
4125 వార్తలు
మనలో ప్రతి ఒక్కరికి ఏదొక బలహీనత ఉంటుంది. దాన్ని బయటకు చెప్పలేక.. చాలా మంది ఒత్తిడికి లోనయి.. మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ.. ఆ బలహీనతను దాచి ఉంచటం కన్నా.. దానిని జయించి.. మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మనల్ని విజయానికి చేరువచేస్తుంది. ఈ అలవాట్లని మీ అలవాట్లుగా మార్చుకుంటే.. తిరుగులేని మానసిక శక్తిని ఆపాదించుకొని మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మరింత పటిష్టంగా తయారవుతారు.నెగటివ్ ఆలోచనలకు దూరం..మానసిక బలహీనతలలో ప్రధానమైనది ఆత్మన్యూనతా భావన. వీలైనంత […] The post మానసిక ఆరోగ్యం కోసం.. appeared first on Navatelangana.

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే చండీ హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో చక్కగా పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. దైవ అనుగ్రహం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మెడికల్ ఎంసెట్ నీట్ అదే విధంగా ఇతరత్రా విద్యా సంబంధిత విషయ వ్యవహారాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఎవరైతే ఎంసెట్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నరో వారు చదువు మీద శ్రద్ధ వహించడం ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం చెప్పదగిన
నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషిరాజ్యాలు నేడు తలవంచి తలలేనిదేహాలై మిగిలి పోయాయెందుకో ?నేల పొరల్లో దాగిన విత్తనంభూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచినమట్టిని తొలుస్తూ అంకురమైనిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకతి సహజధర్మంస్వేచ్ఛగా నీలాకాశంలోరెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగాఎగిరే విహంగాలను రాకాసి గద్లలు అన్యాయంగారెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే….పక్షులన్నీ కలిసి గుంపులుగా చేరి గద్దలనుఎదిరిస్తూ తలెత్తుకుని ఎగరటం నిజం కాదా ?నేడు మరఫిరంగులు మారణాయుధాలతోయుద్దోన్మాది ప్రపంచాన నిబ్బరంగా నిలిచినబడుగు దేశాలను తమకుతలవంచనందుకు దాసోహం కానందుకుఅన్యాయంగా దాడిచేస్తూదౌర్జన్యంగా జనహననం కావిస్తూనగరాలను శిథిలాలుగా మారుస్తూఆర్థిక మాంద్యాన్ని […] The post కొత్త పొద్దుపొడుపై… appeared first on Navatelangana.
1.సున్నిత మనస్కుడై అతడుకల్లోలితమైన ప్రపంచాన్నిపదేపదే కలవరిస్తూమరణించిన తన ఒక్కొక్క కలకిఓ ముద్దు పెట్టుకుంటాడుప్రపంచం అంతమవుతే బాగుందనిఆశపడుతూ ఆ రాత్రి నిద్రపోతాడు2. అర్ధరాత్రిసవ్వడి చేయకుండా ఓ సన్నటి సెలయేరుఅతని కంట చివర నుండి పారుతూహదయాన్ని తాకుతుందిగాయాలన్నీ ఒక్కొక్కటిగా బయలు పడతాయిఎదురుచూపుల్లో తడిని కోల్పోయిన వాడైతారసపడిన వాళ్లంతా ఎప్పటికైనతప్పిపోయేవాళ్ళే అంటూ రెప్ప వాలుస్తాడుప్రపంచమంతా విశాలమైన అతడి హదయంలోగులాబీ ముళ్ళులా ఆనవాళ్ళు3. దూరానికి కోలమానం మర్చిపోయిపరిగెడుతూ పరిగెడుతూవిశ్రాంతి లేని జీవితానికి విరామం అంటూఓ సుదీర్ఘ సాయంత్రాన రాలిపోవడానికి సిద్ధపడినవాడైజీవితం తెల్లారితే వెళ్ళిపోయే […] The post పిచ్చుకల గుంపు appeared first on Navatelangana.

తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో కవిత.. తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆనాటి కెసిఆర్, నేటి కెసిఆర్ వేరు అని అన్నారు. ఆనాటి కెసిఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కెసిఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదని ఘాటు విమర్శలు చేశారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కెసిఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదని అన్నారు. ఎక్కడ ఎవరికీ కష్టం వచ్చినా ఆ సార్ బయటకు రారు... ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు. ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన కెసిఆర్...నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదని కవిత విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా అంటూ
వాళ్ళు అతన్ని చంపేసిరాత్రికల్లా పూడ్చేసారు.వాళ్ళు అతని శవాన్ని కడగలేదు,ఎవరూ అతని గురించి ప్రార్థించలేదు.నేను హత్యకు గురైన వారి సమాధిని తవ్వి,మతదేహాన్ని నీళ్ళతో కడగాలనిప్రజా సమూహం ముందుఅంత్యక్రియల ప్రసంగాన్నిచేయాలని కోరుకున్నాను.కానీ ఏం జరిగింది ?సమాధి ఎక్కడుందో నాకు తెలీదుసమాధి వుందో లేదో నాకు తెలీదుశవం వుందో లేదో నాకు తెలీదు.కానీ, హతుడు ఈ రాత్రికిదేవుని గవాక్షం అధిరోహించితన ముగింపుని పలుకుతాడని నాకు తెలుసు.నేను ఒక సమాధిని తవ్వాలనుకున్నాను.కానీ, ఏం జరిగింది ?నా సమాధిని నేనే తవ్వుకోవాలా ?పాలస్తీనా కవి […] The post నా సమాధి appeared first on Navatelangana.
అవని ఆపతి పడుతుంది.తనకోసంకాదు మనకోసం.గాలి గాయాల్ని దిగమింగుకొని వీస్తుంది.తన ఊపిరికొసం కాదు…మన ఊపిరి కోసం.భానుడు తిమిరాన్ని చీల్చుకొని మళ్ళీ ఉదయిస్తున్నాడు..కొత్తరోజును ప్రసాధిస్తున్నాడు.భూమి రక్తంతో తడిసిపోతుంటే..శవాలను శిలాజాలుగా తన ఒడిలోదాచిపెట్టుకుంటుంది ప్రకృతి.గాయాల చరిత్రను రేపటి తరానికి చెప్పడానికి.!వెచ్చనిరుధిరం ఎప్పటికి ఆరిపోని పారాణిలాఅంటుకుంటుంది కాళ్లకు.!రేపటిభవిష్యత్తు కళ్లలో… సమాధానం లేని ప్రశ్నలు.??యుద్ధపు పొగలు ఊపిరాడని మేఘాలై కమ్ముకున్నాయి.అగ్రరాజ్యం అహంకారానికి..ప్రాణాలు సమిదలై దహించుకపోతున్నాయి.ఎక్కడో పచ్చిమాసియాలో ప్రకంపనలుప్రతిపల్లె పట్నం ఇళ్లలో అల్లుకుంటున్న పొగలు.యుద్ధం చరిత్రఅంతా తడిసిన రక్తంతో ఇంకాతడిగానే ఉంది.అసలైన పేదరికి యుద్ధం ఆకలి […] The post యుద్ధ నీతి appeared first on Navatelangana.
వేముల ఎల్లయ్య రాసిన నవల ‘కక్క’. ఇది తెలంగాణ మాండలికం వాడుక భాషలో వెలువడిన తొలి దళితవాద నవల అనవచ్చు. ఈ పుస్తకం వచ్చి పాతిక సంవత్సరాలయ్యింది. ఈ నవలలను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో ”లోకల్ కాంఫరిషన్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్”గా ఎంపిక చేయడం జరిగింది. మన దేశంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా సబ్జెక్ట్గా ఎంచుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని కె.పురుషోత్తం, గీతా రామస్వామి వారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.కక్క అనే పాత్రదారుడు పటేండ్ల (దొరలు) దగ్గర జీతగానిగా […] The post సామాజిక జీవన చిత్రణ ‘కక్క’ appeared first on Navatelangana.
అక్షరం కేవలం భావవ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది కాలాన్ని దాటే సాక్ష్యం, సమాజాన్ని మేల్కొలిపే శక్తి, మానవ విలువలను నిలబెట్టే ధర్మధ్వజం. అలాంటి అక్షరసాధనను తపస్సుగా స్వీకరించి, భావాన్ని బాధ్యతగా మలిచి, ఆలోచనను ఆవిష్కరణగా మార్చిన సాహిత్యకారుని ప్రస్థానం సాధారణ రచనా యానం కాదు… అది ఒక సాహిత్య దీక్ష, ఒక చైతన్య ప్రయాణం. శతాధిక పత్రికలను సాక్షిగా చేసుకుని సహస్ర సృజనల వైభవాన్ని విరాజిల్లించిన ఆత్మనిబద్ధ కలం వెనుక ఉన్న సాధన, సమాజంపై ఉన్న […] The post సహస్ర సృజనల వైభవం appeared first on Navatelangana.

అమెరికా ఇరాన్ మధ్య పాకిస్థాన్లో చర్చలు విచిత్ర ఉత్కంఠ స్థితికి చేరాయి. ఒక్కరోజు క్రితమే ఇస్లామాబాద్కు వచ్చిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రత్యేక దూతలను కలువకుండానే శనివారం తిరిగి వెళ్లింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సారధ్యంలో పాకిస్థాన్కు వచ్చిన ఇరాన్ బృందం ఇక్కడ ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. పాక్కు చెందిన అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులతో, సైనికాధికారులతో విస్తృత చర్చలు జరిపింది. మూడు దేశాల పర్యటనకు వచ్చిన తాము ముందుగా పాకిస్థాన్కు వచ్చినట్లు ప్రకటించారు. ఈ దశలోనే ట్రంప్ దూతలతో కూడిన అమెరికా బృందం పాకిస్థాన్కు చేరుకుంటుందని, ఇరుదేశాల మధ్య నేరుగా చర్చలు ఉంటాయని తొలుత భావించారు. అయితే అరాగ్చి బృందం అమెరికా టీం వచ్చే దాకా పాకిస్థాన్లో ఉండకుండానే వెళ్లిపోయింది. తాము పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను , సైనిక ప్రధానాధికారి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ను ఇతర అధికారులను కలిసినట్లు అరాగ్చి తెలిపారని వెల్లడైంది. అయితే ఏ విషయాలపై చర్చలు జరిగాయనేది వెలుగులోకి రాలేదు. ఇక శనివారం రాత్రి ఎప్పటికైనా అమెరికా బృందం ఇస్లామాబాద్కు చేరుకోవల్సి ఉంది

ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లు మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ(57), ఇషాన్ కిషన్(74) అర్ధ శతకాలతో చెలరేగి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, నితీష్ కుమార్ రెడ్డి(36), క్లాసెన్(29)లు కూడా రాణించారు. దీంతో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 229 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు నమోదు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో విధ్యంసం సృష్టించాడు. తొలి ఓవర్ నుంచే భారీ సిక్సులతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసిన సూర్యవంశీ.. మొత్తం 37 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 12 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అలాగే, ద్రువ్ జురేల్(51), ఫెర్రీరా(33)లు రాణించారు.
కేతిగాడు : అనుకున్నదొక్కటి… అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఆహా… బిజెపి పిట్టా…జుట్టుపోలుగాడు : మా బిజెపోళ్లను ఇలా ఆటపట్టించడం ఏం బాగోలా. నేను కూడా సోలో ట్రాజెడీ యాక్షన్ చేయగలను తెల్సా… అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదేలే.. అదేమిటో ఆడదంటే ప్రతివానికి అలుసులే. మీ కాంగ్రెసోళ్లు ఎప్పుడూ ఇంతే మహిళా ద్రోహులే.కేతిగాడు : నువ్వు శాలువా కప్పుకుని ఎంతగా కన్నీరు పెట్టుకున్నా నీ మాటలు అసలెవరూ వినరు. మీ వ్యూహం బెడిసికొట్టింది.జుట్టుపోలుగాడు : […] The post బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా appeared first on Navatelangana.

రామగిరి అనే రాజ్యాన్ని పాలించే ఉదయసేనుడికి ప్రజలు అంటే పంచ ప్రాణాలు. తను సాధారణ జీవితాన్ని గడుపుతూ నిత్యం ప్రజల యోగ క్షేమాల కోసం ఆలోచిస్తాడు.అన్ని రాజ్యాల కంటే రామగిరి రాజ్యం సుఖ సంతోషాలతో ఉండడం చూసి పొరుగు రాజులు అసూయ చెందేవారు. రామగిరి రాజ్యాన్ని ఆక్రమించడానికి వారు ఎన్నో సార్లు దాడులు చేసారు.ప్రతి సారి వారికి ఓటమే ఎదురైంది.కారణం ఉదయ సేనుడి తెల్ల గుర్రం.శత్రు రాజులు దాడి చేసిన ప్రతి సారి ఉదయ సేనుడే స్వయంగా […] The post రాజు గారి తెల్ల గుర్రం appeared first on Navatelangana.
పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత చాలా మంది విద్యార్థుల మనసులో ”ఇప్పుడు ఏమి చదవాలి? ఏ దారిని ఎంచుకోవాలి?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ సందేహం రావడం అసాధారణం కాదు. ఇది ఒక సహజమైన మానసిక దశ. పాఠశాల వరకు ఒక నిర్దిష్ట మార్గంలో నడిచిన విద్యార్థి, ఒక్కసారిగా అనేక అవకాశాలు ఎదురుగా వుండడంతో అయోమయానికి గురవుతాడు. ఈ సమయంలో మెదడు ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంతో స్పష్టత తగ్గుతుంది. కాబట్టి ఈ గందరగోళాన్ని […] The post ఫలితాల తర్వాత గందరగోళం appeared first on Navatelangana.
ఒకప్పుడు చదవడం సహజమైన అనుభవం. ఆసక్తి కలిగిందని, కవర్ ఆకట్టుకుందని, లేదా మరొక ప్రపంచంలో మునిగిపోవాలని అనిపించిందని పుస్తకం తీసుకునేవాళ్లం. కానీ క్రమంగా చాలా మందికి చదవడమనే అలవాటు మారిపోయింది. అది ‘ఆప్టిమైజ్’ చేయబడిన కార్యకలాపంగా మారింది. సంవత్సరానికి చదవాల్సిన పుస్తకాల లక్ష్యాలు పెట్టుకుంటాం. చదివిన పేజీలు లెక్కపెడతాం. అభివృద్ధి కలిగిస్తాయని చెప్పే నాన్-ఫిక్షన్ పుస్తకాలను ప్రాధాన్యంగా తీసుకుంటాం. అనుభవం పొందడంకన్నా, ఎంత జ్ఞానం సంపాదించామనే దానిని విలువగా చూస్తాం. చదవడం ద్వారా ఎదగడం అర్థవంతమే. కానీ […] The post … మీ మనసు కోసం చదవండి appeared first on Navatelangana.

మన తెలంగాణ / హైదరాబాద్ : సమ్మె విరమణతో రాష్ట్రం లో శనివారం ఉదయం తొలిషిప్ట్ నుంచే ఆర్టిసి బస్సులు రోడ్లెక్కాయి. మూడు రోజుల సమ్మె తర్వాత బస్సులు యధావిధిగా తిరగడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. గత మూడు రోజులగా నరక యాతన పడ్డ ప్రయాణీకులకు సమ్మె ముగియడంతో ఊరట లభించింది. బస్సులు సాధారణంగా తిరిగాయి. కాగా ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించిన దరిమిలా ఆర్టిసి కార్మికుల్లో ఆనందోత్సవాలు తొణికిసలాడా యి. రాజధాని హైదరాబాద్లో బస్ భవన్ ముందు జెఎసి నేతలు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశా రు. ఆర్టిసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోల ముందు కార్మికులు మిఠాయీలు ఒ కరినొకరు తినిపిస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. బా ణ సంచా కాల్చారు. తమ సహోద్యోగి ఆత్మహత్య చేసుకున్న బాధ ఒకవైపు ఉన్నా ప్రభుత్వం డిమాండ్లు ఆమోదించడం వారి మొహాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు, నారాయణ అభినందనలు ఆర్టిసి కార్మికుల సమ్మెపై సముచితంగా స్పందించి వారి డి మాండ్లను పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రా ష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పా

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ’శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బాలు’ పాత్రలో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మైక్ పట్టుకొని హ్యాపీ వైబ్లో కనిపించారు బ్రహ్మాజీ. అగ్ర నిర్మాత అశ్వని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పి కిరణ్ నిర్మిస్తున్నారు.


ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. జస్టిస్ లీసా గిల్కు న్యాయవ్య వస్థలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ హర్పూల్ సింగ్ బ్రార్ కుమార్తైన జస్టిస్ లీసా గిల్ నవంబర్ 17, 1966 న చండీగఢ్లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ-ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయ వాదిగా నమోదు చేసుకుని, పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 24 ఏళ్ల పాటు సివిల్, క్రిమినల్, రెవెన్యూ విభాగాలలకు సంబంధించిన కేసులు వాదించారు. ఆపై చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సుదీర్ఘకాలం ప్రభుత్వ న్యాయవాదిగా, పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రతినిధిగా పనిచేశారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సంచలన తీర్పులను జస్టిస్ లీసా గిల్ వెలువరించారు. సుప్రీంకోర్టు కొలీజియం ’అడ్వాన్స్ ట్రాన్స్ఫర్’ పాలసీలో భాగంగా ఈ ఏడాది మార్చిలో

లండన్ : జైపూర్ రాజమాత,మహారాణి గాయత్రీదేవికి చెందిన అరుదైన 17వ శతాబ్దపు ఖగోళ కంప్యూటర్ వచ్చేవారం లండన్లో వేలానికి రానున్నది. లండన్లోని ప్రసిద్ధ సోద్బైస్ అనే వేలం సంస్థ ఈ కంప్యూటర్ను వేలం వేయనుంది. ఈ చారిత్రక పరికరం 1.5 నుంచి 2.5 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 15 కోట్ల నుండి రూ.25 కోట్లకు పైగా)పలికే అవకాశం ఉందని అంచనా. 1612లో లాహోర్లో మొఘల్ అధికారి కోసం ఈ కంప్యూటర్ను రూపొందించారు.17 వ శతాబ్దపు అత్యంత క్లిష్టమైన, పెద్ద ఖగోళ సాధనాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. జైపూర్ మహారాజా సవాయ్ మాన్సింగ్, గాయత్రీదేవీల వ్యక్తిగత సేకరణలో ఇదొక భాగం. సమయాన్ని, నక్షత్రాల స్తానాలను, మక్కా దిశను కనుగొనడానికి దీన్ని ఉపయోగించేవారు.

న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ నివాసమంటూ చూపించడానికి బీజేపీ నకిలీ చిత్రాలు ఇంటర్నెట్ నుంచి తీసుకుని ప్రసారం చేస్తోందని, అలాగే పచ్చిఅబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అధికారప్రతినిధి ప్రియాంక కక్కర్ వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి బీజేపీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయిస్తోందని, అలాగే కేజ్రీవాల్ నివాసమని నకిలీ చిత్రాలను ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. ఇది కేవలం ఒక కుట్ర అని.. బీజేపీ నాయకుడు, ఎంపి బన్సూర్ స్వరాజ్ ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ నివాసాన్ని చూపించగలరా? అని బీజేపీని సవాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. “బీజేపీ భయపడుతోంది. ఇంటిచుట్టూ వారు బారికేడ్లు పెట్టారు. మేం సవాలు చేస్తున్నాం. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లోకి మేం ప్రవేశిస్తామని వారు భయపడుతున్నారు. గుజరాత్ నుంచి వారిని ఆప్ తరిమి వేస్తుంది” అని కక్కర్ వ్యాఖ్యానించారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి, బీజేపీని గెలిపించడానికి మొత్తం క్యాబినెట్, 19 మంది ముఖ్యమంత్రులను బీజేపీ రంగం లోకి దించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. హూగ్లీ జిల్లా ఉత్తరపర వద్ద ఎన్నికల ర్యాలీలో శనివారం ఆమె ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులకు బీజేపీ కపట వాగ్దాలను ఇస్తోందని ఆరోపించారు. నిరాశలో ఉన్న బీజేపీ ప్రధాని మోడీ నుంచి హోం, రైల్వే, రక్షణ, మంత్రులతోపాటు ఎన్డిఎ పాలిత రాష్ట్రాలకు చెందిన 19 మంది ముఖ్యమంత్రులను 50 హెలికాప్టర్లతో ఈ ఒక్క రాష్ట్రంలోకి దించిందని, దీనితో పోల్చుకుంటే కేవలం మూడు హెలికాప్టర్లనే టిఎంసి వినియోగించిందని మమతా బెనర్జీ పోల్చి చెప్పారు. ఫలితాల తర్వాత టీఎంసీకి మద్దతు ఇచ్చిన గూండాలను తలకిందులుగా వేలాడదీస్తారని కేంద్రహోం మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక కేంద్ర మంత్రిగా, బాధ్యతాయుత నాయకునిగా అలాంటి మాటలు మాట్లాడ కూడదని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఉగ్రవాద భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. “ మీకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోరని నాకు తెలుసు.