19940 వార్తలు









దేశవ్యాప్తంగా ఏకరీతి కోసం కేంద్ర ప్రభుత్వం 1987 మోడల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2002 నేషనల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2009 నేషనల్ హెల్త్ బిల్ వంటి నమూనా చట్టాలను ప్రతిపాదించింది. ఈ చట్టాలు పారిశుధ్యం, నీటి సరఫరా, మార్కెట్లు, ఆహార భద్రత, సంక్రమణ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలను ప్రస్తావించినప్పటికీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, కొత్త అంటువ్యాధులు, వాతావరణ మార్పుల ప్రభావం, పర్యావరణ కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేంత సమగ్రత వాటిలో లేదు. సాంప్రదాయ ప్రజారోగ్య చట్టాలు ప్రధానంగా బలవంతపు నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం వ్యక్తులపై కొన్ని పరిమితులు విధించవచ్చనే భావన దీనికి ఆధారం. ప్రజారోగ్యం అనేది కేవలం వ్యాధులకు చికిత్స అందించే వ్యవస్థ కాదు. సమాజం సమష్టి కృషి ద్వారా వ్యాధులను నివారించడం, ఆయుష్షును పెంచడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అనే శాస్త్రం, కళ. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజారోగ్య చట్టం రాష్ట్రం, స్థానిక సంస్థలు, సమాజం కలిసి పనిచేసే విధానాన్ని, అధికారాలను, బాధ్యతలను నిర్దేశిస్తుంది. అదే సమయం లో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత

మన తెలంగాణ/మోత్కూర్ : మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మోత్కూర్, అడ్డగూడూర్, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలకు సంబంధించిన 31 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 551 దరఖాస్తులు అందినట్లు సీడీపీఓ నాజీ విలేకరులకు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 7 వరకు మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని, వాటి ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా వెంట తీసుకురావాలని తెలిపారు. నిర్ణీత గడువులో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని లేనిపక్షంలో కలిగే ఇబ్బందులకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీడీపీఓ నాజీ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విమర్శలు రావడం సహజం. కానీ విమర్శను దేశద్రోహంగా, నిరసనను శాంతిభద్రతల సమస్యగా, ప్రశ్నించే వారిని శత్రువులుగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్యాన్ని బల పరచదు, పైగా బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గడం కూడా ఇలాంటి వైఖరి వల్లే ప్రారంభమవుతుంది. యువత ఎందుకు ఆందోళన చెందుతోంది అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందా? ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉందా? పరీక్షల పారదర్శకతపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందా? పాలనా వ్యవస్థలో ప్రతిభకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం భావోద్వేగ రాజకీయాలతో సమస్యలు పరిష్కారం కావు. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలు ఎంత ముఖ్యమో, ప్రజల అసంతృప్తి అంతకంటే ముఖ్యమైన రాజకీయ సంకేతం. ముఖ్యంగా యువత వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తే దానిని కేవలం ఒక నిరసన కార్యక్రమంగా చూడలేం. అది సమాజంలో పేరుకుపోతున్న అసంతృప్తి, నిరాశ, భవిష్యత్తుపై ఆందోళనకు ప్రతిబింబం. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల నిజమైన బలం పోలీసు బలగాల్లో కాదు, ప్రజల

ముంబై: దులీప్ ట్రోఫీ 2026కు సన్నహాలు చేస్తోంది బిసిసిఐ. ఈ దేశవాళిలో తలపడనున్న సెంట్రల్ జోన్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు సారథి రజత్ పాటిధార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు యాజమాన్యం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఉప సారధిగా ఎంపికయ్యాడు. సారాంశ్ జైన్, అమన్ మోఖడె, జీషన్ అన్సారీ, కునాల్ ఛండేలా, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆర్యన్ జుయల్, ఆయూష్ పాండే, హర్ష్ దూడె, యాష్ ఠాకూర్ వంటి వారు జట్టులో స్థానం కలిపించారు. సౌరవ్ రావత్, మయాంక్ మిశ్రా, అమన్దీప్ ఖరె, భార్గవ్ మోరాయ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈనెల 23న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో ఐదు టెస్టు మ్యాచ్లు జరుగనున్నాయి. కాగా, ట్రోఫీలో నార్త్ ఈస్ట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్తోపాటు వెస్ట్ జోన్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సెంట్రల్ జోన్ జట్టు గతేడాది జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ జట్టును ఓడించి టైటిల్ గెలుకుంది. తొలిసారి ఛాంపియన్ నిలిచిన సెంట్రల్ జోన్ రజత్ పాటిధార్ సారథ్యం వహించి, 382 పరుగులతో రాణించి జట్టు గెలుపులో కీలక భూమికపోషించాడు

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం‘. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “దర్శకుడు భద్రప్ప చెప్పిన ఈ కథ విని నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. ఫిలింమేకింగ్ లో ఒక కొత్త దర్శకుడు భద్రప్ప చూపించిన ప్రతిభకు గర్వపడుతున్నా”అని పేర్కొన్నారు. దర్శక నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఆత్మ గౌరవం కోసం కూతురు, సమాజ గౌరవం కోసం తండ్రి... ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్య జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్య జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మ గౌరవం గురించి చర్చిస్తుంది”అని తెలియజేశారు. డైరెక్టర్ భద్రప్ప గాజుల మాట్లాడుతూ “మనం నిజ జీవితంలో చూసే పాత్రలు, మన ఇరుగు పొరుగు వ్యక్తులను పోలిన క్యారెక్టర్స్ మా మూవీలో ఉంటాయి. మా చిత్రంలో నవ్వులతో పాటు మనసు

రన్ రాజా రన్’ చిత్రంలో బుజ్జిమా పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార సీరత్ కపూర్ చిత్రపరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తయ్యాయి. కొరియోగ్రఫీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీరత్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ నోట్ను షేర్ చేశారు. “12 సంవత్సరాలు... లెక్కలేనన్ని పాఠాలు..అంతులేని కృతజ్ఞత. ఇప్పటికీ నేర్చుకుంటూ.. రూపాంతరం చెందుతూ నన్ను కదిలించే కథలనే ఎంచుకుంటున్నాను” అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక వేడుక కోసం సీరత్ కపూర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతిక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని, బోనాల ఉత్సవాల్లో కులాలకతీతంగా మతలకతీతంగా భాగస్వామ్యమై జరుపుకుంటారని ప్రశంసించారు.

ముంబై: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అటిట్యూడ్ నచ్చకనే జట్టు నుంచి తప్పించేవారని, ఈ విషయం అర్ధమయ్యేది కాని చెప్పుకొచ్చాడు. గాయంతో భారత జట్టుకు దూరమైన పాండ్యా.. బెంగళూరులోని బిసిసిఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. టీమిండియా తదుపరి వైట్ బాల్ సిరీస్లలో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆడలేదని, జట్టు కోసమే ఆడానని తెలిపాడు. ‘సారథ్యం విషయానికి వస్తే.. నాకు నేను ఎప్పుడూ సందేహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పదవులు కోసమో లేక నా మాట నెగ్గించుకోవడానికో ఆడను అని పేర్కొన్నాడు.






