23920 వార్తలు

నవతెలంగాణ ఢిల్లీ: నేడు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో పూర్వ సభ్యులు వి.ఎస్. అచ్యుతానందన్ తొలి వర్ధంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ లో వి.ఎస్.అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబి మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ […] The post వి.ఎస్. అచ్యుతానందన్ కు ఘన నివాళి appeared first on Navatelangana.







పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో ప్రజలునవతెలంగాణ-కుభీర్ మండలంలోని రంగశివిని తండాలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి, వారికి నెల నెల గ్రామ పంచాయతీ నుంచి జీతాలు చెల్లిస్తోంది. అయినా ఇక్కడ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కార్మికులు ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదరంతో మురికి కాలువలు నిండిపోయాయి. మురుగు […] The post అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు appeared first on Navatelangana.

ఢిల్లీ: యువతపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ దారుణంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఈ దేశ యువత పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు అని అన్నారు. సోమవారం పార్లమెంట్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి చేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆందోళనపై చర్చించాలని స్పీకర్ ను కోరితే.. ప్రభుత్వాన్ని అడగాలని అంటున్నారని విమర్శించారు. చెదపురుగుల వల్ల విద్య, పరీక్షా విధానం కుళ్లిపోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, పరీక్షా విధానాలపై యువత నిరసన తెలుపుతోందని, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై.. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

నవతెలంగాణ-హైదరాబాద్: సమాజ్వాదీ పార్టీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పరీక్షల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడిన యాదవ్, పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు సరైంద కాదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏంటని తప్పుబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేయకుండా […] The post పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం appeared first on Navatelangana.


తహశీల్దార్ వెంకటేష్ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది ఐలాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలు నేలమట్టం అక్రమార్కులకు అధికారుల వార్నింగ్ కూల్చివేతలో పాల్గొన్న ఆర్ఐలు, జీపీఓలు నవతెలంగాణ- అమీన్పూర్: అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు సోమవారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న ఈ నిర్మాణాలపై స్థానిక తాహశీల్దార్ వెంకటేష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాహశీల్దార్ ఆదేశాల మేరకు […] The post అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత appeared first on Navatelangana.


హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన మహా ఉద్యమంలో, క్రియాశీలక పాత్రను పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలకు, త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు. మంగళవారం నాడు ట్యాంక్ బండ్ లోని తెలంగాణ అమర జ్యోతిలో, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై, జర్నలిస్టులతో ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తలను సేకరించి ప్రచారం చేసే బాధ్యతకే పరిమితం కాలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆవేదనను, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, వాస్తవాలను ప్రజలకు చేరవేసి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షను, సామాజిక-ఆర్థిక అసమానతలను, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చారన్నారు. అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి


మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్నవతెలంగాణ – కామారెడ్డిమానవ మనుగడకు నీరే జీవాధారమని, వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యాచ్ ది రెయిన్ – వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పడే ప్రతి వర్షపు బొట్టును వృథా […] The post వర్షపు నీటిని ఒడిసి పట్టి భావి తరాలకు అందిద్దాం appeared first on Navatelangana.



హైదరాబాద్: ఐపిఎల్లో బ్యాట్స్మెన్లు వెలుగులోకి వస్తున్నారని మాజీ క్రికెటర్ రవీచంద్రన్ అశ్విన్ తెలిపారు. స్టార్ బ్యాటర్ల గురించి జరిగిన చర్చ బౌలర్ల గురించి జరగడంలేదని, ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా గురించి మాత్రమే చర్చ జరిగిందని, అలాంటి బౌలర్లు టీమిండియాకు కావాలని తెలియజేశాడు. సిరాజ్, షమి, భువనేశ్వర్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంత మంది ప్రశ్నిస్తారని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్లు లేకపోతే తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలియజేశారు. రోకోలను టీమ్ నుంచి పక్కన పెడితే టాప్ లేచిపోతుందని హెచ్చరించారు. రోహిత్, కోహ్లీ ఆడాలనుకుంటే వారిని టచ్ చేసేవారు లేరని, అందుకు కారణం కూడా ఉందని, ఇద్దరు వన్డేల్లో 12 వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు ఎన్నో రికార్డులు నెలకొల్పారని, రోహిత్, కోహ్లీకి భారీ అభిమాన గణం ఉందని, అభిమానులు క్రికెట్ స్టేడియానికి రావడానికి ఆ ఇద్దరే కారణమని అశ్విన్ వివరించారు. వారిని బలవంతంగా టీమ్ నుంచి పంపిస్తే అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.



నవతెలంగాణ-హైదరాబాద్: షిండే వర్గంలో ఆరుగురు లోక్సభ ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టును ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ను ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసింది. ఉద్ధవ్ వర్గం పిటిషన్ను విచారించేందుకు సమ్మతిని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.ఈ విలీనాన్ని ఆమోదిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్ధవ్ వర్గం విజ్ఞప్తి చేసింది. లోక్సభ వర్షాకాల […] The post ఆరుగురు ఎంపీల విలీనం..’సుప్రీం’ను ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే appeared first on Navatelangana.

హైదరాబాద్: దేవాదులకు వెళ్లి కాంగ్రెస్ మంత్రులు తాము కట్టిన ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవాదులలో మోటార్లు నడపకుండా నీళ్లెలా ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని, ఆయకట్టుకు సరిపడా నీళ్లున్నా ఇవ్వడం లేదని విమర్శించారు. 10 పంపులు నడుపుతున్నామన్నారని, నిన్న కూడా 5 పంపులే నడుస్తున్నాయని మండిపడ్డారు. బోర్లు ఎండిపోతే పంటలు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడతారని, మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి? అని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రుల మాట, వరంగల్ కలెక్టర్ ది మరో మాట ఉంటుందా? అని ప్రశ్నించారు. రామప్ప కింద తూములు మూసివేశారని, నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటి? అని గోదావరిలో నీళ్లు ఉండగా తూములు ఎందుకు మూసివేశారు? అని నిలదీశారు. సకాలంలో మోటార్లు మరమ్మత్తు చేయకపోవడం, ట్యాంకర్లు, బిందెలు, సీసాలతో పంటలకు చుక్క చుక్క నీళ్లు వేసే ఈ పరిస్థితి ఏర్పడిందని, ధ్వజమెత్తారు. 10 మోటార్లు నడపలేకపోతున్నామని రైతులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.