
3518 వార్తలు







హైదరాబాద్: హ్యామ్ రోడ్ల స్కామ్ ను అసెంబ్లీలో బయటపెట్టామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. టెండర్లు తెరిచారని..సగటున 25 శాతం ఎక్సెస్ వెళ్లాయని, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో టెండర్లు ఎక్సెస్ వెళ్లాయని తెలియజేశారు. ఆర్ అండ్ బి కంటే పిఆర్ లో రెండు శాతం ఎక్కువ ఉందని, ఒక టెండర్ ఏకంగా 75 శాతం ఎక్సెస్ వేశారని అన్నారు. ఆర్ అండ్ బి లో రూ.11 వేల కోట్లతో టెండర్ పిలిస్తే రూ. 15 వేల కోట్లు అవుతుందని, పిఆర్ లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు రూ. 8 వేల కోట్లు అవుతుందని అన్నారు. రెండు శాఖలో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ. 5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, హైవేలకు టెండర్లు పిలిస్తే 25 శాతం తక్కువ.. హ్యామ్ రోడ్లలో 25 శాతం ఎక్కువ అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ఆర్సిబి స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్లో చెలరేగిపోతున్నాడు. గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి ఓడినప్పటికీ.. భువీ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రేసులో ఎస్ఆర్హెచ్ బౌలర్ ఇషాన్ మలింగా(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువనేశ్వర్ (17 వికెట్లు) అగ్రస్థానానికి చేరాడు. అంతేకాక.. భువీ ఈ మ్యాచ్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై 200 ఐపిఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్గా భువీ రికార్డు సాధించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ను ఔట్ చేయడంతో భువనేశ్వర్ ఈ ఘనతను అందుకున్నాడు. భువీ తర్వాతి స్థానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. పలు ఐపిఎల్ సీజన్లు యుఎఇ, దక్షిణాఫ్రికా వేదికలుగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఓవరాల్గా ఐపిఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చాహల్(228 వికెట్లు) మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో భువనేశ్వర్ 215 వికెట్లతో ఉన్నాడు.






హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత వల్లే మాజీ సిఎం కెసిఆర్ మేల్కొంటున్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కవితకు థ్యాంక్స్ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని, కవిత భయంతోనే కెసిఆర్ బయటకు వస్తున్నారని, వాటాల పంపకాల వల్లే కవిత పార్టీ పెట్టిందని తెలియజేశారు. కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తే కెసిఆర్ కు ఇబ్బందేంటీ? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. నగరం చుట్టూ చెరువులను బిఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని, బిఆర్ఎస్ నేతలు ఎందుకు సభలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. డిక్లరేషన్లు అమలు చేస్తున్నామని త్వరలోనే పదవులు భర్తీ చేస్తున్నామని, కేబినెట్ విస్తరణపై సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై పెను ప్రభావం పడుతోందన్నారు. అంతిమంగా సామాన్యుడిపై పెను భారం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు సామాన్యులను మోసగించడమే అని ఆరోపించారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు.
నవతెలంగాణ-కంఠేశ్వర్: జిల్లా టిఎన్జివో అసోసియేటడ్ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పెద్దొళ్ల నాగరాజు ని మెడికల్ కళాశాల లో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ నాగరాజు ఉద్యోగులకు అందిస్తున్న సేవలను మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ […] The post టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులుగా నాగరాజు appeared first on Navatelangana.
నవతెలంగాణ-జన్నారం: ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోవాలని సీపీ ఐ ఎం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకొని పాటు పలు గ్రామాల్లో హమాలీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా మండలవ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అలాగే మార్కెట్ కమిటీ, బస్టాండ్ ఆవరణల్లో సీపీఎం, సీఐటీయూ నాయకులు జెండాలను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..చికాగో అమరవీరుల స్ఫూర్తితో […] The post హక్కుల రక్షణకు పోరాడాలి: సీపీఎం appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు జెండా ఎగరవేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, “దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. 8 గంటల పనిదినం కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజును స్మరించుకుంటున్నాం” అని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని […] The post ధర్మారంలో ఘనంగా మే డే ఉత్సవాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పింది. పాఠశాలకు చెందిన ఎనిమిది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. నాజ్రీన్ 549, హిందూ 540, చరణ్ 535, సూర్య తేజ 532, నిఖీష 525 హర్షిత్ గౌడ్ 521, స్ఫూర్తి 516, వైష్ణవి 507 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విజయం పట్ల హర్షం […] The post దుబ్బాకలో సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రభంజనం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రపంచవ్యాప్తంగా జరిగే 141 మే డే కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,మత ప్రాంత,జాతి,వివక్షత,విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారని. […] The post సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు appeared first on Navatelangana.