21390 వార్తలు

విశ్రాంత ఐపిఎస్ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.వరుడు ఆస్ట్రేలియాలో ఎం ఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంటూ నమ్మబలికి భారీగా కట్నం, బంగారం తీసుకున్నాడు.2024 అక్టోబర్ లో విశ్రాంత ఐపిఎస్ వివాహం జరిగింది.పెళ్లై రోజులు గడుస్తున్న వరుడు ఆస్ట్రేలియా కు వెళ్ళడం లేదు. ఈక్రమంలో ఎంఎస్ పూర్తి చేయలేదని తెలుసుకొని యువతి నిలదీసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా నిరమ్. ఈ చిత్రాన్ని కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్ పై కె. బిందుమాధవి నిర్మిస్తున్నారు. సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు బలరామ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ‘నిరమ్’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ “ట్రైలర్ లాగే సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా నిరమ్ మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ - ఒక సాధారణ యువతి తనకు తెలియకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోతే ఎలా ఇబ్బంది పడుతుంది, ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అనేది తన పాత్ర లో చూస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఇమ్మాన్, బలరామ్ కృష్ణ, పి. రాజేష్, నితిన్ సత్యా, సురేఖా వాణి, ప్రవస్తి, సంటానియో టెర్జియో, భారతీబాబు పాల్గొన్నారు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తు న్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్‘. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నా రు. ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొ డ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో ప్రముఖ నటి అభిరామి నటిస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ‘సుధీర్స్ జోకర్‘ సినిమాలో అభిరామి... గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా అభిరామి పోషిస్తున్న గాయత్రీ దేవి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య లను శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వాటర్స్ లో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి, విప్ లకు పుష్ప గుచ్చాలను అందజేశారు.



హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రీక్వెల్కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్ లో ’సర్దార్’ ప్రపంచాన్ని భారీ స్థాయిలో చూపించారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్టైల్ ఫీల్ను తీసుకొస్తున్నాయి. కార్తి డబుల్ రోల్లో అదరగొట్టారు. మొత్తానికి, ’సర్దార్ 2’ టీజర్... ఇంటెన్స్ యాక్షన్, హై ఓల్టేజ్ స్పై డ్రామా, కార్తి-, ఎస్.జే. సూర్య మధ్య సంఘర్షణతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.






క్షణాల్లో వచ్చిన వరద కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా..తండ్రి చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ తన కళ్ల ముందే భార్య, ఇద్దరు పిల్లలు వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఎస్ యూవీ కారు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యవత్మాల్ జిల్లాలోని దర్వా తాలూకా దహేలి గ్రామం సమీపంలో కుప్తి (పదన్) నదిపై ఉన్న వంతెనను దాటేందుకు ఒక కుటుంబం తమ కారులో ప్రయాణించింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంతెనపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చీకటి కారణంగా నీటి తీవ్రతను అంచనా వేయలేక డ్రైవ్ చేయడంతో కారు వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ముగ్గురు మృతి: ఈ ప్రమాదంలో లోని గ్రామానికి చెందిన మాధవి ఖాందారే (42), ఆమె కుమార్తెలు సాచి (17), ప్రాచి (11) వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించారు. జూలై 31 (శుక్రవారం) మధ్యాహ్నం కారుతో పా




తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి. సెప్టెం బర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వ హించనున్నారు. సెప్టెం బర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. సెప్టెంబర్ 15 వ తేదీ - సాయ ంత్రం ధ్వజారో హణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం, 16వ తేదీ - ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 17వ తేదీ - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహ నం, 18వ తేదీ -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం, 19వ తేదీన ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం, 20వ తేదీ ఉదయం 8 గంటలకు హను మంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం, 21వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్య

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 105.44 కోట్ల మేర రుణం ఎగవేతకు పాల్పడిన ’ఎన్సిఎస్ షుగర్స్’ వ్యవహారం లో హైదరాబాద్, విజయనగరం తో సహా 10 ప్రాంతాల్లోని వాణిజ్య, నివాస ప్రాంగణాల్లో శుక్రవారం సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయనగరం, కాకినాడలోని 10 ప్రాంతాలలో సిబిఐ సమన్వ యంతో కూడిన సోదాలు నిర్వహిం చింది. ఇందులో ఎన్సిఎస్ షుగర్స్ లిమిటెడ్ డైరెక్టర్లకు సంబంధించిన ఫ్యాక్టరీ, రిజిస్టర్డ్ కార్యాలయం, నివా స ప్రాంగణాలు ఉన్నాయి. ఈ సోదాల సమయంలో దర్యాప్తుకు సంబంధించిన రికార్డులతో సహా నేరానికి సంబంధించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ పేర్కొంది. నేరపూరిత కుట్ర యొక్క పూర్తి స్థాయిని నిర్ధారించడానికి, నిధుల మళ్లింపు, కదలికలను గుర్తించడానికి, అలాగే ఇందులో పాల్గొన్న వ్యక్తుల నిర్దిష్ట పాత్రలను తేల్చడానికి స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలిస్తున్నట్లు సిబిఐ తెలి పింది. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు ఆధారంగా ఎన్సిఎస్ షుగర్స్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, అజ్ఞాత ప్రభుత్వ అధికారులపై బెంగళూరులోని సిబిఐ బ్యాంకిం

వాణిజ్య అవసరాల కోసం రెస్టారెంట్లు, హోటళ్లు వాడే వంట గ్యాస్ ధర తగ్గింది.హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ పై రూ. 200 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు శనివారం ప్రకటించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్లపై దాదాపు రూ. 192 నుండి రూ. 209 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గడం విశేషం. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ పై రూ. 202 మేర తగ్గి రూ.2,728కి చేరింది. అలాగే కోల్కతాలో రూ.2,013.50గా ఉన్న ధర రూ.209 తగ్గి రూ.1,804.50కు పడిపోయింది.బెంగళూరులో రూ. 200 మేర తగ్గింపుతో ధర రూ. 2,821 కి తగ్గింది. బీహార్ లో రూ. 209 తగ్గినా కూడా అక్కడ సిలిండర్ ధర రూ. 3,018 వద్ద కొనసాగుతోంది.

ఎల్నినో ప్రభావంతో వెలవెల బోయిన గోదావరి పరివాహక ప్రాంతం భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఉత్తర తెలంగాణలో గత మూడోరోజు కురుస్తున్న వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరదల తీవ్రత తగ్గింది. కానీ ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరదతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోగా వరి, పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి గోదావరి 51 అడుగులకు మించి ప్రవహిస్తోంది. అధికారులు శనివారం ఉదయం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహానికి బూర్గంపహాడ్, చర్ల మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చర్ల వద్ద ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 50మంది వ్యక్తులను అధికారుల సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇసుక కోసం వెళ్లగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతోనే గోదావరి తీరంలోనే మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు వరదలో చిక్కుకుపోవడంతో నాటు పడవల సహాయంతో వారిని రక్షించారు. గోదావరి వరదలకు సంబందించిన సమస్యలు తెలిపేందుకు అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 7995268352, 08743 232444, 7981219425

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో శుక్రవారంనాడు మరో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనల మధ్య ఎలాంటి చర్చా జరక్కుండానే ‘జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026’ను కేంద్రం ఆమోదింపజేసుకుంది. తొలుత ఈ బిల్లుపై చర్చను ప్రారంభించి, ఆమోదించాల్సిందిగా సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా సభ్యులను కోరారు. అయితే విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనపై జరిగిన పోలీసు చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, హోం మంత్రి అమిత్షా సభకు రావాలంటూ పట్టుపట్టారు. దీంతో బిల్లు ఎలాంటి చర్చకు నోచుకోకుండా మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. చర్చకు నిరాకరించిన విపక్ష సభ్యుల ప్రవర్తనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురదృష్టకరమని, విపక్షాలు మునుముందు ఇలాంటివి జరక్కుండా చూసుకోవాలని, పార్లమెంటుకు పంపిన ప్రజలకు జవాబుకు చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం బిల్లు ఆమోదం పొందగానే సభ సోమవారంనాటికి వాయిదా పడింది.

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది. హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు (ఓపీటీ)పై లక్ష డాలర్లు రుసుము విధించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది. అమెరికా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడాలని కోరుకునే వారికి ఈ ఓపీటీ తప్పనిసరి. ఓపీటీ లేకుంటే విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఓపీటీ కింద జాబ్ చేస్తే హెచ్1-బి వీసాలకు అవకాశం ఉంటుంది. 2024 లెక్కల ప్రకారం సుమారు 4,19,000 విదేశీయులు ఓపీటీపై పనిచేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం లెక్కలు మాత్రం అందుబాటులో లేవు. కాగా, అమెరికా యూనివర్సిటీల నుంచి ఎక్కువగా రిక్రూట్మెంట్లు చేసుకుంటున్న టెక్ కంపెనీలు మాత్రం హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజును వ్యతిరేకిస్తున్నాయి.

కావేరీ జలాల వివాదం మరోసారి తమిళనాడు-కర్ణాటక మధ్య చిచ్చు రేపింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ప్రస్తుత పరిస్థితిలో తమిళనాడు సర్కార్తో చర్చల్లేవని స్పష్టం చేశారు.తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయడం, దీంతో కర్ణాటకలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై విధాన సౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమిళనాడుతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రస్తుతానికి సానుకూల వాతావరణం లేదన్నారు.ఈ వివాదంపై ఆగస్టు మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, రైతులు, విపక్షాలతో చర్చించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా, కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ ఆదేశాలపై ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ అనుకూల గ్రూపులు నిరసనలకు దిగాయి. తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ స్క్రీనింగ్న