21393 వార్తలు

పూర్తి సహకారమందిస్తాంన్యూయార్క్ తో పోటీపడే వాతావరణం తెలంగాణ సొంతంభారత ఫ్యూచర్ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలు2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంఏఐ సునామీని తట్టుకునేలా నైపుణ్య అభివృద్ధిపై దృష్టిసీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నవతెలంగాణ – హైదరాబాద్‘రండి…తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. మీకు పూర్తి సహకారమందిస్తాం. తెలంగాణ అంటేనే వ్యాపారం. న్యూయార్క్ తో పోటీపడే వాతావరణం తెలంగాణలో ఉంది .’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో […] The post రండి…పెట్టుబడులు పెట్టండి appeared first on Navatelangana.

ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీలోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద పోటెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి వరదనీరు 14.83 మీటర్లకు చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. […] The post ఏజెన్సీ ప్రాంతాలు జలమయం appeared first on Navatelangana.

మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటంపదో రోజుకు మహిళా సంఘాలc ఐక్య ఆందోళనరాజ్యసభ సీపీఐ(ఎం) పక్షనేత జాన్ బ్రిట్టాస్ సంఘీభావంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స (ఎన్సీడబ్ల్యూఆర్) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఐక్య ఆందోళన శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు, […] The post 33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలి appeared first on Navatelangana.

పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనఅర్ధాంతరంగా ఉత్పత్తి నిలిపేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు నవతెలంగాణ-చౌటకూర్‘సీబీఎల్’ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమలో ఏడాదిగా సుమారు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారనీ, అర్ధాంతరంగా పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తులు నిలిపివేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు. శుక్రవారం పరిశ్రమ […] The post ‘సీబీఎల్’ కార్మికులకురె గ్యులర్ పని దినాలు కల్పించాలి appeared first on Navatelangana.

కీలక రంగాలు, సేవలను ప్రయివేటీకరించం : దేశాధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ – కానెల్హవానా : అమెరికా ఆంక్షలు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి క్యూబా నడుం బిగించింది. ప్రభుత్వ అధీనంలోని కీలక రంగాలలోకి ప్రైవేటు పరిశ్రమలను అనుమతించేందుకు ఉద్దేశించిన ప్రణాళిక వివరాలను ప్రకటించింది. భూ వినియోగంపై ఆంక్షలను సడలించడం, ఇంధనం – ఔషధాల దిగుమతులకు వ్యాపార సంస్థలను అనుమతించడం, క్యూబా ద్వీపంలో పనిచేసేందుకు ప్రయివేటు పర్యాటక సంస్థలను అనుమతించడం వంటి చర్యలపై రెండు […] The post ఆర్థిక ప్రక్షాళన దిశగా క్యూబా appeared first on Navatelangana.

ఆయుధాలను హమాస్ విడనాడిందిఇక ఇజ్రాయిల్కు భద్రత లభిస్తుంది : ట్రంప్ వాషింగ్టన్ : గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులు ఆయుధాలు విడనాడాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిని చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ‘ఈ రోజు గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులన్నీ పూర్తిగా ఆయుధాలను విడనాడాయి. శాంతి బోర్దు చారిత్రక ఒప్పందం కుదిర్చింది’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చిరకాల శాంతి, భద్రత […] The post గాజాలో శాంతి ఒప్పందం కుదిరింది appeared first on Navatelangana.

విజేతలకు నియామక పత్రాలు అందజేతనవతెలంగాణ-పటాన్చెరుహైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ శుక్రవారం ‘అచీవర్స్ డే 2026’ ను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 2026లో గ్రాడ్యుయేట్ బ్యాచ్కు సంబంధించిన ప్రాంగణ నియామక ఫలితాలను గీతం ప్రకటించింది. జులై 2026 నాటికి, ప్రాంగణ నియామకాలను ఎంచుకున్న 1,347 మంది విద్యార్థుల్లో 771 మంది (60శాతం) ప్లేస్మెంట్లు సాధించారు. విశ్వవిద్యాలయంలోని ఏడు స్కూళ్లలో 324 ప్రముఖ నియామక సంస్థల […] The post గీతంలో ‘అచీవర్స్ డే’ వేడుకలు appeared first on Navatelangana.

పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమ యాత్రకు వేలాది జనంఅధికార లాంఛనాలతో అంత్యక్రియలుమంత్రి సీతక్క, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నివాళినవతెలంగాణ-నర్సంపేటనర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి శుక్రవారం జనం కన్నీటి వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాల మధ్య ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ నెల 26న గుండెపోటుతో హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి […] The post జన నేతకు కన్నీటి వీడ్కోలు appeared first on Navatelangana.

కుటుంబ ఓటర్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రం ఓటును సులభంగా వినియోగించుకునే అవకాశం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝానవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‘సర్’ ప్రక్రియను 99.79 శాతం పూర్తి చేసి జనగామ జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 99.79 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జనగామ జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిందని […] The post ‘సర్’ 99.79 శాతం డిజిటలైజేషన్ appeared first on Navatelangana.

మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృషభం సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిధునం ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. కర్కాటకం ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సింహం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార

జగిత్యాల జిల్లాలోని మూడు రైస్ మిల్లులలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి 87 కోట్ల రూపాయల విలువ చేసే సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ ఎస్పీ బసవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఎస్ జితేందర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జగిత్యాల జిల్లాలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రైస్ మిల్లులకు అందించిన ధాన్యాన్ని లెక్కించిన అధికారులు రూ. 87 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదించగా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్లుల యజమానులపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారులు జరిపిన తనిఖీల్లో కేవలం మూడు రైసు మిల్లులలో 87 కోట్ల రూపాయల ధాన్యం

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకులపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక తీర్పు ప్రకటించింది. 17 ఏళ్లుగా భార్య పాయల్ తో దూరంగా ఉంటున్న ఆయన వైవాహిక జీవితానికి ముగింపునిచ్చింది. కొన్నేళ్లుగా ఒమర్, పాయల్ పరస్పరం కేసులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాకూ, ఆయన భార్య పాయల్లకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించింది. తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని, పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి అంగీకరించినట్లు ఇరువురూ కోర్టుకు చెప్పినట్లు కోర్టు వెల్లడించింది. గతంలో తమ వివాహాన్ని రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంలో విచారణ సందర్భంగా ఒమర్, పాయల్ పరస్పర అంగీకారంతో తమ పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేశారు. అలాగే పరస్పరం దాఖలు చేసుకున్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా

న్యూయార్క్ మేయర్ మమ్దానీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా బదులిచ్చారు. నెతన్యాహు యుద్ధ నేరగాడు, అమెరికాలో అడుగుపెడితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్ కింద ఆయనను అరెస్ట్ చేయాలని ఇటీవల మమ్దానీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మాట్లాడుతూ.. తనను ఎవరైనా అరెస్ట్ చేస్తే అక్కడికి ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. న్యూయార్క్లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశానికి తాను తప్పకుండా హాజరవుతానని నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పూర్తిగా అవినీతిమయమైందని కూడా ఆరోపించారు. భవిష్యత్లో ఇజ్రాయెల్ నేతలు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశముందని, వాటికి బెదరమని నెతన్యాహు అన్నారు. అయితే మమ్దానీ అభ్యర్థనను ట్రంప్ ఇప్పటికే తోసిపుచ్చారు. తాము నెతన్యాహును అరెస్ట్ చేయబోమన్నారు.


పాకిస్థాన్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ బొగ్గు గనిలో శుక్రవారంనాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది కార్మికులు మరణించగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. క్వెట్టా సమీపంలో సోరేంజ్లో ఈ ప్రమాదం జరిగింది. గనిలో మిథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి 34 మృతదేహాలను వెలికి తీశారు. 22 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాటలకు రూ.5 లక్షలు (పాక్ కరెన్సీ), క్షతగాత్రులకు రూ.3 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని బలోచిస్థాన్ మంత్రి షోయిబ్ నోషెర్వాని ప్రకటించారు.

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రికార్డు సృష్టించింది. అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏదేనీ నమోదిత కంపెనీ కూడా ఒక్క రోజు ఇంత భారీ స్థాయిలో మార్కెట్ విలువను పెంచుకోలేదు. ఈ సంచలన ర్యాలీతో మైక్రోసాఫ్ట్, ప్రముఖ ఏఐ చిప్మేకర్ ‘ఎన్విడియా’ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక్కసారిగా 9 శాతం పెరిగాయి. ఫలితంగా ఒక్క రోజులోనే పొందిన ఈ అదనపు మార్కెట్ విలువ, దక్షిణాఫ్రికా, వియత్నాం, టర్కీ వంటి దేశాల మొత్తం స్టాక్ మార్కెట్ విలువల కంటే చాలా పెద్దది చెప్పుకోదగ్గ విషయం.

ఇకామార్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, ఓటిటి వేదిక నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. తన ప్లస్ లాయల్టీ మెంబర్లకు నెట్ఫ్లిక్స్ ఉచితంగా మొబైల్ప్లాన్ అందించాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి క్తొగా రివార్డ్ పథకాన్ని ప్రారంభించాలని, దాన్ని నెలవారీ షాపింగ్ ఆధారంగా వర్తింప చేయనున్నట్లు శుక్రవారంనాడు ప్రకటించాయి. నెలలో నాలుగు సార్లు రూ.299, ఆ పైన అధికంగా షాపింగ్ చేసిన వారికి ఇది ఉచితంగా లభించనుంది. అయితే ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ గ్రాసరీ, ఫ్లిప్కార్ట్ మినిట్స్లో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. నాలుగో ఆర్డర్ పూర్తి కాగానే నెల రోజుల పాటు మొబైల్ ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఫ్లిప్కార్ట్ సభ్యులు కాని వారు కూడా ఈ మొబైల్ ప్లాన్కు అర్హులేనని ప్రకటించాయి.


జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లా కెల్లామ్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా, మరొకరని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కాలేజీ (జీఎంసీ)కి తరలించారు. ఈ ఇద్దరినీ ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్, భూపేంద్ర కుమార్గా గుర్తించామని, దీపక్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించగా, భూపేంద్ర కుమార్ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి శుక్రవారంనాడు ప్రకటించింది. జూలైలో కాస్త పరిస్ధితులు మెరుగుపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఐఎండి చేసిన ప్రకటన నిరాశపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఓ మోస్తరు ఎల్నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని ఐఎండి హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నెలవారీ సమాచారంలో భాగంలో ఆగస్టు నెలలో భారతదేశంలో సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 94% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయినా వాయువ్య, ఈశాన్య, తూర్పు-మధ్య, తూర్పు ద్వీపకల్ప ప్రాంతంలోని కొన్ని భాగాలలో సాధారణం నుండి అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన కాలం రెండవ భాగంగా భావించే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలిపినా వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఎల్ నినో ఆగస్టు నెల మొత్తం మధ్యస్థ తీవ్రతతో కొనసాగి, సెప్టెంబరులో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.


రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ’టాక్సిక్’ నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్, కియారా బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన డిజైన్తో రూపొందించిన ఎరుపు రంగు దుస్తుల్లో కియారా అద్వానీ ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారు. గ్లామర్కే పరిమితం కాకుండా, నాదియా పాత్రలో కియారా ఆత్మవిశ్వాసం, మిస్టరీ దాగి ఉన్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ’టాక్సిక్’ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్ఎంపి వైద్యుడు దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్ఎంపి డాక్టర్ మల్లయ్య( 57) ప్రథమ చికిత్స కేంద్రంలో ఉండగా గుర్తుతెలియని ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు తమతో తెచ్చుకున్న కారం కంట్లో చల్లి కత్తులతో దాడి చేసి పరారైయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్ఎంపి మల్లయ్యకు స్థానికంగా ఉండే కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా భూమి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో కూడా అతనిపై కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతని భార్య మన్నెమ్మ గ్రామంలో కొంతమంది తమ భూమిపై కన్నేసి తన భర్తను హత్య చేయడం జరిగిందని తెలిపింది. జన సమూహంలో హత్యకు పాల్పడడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది