22307 వార్తలు








సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘ న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ చాలా నచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. జగపతి బాబు చాలా స్టైలిష్గా కనిపించారు ‘అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘రాజేష్ ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాలో హీరో స్క్రీన్ప్లే. ఇందులో ప్రతి క్యారెక్టర్కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటుంది‘అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ భరణ్, నిర్మాత హరీష్, దర్శకుడు రాజేష్ కర్ణ, సింజిత్ తదితరులు పాల్గొన్నారు.

నిశ్శబ్దపు నిశీధిలో నీ జ్ఞాపకం వెలిగిన వేళ నా గుండెలో ప్రవహించిన జీవనదులు ప్రతి పలకరింపునూ ఒక ప్రేమలేఖగా మలుస్తూ ఉదయపు చూపులా దోబూచులాడిన నీ చిరునవ్వు అమలిన మన స్నేహపు అనుభూతులను భాషగా మార్చి మాటలకన్నా ముందుగా పలకరించుకున్న మన మనసులు ఇక నువ్వూ నేనూ ఈ కవిత్వపు జలపాతంలో తనివితీరా తడుస్తూ కాలపు అంచులదాకా -విల్సన్ రావు కొమ్మవరపు

కాస్త మోహం వుండాలి బతుకు పట్ల లక్ష్యం పట్ల నిరాశలను దూగోడ పట్టి భవిశ్వత్తునుబాంగారు బొమ్మను చేయాలి కాస్త ప్రేమ ఉండాలి పచ్చదనం పట్ల ప్రకృతి పట్ల దోసిలి నీల్లు చల్లి చెట్టును చేమనుచేరదేయాలి కాస్త జాలి వుండాలి అలిసిన వారి పట్ల ఓడిన వారి పట్ల స్వాస్థన కూర్చి మాటలు పేర్చి విశ్వాసాన్ని మెదడు నిండా దట్టించాలి కాస్త గౌరవం ఉండాలి నదీ పట్ల సముద్రము పట్ల సీసాలు ప్లాస్టక్ విసిరేయకుండా నీటితో పవిత్రంగా ప్రార్థన చేయాలి. కాస్త బాధ్యత వుండాలి అమ్మ పట్ల నాన్న పట్ల మూలాలకు సేవ చేసి సదా మనుషులం అనిపించు కోవాలి - దాసరి మోహన్

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. సియాటెల్ నగరంలోని స్పేస్నీడిల్ వద్ద బైట్ ఆఫ్ సియాటెల్ కార్యక్రమంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ కాల్పులలో ఐదుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రతి సంవత్సరం సియాటెల్ సెంటర్ వద్ద బైట్ ఆఫ్ సియాటెల్ పేరిట ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. సంగీత కార్యక్రమాలు జరుగుతుండగా ఓ దుండగులు కాల్పులు జరిపినట్టు సమాచారం.

రాజులు మారినా,రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీలపై హింస తప్పడంలేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ఈనాటికి సజీవం. నాటి కాలమాన వైచిత్రమో, చందాల కేశవదాసు దూరదృష్టినో చెప్పలేము కానీ, ఆయన రాసిన కనక్తార నాటకం నేడు చారిత్రికప్రాదాన్యత సంతరించుకొంది. స్త్రీలపై హింస, పురుషాదిక్య సమాజం అకృత్యాలను, స్త్రీల తిరుగుబాటును కళ్ళకు కట్టినట్లు ఈ నాటకంలో చూపించడం అద్భు తం. అంతేకాదు కనక్తార నాటకంలో రచయిత తెలంగాణా యాసను, భాషను ప్రవేశపెట్టిన తొలి నాటకంగా సైతం చరిత్ర సాహిత్య పుటల్లో నిలుస్తుంది. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకానికి కాస్తా అటూ ఇటూగా1911లో కేశవదాసు ఈ నా టకం రాశారు. అయితే కన్యాశుల్కం నాటకానికి దక్కిన ప్రాధాన్యత, ప్రాచుర్యం కనక్తార నాటకానికి లభించలేదు. అందుకు కులం అడ్డు గోడలో, ప్రాంతీయ అసమానతలో కారణం కావచ్చును. నిజానికి గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం లో వస్తువు కాలపరిమితి దాటింది. కానీ, చందాల కేశవదాసు రాసిన కనక్తార నాటకంలో స్త్రీ వివక్ష, మానవీయ విలువలు, అక్కా, తమ్ముడి అనుబం ధం సందేశం అనే వంటి అంశాలతో నేటికీ స జీవ గా నిలుస్తుంది. అంతే కాదు రచయిత కనక్త

నూతలపాటి పేరరాజుగారనే గురువుగారు తన శిష్యులను విహారయాత్రకు తీసుకువెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని, మానవ ప్రవృత్తిని కలిపి వర్ణించమన్నారు. ఒక విద్యార్థి ‘సాంధ్యలలనాలలామంబుసంతసమున..’ అని ఆశువుగా చెప్పేశాడు. వెంటనే గురువుగారు ‘పారిజాతాపహరణ’ కావ్యం గూర్చి పద్యం చెప్పమని పరీక్ష పెట్టారు. వెనువెంటనే ఆ విద్యార్ధి పలుకు పలుకున తేనియలొలుకునట్లు.. అలా అలా అనర్గళంగా, లయబద్దం గా చెప్పుకొనిపోవటం గమనించిన గురువుగారు ఆ విద్యార్థిని ఆశీర్వదించారు. తరువాత కాలంలో ఆ బాలమేధా వి తెలుగు విశ్వవిద్యాలయపు తొలి ఉపకులపతి గా నియమితులయినా రు. ఆయనే ఆచార్య తూ మాటి దోణప్ప. ఆచార్య తూమాటి దోణప్పగారు 1 జులై 1926, అనంతపురం జిల్లా, ఉరవకొండ తాలూకా, రాకె ట్ల గ్రామంలో జన్మించారు. తల్లి తిమ్మక్క, తండ్రి సంజీవప్ప. ప్రాథమిక విద్య ఉరవకొండ బోర్డు హై స్కూల్లోనే జరిగినది. అక్కడ ఉపాధ్యాయులు నూతలపాటిపేరరాజు. దోణప్పగారి చిన్ననాటి విద్యాభ్యాసం సొల్లాపురంలోని తాతగారైన భీమప్పగారి వద్ద జరిగినది. ఆయన గొప్ప పౌరాణికు లు. సంస్కృతాంధ్రలలో విద్వాంసులు. అమరం, శబ్ధాలు, మేఘసందేశం, రఘువంశం, యోగవాశిష్ట్యం, వివేకా చూడామణి వంటివి దోణప్పగారు వారి వద్ద

నేను, నా సాహితీ యాత్ర: 24 పల్లెటూరిని వదిలి పారిశ్రామిక ప్రాంతానికి వలస వచ్చిన దిగువ మధ్యతరగతికి చెందిన పెద్ద కుటుంబం, తక్కువ అవసరాలతో అదుపు చేసిన కోర్కెలతో పొదుపుగా బతకాల్సిన ఆర్ధిక పరిస్థితి, గోదావరిఖని కార్మిక వాడలలో కుల, మత, ప్రాంతీయ భేదాలు లేని పర్యావరణంలో బాల్యజీవితం, విద్యాభ్యాసం...ఈ నేపథ్యానికి తోడు రకరకాల మనస్తత్వాల వాళ్ళతో సావాసం, నాలో పఠ నం పట్ల ఆసక్తిని పెంచాయి. మా నాయన సింగరేణి బొగ్గుగని కార్మికుడు. రెక్కల కష్టం ఒక్కడిది, తినేనోళ్ళు ఎనిమిది. 10-12 ఏళ్ల వయసులోనే pleasure of reading రుచి మరిగాను. అప్పు డు పుస్తక పఠనం నాకు ఒక ‘ఎస్కేప్ రూట్’. బా లల బొమ్మల కథల పుస్తకాలతో మొదలై, వయసు పెరుగుతున్నా కొద్ది, అభిరుచులు మారుతున్నకొద్ది, అన్ని రకాల వార, మాస పత్రికలు, నవలలు చదవడం హాబీగా మారింది. మధురాంతకం రా జారాం, తిలక్, రావిశాస్త్రి తదితరుల కథలు, పత్రికల్లోని సీరియల్స్ , శ్రీశ్రీ, తిలక్.. తదితరుల కవిత్వం, వాసిరెడ్డి సీతాదేవి, దాశరథి రంగాచా ర్య, మహీధర రామమోహనరావు, కొమ్మూరి వేణుగోపాలరావు వంటి ప్రసిద్ధుల నవలలు నాకు 17 ఏళ్ల వయసు లోపలేపరిచయమైనాయి. ‘పెంకుటిల్లు’ బాగా గుర్తుండి పోయిన నవ

అమరావతి: కుటుంబంలో గొడవలు చెలరేగడంతో భార్యను భర్త గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.... భవానీ పేటలో మురళీ(45), మంగం లక్ష్మి(40) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు, కూమారులు, కూతురు ఉంది. కూతురుకు పెళ్లి చేయగా కుమారులతో కలిసి ఉంటున్నారు. ఒక అర ఎకరం భూమి ఉండడంతో అమ్మేసి ఇల్లు కొనుగోలు చేద్దామని మురళీతో భార్య లక్ష్మి తరచూ చెబుతూ ఉండేది. భూమి విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం లక్ష్మి చర్చికి వెళ్లి ఇంటికి వచ్చింది. మరోసారి భూమి విషయంలో భర్తతో భార్య గొడవకు దిగింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను నెట్టేశాడు. కిందపడిపోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతు కోశాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో స్థానికులు అక్కడికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ చూసి షాక్ గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళల వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణం గెలిచిన మీరాబాయి కామన్వెల్త్ గేమ్స్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్తో రికార్డుగ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం వచ్చిచేరింది. మహిళల 48 కిలోల వెయి ట్ లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్ మెడల్ కైవసం చేసుకు ంది. కాగా, కామన్వెల్త్ గేమ్స్లో చానుకు ఇది వరుసగా మూడో గోల్డ్ మెడల్. అంతకుముందు 2018లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన చాను.. 2022లో జరిగిన విశ్వక్రీడల్లో మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో వరుసగా మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్గా చాను నయా రికార్డును నెలకొల్పింది. అదివారం జరిగిన ఈ పోటీ ల్లో స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కిలోల బరువు ఎత్తిన చాను.. రెండో ప్రయత్నంలో 82 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ంది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త స్నాచ్ రికార్డును నమోదు చేసింది. అనంరతం జరిగిన క్లీన్ అండ్ జెర్క్లోనూ అదే జోరు కనబరిచింది చాను. స్నాచ్ ముగిసే సమయానికే ప్రత్యర్థుల కంటే ఏకంగా 8 కేజీల ఆధిక్యంలో నిలిచిన మ

నూతన హాల్ట్ స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్ నుంచి రూ.20 ఛార్జి త్వరలో రూ.౩౦౦ కోట్లతో విద్యుద్ధీకరణ తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్రమంత్రులు భక్తుల ఏండ్లతరబడి ఎదురుచూపులకు తెరమన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/కొమురవెల్లి: ప్రసిద్ధ శైవక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి భక్తుల దశాబ్దాల కల సాకారమైంది. క్షేత్రానికి చేరుకునేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనం గా నిర్మించిన రైల్వేస్టేషన్ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసుకోవచ్చన్నారు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి సన్నిథిలో భక్తులకు అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు. ‘హైదరాబాద్ నుంచి కేవలం 20 రూపాయల ఛార్జీతో భక్తులు నేరుగా కొమురవెల్లికి చేరుకోవచ్చ’న్నారు. ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న ఈ రైలు త్వరలోనే 300

మూడో టి20లోనూ జింబాబ్వే చిత్తు3-0తో సిరీస్ కైవసం హరారే: భారత్ కుర్ర జట్టు అతిధ్య జింబాబ్వేను వైట్వాష్ చేసింది. మూడు టి20ల సిరీస్ను 30తో జింబాబ్వేను చిత్తుచేసిన శ్రేయాస్ సేన తొలి సిరీస్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్లో 35 పరుగులు తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష ఛేదనలో జింబాబ్వే 157 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో అతిధ్య జట్టు సొంత గడ్డపై ఘోర పరాభావాన్ని ఎదుర్కొవలసి వచ్చింది. ర్యాన్ బార్ల్(54) రాణించినా.. వెస్లీ మద్వైరా(28), కర్రన్(20), మైయ్యర్స్(19) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు టీనేజ్ స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ(81 ) శుభారంభాన్ని అందించాడు. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఇతర భారత ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నా వైభవ్ తనదైన స్టైల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి ఉంటే టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించి ఉండేవాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ




