
4112 వార్తలు
– ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు బానిసలు– సీఎం రేవంత్రెడ్డి కర్కోటకుడు– కేసీఆర్ మరమనిషి..ఆయనో బందీ..– అక్క నుంచి అమ్మగా పరిణితి చెందా: కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు– ఘనంగా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) ఆవిర్భావంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర రాజకీయ చిత్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ […] The post సామాజిక న్యాయానికి బద్ధవ్యతిరేకి బీజేపీ appeared first on Navatelangana.
2047 నాటికి ఈ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తాం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపిన సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశంలో ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ అవతరించనుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన భారతదేశపు తొలి ప్రయివేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శనివారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరో స్పేస్ పార్క్లోని మ్యాక్స్-క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎంతో […] The post ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ appeared first on Navatelangana.
– శవానికి చోటివ్వని అద్దె ఇల్లు– కరీంనగర్లో అమానుషం..మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని యజమాని– దశదినకర్మ వరకు ఇంటిముఖం చూడొద్దంటూ గెంటివేత– దిక్కుతోచక శ్మశానవాటికలోనే ఆశ్రయం పొందుతున్న కుటుంబం– గుండెల్ని పిండేస్తున్న పసిపిల్లల రోదన.. పట్టించుకోని పాలకులు, అధికారులు– మానవత్వాన్ని మంటగలుపుతున్న స్వార్థపు మనుషులు – నగరంలో 50 వేల అద్దె కుటుంబాల దీనస్థితికనీసం ఉండేందుకు నిలువ నీడ (సొంత ఇల్లు) లేని పేదరికం వారిది. బతుకుదెరువు కోసం దశాబ్దాల కిందట వలసొచ్చి, అద్దె ఇండ్లల్లో ఉంటూ నెట్టుకొస్తున్న […] The post శ్మశానమే శరణాలయం! appeared first on Navatelangana.
పట్టణాల్లోనే ఉన్నట్టు సమాచారంఅత్యధికంగా 818 మంది మావోయిస్టులు లొంగిపోయింది మన రాష్ట్రంలోనేమిగిలినవారు కూడా త్వరలో సరెండరవుతారు : ప్రెస్ కాన్ఫరెన్స్లో డీజీపీ ప్రకటనఆయుధాలతో సహా లొంగిపోయిన 47 మంది మావోయిస్టులునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిమావోయిస్టు అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి దండకారణ్యంలో లేరనీ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తమకు సమాచారం ఉందని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు భార్య జోడె లక్ష్మీబాయి, మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, మరో […] The post గణపతి దండకారణ్యంలో లేడు appeared first on Navatelangana.
అజహరుద్దీన్, కోదండరామ్కు ఊరటత్వరలో విడుదల కానున్న గెజిట్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఏడాది క్రితం పంపిన ఫైల్కు గవర్నర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో తెలంగాణలో గవర్నర్ కోటాలోని నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గత ప్రభుత్వం నుంచి సాగుతున్న ఉత్కంఠకు స్వస్తి పలుకుతూ, గవర్నర్ కోటాలో ఇద్దరు కీలక నేతలకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల […] The post ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం appeared first on Navatelangana.
హీరో తరుణ్ భాస్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’.ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం నుంచి లేటెస్ట్గా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘ప్రేమకి పులిహోర..’ రిలీజ్ చేశారు.టిపికల్ లవ్ సాంగ్లా […] The post ‘ప్రేమకు పులిహోర కలిపామా…’ appeared first on Navatelangana.
కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మల యాళ సంచలనం ‘వాలా ?’ ఇప్పుడు తెలుగులోనూ నాని మస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.సావిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జారు, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై, విపిన్ దాస్, హారిస్ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్తో కలిసి నిర్మించిన ‘వాలా 2’ తెలుగులో ఈ […] The post ‘వాలా’కి తెలుగులోనూ మంచి ఆదరణ appeared first on Navatelangana.
– ఆల్టైమ్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్– ఛేదనలో శ్రేయస్, ప్రభుసిమ్రన్ విధ్వంసం– కెఎల్ రాహుల్ భారీ సెంచరీ వృథా– ఢిల్లీ 264/2, పంజాబ్ 265/4న్యూఢిల్లీ : టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర. పంజాబ్ కింగ్స్ 264 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఊదేసింది. ఫిరోజ్షా కోట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. మరో 7 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. ఛేదనలో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (76, 26 బంతుల్లో […] The post 264 ఉఫ్ appeared first on Navatelangana.
వయసు మీద పడుతున్న కొద్దీ ‘అమ్మో ఇక ఏమీ చేయలేము, వయసు అయిపోతుంది, ఇక శరీరం సహకరించడం లేదు’ అనుకునే వారు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే, మనం అనుకున్నది సాధించడానికి, ఇష్టమైన రంగంలో రాణించడానికి వయసుతో సంబంధం లేదు అనుకునేవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ కోవకే చెందుతారు తాడికొండ రాజేశ్వరి. అరవై ఏండ్లు నిండినా పదహారేండ్ల అమ్మాయిలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ వయసులో స్కూటీపై […] The post వయసు ఓ సంఖ్య మాత్రమే appeared first on Navatelangana.
పియ్రమైన వేణు గీతికకుఎలా ఉన్నావు, ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు ఎండ వేడి అసలు పడదు నీకు తెలుసు కదా! బైటకి ఎక్కడికి వెళ్లడం లేదు. రోజూ మన ఇంటి దగ్గరలో అందరికీ మజ్జిగ పంచుతున్నాను. అంతే ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్న. ఎప్పుడైనా బయటకు వెళ్ళవలసి వస్తే సాయంత్రం 6.30 తర్వాత వెళ్తున్న. ప్రస్తుతం ఇది నా పరిస్థితి.నాన్న! నీకు కిందటి వారం పిల్లల ఆహారం, అలాగే […] The post అర్థమయ్యేలా చెప్పాలి appeared first on Navatelangana.
మనలో ప్రతి ఒక్కరికి ఏదొక బలహీనత ఉంటుంది. దాన్ని బయటకు చెప్పలేక.. చాలా మంది ఒత్తిడికి లోనయి.. మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ.. ఆ బలహీనతను దాచి ఉంచటం కన్నా.. దానిని జయించి.. మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మనల్ని విజయానికి చేరువచేస్తుంది. ఈ అలవాట్లని మీ అలవాట్లుగా మార్చుకుంటే.. తిరుగులేని మానసిక శక్తిని ఆపాదించుకొని మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మరింత పటిష్టంగా తయారవుతారు.నెగటివ్ ఆలోచనలకు దూరం..మానసిక బలహీనతలలో ప్రధానమైనది ఆత్మన్యూనతా భావన. వీలైనంత […] The post మానసిక ఆరోగ్యం కోసం.. appeared first on Navatelangana.

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే చండీ హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో చక్కగా పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. దైవ అనుగ్రహం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మెడికల్ ఎంసెట్ నీట్ అదే విధంగా ఇతరత్రా విద్యా సంబంధిత విషయ వ్యవహారాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఎవరైతే ఎంసెట్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నరో వారు చదువు మీద శ్రద్ధ వహించడం ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం చెప్పదగిన
నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషిరాజ్యాలు నేడు తలవంచి తలలేనిదేహాలై మిగిలి పోయాయెందుకో ?నేల పొరల్లో దాగిన విత్తనంభూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచినమట్టిని తొలుస్తూ అంకురమైనిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకతి సహజధర్మంస్వేచ్ఛగా నీలాకాశంలోరెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగాఎగిరే విహంగాలను రాకాసి గద్లలు అన్యాయంగారెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే….పక్షులన్నీ కలిసి గుంపులుగా చేరి గద్దలనుఎదిరిస్తూ తలెత్తుకుని ఎగరటం నిజం కాదా ?నేడు మరఫిరంగులు మారణాయుధాలతోయుద్దోన్మాది ప్రపంచాన నిబ్బరంగా నిలిచినబడుగు దేశాలను తమకుతలవంచనందుకు దాసోహం కానందుకుఅన్యాయంగా దాడిచేస్తూదౌర్జన్యంగా జనహననం కావిస్తూనగరాలను శిథిలాలుగా మారుస్తూఆర్థిక మాంద్యాన్ని […] The post కొత్త పొద్దుపొడుపై… appeared first on Navatelangana.
1.సున్నిత మనస్కుడై అతడుకల్లోలితమైన ప్రపంచాన్నిపదేపదే కలవరిస్తూమరణించిన తన ఒక్కొక్క కలకిఓ ముద్దు పెట్టుకుంటాడుప్రపంచం అంతమవుతే బాగుందనిఆశపడుతూ ఆ రాత్రి నిద్రపోతాడు2. అర్ధరాత్రిసవ్వడి చేయకుండా ఓ సన్నటి సెలయేరుఅతని కంట చివర నుండి పారుతూహదయాన్ని తాకుతుందిగాయాలన్నీ ఒక్కొక్కటిగా బయలు పడతాయిఎదురుచూపుల్లో తడిని కోల్పోయిన వాడైతారసపడిన వాళ్లంతా ఎప్పటికైనతప్పిపోయేవాళ్ళే అంటూ రెప్ప వాలుస్తాడుప్రపంచమంతా విశాలమైన అతడి హదయంలోగులాబీ ముళ్ళులా ఆనవాళ్ళు3. దూరానికి కోలమానం మర్చిపోయిపరిగెడుతూ పరిగెడుతూవిశ్రాంతి లేని జీవితానికి విరామం అంటూఓ సుదీర్ఘ సాయంత్రాన రాలిపోవడానికి సిద్ధపడినవాడైజీవితం తెల్లారితే వెళ్ళిపోయే […] The post పిచ్చుకల గుంపు appeared first on Navatelangana.

తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో కవిత.. తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆనాటి కెసిఆర్, నేటి కెసిఆర్ వేరు అని అన్నారు. ఆనాటి కెసిఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కెసిఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదని ఘాటు విమర్శలు చేశారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కెసిఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదని అన్నారు. ఎక్కడ ఎవరికీ కష్టం వచ్చినా ఆ సార్ బయటకు రారు... ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు. ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన కెసిఆర్...నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదని కవిత విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా అంటూ
వాళ్ళు అతన్ని చంపేసిరాత్రికల్లా పూడ్చేసారు.వాళ్ళు అతని శవాన్ని కడగలేదు,ఎవరూ అతని గురించి ప్రార్థించలేదు.నేను హత్యకు గురైన వారి సమాధిని తవ్వి,మతదేహాన్ని నీళ్ళతో కడగాలనిప్రజా సమూహం ముందుఅంత్యక్రియల ప్రసంగాన్నిచేయాలని కోరుకున్నాను.కానీ ఏం జరిగింది ?సమాధి ఎక్కడుందో నాకు తెలీదుసమాధి వుందో లేదో నాకు తెలీదుశవం వుందో లేదో నాకు తెలీదు.కానీ, హతుడు ఈ రాత్రికిదేవుని గవాక్షం అధిరోహించితన ముగింపుని పలుకుతాడని నాకు తెలుసు.నేను ఒక సమాధిని తవ్వాలనుకున్నాను.కానీ, ఏం జరిగింది ?నా సమాధిని నేనే తవ్వుకోవాలా ?పాలస్తీనా కవి […] The post నా సమాధి appeared first on Navatelangana.
అవని ఆపతి పడుతుంది.తనకోసంకాదు మనకోసం.గాలి గాయాల్ని దిగమింగుకొని వీస్తుంది.తన ఊపిరికొసం కాదు…మన ఊపిరి కోసం.భానుడు తిమిరాన్ని చీల్చుకొని మళ్ళీ ఉదయిస్తున్నాడు..కొత్తరోజును ప్రసాధిస్తున్నాడు.భూమి రక్తంతో తడిసిపోతుంటే..శవాలను శిలాజాలుగా తన ఒడిలోదాచిపెట్టుకుంటుంది ప్రకృతి.గాయాల చరిత్రను రేపటి తరానికి చెప్పడానికి.!వెచ్చనిరుధిరం ఎప్పటికి ఆరిపోని పారాణిలాఅంటుకుంటుంది కాళ్లకు.!రేపటిభవిష్యత్తు కళ్లలో… సమాధానం లేని ప్రశ్నలు.??యుద్ధపు పొగలు ఊపిరాడని మేఘాలై కమ్ముకున్నాయి.అగ్రరాజ్యం అహంకారానికి..ప్రాణాలు సమిదలై దహించుకపోతున్నాయి.ఎక్కడో పచ్చిమాసియాలో ప్రకంపనలుప్రతిపల్లె పట్నం ఇళ్లలో అల్లుకుంటున్న పొగలు.యుద్ధం చరిత్రఅంతా తడిసిన రక్తంతో ఇంకాతడిగానే ఉంది.అసలైన పేదరికి యుద్ధం ఆకలి […] The post యుద్ధ నీతి appeared first on Navatelangana.
వేముల ఎల్లయ్య రాసిన నవల ‘కక్క’. ఇది తెలంగాణ మాండలికం వాడుక భాషలో వెలువడిన తొలి దళితవాద నవల అనవచ్చు. ఈ పుస్తకం వచ్చి పాతిక సంవత్సరాలయ్యింది. ఈ నవలలను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో ”లోకల్ కాంఫరిషన్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్”గా ఎంపిక చేయడం జరిగింది. మన దేశంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా సబ్జెక్ట్గా ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని కె.పురుషోత్తం, గీతా రామస్వామి వారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.కక్క అనే పాత్రదారుడు పటేండ్ల (దొరలు) దగ్గర జీతగానిగా […] The post సామాజిక జీవన చిత్రణ ‘కక్క’ appeared first on Navatelangana.
అక్షరం కేవలం భావవ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది కాలాన్ని దాటే సాక్ష్యం, సమాజాన్ని మేల్కొలిపే శక్తి, మానవ విలువలను నిలబెట్టే ధర్మధ్వజం. అలాంటి అక్షరసాధనను తపస్సుగా స్వీకరించి, భావాన్ని బాధ్యతగా మలిచి, ఆలోచనను ఆవిష్కరణగా మార్చిన సాహిత్యకారుని ప్రస్థానం సాధారణ రచనా యానం కాదు… అది ఒక సాహిత్య దీక్ష, ఒక చైతన్య ప్రయాణం. శతాధిక పత్రికలను సాక్షిగా చేసుకుని సహస్ర సృజనల వైభవాన్ని విరాజిల్లించిన ఆత్మనిబద్ధ కలం వెనుక ఉన్న సాధన, సమాజంపై ఉన్న […] The post సహస్ర సృజనల వైభవం appeared first on Navatelangana.

అమెరికా ఇరాన్ మధ్య పాకిస్థాన్లో చర్చలు విచిత్ర ఉత్కంఠ స్థితికి చేరాయి. ఒక్కరోజు క్రితమే ఇస్లామాబాద్కు వచ్చిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రత్యేక దూతలను కలువకుండానే శనివారం తిరిగి వెళ్లింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సారధ్యంలో పాకిస్థాన్కు వచ్చిన ఇరాన్ బృందం ఇక్కడ ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. పాక్కు చెందిన అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులతో, సైనికాధికారులతో విస్తృత చర్చలు జరిపింది. మూడు దేశాల పర్యటనకు వచ్చిన తాము ముందుగా పాకిస్థాన్కు వచ్చినట్లు ప్రకటించారు. ఈ దశలోనే ట్రంప్ దూతలతో కూడిన అమెరికా బృందం పాకిస్థాన్కు చేరుకుంటుందని, ఇరుదేశాల మధ్య నేరుగా చర్చలు ఉంటాయని తొలుత భావించారు. అయితే అరాగ్చి బృందం అమెరికా టీం వచ్చే దాకా పాకిస్థాన్లో ఉండకుండానే వెళ్లిపోయింది. తాము పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను , సైనిక ప్రధానాధికారి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ను ఇతర అధికారులను కలిసినట్లు అరాగ్చి తెలిపారని వెల్లడైంది. అయితే ఏ విషయాలపై చర్చలు జరిగాయనేది వెలుగులోకి రాలేదు. ఇక శనివారం రాత్రి ఎప్పటికైనా అమెరికా బృందం ఇస్లామాబాద్కు చేరుకోవల్సి ఉంది

ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లు మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ(57), ఇషాన్ కిషన్(74) అర్ధ శతకాలతో చెలరేగి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, నితీష్ కుమార్ రెడ్డి(36), క్లాసెన్(29)లు కూడా రాణించారు. దీంతో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 229 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు నమోదు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో విధ్యంసం సృష్టించాడు. తొలి ఓవర్ నుంచే భారీ సిక్సులతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసిన సూర్యవంశీ.. మొత్తం 37 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 12 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అలాగే, ద్రువ్ జురేల్(51), ఫెర్రీరా(33)లు రాణించారు.
కేతిగాడు : అనుకున్నదొక్కటి… అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఆహా… బిజెపి పిట్టా…జుట్టుపోలుగాడు : మా బిజెపోళ్లను ఇలా ఆటపట్టించడం ఏం బాగోలా. నేను కూడా సోలో ట్రాజెడీ యాక్షన్ చేయగలను తెల్సా… అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదేలే.. అదేమిటో ఆడదంటే ప్రతివానికి అలుసులే. మీ కాంగ్రెసోళ్లు ఎప్పుడూ ఇంతే మహిళా ద్రోహులే.కేతిగాడు : నువ్వు శాలువా కప్పుకుని ఎంతగా కన్నీరు పెట్టుకున్నా నీ మాటలు అసలెవరూ వినరు. మీ వ్యూహం బెడిసికొట్టింది.జుట్టుపోలుగాడు : […] The post బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా appeared first on Navatelangana.