🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3891 వార్తలు

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం
పాత వార్త
తెలంగాణ

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం

– దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు?– పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు – రిపోర్టు ప్రకారం చర్యలు వద్దని చెప్పింది– కేసీఆర్‌ మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు […] The post కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 27, 2026 - సోమవారం👁 2
రెట్టింపు ధరలకు యూరియా దిగుమతి
పాత
తెలంగాణ

రెట్టింపు ధరలకు యూరియా దిగుమతి

సుమారు 2.5 మిలియన్‌ టన్నులు ఇంపోర్ట్‌దిగుమతి ఖర్చులు పెరిగితే ప్రభుత్వంపై ఆర్థిక భారం ముందస్తు ప్రణాళికాలోపం కారణంగానే ఈ పరిస్థితి : మోడీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యవసాయరంగంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామంన్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలోని పరిస్థితు లను ముందుగానే అంచనా వేయటంలో విఫలమైన మోడీ సర్కారు చర్యలతో భారత్‌ భారీ మూల్యం చెల్లించు కుం టోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇప్పటికే గ్యాస్‌ కొరత ఏర్పడి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. చిరు వ్యాపారులను […] The post రెట్టింపు ధరలకు యూరియా దిగుమతి appeared first on Navatelangana.

కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు
పాత
తెలంగాణ

కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆధారాలు లేకుండా ఒక రిటైర్డు ఉద్యోగిపై సీబీఐ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని అధికరణ 21 ద్వారా వ్యక్తికి లభించిన స్వేచ్ఛను కాలరాయడమేనని చెప్పింది. రిటైర్డు ఉద్యోగికి రూ.50 వేలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. 2009 జనవరి 31న రిటైర్‌ ఉద్యోగిపై, అదే ఏడాది మార్చిలో తయారైన మెడిసిన్స్‌ విషయంలో సీబీఐ కేసు పెట్టింది. సికింద్రాబాద్‌ లాలాగూడలోని రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రికి సరఫరా చేసిన రాక్సీత్రోమైసిన్‌ […] The post కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు appeared first on Navatelangana.

సామ్రాజ్యవాదంతో ప్రపంచానికి సమస్యలు
పాత
తెలంగాణ

సామ్రాజ్యవాదంతో ప్రపంచానికి సమస్యలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థపొరాటాల కాలం..జనంలో ఉండి పనిచేయాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు‘మన స్థాయిలో మరో సుందరయ్య’ పుస్తకావిష్కరణనవతెలంగాణ- వైరాటౌన్‌సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచవ్యాప్తంగా సమస్యలను సృష్టిస్తున్నాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో సోమవారం మార్క్సిస్టు పోరాట యోధుడు సంక్రాంతి మధుసూదన్‌రావు ప్రథమ వర్థంతి జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్మారక […] The post సామ్రాజ్యవాదంతో ప్రపంచానికి సమస్యలు appeared first on Navatelangana.

ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క
పాత
తెలంగాణ

ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ”చైల్డ్‌ సేఫ్టీ – ప్రొటెక్షన్‌ అండ్‌ సే నో టు డ్రగ్స్‌” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, […] The post ఆఫ్టర్‌ కేర్‌ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క appeared first on Navatelangana.

వచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె
పాత
తెలంగాణ

వచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె

వ్యవసాయం, గ్రామీణ జీవనంపై కార్పొరేట్‌ దాడిరైతు-కార్మికుల ఐక్య పోరాటమే ప్రత్యామ్నాయం : బి వెంకట్‌, ఎంపీ శివదాసన్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం మోకరిల్లిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, ఎంపీ శివదాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నాటకలోని షాపూర్‌లో వ్యవసాయ, గ్రామీణ కార్మికుల మహాప్రదర్శనలో వారు మాట్లాడారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై వచ్చే నెల 15న దేశవ్యాప్త సమ్మె […] The post వచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె appeared first on Navatelangana.

డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం
పాత
తెలంగాణ

డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం

రేవంత్‌రెడ్డి, భట్టి సహా పలువురి సంతాపంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) మారబోయిన మధుసూదన్‌ (50) హఠ్మారణం చెందారు. సోమవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గతంలో ఈనాడు, […] The post డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్‌ హఠాన్మరణం appeared first on Navatelangana.

డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు
పాత
తెలంగాణ

డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు

– దానితో పంజాబ్‌ నష్టపోతుంది– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్‌ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […] The post డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు appeared first on Navatelangana.

ఆర్సీబీ అదుర్స్‌
పాత
వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు
పాత
తెలంగాణ

వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు

పశ్చిమ బెంగాల్‌లోప్రజల నుంచి విశేష స్పందననవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్‌ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. డోమ్‌జూర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్‌ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో […] The post వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు appeared first on Navatelangana.

టెన్‌పిన్‌ చాంప్స్‌ గాంధీ, శతి
పాత
బీజేపీది మనువాద సిద్ధాంతం
పాత
తెలంగాణ

బీజేపీది మనువాద సిద్ధాంతం

మహిళలకు ప్రాధాన్యత ఉండదుబొందల పడ్డట్టు ప్రజల పరిస్థితిసీఎం, మంత్రులను చూస్తే జాలేస్తుందికోటి ఎకరాలు కబ్జా చేసే యత్నంతెలంగాణ వారియర్స్‌ తయారు కావాలిసభ్యత్వాన్ని పట్టించుకోకుంటేసిట్టింగ్‌ ఎమ్మెల్యేలకూ టికెట్‌ ఇవ్వనుసంస్థాగతంగా పార్టీబలోపేతం కావాలి : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీజేపీది మనువాద సిద్ధాంతమని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండబోదని అన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తుందన్నారు. లోక్‌సభలో 2/3 మెజార్టీ లేకున్నా మహిళా బిల్లును, డీలిమిటేషన్‌కు ముడిపెట్టిందని చెప్పారు. […] The post బీజేపీది మనువాద సిద్ధాంతం appeared first on Navatelangana.

కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు..
పాత
తెలంగాణ

కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు..

అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం, కమిటీలపై దృష్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీఆర్‌ఎస్‌ అధినేత్రి, తన కూతురు కల్వకుంట్ల కవిత ప్రభావం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పడిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల దాకా పలు ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయినా బయటకు రాని కేసీఆర్‌.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి తెలంగాణ భవన్‌కు రావటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అటు లీడర్లకు, ఇటు […] The post కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు.. appeared first on Navatelangana.

కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
పాత
తెలంగాణ

కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా కార్యాచరణగ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు రద్దుత్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమంచీఫ్‌ మినిస్టర్‌ స్థాయిలో చీప్‌ మాటలుప్రాంతీయ పార్టీ స్థితికి పడిపోయిన కాంగ్రెస్‌మాతో కలిసి నడిచిన సకల జనులకు ధన్యవాదాలు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల […] The post కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట appeared first on Navatelangana.

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం
పాత
తెలంగాణ

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం

వాషింగ్టన్‌ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్‌ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్‌ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్‌ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్‌ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్‌ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్‌ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్‌ డకోటా గవర్నర్‌ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ […] The post విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం appeared first on Navatelangana.

క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి
పాత
తెలంగాణ

క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి

ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో ప్రమాదంభారీ ఈదురుగాలులు వీచడంతోనే..రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటననవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్‌ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీ ప్రాజెక్టులో పనులు […] The post క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి appeared first on Navatelangana.

లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి
పాత
నెతన్యాహూను ఓడిస్తాం
పాత
తగ్గుతున్న ‘ఉపాధి’ పనిదినాలు
పాత
సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు
పాత
తెలంగాణ

సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు

ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలున్యూఢిల్లీ : భారత్‌, న్యూజీలాండ్‌ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, న్యూజీలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ […] The post సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు appeared first on Navatelangana.

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)
పాత
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)

మేషంభూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కర్కాటకం సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత

మా లెక్కలు వేరు
పాత
తెలంగాణ

మా లెక్కలు వేరు

ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ -చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్‌ బెదిరింపులు-రష్యాలో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వాషింగ్టన్‌..టెహ్రాన్‌: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు […] The post మా లెక్కలు వేరు appeared first on Navatelangana.

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
పాత
తెలంగాణ

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి తిరుమలేశుని దర్శించుకున్న బిజెపి చీఫ్ రాంచంద్రరావు మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తెలిపారు. రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందిం

చాలా పార్టీలు వస్తుంటయ్.. పోతుంటయ్
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)