24851 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మహమ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగుడు ఫైజ్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […] The post పాతబస్తీలో ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్య.. appeared first on Navatelangana.



చెన్నై: విశ్వాసానికి మారుపేరు కుక్క. తనకు కాస్త ఆహారం పెట్టి, ప్రేమ చూపించిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాయి. యజమాని కోసం ప్రాణాలనైనా అర్పిస్తాయి. వాటి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. ప్రపంచవ్యాప్తంగా కుక్కలు తమ యజమానుల పట్ల చూపే అనంతమైన ప్రేమకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. యజమానిని కాపాడేందుకు ఓ కుక్క నాగు పాముతో పోరాడి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కన్నియకుమారి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... తక్కలైలో వికేష్, గాయత్రి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయత్రి తల్లి పద్మ కుమారి కూడా వీళ్లతో పాటు ఉంటుంది. గత రెండు సంవత్సరాల నుంచి చించాన్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం వీరితో ఎంతో విశ్వాసంగా ఉండేది. పద్మ కుమారి ఇంటి వెనుక ఉన్న ఆరుగుపై కూర్చుంది. అదే సమయంలో నాగు పాము బుసలు కొడూ పద్మ కుమారి దగ్గరికి వచ్చింది. వెంటనే శునకం పాముతో పోరాటం చేసింది. పాము కాటు వేసింది. పామును శునకం కరిచి రెండు ముక్కలు చేసి అనంతరం ప్రాణాలు విడిచింది. యజమాని కోసం శునకం తన ప్రాణాలను విడిచింది. కుక్క విశ్వాసం ముందు ఎవరు

లక్నో: పాలల్లో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చి అనంతరం పడుకున్న తరువాత భర్తపై భార్య పాము విసిరేసింది. పాముకాటుతో తన భర్త చనిపోయాడని భార్య నమ్మించి హత్య క్రియలు పూర్తి చేసింది. పోలీసుల విచారణలో దొరికిపోవడంతో భార్యతో పాటు ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మేరఠ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హస్తినాపూర్లో అతుల్ పవార్(35), దామిని(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్ను ఈ దంపతులు నిర్వహిస్తున్నారు. స్కూల్లో 150 మంది పిల్లల వరకు ఉంటున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్తో దామినికి పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి అతుల్ అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 16 రాత్రి భర్తకు భార్య అధిక మోతుదులో పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత అతడి దుప్పట్లో పామును విడిచింది. పాము కాటువేయడంతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. మృతుడి మంచంపై ప





నేడు అర్ధరాత్రి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ స్పెయిన్-అర్జెంటీనా మధ్య తుదిపోరు సర్వత్రా ఉత్కంఠ న్యూయార్క్: ఫిఫా వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగే ఫైనల్తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశ నుంచి ఒక్క మ్యాచ్లో ఓడకుండా ఫైనల్లో అడుగు పెట్టిన ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీ సాగనుంది. అయితే ఈ రెండు జట్లలో ఎవరు ఛాంపియన్గా నిలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లలో అద్భుతంచేసే ఆటగాళ్లకు కొదవాలేదు. అయితే స్పెయిన్ ‘టికీటాకా’ వ్యూహాలతో అద్భుతాలు చేస్తుంటే.. లియొనల్ మెస్సీ సారధ్యంలోని జట్టు అసాధరణమైన ఆటతీరుతో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. 2010 ప్రపంచకప్లో స్పెయిన్ ఇదే తత్వంతో విజేతగా నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ టోర్నమెంట్లో స్పెయిన్ ఏ మ్యాచ్లోనూ నాలుగు లేదా ఐదు గోల్స్ కొట్టలేదు. కానీ ఒక్కో గోల్తోనే మ్యాచ్లను గెలిచింది. నాకౌట్ దశలో పోర్చుగల్పై 1-0, పరాగ్వేపై 1-0, జర్మనీపై 1-0, ఫైనల్లో నెదర్లాండ్స్పై అదనపు సమయంలో 1-0తో గెలిచి ప్రపంచ ఛాంపియన్గా అవతరించి







నేడు ఇంగ్లండ్తో మూడో వన్డే అండన్(లార్డ్): ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్లో గెలుపొంది సిరీస్లో సమంగా నలిచిన ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో ఎవరూ గెలుపొందినా సిరీస్ విజేతగా నిలువనున్నారు. బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించిన టీమిండియా కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో పరాజయంపాలైంది. దీంతో మూడో వన్డేలో ఎలాగైనా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలనే యోచనతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఇక బ్యాటింగ్లోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు విఫలమైనా మిగతా ఆటగాళ్లు అద్భుత బ్యాటింగ్తో దాని ప్రభావం జట్టుపై పడకుండా చూశారు. ఈ మ్యాచ్లోనైనా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలు తమ పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోకోలు రాణిస్తే టీమిండియాకు ఎదుర





