24785 వార్తలు





శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజౌరీ, ఫూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఢిల్లీ: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. హార్టికల్చర్ పై దేశవ్యాప్తంగా ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై చర్చ జరగాలని, చట్టం తేవాలని, మ్యూల్ ఖాతాలు, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై జరగాలని కోరారు. షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీలద్వారా దేశానికి తీవ్ర నష్టం జరిగిందని ఎంపి లావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరిగతిన జరుగుతున్నాయని, గోదావరి- పెన్నా నదులను అనుసంధానించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాలని, మహిళా బిల్లుకు విపక్షాలు సహకరించాలని ఎంపి లావు కృష్ణదేవరాయులు కోరారు.

సిద్దిపేట: కాళేశ్వరం జలాల కోసం రైతన్నలు కదం తొక్కారు. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు రైతుల మహా పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. రక్త పీపాసి సిఎం రేవంత్ రెడ్డి ఈగ కాసుకోవాలని, నీళ్ల కోసం మా రక్తం దారపోస్తామని, కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని రైతన్నలు నినాదాలు చేశారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని, ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర కు వేలాది మందిగా తరలివచ్చి రిజర్వాయర్లను నీళ్లతో నింపాలని కోరారు. -

బెంగళూరు: బైక్పై వెళ్తుండగా అడవి పందిని తప్పించే క్రమంలో నవ వధువు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంజనగూడు ప్రాంతానికి చెందిన పునీత్, మోగనహుండి గ్రామానికి చెందిన మేఘనకు 15 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఆషాడ మాసం కావడంతో మేఘన తన పుట్టింటికి వెళ్లింది. భార్యను కలిసేందుకు పునీత్ కూడా అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం భార్యతో కలిసి తన ఇంటికి బైక్పై వస్తున్నాడు. ఆర్టి నగర్ సమీపంలో అడవి పంది ఎదురు రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. మేఘనా తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన చనిపోయింది. పునీత్ స్వల్ప గాయాలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పునీత్ హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మేఘన కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలలో ఉండేదని పోలీసులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

‘దేవతల పాత్రలు పోషించే అవకాశాలు నటీనటులకు అంత సులభంగా లభించవు. ఎందుకంటే అవి చరిత్రలో నిలిచిపోయతాయి. సీతమ్మ పాత్ర నాకు దక్కడం నా అదృష్టం’’ అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు. ఆమె సీతగా, రణ్బీర్ కపూర్ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్లో విడుదల కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా శననివాం ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘సీతమ్మ నేవ్వే నా ద్వారా ఈ పాత్రలో నటించూ అని ధ్యానం చేస్తుండేదాన్ని’ అని తెలిపారు.

హైదరాబాద్: నేతలందరూ వారి నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. సర్ ప్రక్రియ చాలా కీలకమైనదని..నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. జూమ్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టాలని, సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు సర్ ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని, దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలు గుర్తించి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవద్దు అని మహేష్ గౌడ్ సూచించారు.




హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ లోని ఎగ్జిట్ 18 వద్ద ఎయిర్పోర్టుకు వెళ్తుండగా కారు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుబాయ్కు వెళ్తున్న తమ స్నేహితుడిని ఎయిర్పోర్టులో సాగనంపేందుకు రెండు కార్లలో స్నేహితులు బయలుదేరారు. కెఎ 29 ఎన్ 1908 అనే నంబర్ గల స్విప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఖాజా అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో జమీర్, యాకూబ్, అక్బర్ తీవ్రంగా గాయపడడంతో శంసాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో విషాదం చోటుచేసుకుంది. నీలాద్రి హాస్పిటల్లో చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నల్లగొండ జిల్లా పెద్దవూర గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు శస్త్రచికిత్స (ఫ్యామిలీ ప్లానింగ్) కోసం నీలాద్రి ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. శస్త్రచికిత్సకు ముందు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల ప్రాణాలు తీశాయని బంధువులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సర్ పై సీరియస్ గా దృష్టి సారించాలని, పార్టీ పరంగా సర్ ఇన్ ఛార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సర్ పై జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్ పై 489 భేటీలు జరిగాయని తెలియజేశారు. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని, ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, పదవుల కోసం గాంధీభవన్ లో అపాయింట్ మెంట్లు ఇవ్వొద్దని కోరారు. రేపటి నుంచి ఆగస్టు 3వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దని సూచించారు. కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చోని పనిచేయట్లేదని విమర్శించారు. ఇన్ ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్ పై సమీక్షలు నిర్వహిస్తారని, ఎంపిలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని అన్నారు. ఇన్ ఛార్జ్ లుగా ఉన్న చోట ఎంపిలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని రేవంత్





