21393 వార్తలు

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది. హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు (ఓపీటీ)పై లక్ష డాలర్లు రుసుము విధించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది. అమెరికా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడాలని కోరుకునే వారికి ఈ ఓపీటీ తప్పనిసరి. ఓపీటీ లేకుంటే విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఓపీటీ కింద జాబ్ చేస్తే హెచ్1-బి వీసాలకు అవకాశం ఉంటుంది. 2024 లెక్కల ప్రకారం సుమారు 4,19,000 విదేశీయులు ఓపీటీపై పనిచేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం లెక్కలు మాత్రం అందుబాటులో లేవు. కాగా, అమెరికా యూనివర్సిటీల నుంచి ఎక్కువగా రిక్రూట్మెంట్లు చేసుకుంటున్న టెక్ కంపెనీలు మాత్రం హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజును వ్యతిరేకిస్తున్నాయి.

కావేరీ జలాల వివాదం మరోసారి తమిళనాడు-కర్ణాటక మధ్య చిచ్చు రేపింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ప్రస్తుత పరిస్థితిలో తమిళనాడు సర్కార్తో చర్చల్లేవని స్పష్టం చేశారు.తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయడం, దీంతో కర్ణాటకలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై విధాన సౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమిళనాడుతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రస్తుతానికి సానుకూల వాతావరణం లేదన్నారు.ఈ వివాదంపై ఆగస్టు మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, రైతులు, విపక్షాలతో చర్చించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా, కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ ఆదేశాలపై ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ అనుకూల గ్రూపులు నిరసనలకు దిగాయి. తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ స్క్రీనింగ్న













పాస్పోర్ట్ నుంచి ఫారిన్ ఉద్యోగం దాకా.. టామ్కామ్దే బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి



మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులకు అత్యంత కీలకమని, పెట్టుబడులకు సురక్షితమైన గ మ్యం తెలంగాణ అని, రాష్ట్ర ప్రభు త్వం మీ పెట్టుబడులకు పూర్తి రక్షణ గా ఉంటుందని, రాష్ట్రంలో పాలసీ పె రాలసిస్ లేదని సిఐఐ నార్తర్న్ రీజనల్ (ఉత్తర భారత ప్రతినిధులతో) కౌన్సిల్ ప్రతినిధులతో సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణకు వచ్చి పెట్టుబడు లు పెట్టాలని సిఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎంసిఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిఐఐ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ విజయగాథలాగే, సీఐఐ కూడా 130 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిందని, రాజ్యాంగాన్ని రూపొందించిందని, స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిందని ఆ యన తెలిపారు. ఆర్థిక సంస్కరణల వ ల్లనే భారతదేశం నేడు ప్రపంచ స్థాయి కి చేరుకుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపా

మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో రాష్ట్రానికి జూలై నెలాఖరులో ఏర్పడిన అల్పపీడనం వరంగా మా రింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షా లు గట్టెక్కించాయి. జూన్ 1 నుంచి జూలై 31 వరకు నమోదైన మొత్తం వర్షపాతంలో దాదాపు మూడో వంతు వర్షం కేవలం గత ఐదు రోజుల్లోనే కురవడం విశేషం. దీంతో తీవ్ర లోటు పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడుతూ ప్రస్తుతం రాష్ట్రం సాధారణ వర్షపాతం కేటగిరీలోకి చేరుకుంది. రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిజిడిపిఎస్) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 31 వరకు 339.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలానికి 357.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండ గా ప్రస్తుతం లోటు కేవలం ఐదు శాతానికి పరిమితమైంది. అల్పపీడనం ప్రభావంతో కురిసి వర్షాలతో గత ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటివరకు నమోదైన మొత్తం వర్షపాతంలో దాదాపు 34 శాతం వర్షం కేవలం ఐదు రోజుల్లోనే కురిసింది. ఈ వర్షాలు లేకపోతే రాష్ట్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముండేదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై మూడో వారంలో అ

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 31: మేడిగడ్డ మరమ్మత్తులపై ఆగస్టు నెలాఖరు నాటికి బ్లూప్రింట్ సిద్ధం కానుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డిఎస్ఎ) శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మరమ్మతులు, పునరావాస కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో సాంకేతికంగా పరిశీలించినట్లు సమాచారం. మూడు బ్యారేజీల ప్రస్తుత నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, మరమ్మతుల విధానం, అమలు దశలు, భవిష్యత్లో నిర్వహణకు అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. గతంలో ఎన్డీఎస్ఏ నివేదికలో సూచించిన అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించినట్లు సమాచారం. అయితే, సమావేశం అనంతరం ఎన్డీఎస్ఏ నుంచి అధికారిక నిర్ణయం లేదా ప్రకటన విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై మరింత సాంకేతిక పరిశీలన అనంతరం తుది సిఫార్సులు వెల్లడించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కేంద్ర జల సంఘం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై పార్లమెంటులో చర్చ కు పట్టుబడుతున్న విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటు ప్రాంగణం లో ‘ఇండియా’ కూటమి ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. రామమందిర విరాళాల చోరీని ఎండగట్టేందుకు ‘చందా చోరీ’ స్కిట్ ప్రదర్శించారు. ఎంపీ పప్పు యాదవ్ పూజారి వేషంలో కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నారు. ఆయన ముందు ఓ టేబుల్ వేసి దానిపై హుండీ పెట్టారు. దానికి అటు, ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. భక్తుల తరహాలో రాహుల్ గాంధీ, తదితరులు పప్పుయాదవ్ వద్దకు వచ్చి హుండీలో నగదు వేశారు. ఆ విరాళాలను తస్కరిస్తున్నట్టు పప్పుయాదవ్ నటిస్తూ ఆ స్కిట్ను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్దకు చేరుకున్న విపక్ష ఎంపీలు జంట నిరసనలు చేపట్టారు. విద్యార్థులపై పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తూ హోం మంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపైనా బ్యానర్ పట్టుకుని నినాదాలు హోరెత్తించారు. ఈ నిరసనల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రా జెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వి ని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ ప్రా జెక్టులు, పథకాల కింద కేబినెట్ రూ.4,50,98 8 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపిందని చెప్పారు. దేశంలో చమురు, సహజవాయువుల అన్వేషణ, ఉత్పత్తిని వేగం చేసే లక్ష్యంతో రూ.84,084 కోట్ల వ్యయంతో రూపొందించిన ‘సముద్ర మంధన్- ది నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మొత్తాన్ని 2030-31 వరకూ వినియోగించనున్నట్టు చెప్పా రు. ఈ పథకం ద్వారా భారత్ హైడ్రోకార్బన్ నిల్వలకు 600 మిలియన్ టన్నుల చమురు సమాన పరిమాణం (ఎంఎంటీఓఈ) కంటే ఎక్కువ నిల్వలు అదనంగా చేరే అవకాశం ఉందన్నారు. సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యకలాపాలు పెరగడం, దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరగడం, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని వివరించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకూ ఉన్నవిలువ గెలు

మన తెలంగాణ/నర్సంపేట: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి మృతిచెందారు. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో ఉండగా గుండెపోటుకు గురికాగా కుటుంబసభ్యులు హుటాహుటిన సమీపంలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ మమతారెడ్డి తొమ్మిది సార్లు సీపీఆర్ చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రి తరలించారు. వైద్య చికిత్స త్వరగా అం దేందుకు గ్రీన్ఛానల్ ద్వారా హ న్మకొండ నుంచి 1.50 గంటల్లో సికింద్రాబాద్కు చేరుకోగా దీంతో వైద్యులు చికిత్స అందించారు. కాగా, పెద్ది సుదర్శన్రెడ్డికి గుండెపోటుతో పాటు ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం కారణంగా మెదడుకు రక్తం సరఫరా కాక బ్రెయిన్ డెత్ అయినట్లుగా వైద్యులు నిర్దారించి అందుకు అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతుండగానే గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు పెద్ది సుదర్శన్రెడ్డి మృతిచెందినట్లుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు పెద్ది మృతదేహాన్ని హన్మకొండ మీదుగా నర్సంపేట నుంచి అంతిమ యాత్ర