24841 వార్తలు

స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన K సిరీస్లో మరో కొత్త మోడల్ను తీసుకురానుంది. కంపెనీ దీనిని ఒప్పో K15 పేరిట చైనాలో జూలై 24న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్కు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో విడుదలైన ఒప్పో K15 ప్రో, ఒప్పో K15 ప్రో ప్లస్ మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ధర ఎంత ఉండవచ్చు?ఒప్పో K15 ధరకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ జూలై 24న జరిగే లాంచ్ ఈవెంట్లో ప్రకటించనుంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రే, వైట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫీచర్లు( అంచనా) డిస్ప్లే: ఈ స్మార్ట్ఫోన్లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వనున్నారు. అలాగే IP69 రేటింగ్తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ప్రాసెసర్: పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్సెట్తో పాటు టైడల్ ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పరికరం స్మార్ట్ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ల

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు, స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. జులై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన నివేదికల ప్రకారం, జులై 19 నుంచి 23 వరకు […] The post జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు : అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల నుంచి ఆయన ఈ దీక్షను కొనసాగిస్తుండగా.. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం సోనమ్ వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు […] The post సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. appeared first on Navatelangana.





అల్లం అందరి వంటింట్లో ఎప్పుడూ ఉండే సహజ ఔషధం. రుచి కోసం దీనిని అన్ని వంటకాలలో వాడుతుంటారు. అల్లంలో ఉండే జింజరాల్ అనే సమ్మేళనం శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా, ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిపాటి అల్లం రసం తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటంతో పాటు వికారం, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఉదయాన్నే రెండు స్పూన్ల అల్లం రసం తాగితే ఏం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గేందుకు తోడ్పడుతుంది. 2. వికారం తగ్గిస్తుంది: ప్రయాణ సమయంలో వచ్చే వికారం లేదా ఉదయం వికారం వంటి సమస్యల్లో ఉపశమనం కలిగించవచ్చు. 3. బరువు నియంత్రణకు సహకారం: జీవక్రియ (మెటాబాలిజం)ను ప్రోత్సహించి బరువు నియంత్రణలో కొంతమేర ఉపయోగపడవచ్చు. 4. రక్త ప్రసరణకు మేలు: శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే అవకాశం ఉంది. 5. రోగనిరోధక శక్తి: యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీర రక్షణ వ్యవస్థకు మద్దతునిస్తాయి. 6. చర్మ ఆరోగ్యం:



మన తెలంగాణ/మోత్కూర్: మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఆర్.ఎస్ మండల పట్టణ శాఖల ఆధ్వర్యంలో శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మండల పట్టణ అధ్యక్షులు పోన్నేబోయిన రమేష్, జంగ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు మాజీ మండల అధ్యక్షులు కొండ సోంమల్లు, మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్, నాయకులు మర్రి అనిల్ కుమార్ దాసరి తిరుమలేష్ దబ్బటి శైలజ కూరెళ్ల పరమేష్ మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య బత్తిని తిరుమలేష్ పురుగుల మల్లయ్య సామ పద్మా రెడ్డి కోక బిక్షం తాటి లక్ష్మణ్ అన్నందాస్ విద్యాసాగర్ నేర్లకంటి మచ్చగిరి కంచర్ల క్రాంత్ కుమార్ రెడ్డి గనగాని రాజేష్ జిట్ట సాయి కుమార్ పోన్నె బోయిన మచ్చగిరి దాసరి నవీన్ బందెల శ్రీను కూరెళ్ల రమేష్ చుక్క అశోక్ మొరిగాల శీను మరిగాల వెంకన్న మలిపెద్ద మల్లారెడ్డి పసునూరి యాదగిరి కూరెళ్ల సురేష్ కల్వల శోభన్ అన్నందాస్ మచ్చగిరి దండ్ల కళ్యాణ్ దాసరి ఎలేందర్ బుర్ర వెం



న్యూఢిల్లీ: మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గెమ్స్కు తెరలేవనుంది. గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా క్రీడల్లో పాల్గొనే భారత బృందాన్ని ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్), లొవ్లీనా బొర్గోహైన్(బాక్సింగ్)లు సారధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని శనివారం భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23న ఆరంభమయ్యే ఆరంభ వేడుకలో మీరాబాయి, లవ్లీనాలు 126 మందితో కూడిన భారత బృందానికి ముందునడుస్తూ పతకధారులుగా వ్యవహరించనున్నారని పేర్కొంది. ఛాను, లవ్లీవాలో ఒకరు మువ్వన్నెల జెండాను ఎత్తుకుని నడవనుండగా.. మరొకరు కామన్వెల్త్ క్రీడా జ్యోతిని పట్టుకొని నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష తెలిపారు.

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మహమ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగుడు ఫైజ్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […] The post పాతబస్తీలో ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్య.. appeared first on Navatelangana.



చెన్నై: విశ్వాసానికి మారుపేరు కుక్క. తనకు కాస్త ఆహారం పెట్టి, ప్రేమ చూపించిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాయి. యజమాని కోసం ప్రాణాలనైనా అర్పిస్తాయి. వాటి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. ప్రపంచవ్యాప్తంగా కుక్కలు తమ యజమానుల పట్ల చూపే అనంతమైన ప్రేమకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. యజమానిని కాపాడేందుకు ఓ కుక్క నాగు పాముతో పోరాడి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కన్నియకుమారి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... తక్కలైలో వికేష్, గాయత్రి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయత్రి తల్లి పద్మ కుమారి కూడా వీళ్లతో పాటు ఉంటుంది. గత రెండు సంవత్సరాల నుంచి చించాన్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం వీరితో ఎంతో విశ్వాసంగా ఉండేది. పద్మ కుమారి ఇంటి వెనుక ఉన్న ఆరుగుపై కూర్చుంది. అదే సమయంలో నాగు పాము బుసలు కొడూ పద్మ కుమారి దగ్గరికి వచ్చింది. వెంటనే శునకం పాముతో పోరాటం చేసింది. పాము కాటు వేసింది. పామును శునకం కరిచి రెండు ముక్కలు చేసి అనంతరం ప్రాణాలు విడిచింది. యజమాని కోసం శునకం తన ప్రాణాలను విడిచింది. కుక్క విశ్వాసం ముందు ఎవరు

లక్నో: పాలల్లో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చి అనంతరం పడుకున్న తరువాత భర్తపై భార్య పాము విసిరేసింది. పాముకాటుతో తన భర్త చనిపోయాడని భార్య నమ్మించి హత్య క్రియలు పూర్తి చేసింది. పోలీసుల విచారణలో దొరికిపోవడంతో భార్యతో పాటు ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మేరఠ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హస్తినాపూర్లో అతుల్ పవార్(35), దామిని(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్ను ఈ దంపతులు నిర్వహిస్తున్నారు. స్కూల్లో 150 మంది పిల్లల వరకు ఉంటున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్తో దామినికి పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి అతుల్ అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 16 రాత్రి భర్తకు భార్య అధిక మోతుదులో పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత అతడి దుప్పట్లో పామును విడిచింది. పాము కాటువేయడంతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. మృతుడి మంచంపై ప



