24441 వార్తలు




చెన్నై: చదివించి వైద్యుడిని చేసినందుకు అక్క కూతురుకు మేనమామ అశ్లీల ఫొటోలు, అసభ్యకర మెసేజ్లు పంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపెట్టై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చెల్లవేల్ అనే యువకుడు వైద్య విద్య చదివేందుకు అతడి సోదరి ఐదు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసింది. వైద్యుడైన తరువాత తన కూతురును పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకొని ముఖం చాటేశాడని పేర్కొంది. తంజావూర్ జిల్లా మరుంకుళం ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా అతడు సేవలందిస్తున్నాడు. తన కూతురు సెల్ఫోన్కు అశ్లీల ఫొటోలు, అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో చెల్లవేల్ అక్క అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా అతడిపై క్రిమినల్ కేసు ఉన్నట్టు సమాచారం.




మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తుంది భావాలు మబ్బులైతే తర్కం సూర్యుడు కావాలి నిజం బయట దాగి ఉండదు మన పక్షపాతపు పొరలలో చిక్కుకుపోతుంది గత అనుభవం గీతలు గీస్తే ప్రస్తుతం వాటి మధ్యే నిలుస్తుంది పక్షపాతం తెలియని చూపు బంధనం పక్షపాతం తెలిసిన చూపు విముక్తి మన అద్దం శుభ్రం అయినప్పుడే ప్రపంచం కాదు, సత్యమే మనలో ప్రతిఫలిస్తుంది - డాక్టర్ నూకరాజు బెందుకుర్తి



మౌనవేణువేదో అపురూప రాగాలను తొలకరిస్తున్నట్టు ఏ వెన్నెల పాలపుంతలనో పచ్చి పసుపూ వెన్నముద్దతో కలగలిపి మైపూతగాఅలదుకున్నట్టు ఉజ్వలప్రకాశమై అదృశ్య ఉనికి ఒకటి అహరహం వెన్నంటి నీడలా పలకరిస్తూనే ఉంది గాలి సన్నాయిలచిరుమేళవింపుల్లో పాలరాతి సోపానాల మీద జారిపడే సరిగమల్లో గమకాలుకుదించుకు వేలాది వాయులీన తరంగాల్లో తడిసి ముద్దైపోతూ మమేకమవుతూ నక్షత్ర దీపాలు అలంకరించిన పసిడి పల్లకిలో రేకులు రేకులుగా విప్పారే వెయ్యి రేకుల బ్రహ్మకమలం -పొరలుపొరలుగా తరలివచ్చే ఊహల మధుపాయీల గుంపు అమృతహృదయాన్నిఅక్షరాలనిండా పొదిగి విరబూసిన విరిబాలలను సుతారంగా అల్లిన కవన మాలికలు ద్వార బందాలకు వేళ్ళాడదీసిన ప్రదర్శన తుంచుకు అలంకరించుకుందామనో కసికసిగా నలిపి విసిరేద్దామనో ఎన్ని కాంక్షల కసాయి చూపులో అందని ఆకాశాలను దింపితెచ్చి ఎరుపెక్కిన చందమామ అరచేతిలో శిలువవేసి చుక్కలను ఇంటి చుట్టూ కంచెగా నాటుకున్న బృందావనం పాటలు రాకపోతేనేంఏ అణువు కదలించినా కాంభోజి రాగాలూ యమునా కల్యాణిలే ఎన్ని ఉపద్రవాలు దండెత్తి వచ్చినా ఎన్నెన్ని యుద్ధనౌకలు సముద్రాన మునిగినా ఎంత మారణ కాండ శృతిమించి విషాదం చిమ్మినా భ

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. పొరుగింటి బాలికతో కలిసి అక్కాచెల్లెలు వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... దోమలగూడలో అక్కాచెల్లెలు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14)లు ఇంటి పక్కనే ఉన్నబంధువు రోహిణి కుమార్తె లత (14)తో కలిసి ఆటోలో వెళ్లారు. హిమాయత్నగర్లో ముగ్గురు ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగినట్టు సిసి టివి ఫుటేజీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముగ్గురు బాలికల కోసం గాలింపు చేపట్టారు.

ప్రపంచ సాహిత్య చరిత్రలో ‘నేర కథా రచయిత్రి’గా అగాథా క్రిస్టీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. బైబిల్, షేక్స్పియర్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఆమె రచనలు ఉన్నాయనే రికార్డు ఆమె స్వంతం చేసుకున్నారు. అగాథా క్రిస్టీ 66 నవలలు, 14 కథా సంకలనాలు రాశారు . ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలం ప్రదర్శితమవుతున్న ‘ది మౌస్ట్రాప్’ నాటకం ఇవన్నీ ఆమె అపార ప్ర తిభకు నిదర్శనాలు. అయితే, ఈ వ్యాసం క్రిస్టీని కేవలం ‘క్రైమ్ క్వీన్’గా కాక, తన కాలంలోని సామాజిక, సాంస్కృతిక ప్రక్రియలతో సంభాషించిన ఒక సంక్లిష్ట రచయిత్రిగా పేరు సంపాదించింది. ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను, రచనా ప్రత్యేకతలను, సాహిత్య విమర్శకుల దృక్పథాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అగాథా క్రిస్టీ వ్యక్తిగత జీవితంలోని అనేక సంఘటనలు ఆమె రచనలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫార్మసిస్ట్గా పనిచేసిన అనుభవం ఆమెకు విషాలపై అద్వితీయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. ఆమె నవలల్లో విషప్రయోగాలు చాలా వాస్తవికంగా, శాస్త్రీయంగా చిత్రీకరించబడటానికి ఇదే ప్రధాన కారణం. రెండవ వివాహం తర్వాత పురావస్తు శాస్త్రవ






తాజా కితాబ్అదృశ్య రాజ్య చరిత్ర: మానవ సమాజ పరిణామ క్రమంలో రా జ్య అవసరం ఎందుకు కల్గింది అనే చిక్కు ప్రశ్నకు భిన్నమైన వివరణలు, విశ్లేషణ లు సైద్ధాంతికపర చర్చలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. గత ఎనిమిది దశాబ్దాలలో రాజ్యాంగంలో ఏమి రాసిసున్నా బలప్రయోగం పెరుగుతూ వస్తున్నది.రాజ్యం హింసను నియంత్రించాలని భావించినా రాజ్యమే హింసను ప్రేరేపించడం, ద్వేషాల్ని రెచ్చగొట్టడం, మత విశ్వాసాలని విద్వేషాలుగా మార్చడం, ప్రజా పోరాటాలని నగ్నంగా అణచివేయడం, తానే ఒక నేరమయ వ్యవస్థగా రూపాంతరం చెందడం ఒక చారిత్రక విషాదం. ప్రఖ్యాత జర్నలిస్టు జోసీ జోసెఫ్ సమకాలీన రాజ్య వ్యవస్థ అంతర్గత విధ్వంసాన్ని వివరిస్తూ రాజ్యమే నేరమయం కావడం లాంటి కొన్ని భయంకరమైన వాస్తవాలను, సంఘటనలు సోదాహరణంగా,సాక్ష్యాధారాలతో మన ముందుంచాడు. రాజ్య నిజ స్వరూపాన్ని ప్రతిభావంతంగా వివరించాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం మనంగానిలిబెట్టు కోవడానికి, తీవ్రమైన షాక్ (Shock) నుండి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. జోసీ జోసెఫ్ చేసిన ఈ సాహస రచనకు చరిత్ర రుణపడి ఉంటుంది.ప్రొ.జి.హరగోపాల్ఒక గాంధేయ విశ్లేషణ: ప్రజాస్వామ్యం, రాజ్యాధికారం,అణగారిన వర్గాలను ఒక మూలకు విసిరేసిన పర



నేను, నా సాహితీ యాత్ర: 23 నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పేరు సీతారామపురం.చదువుకోవడానికి నేను చాలా పోరాటం చేసాను. ఎలాగోలా డిగ్రీ పూర్తిచేసి 1975లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. చాలా సంవత్సరాలు చిన్న చితకా ఉద్యోగాలు చేసాక, 1979లో పబ్లిక్ సర్వీస్ కమీషన్లో ఉద్యోగం దొరికింది. మా సీతారంపురం నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం వెనక ఉన్నది మా నాన్న ప్రోత్సాహం. 1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా దినంగా ప్రకటించడం వల్ల ఆడవాళ్ళకి ఉద్యోగాలొస్తాయని మా నాన్న బలంగా నమ్మి నన్ను తెచ్చి ఈ మహారణ్యంలో పడేసాడు. 1979 వరకూ నాకు ఉద్యోగం దొరకలేదు.అయినా నేను భయపడలేదు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ నిలదొక్కుకున్నాను. అదంతా చాలా పెద్ద కధ.ఇంటర్మీడియట్ చదివేటప్పటికే నేను నాస్తికురాలను. నాస్తికుడు దొరకకపోతే పెళ్ళేచేసుకోవద్దని అనుకున్నాను. అయితే 1980 లో విజయవాడలోని గోరా గారి నాస్తిక కేంద్రంలో గమ్మత్తుగా ఓ నాస్తికుడు పరిచయమయ్యాడు. మాయలు, మంత్రాలు లేవం టూ నిప్పుల గుండం తొక్కినప్పుడు, తూలి పడబోతున్నప్పుడు ఓ చెయ్యి, నా చేయి పట్టుకుని పడిపోకుండా ఆపింది. అతనే సంవత్సరం తర్వాత నా జీవన సహచరుడయ్యాడు. చిన్న అడ్వకేట
