
3528 వార్తలు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై పెను ప్రభావం పడుతోందన్నారు. అంతిమంగా సామాన్యుడిపై పెను భారం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు సామాన్యులను మోసగించడమే అని ఆరోపించారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు.
నవతెలంగాణ-కంఠేశ్వర్: జిల్లా టిఎన్జివో అసోసియేటడ్ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పెద్దొళ్ల నాగరాజు ని మెడికల్ కళాశాల లో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ నాగరాజు ఉద్యోగులకు అందిస్తున్న సేవలను మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ […] The post టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులుగా నాగరాజు appeared first on Navatelangana.
నవతెలంగాణ-జన్నారం: ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోవాలని సీపీ ఐ ఎం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకొని పాటు పలు గ్రామాల్లో హమాలీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా మండలవ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అలాగే మార్కెట్ కమిటీ, బస్టాండ్ ఆవరణల్లో సీపీఎం, సీఐటీయూ నాయకులు జెండాలను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..చికాగో అమరవీరుల స్ఫూర్తితో […] The post హక్కుల రక్షణకు పోరాడాలి: సీపీఎం appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు జెండా ఎగరవేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, “దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. 8 గంటల పనిదినం కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజును స్మరించుకుంటున్నాం” అని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని […] The post ధర్మారంలో ఘనంగా మే డే ఉత్సవాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పింది. పాఠశాలకు చెందిన ఎనిమిది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. నాజ్రీన్ 549, హిందూ 540, చరణ్ 535, సూర్య తేజ 532, నిఖీష 525 హర్షిత్ గౌడ్ 521, స్ఫూర్తి 516, వైష్ణవి 507 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విజయం పట్ల హర్షం […] The post దుబ్బాకలో సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రభంజనం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రపంచవ్యాప్తంగా జరిగే 141 మే డే కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,మత ప్రాంత,జాతి,వివక్షత,విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారని. […] The post సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-కామారెడ్డి: మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండాలో గోనె శ్రీలత–శ్రీనివాస్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించుకున్నారు.వారి గృహప్రవేశాన్నినికి అతిథిగా గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ హాజీరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు కల సాకారం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు అందుకొని సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి గృహప్రవేశాన్ని పురస్కరించుకొని ఆ […] The post ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య జయంతి సందర్భంగా మే డే స్ఫూర్తితో.. స్థానిక నాందేవ్ వాడలో చలివేంద్రం మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. సుందరయ్యప్రారంభించారు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యారంగానికి నిధులను కేటాయించడం లేదని […] The post ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలివేంద్రం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రాజన్నసిరిసిల్ల: మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పాల్గొని మాట్లాడారు. నేడు ప్రపంచంలో పొద్దు పొడిచిన నుండి రోజు ముగిసే వరకు ఎన్నో రంగాలలో నేటి ఆధునిక ప్రపంచ లో మనిషి జీవనం సాఫీగా సాగే క్రమంలో, సమాజ అభివృద్ధిలో కార్మికుల శ్రమ దాగి ఉందని అన్నారు. శ్రమ నీ పెట్టుబడిగా […] The post అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్ పర్సన్ appeared first on Navatelangana.

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎల్.ఐ.కె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)’. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఒటిటి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ మే నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సోషల్మీడియాలోఈ వివరాలను ప్రకటిస్తూ సదరు ఒటిటి సంస్థ పోస్టర్ని విడుదల చేసింది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ లవ్స్టోరీని తనదైన శైలీ కామెడీని టచ్ చేస్తూ.. ఈ సినిమాను తరకెక్కించాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఎస్.జె సూర్య విలన్గా నటించారు.

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం […] The post సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి: ఎర్రజెండా అందరికీ అండగా నిలుస్తుందని సిపిఐ(ఎం) గిద్ద పార్టీ శాఖ కార్యదర్శి మొగులయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గిద్ద, రామారెడ్డి తదితర గ్రామాల్లో మే డే దినోత్సవాన్ని ఎర్రజెండా ఎగరవేసి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు తమ హక్కులు సాధించుకోవాలంటే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు చేయవలసిందేనని, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటంలో ఎర్ర జెండా పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో జిపి […] The post ఎర్రజెండా అందరికీ అండ appeared first on Navatelangana.

సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం టికెట్ స్క్వాడ్ ఆపాడు. అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం టికెట్ స్క్వాడ్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించి సదరు అధికారిని కండక్టర్ చెప్పుతో కొట్టాడు. ప్రయాణికులు దాడి చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే క్లాసన్ ప్రవర్తనతో మరోసరొ వార్తల్లో నిలిచాడు. అనుమతి లేకుండా తన కుటుంబసభ్యల ఫోటోలు, వీడియోలు తీసినందుకు క్లాసెన్ ఓ ఫ్యాన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కానీ, ఇందులో క్లాసెన్ ఫేస్ మాత్రం కనిపించలేదు. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఎస్ఆర్హచ్ ఆటగాళ్లు తిరిగి హైదరాబాద్కి పయనమయ్యారు. ఈ సమయంలో ఓ అభిమాని క్లాసెన్ను పలకరించాడు. ‘‘మీరు చాలా బాగా ఆడారు’’ అని అన్నాడు. దీనిపై స్పందించిన క్లాసెన్.. ‘‘థాంక్యూ వెరి మచ్ సర్.. అయితే మీరు దయచేసి ఫోటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫోటోలు తీస్తారు. కానీ, అలా చేయొద్దు. మీరు ఆపకపోతే మాత్రం మిమ్మల్ని మట్టికరిపిస్తాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు క్లాసెన్కు మద్దతుగా నిలిచారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని కామెంట్లు చేశారు.

నల్లగొండ: ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి తొమ్మిది మంది గాయపడిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో జరిగింది. వెలిమినేడు గ్రామ శివారులో నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో ఏప్రిల్ 9న కూడా ఈ కర్మాగారంలోనే పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే.