22475 వార్తలు

న్యూఢిల్లీ: వరల్డ్ జూనియర్ స్వ్కాష్ ఛాంపియన్షిప్లో భారత యంగ్ ప్లేయర్ అనహత్ సింగ్ సంచలనం సృష్టించింది. అద్భుత ఆటతీరుతో ఫైనల్కు చేరిన అనహత్ టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఈజిప్ట్కు చెందిన బార్బ్ సమేహ్ను వరుసగా నాలుగు గేమ్స్లలో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనహత్.. బార్బ్ సమేహ్పై 11-3, 8-11, 11-4, 11-6 తేడాతో గెలుపొంది టైటిల్ పోరు అర్హత సాధించింది. ఇక తొలి గేమ్ను 11-3తో సునయాసంగా గెలిచిన అనహత్కు రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. ఈ గేమ్లో 11-8తో చేజార్చుకుంది. అనంరతం చెలరేగిన అనహత్ వరుసగా రెండు గేముల్లో ఆదిపత్యం చెలాయించి.. 11-4, 11-6తో మ్యాచ్ను తనవైపు తిప్పుకుంది.

హరారే: టీమిండియా యువ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అతిధ్య జింబాబ్వేతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో టీమిండియా 90 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 220 పరుగుల భారీ లక్ష చేధనకు దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్(32), ర్యాన్ బర్ల్(20), మరుమని(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ మూడు వికెట్లు పడగొట్టి అతిధ్య జట్టు నడ్డీ విరచగా.. యశ్ ఠాకూర్2, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.తిలక్, ఇషాన్ అర్ధ శతకాలు.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. మరోసారి అభిషేక్ శర్మ(8) విఫలమయ్యడు. రెండో ఓవర్లో ముజర్బానీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అభిషేక్ ఔటైనా.. వైభవ్ సూర్యవంశీ(20) చెలరేగాడు. రిచర్డ్ నగర్వా వేసిన మూడో ఓవర్లో వరుసగా 4, 6, 4, 4 బౌండరీలు బాది ఆఖరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన

హీరో రోహిత్ నారా 23వ చిత్రం పూర్తి ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్తో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిస్తున్నారు. రోహిత్ నారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ’సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఫస్ట్-లుక్ పోస్టర్ రోహిత్ నారాను సరికొత్త అవతారంలో పరిచయం చేస్తుంది. టైటిల్ తో పాటు, కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. హాస్యనటుడు సుదర్శన్ వాయిస్ తో ఈ వీడియో, రోహిత్ నారా పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, అతనికి ‘సౌండ్ ఇంజినీర్‘ అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది. టైటిల్, కాన్సెప్ట్ వీడియో ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, సంగీతాన్ని మిళితం చేసే కథను సూచిస్తుంది. రోహిత్ నారా సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది.

కూకట్పల్లి: స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మహేశ్(17), లక్ష్మీతేజ(17) అనే ఇద్దరు యువకులు మరో స్నేహితుడి కలిసి క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్నారు. టిప్పర్ లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ను సీజ్ చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... శైలజ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సి.రాంప్రసాద్, శివనాగు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుందని, పవన్ మహావీర్కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని‘ అతిధులు పేర్కొన్నారు. నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మహావీర్, హీరోయిన్లు వర్షిక, సుహానా, దర్శకుడు శివాల ప్రభాకర్తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద పనిచేస్తున్న 16,871 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుంది. క్రమబద్ధీకరించిన రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ముగిసే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. […] The post ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు appeared first on Navatelangana.

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రదాన కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడని, అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పించాడు. ఐపిఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్లో ముందుగా వైభవ్కు అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లోనూ తొలి మ్యాచ్ ఆడించలేదు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఆడించగా.. వైభవ్ విఫలమయ్యాడు. దాంతో ఆఖరి మ్యాచ్కు తప్పించి 15 ఏళ్ల కుర్రాడి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీశాడని తప్పుబట్టాడు. జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ రికార్డ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడని, 18 బంతుల్లోనే 4 సిక్స్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనతను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడని, ఇప్పటికైనా తరుపరి సిరీస్లలో అతన్ని పరిగననలోకి తీసుకోవాలని సూచించాడు.











జగిత్యాల: చితి ఆరక ముందే బంగారం కోసం మంటలపై నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... మల్యాలలో ఓ మహిళ చనిపోవడంతో శుక్రవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహానికి చితి పెట్టిన అనంతరం వారు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయిన తరువాత ఇద్దరు మహిళలు మృతదేహం తల భాగంపై నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం బూడిదతో పాటు పుర్రెను ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్నవారు వెంబడించడంతో వారు పారిపోయారు. మహిళలు చనిపోతే వారి మెడలో ఉన్న నల్లపూసల ఆభరణం నుంచి బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటించారు. బంగారం గుండు ధర పది వేలకు పైగా ఉండడంతో దాని కోసమే పుర్రెను ఎత్తుకెళ్లి ఉంటారని బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక అల్లాడిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నైరుతి రుతుపవనాల కదిలికలతో ఏపీ, తెలంగాణలో మేఘావృతమై మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాలు నిలకడగా కొనసాగుతూ, దక్షిణ కోస్తాలో చల్లటి గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల పిడుగుల ప్రమాదంపై అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం ఉదయం భారత మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పులు నమోదు కాలేదు. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,930 వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల […] The post నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన కొడుకు ఉద్యమంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు భయపడ్డానని, కొడుకును పోలీసులు కొట్టినప్పుడు మరింత ఆందోళన చెందానని తెలిపారు. నెల రోజుల ఉద్యమంలో నిద్రలేని రాత్రులు, తిండి కూడా సహించని పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో బతికామని అనితా దీప్కే మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. The post నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత appeared first on Navatelangana.

నార్కట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట కింద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద బొమ్మల దుకాణంలో మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు బూడిదగా మారాయి. రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు వ్యాపించడంతో పలు దస్త్రాలు కాలిపోయాయి. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో దుకాణాలలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
