🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3532 వార్తలు

రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు
పాత
ఫ్యాన్‌కు క్లాసెన్ స్వీట్ వార్నింగ్.. ‘దయచేసి’ అంటూనే..
పాత
తెలంగాణ

ఫ్యాన్‌కు క్లాసెన్ స్వీట్ వార్నింగ్.. ‘దయచేసి’ అంటూనే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే క్లాసన్‌ ప్రవర్తనతో మరోసరొ వార్తల్లో నిలిచాడు. అనుమతి లేకుండా తన కుటుంబసభ్యల ఫోటోలు, వీడియోలు తీసినందుకు క్లాసెన్ ఓ ఫ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కానీ, ఇందులో క్లాసెన్ ఫేస్ మాత్రం కనిపించలేదు. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఎస్‌ఆర్‌హచ్ ఆటగాళ్లు తిరిగి హైదరాబాద్‌కి పయనమయ్యారు. ఈ సమయంలో ఓ అభిమాని క్లాసెన్‌ను పలకరించాడు. ‘‘మీరు చాలా బాగా ఆడారు’’ అని అన్నాడు. దీనిపై స్పందించిన క్లాసెన్.. ‘‘థాంక్యూ వెరి మచ్ సర్.. అయితే మీరు దయచేసి ఫోటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫోటోలు తీస్తారు. కానీ, అలా చేయొద్దు. మీరు ఆపకపోతే మాత్రం మిమ్మల్ని మట్టికరిపిస్తాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు క్లాసెన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని కామెంట్లు చేశారు.

చిట్యాలలో ఫార్మా కంపెనీలో పేలుడు... తొమ్మిది మందికి గాయాలు
పాత
నాదీ రైతు కుటుంబమే.. రైతు కష్టం, విలువ తెలుసు : చంద్రబాబు
పాత
తెలంగాణ

నాదీ రైతు కుటుంబమే.. రైతు కష్టం, విలువ తెలుసు : చంద్రబాబు

అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. పమిడిముక్కల ప్రజావేదిక ప్రాంగణంలో స్టాళ్లు పరిశీలించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ‘పేదల సేవ’ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చామని, పేదల రుణం తీర్చుకునేందుకు కష్టపడుతున్నామని తెలియజేశారు. టిడిపి గుర్తులో నాగలి, కార్మికుడు, గుడిసెను దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ఉంచారని, శుభసూచకానికి గుర్తు పసుపు ఆ రంగును పార్టీ జెండాలో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి తన కష్టాన్నిమరచిపోతున్నానని, పింఛన్ల కోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నానని, దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పారు. కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని, లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా మారాలని అధికారులకు సూచించారు. అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15

తెలంగాణ ఆర్ టిసి కార్మికులందరికీ  కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు: పొన్నం
పాత
తెలంగాణ

తెలంగాణ ఆర్ టిసి కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు: పొన్నం

కరీంనగర్: హుస్నాబాద్ ఆర్ టిసి బస్ డిపో లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ జరుపుకోవడం జరిగింది. మే డే వేడుకల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్ టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ పొన్నం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ఆర్ టిసి సిబ్బంది హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలత ను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, కౌన్సిలర్ లు , ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఏసిపి సదానందం, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత పెరిగిందంటే?
పాత
తెలంగాణ

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత పెరిగిందంటే?

హైదరాబాద్: కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.993 పెంచామని చమురు సంస్థలు తెలిపాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071 హైదరాబాద్ లో రూ.3315 కు చేరింది, ఎల్ పిజి సిలిండర్‌ ధరల్లో మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం నడుస్తుండడంతో హర్మూజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ లో మూడు సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. మార్చిలో రూ.144, ఏప్రిల్ లో రూ.195, ఇప్పుడ ఏకంగా రూ.993 పెంచడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మూడు వేల రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకోవడం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకోని కూర్చోవడం బెటర్ అని యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ లో మార్పులు లేవు.

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదు: కెటిఆర్
పాత
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదు: కెటిఆర్

హైదరాబాద్: ఎన్నికలు అయిపోగానే సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచడం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. హోటల్ కార్మికులకు ప్రధాని ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచారని, రూపాయి విలువ పాతాళానికి, సిలిండర్ ధరలు ఆకాశానికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, సిగాచి ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు పరిహారం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు దాన వీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అని ఎద్దేవా చేశారు. జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అని కెటిఆర్ ప్రశ్నించారు. హామీలపై అడిగితే బూతులు తిడుతారని, కార్మికులు అంటే సిఎం రేవంత్ రెడ్డికి లెక్కలేదని మండిపడ్డారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని, తాను ఎంతో మంది సిఎం లను చూశానని, ఆ సిఎంలకు రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కార్మికులను అప్పటి మాజీ సిఎం కెసిఆర్ ప్ర

క్రేజీ కాంబో.. కొరటాల డైరెక్షన్‌లో బాలయ్య మూవీ
పాత
తెలంగాణ

క్రేజీ కాంబో.. కొరటాల డైరెక్షన్‌లో బాలయ్య మూవీ

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తదుపరి మూవీ అప్‌డేట్ వచ్చేసింది. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివతో బాలకృష్ణ తదుపరి చిత్రంలో నటించనున్నారు. ‘ఎన్‌బికె112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘‘అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది’’ అనే పవర్‌ఫుల్ కొటేషన్‌‌తో ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. ‘వీరసింహారెడ్డి’ వంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. The Stars Align ✨A Festival Awaits 💥💥#NBKxKoratalaSiva ❤‍🔥#NBK112 pic.twitter.com/PiBfFRWSeV— Yuvasud

ప‌దిలో ఉత్త‌మ మార్కులు.. ఆర్చిత యాదవ్‌కు సత్కారం
పాత
తెలంగాణ

ప‌దిలో ఉత్త‌మ మార్కులు.. ఆర్చిత యాదవ్‌కు సత్కారం

నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన నానుమాల ఆర్చిత యాదవ్ వరంగల్ జిల్లా పాకాలకొత్తగూడ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదివి ప‌దో తరగతి పరీక్షా ఫలితాల్లో 531 మార్కులు సాధించింది.దీంతో శుక్రవారం ఆర్చితను బీఆర్ఎస్ నాయకుడు ఢిల్లీ రాజు శాలువాతో సన్మానించి,డిక్షనరీని అందజేశారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడారు.. భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. The post ప‌దిలో ఉత్త‌మ మార్కులు.. ఆర్చిత యాదవ్‌కు సత్కారం appeared first on Navatelangana.

కార్మికులు తమ సమస్యల సాధనకు సంఘటితం కావాలి: చెలిమేల నర్సయ్య
పాత
తెలంగాణ

కార్మికులు తమ సమస్యల సాధనకు సంఘటితం కావాలి: చెలిమేల నర్సయ్య

నవతెలంగాణ-దర్పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్మిక వర్గాలు ఘనంగా మేడే దినోత్సవం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య ముఖ్య అతిధిగా పాల్గొనడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు బాలయ్య,భూమేష్ మమత రజిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాలన్నీ సంఘటితమై తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సంక్షేమ ఫలాలు […] The post కార్మికులు తమ సమస్యల సాధనకు సంఘటితం కావాలి: చెలిమేల నర్సయ్య appeared first on Navatelangana.

కరీంనగర్ జిల్లాలో జాన్సన్  కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్  మహిపాల్ రెడ్డి
పాత
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మోత్కూర్ విద్యార్థులు
పాత
తెలంగాణ

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మోత్కూర్ విద్యార్థులు

అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంటున్న విద్యార్థులు.మన తెలంగాణ/మోత్కూర్ : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ (ఎస్.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పాఠశాల విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచారు. విజేతలకు హైదరాబాదులోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులు నిర్వాహకులు అందజేసినట్లు పాఠశాల డైరెక్టర్లు మలిపెద్ది రాజిరెడ్డి, మల్లిపెద్ది శివానీలు గురువారం విలేకరులకు తెలిపారు. ఒలంపియాడ్ టాలెంట్ టెస్టులు జి మోక్షిత 9వ తరగతి, పి లోకేష్ 8వ తరగతి , పి హర్షిత ఏడవ తరగతి, పి పూజిత ఆరవ తరగతి , ఎం. మాన్విక్ రెడ్డి మూడవ తరగతి విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచారు. అదే విధంగా జిల్లా టాపర్లుగా బీ లిఖిత 9వ తరగతి, పి వైష్ణవి 8వ తరగతి, ఏ అర్జున్ ఏడవ తరగతి, ఎన్. రోసి గ్రేసీ ఆరవ తరగతి, గాదెనబోయిన సాయి నక్షత్ర 5వ తరగతి, ఎం అక్షిత్ రెడ్డి ఐదవ తరగతి , జీ సాన్విక నాలుగవ తరగతి, బి శ్రేయాన్స్ మ

గుండి గోపాల్రావుపేట  ఎస్సెస్సీ ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం : కరస్పాండెంట్ మినుకుల మునీందర్
పాత
కోల్కతాలో అర్ధరాత్రి హైడ్రామా.. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని దీదీ విమర్శ..  స్ట్రాంగ్ రూమ్ ముందు 4 గంటల ధర్నా
పాత
ఫేస్‌బుక్ సీఈఓ జూకర్‌బర్గ్ సంచలన నిర్ణయం : మే 20 నుండి కొత్త రౌండ్ లేఆఫ్స్ స్టార్ట్
పాత
అసలు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా డిసెడ్ చేస్తారో తెలుసా?  పెంచుకోవటం కుదురుతుందా?
పాత
విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ : సివి ఆనంద్
పాత
తెలంగాణ

విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ : సివి ఆనంద్

హైదరాబాద్: ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల నెరవేరేలా, శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తామని డిజిపి సివి ఆనంద్ తెలిపారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర కొత్త డిజిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని పోలీసు శాఖకు సూచించారు. నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని, మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందని తెలియజేశారు. నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని, నేరగాళ్లు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతుందని అన్నారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ అని కొనియాడారు. శాంతిభద్రత విషయంలో రాజీ పడొద్దు అని నేరాల తీరు కూడా మారుతుందని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం బాగా కృషి చేస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా.. డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయని

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, చీరల వ్యాపారం చేసే భార్యను చంపి భర్త ఆత్మహత్య : కొడుకులు ఇద్దరూ డాక్టర్ చదువుతున్నారు..!
పాత
వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం
పాత
తెలంగాణ

వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని న‌వ‌తెలంగాణ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేడే ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం జెండాను ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత న‌వ‌తెలంగాణ దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేష్ అధ్య‌క్ష‌త‌న ఎంహెచ్ భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మినేని వీర‌భ‌ద్రం మాట్లాడుతూ..144 సంవ‌త్స‌రాల క్రితం కార్మిక‌లోకం క‌దంతొక్కి 8 గంట‌ల ప‌ని దినాన్ని సాధించుకుంద‌ని, వారి త్యాగాలకు, […] The post వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం appeared first on Navatelangana.

దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు
పాత
తెలంగాణ

దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. నవజాత శిశువును వీధికుక్కలు పీక్కుతిన్న విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గుట్ట పక్కన గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును పడవేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న వీధికుక్కలు ఆ శిశువును కొరికి తినేశాయి. శిశువు శరీర భాగాలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. […] The post దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు appeared first on Navatelangana.

సింగరేణి కార్మికుల పెన్షన్ పెరిగేవరకు పోరాడతా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పాత
ఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తున్నయా..? : యాదాద్రి కలెక్టర్ అనురాగ్
పాత
కరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్  ట్రీ విద్యార్థుల విజయకేతనం :  చైర్మన్  బి.రమణారావు
పాత
Advertisement