24326 వార్తలు



హైదరాబాద్: పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. హైదరాబాద్ లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగష్టు నాటికి 2 లక్షల పైగా ఇళ్లు పూర్తి కాబోతున్నాయని, ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు సాకారమని తెలియజేశారు. స్థలం ఉన్నవారికి 4.50 లక్షల ఇళ్లు ఇచ్చామని, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయంచామని పొంగులేటి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని, గజం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉన్న ప్రాంతంలో కూడా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కట్టిన ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారని, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో కొంత మందే నివసిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కోర్ పరిధికి 30 కి.మీ. దూరంలో గత ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిందని, ఉపాధికి దూరంగా ఉండడంతో పేదలకు ఇచ్చిన ఇళ్లలో నివసించడానికి ఇష్టపడట్లేదని అన్నారు. ధనికులు నివసించే చోట



హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటికి టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియా బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసింది. భారత జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసి ఓటమిన మూటకట్టుకుంది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేశాడు. లార్స్ లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లార్డ్ లో సెంచరీలు చేయలేదు. 2004లో సౌరవ్ గంగూలీ 90 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. లార్డ్ మైదానంలో 39 ఏళ్ల 80 రోజుల వయసులో రోహిత్ శర్మ సెంచరీ చేసి రికార్డు కూడా నెలకొల్పాడు. లార్డ్ మైదానంలో రోహిత్ది చివర వన్డే అని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్ వన్డే ఆఖరి మ్యాచ్ కాదు అని, 2027 వరల్డ్ కప్లో కూడా రోహిత్ శర్మ ఆడుతాడని బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపడంలో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. రోహిత్ శర్మ ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం జట్టులో ఉంటాడని సైకియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రోహిత్ వన్డేలలో 34 సెంచరీలు 11895 పరుగులు చేశాడు. వన్డేలలో 264 పర






రూ.15 లక్షల బడ్జెట్లో కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి నిస్సాన్ టెక్టన్, హ్యుందాయ్ క్రెటా రెండు బలమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ టెక్టన్ ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో దృష్టిని ఆకర్షిస్తుండగా..హ్యుందాయ్ క్రెటా మాత్రం ఎన్నో ఏళ్లుగా విశ్వసనీయ పనితీరు, బలమైన సర్వీస్ నెట్వర్క్తో వినియోగదారుల ఆదరణ పొందుతోంది. మరి ఈ రెండింటిలో ఏ ఎస్యూవీ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుందో చూద్దాం. ధర, డిజైన్ నిస్సాన్ టెక్టన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.10.91 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.20.11 లక్షల వరకు అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా టెక్టన్ బోల్డ్, మస్క్యులర్ లుక్తో ఆకట్టుకుంటుంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, LED DRLs, కనెక్టెడ్ టెయిల్లైట్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా మాత్రం ప్రీమియం, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ డిజైన్తో కనిపిస్తుంది. క్యాబిన్, ఫీచర్లు నిస్సాన్ టెక్టన్ ఇంటీరియర్ ట్రై-టోన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, 48 కలర

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఫామ్పై వస్తున్న విమర్శలకు అతడు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. టీం ఇండియా మ్యాచ్ ఓడినప్పటికీ.. రోహిత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో లార్డ్స్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా అతడు రికార్డు సృష్టించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై కెప్టెన్ శుభ్మాన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. ఇప్పటివరకు జట్టులో అలాంటి చర్చే జరగలేదని గిల్ అన్నాడు. ‘‘ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాతో అనలేదు. ఇదంతా సోషల్మీడియాలో మొదలైన చర్చే. గత కొన్నేళ్లుగా రోహిత్ - విరాట్ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు సేవలు అందించారు. ఈ మ్యాచ్లోనూ చక్కని భాగస్వామ్యం నిర్మించారు. ఇక రోహిత్ భాయ్ బ్యాటింగ్ అదిరిపోయింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మందకొడిగా మారింది. ఇక్కడ పరుగులు చేయడం చాలా కష్టం. కానీ, అతడి ఆట మాత్రం అద్భుతంగా ఉంది’’ అని గిల్ వివరించాడు.


హైదరాబాద్: ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం మోతీ నగర్ లోని బంధువు ఇంట్లో శానిటైజర్ లో విషం కలుపుకొని ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నం చేసుకున్నాడు. బంధువులు గమనించి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించారు. ఎస్ ఆర్ నగర్ లోని ఆస్పత్రి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళ ఐపిఎస్ ను ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో అతడిపై కేసు నమోదైంది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని తెలిపారు.




తక్కువ ధరలో ఒక ప్రీమియం శాంసంగ్ స్మార్ట్ఫోన్ను కొనాలని చూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ S25 FE పై ఏకంగా రూ.14,000 పైగా డిస్కౌంట్ను అందిస్తోంది. అదనంగా, వినియోగదారులు ఈ ఫోన్ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. ఈ ఫోన్లో గెలాక్సీ AI, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్లో ఎంత ధరకు లభిస్తుందో, ఆఫర్లు ఏమిటో, దాని ఫీచర్లు ఎంత శక్తివంతమైనవో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ S25 FE పై డిస్కౌంట్, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ S25 FE భారతదేశంలో రూ.59,999 ప్రారంభ ధరతో విడుదల అయింది. అయితే, ప్రస్తుతం దీనిని అమెజాన్లో రూ.45,499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రారంభ ధరతో పోలిస్తే వినియోగదారులు రూ.14,500 ప్రత్యక్ష తగ్గింపును పొందవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ S25 FE పై అమెజాన్ అనేక అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. వినియోగదారులు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో చెల్లిస్తే రూ.1,364 క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఈ కార్డ్పై నో-కాస్ట్ EMI కూడా అందుబా



మన భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలు, ప్రోబయోటిక్స్తో నిండి ఉంటుంది. ప్రతిరోజూ పరిమిత మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎముకలు, గుండె, చర్మం ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి రోజు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పెరుగులోని మంచి బ్యాక్టీరియా శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి: కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండే పెరుగు ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. బరువు నియంత్రణకు సహకారం: ప్రోటీన్ అధికంగా ఉండే పెరుగు ఎక్క

ఢిల్లీ: నెల రోజులుగా భారత్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాష్ట్రీయ, జాతీయ, అంతరిక్ష రంగాల్లో భారత్ గర్వించదగిన క్షణాలు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, నెల రోజులుగా అనేక పరిణామాలు జరిగాయని తెలియజేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని, రెండ్రోజుల క్రితం ప్రయోగం ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన నిలిచామని అన్నారు. భారత యువత అంతరిక్షంలో తమదైన ముద్ర వేశారని మోడీ కొనియాడారు. ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాలని అందరం ప్రార్థిద్దామని, గతేడాది ఇదే సమాయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నామని, ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ ను రోదసీలో విజయవంతంగా ప్రవేశపెట్టారని మోడీ పేర్కొన్నారు.