
4101 వార్తలు



హైదరాబాద్: బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయ్యాంది. పెళ్లి పేరుతో నమ్మించి రూ 9.5 కోట్లు మోసం చేసిందని ధర్మేంద్ర కుటుంబం ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫాట్లు, కారు, గిఫ్టుల రూపంలో రూ. 9.5 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. తన కుమారుడిని మోసం చేసిందని తన తండ్రి సత్యనారాయణ, అషురెడ్డి సోదరి దివ్యారెడ్డికి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 లో అషురెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం ఏర్పడింది. ఇరుకుటుంబాలు వేణుస్వామితో జాతకాలు సైతం చూపించారు. సడన్ గా ధర్మేంద్రతో పెళ్లికి నిరాకరించడంతో ధర్మేంద్ర డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అషురెడ్డి డబ్బులు ఇవ్వకపోగా తిరిగి కేసు పెడతానని బెదిరించి ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ జయంత్ తో కలిసి డ్రామా ఆడిందని బాధితుడు ధర్మేంద్ర అన్నారు. ఛీటింగ్ ఆరోపణలపై అషురెడ్డి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని, పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్లు కాజేశాననేది అవాస్తమని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని, ధర్మేంద్ర కుటుంబానికి అషురెడ్డి హెచ్చరించారు. అషురెడ్డిని ఆమె తల్లే



అమరావతి: అర్థరాత్రి అమ్మాయిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేస్తుండగా పోలీసులు కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ శివారలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అర్థరాత్రి ఆమె విజయవాడ బస్టాండ్కు చేరుకుంది. రాత్రి సమయంలో నంబూరుకు వెళ్లడం మంచిది కాదని బస్టాండ్లో వెయిట్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ నంబూరుకు వెళ్తానని పలుమార్లు ఆమెను అడిగాడు. ఆటోలో వెళ్లడం సురక్షితం కాదని అక్కడే ఉండిపోయింది. ఆటో డ్రైవర్ మళ్లీ వచ్చి అడగడంతో సరేనని వెళ్లింది. అప్పటికే యువతి శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో ఆటో నంబర్ను యాఫ్ ఎంటర్ చేసింది. విజయవాడ నుంచి డిజిపి కార్యాలయం దాటిన వెంటనే ఆమెతో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆటోను వెంబడించి పట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొలను కొండకు చెందిన ఫణీంద్రగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో అతడి వ్యవహారశైలిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శక్తి యాప్ ద్వారా యువతిని పోలీసులు కాపాడడంతో మంత్రి నారా లోకేష్ మంగళగి


జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో ఓటమిని చవి చూసింది. సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఛేజింగ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. అయితే మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపాలు కావడానికి కారణాలను ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. ఫీల్డింగ్లో తమ జట్టు విఫలమైందని.. కీలకమైన క్యాచ్లు వదిలేశామని పరాగ్ అన్నాడు. ‘‘నైపుణ్యం పరంగా మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేశాం. కానీ, కీలకమైన క్యాచ్లను వదిలేశాం. అదీనూ భారీ షాట్లు కొట్టే అభిషేక్ వంటి ప్లేయర్లు ఇచ్చిన క్యాచ్ను వదిలిపెట్టడం నష్టం చేసింది. ఇలాంటి వారి నుంచి రెండో ఛాన్స్ వస్తుందని ఆశించలేం. మ్యాచ్ను మా నుంచి లాగేశారు. మేం ఫీల్డింగ్లో ఇంకాస్త మెరుగు కావాల్సిన అవసరం ఉంది. గేమ్లో ఇదంతా భాగమే అయినా.. ఇంప్రూవ్ చేసుకుంటాం. తర్వాత మ్యాచ్ నాటికి సరి చేసుకుని బరిలోకి దిగుతాం. తొలుత మేం బ్యాటింగ్ో కనీసం మరో 15 పరుగులు చేయాల్సింది. ఆఖర్లో సన్రైజర్స్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. యార్కర్లను చక్కగా అమలు చేశారు’’ అని పరాగ్ తెలిపాడు.

అమరావతి: ఎపిలో డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు పై పేర్ని నాని మండిపడ్డారు.ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు స్పహ లేకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని, దేశంలో తనకంటే అనుభవమున్న సిఎం లేడని కోతలు కోస్తుంటారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరత వ్యాపారస్తులకు పండుగలా మారిందని ధ్వజమెత్తారు. పలుకుబడి ఉపయోగించి సమస్యను పరిష్కరించలేరా? అని తమ అనుభవం ఎందుకు? అని ప్రశ్నించారు. పెట్రోల్ అగచాట్ల మాటున పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు నలిగిపోతున్నాయని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవతెలంగాణ కంఠేశ్వర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.క్లబ్ అధ్యక్షుడిగా పెట్టిగాడి రాఘవేందర్,కార్యదర్శిగా చింతల గంగాదాస్,కోశాధికారిగా అంకం రాజేందర్ ఎన్నికయ్యారు.ఎన్నికల అధికారిగా లయన్స్ జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ వ్యవహరించారు..లయన్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాఘవేందర్ ఈ సందర్భంగా చెప్పారు.కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శులు డి.యాదగిరి,కె.రవీందర్,జోన్ చైర్మెన్ అబ్బాయి […] The post ఇందూర్ లయన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఒక కార్యక్రమం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారన్న వార్త తనకు ఉపశమనం కలిగించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు జరిగింది. ఈ […] The post ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు..ఖండించిన ప్రధాని మోడీ appeared first on Navatelangana.





గాంధీనగర్: మానసిక వికలాంగురాలైన మేనకోడలుపై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మహిసాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లూనావాడా టౌన్లో 26 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. 70 ఏళ్ల వృద్ధుడు వరసకు మేనకోడలు అయ్యే సదరు యువతిపై కన్నేశాడు. వృద్ధుడు సదరు యువతిని ఒంటిరిగా ఇంటికి రప్పించి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.





అమరావతి: అనంతపురం జిల్లా రుద్రం పేటలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వైసిపి నేత ఖాజా హుస్సేన్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు హుస్సేన్ ను పట్టుకుని గుండు కొట్టించి దేహశుద్ధి చేశారు. కుటుంబ సభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైసిపి నేత కావడంతో పంచాయితీ చేసి పోలీసులు తనను వదిలి పెట్టారు. మతిస్థిమితం లేదంటూ కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. వైసిపి నేత ఖాజా హుస్సేన్ ను వదిలి పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

