23126 వార్తలు

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశా, సచిన్లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాదిలోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.



పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ముసాయిదా విడుదల చేసిన కేంద్రం సోమవారం లోక్సభ ముందుకు బిల్లు న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలు, అవకతవకలకు శాశ్వతంగా చెక్ పేట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. రెండేళ్ల క్రితం తీసుకువచ్చిన పేపర్ లీక్ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును తీసుకువస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ ను కేంద్రం శనివారంనాడు విడుదల చేసింది. ఈ కీలక సవరణ బిల్లును లోక్సభలో సోమవారంనాడు ప్రవేశపెట్టనుంది. బిల్లు ప్రతులను లోక్సభ సభ్యులకు సర్క్యులేట్ చేసింది. సవరణ బిల్లు ప్రకారం, పరీక్షల్లో సాధారణ మోసాలు, అక్రమాలకు పాల్పడే వారికి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. రూ.50 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీస జైలు శిక్ష ఏడేళ్లు, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు, సర్వీసు ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడినట్లయితే రూ.5 కోట్ల వరకూ జరిమానా ఉంటుంది. అక్రమాలకు పాల్పడే సంస్థలను ఎనిమిదేళ్లు బ్లాక్లిస్ట్ లో ఉంచుతారు. పేపర్ లీక్ కేసుల్లో విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలి. కేస


జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ బ్రయాన్ బెనెట్ (32) మాత్రమే రాణించాడు. మరుమాని (24), ర్యాన్ బర్ల్ (20), బ్రాడ్ ఎవాన్స్ (19), డియోన్ మైయర్స్ (12)లు పెద్దు స్కోరు చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ లు చెరో వికెట్ తీయగా.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్, తిలక్ వర్మకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ 90 పరుగులు భారీ తేడాతో గెలుపొంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది అని పేర్కొన్నారు. జెన్ జెడ్ అంటూ విక్టరీ సిబల్ చూపిస్తూ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి ఉపనేత హరీష్రావు స్పందిస్తూ, దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం అని వ్యాఖ్యానించారు. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ , కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీమంత్రి,బిఆర్ఎస్ఎల్పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం అని అభివర్ణించారు. బిఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్




వయనాడు: నీట్ పరీక్షల్లో అవకతవకలపై గళం విప్పిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పోలీసుల అమానుషకాండకు బాధితులైన విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పడానికి బదులు సిల్లీ వీడియోలు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వీధుల్లోకి రావడానికి ఆయనే బాధ్యులని, విద్యార్థులపై టెర్రరిస్టుల తరహాలో పెల్లెట్ గన్లు ప్రయోగించడానికి కూడా ఆయనే బాధ్యులని అన్నారు. దీనిపై దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటుకు హాజరై విద్యార్థులు అడుగుతున్న మార్పులు చేపట్టాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, విద్యార్థుల భవిష్యత్తు చెల్లాచెదురైందని చెప్పారు. పరీక్ష రాయాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయితే కొందరు ధనవంతుల పిల్లలు 30 నుంచి 40 లక్షలలకు కొనుక్కుంటారని, తక్కిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. ఈ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన వారికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందన్నారు. కఠినమైన చట్టాలు ఉన్నందున ఎవరూ ఆం


కొచి : కొచ్చి కేంద్రంగా ఉన్న సిఎంఆర్ఎల్ (కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ )కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసులో కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ శశిధరన్ కర్తా కేరళ మాజీ సిఎం పినరయి విజయన్ కుమార్తె వీణా టికి అక్రమంగా నిధులు చెల్లించినట్టు అంగీకరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను శనివారం న్యాయనిర్ణయాధికార సంస్థకు సమర్పించింది. నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ తన నివేదికలో కోరింది. మాజీ సిఎం పినరయి విజయన్తో ఆమెకున్న వ్యక్తిగత సంబంధం వల్లనే ఈ చెల్లింపులు జరిగినట్టు మాజీ ఎండీ అంగీకరించారని పేర్కొంది. సిఎంఆర్ఎల్ అక్రమ లావాదేవీల్లో వీణా టి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి.మాజీ సిఎం పినరపి విజయన్ కుమార్తె వీణాకు, సిఎంఆర్ఎల్కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. విజయన్ కుమార్తె వీణా టి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు సిఎంఆర్ఎల్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే దాదాపు రూ. 2.78 కోట్ల మొత్తం ముందస్తు చెల్

లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్ ఈ ఫీజును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన అప్పీల్స్ కోర్టు సాధారణంగా 5000 డాలర్ల లోపు ఉండే ఫీజును లక్షడాలర్లకు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత వాషింగ్టన్: అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్



వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. చర్చల అంశాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తున్నందున ఆ దేశంపై భీకర దాడులు విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. “ప్రస్తుతం మేం వారితో చర్చలు జరుపుతున్నాం. చర్చలను వారు సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకు కారణం ఉండొచ్చు. వారు లొంగిపోవచ్చు. లేదా ఏదైనా గుహ లోకి వెళ్లి దాక్కోవచ్చు. మా వైపు నుంచి క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయి. యుద్ధం ముగించడానికి రెండు అవకాశాలున్నాయి. ఇప్పుడు చేస్తోన్న దాడుల తీవ్రత పెంచి, వాళ్ల దగ్గర ఉన్నదంతా నాశనం చేయొచ్చు. లేకపోతే ఒప్పందం చేసుకోవచ్చు. డీల్ చేసుకోవడమనేది తెలివైన వ్యూహం. చర్చల విషయంలోవారు సీరియస్గా ఉన్నంత మాత్రాన ఒప్పందం కుదురుతుందని చెప్పలేం. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి” అని పేర్కొన్నారు.కాగా.. ఇరాన్పై భీకర దాడుల్ని పరిశీలిస్తున్నామని, దానిపై నిర్ణయం తీసుకుంటామని ముందురోజు ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఇరాన్ నుంచి కౌంటర్ వచ్చింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమని, బలప్రయోగం , ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోమని



ఇద్దరు పోలీసులకు గాయాలుటియర్ గ్యాస్, స్పల్ప లాఠీచార్జి ప్రయోగించిన పోలీసులు అదనపు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపు న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తెంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అదనపు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ముంబై : మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తా బీహార్లో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడు బీహార్లో ఉన్నట్టు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. బిజేంద్ర గుప్తా, అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్పై మహారాష్ట్రకు తీసుకువచ్చి టెట్ పేపర్ లీక్ నెట్వర్క్, ఇలాంటి కేసుల్లో అతడి ప్రమేయాన్ని ప్రశ్నించనున్నారు. దేశ వ్యాప్తంగా ఇతర పరీక్ష పత్రాల లీక్ సిండికేట్లతో బిజేంద్ర గుప్తాకు ఉన్న సంబంధాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టెట్ పేపర్ లీక్ కేసులో బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గుప్తా, అతడి అనుచరుడి అరెస్టుతో ఈ సంఖ్య 14కు చేరింది.

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి అమ్మాయి దీటుగా బదులిచ్చారు. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి అతడిని నిలదీసింది. అంతేకాకుండా బస్సులోని ఇతర ప్రయాణికుల ముందే అతడిని చితకబాది తన ధైర్యాన్ని చాటుకుంది. ఈ విషయాన్ని డ్రైవర్కు చెప్పడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. బస్సులో ఆ యువతి సదరు వేధింపుల వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం మేరక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
