
3924 వార్తలు





నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేమ్రాజ్ కల్లానిలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న, డోన్ గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసా ఆధ్వర్యంలో, సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్, మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పటేల్, మతుర తండా సర్పంచ్ అనిత చౌవాన్ , అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ జెండాను […] The post గ్రామాలలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ- మద్నూర్ హైదరాబాదులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ, గృహ నిర్మాణాల, శాఖ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు కావాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి […] The post గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎగరవేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో […] The post డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-నాచారంబీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాచారంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసిన మహానేత కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర సాధనకు దారి తీసిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే ప్రజాప్రతినిధులుగా సేవ […] The post తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 28న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సమస్మరణ సభను న్యూ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష […] The post నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

నవతెలంగాణ-రామారెడ్డి కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని దళారులకు అన్నీ మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి లబ్ధి పొందాలని సర్పంచ్ లతశ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఉప సర్పంచ్ దయానంద్, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, పాలకవర్గ సభ్యులు చాట్ల లక్ష్మణ్, వంచ సతీష్, నరేందర్ రెడ్డి, కూడెల్లి ఎల్లం, దేవదాస్, కీసరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు […] The post వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గౌసోద్దిన్ భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సేవా సమితి సభ్యులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. The post అనారోగ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.


పశ్చిమ బెంగాల్: బిహార్, ఒడిశాలో కమలం వికసించిందని.. ఇప్పుడు బెంగాల్ వంతు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జనసంఘ్ కు బెంగాల్ పుట్టినిల్లు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ పశ్చిమబెంగాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఏం చేయలేదని, టిఎంసి రైతులు, యువత కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టిఎంసి విధానం అని మండిపడ్డారు. 15 ఏళ్లు ఏం చేశారో టిఎంసి ఒక్కసారైనా చెప్పిందా? అని రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత లేదా? అని మోడీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చారని, టిఎంసి తన సిండికేట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని, టిఎంసి సిండికేట్ ను ఓడించాలని సూచించారు. బెంగాల్ యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు.
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమం, […] The post తాడిచెర్లలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్లో బీజేపీని తిరస్కరించాలని CPI జనరల్ సెక్రటరీ డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతో బెంగాల్తో పాటు దేశాన్ని సంక్షోభంలో పడేస్తుందన్నారు. నేటితో ముగియునున్న సెకండ్ ఫేజ్ ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వవద్దని నేను బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బెంగాల్లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం. బెంగాల్లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోనివ్వకూడదు. ఇది కేవలం బెంగాల్కే కాకుండా, యావత్తు దేశానికి కూడా వినాశకరంగా పరిణమిస్తుందని’ అని చెప్పారు. […] The post బెంగాల్లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జనరల్ సెక్రటరీ డి.రాజా appeared first on Navatelangana.
ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుకౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని యుంసీటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమన్నారు. భూమి కౌలుకు తీసుకొని అరుగాలం కష్టపడి పంట పండిస్తే పండించిన పంటను ప్రభుత్వానికి […] The post కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలో పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజలందరూ గో ఆరాధన ఉద్యమ ర్యాలీ సోమవారం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరుకొని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతలతో గోశాల నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తహశీల్దార్ ముజీబ్ కు వినతిపత్రం అందజేశారు. గో వంశ సంరక్షణ, గోవును దేశమాతగా, ఓన్నత్య త్యాగానికి చిహ్నంగా […] The post పార్టీలకతీతంగా గో ఆరాధన ఉద్యమ ర్యాలీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామంలో సంవృద్ది జీవ ప్రార్ధన మందిరం నందు సోమవారం ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని రిబ్బన్ కట్ చేసి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వడిత్య విజయ్, శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, పెద్దవూర మండల మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, పాస్టర్ శ్యాం బాబు, దోరేపల్లి నరేష్, డేవిడ్, శంకర్ రెడ్డి, జోషి, […] The post వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.
నవతెలంగాణ -పెద్దవూర నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి 26 ఆవిర్భావ దినోత్సవం సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి సర్పంచ్ జటావత్ రవి నాయక్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొదిళ్ల శ్రీను ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి కేక్ […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.