
3415 వార్తలు



కొత్త బైక్ కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్! ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో తన పాపులర్ పల్సర్ సిరీస్ లో బజాజ్ పల్సర్ NS400Z ను ఇప్పుడు మునుపటి కంటే చౌకగా అందిస్తోంది. 18% GST వల్ల బైక్ ధర మరింత తగ్గింది. ఇపుడు దీని కొత్త ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధర తగ్గింపు వల్ల వినియోగదారులు రూ.24,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత చౌకైన 40-హార్స్పవర్ బైక్గా నిలిచింది. ఈ తగ్గింపు కేవలం బైక్ ధరపై మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్పై కూడా ఉంటుంది. అంటే, ఈ శక్తివంతమైన బైక్ను కొనుగోలు చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం అయింది. బజాజ్ పల్సర్ NS400Z ఇంజన్ ఈ బైక్లో 349cc ఇంజన్ను అమర్చారు. ఇది 40.6 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, ఈ బైక్ వేగంతో పాటు మంచి పనితీరును కనబరుస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ద్వారా ఇంజన్ వేడెక్కకుండా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలలో కూడా బైక్ సజావుగా నడపవచ్చు. బజాజ్ పల్సర్ NS400Z ఫీచర్లు ఫీచర్ల పరంగా, ఇది దాని సెగ్మెంట్లో అత్యంత ఫీచర్-రిచ్ బైక్గా పరిగణించవచ్చు. ఇది నాలుగు రైడ్ మోడ్లను అందిస్తు

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ పట్టణంలోని భవ్య చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం మహాన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘనంగా సన్మానించి, లక్ష్మి నారాయణ ఫోటోలు బహుకరించారు. The post ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం appeared first on Navatelangana.


మే 17లోగా డిపోల్లో వసతులు మెరుగుపరచాలిఆర్టిసి ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసి అధికారులు కిందిస్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో, స్నేహపూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం ఆర్టిసి ఉన్నతాధికారులతో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్టిసి ఎండి నాగిరెడ్డి, ఈడీలు, ఆర్ఎంలు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టిసి కార్మిక సంఘాల నేతల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ స్థాయి అధికారులు సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని సూచించారు. ‘ఇంటర్నల్ ఎటాక్‘ సంస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను
– భద్రతకు గ్రామస్తుల ముందడుగునవతెలంగాణ – కామారెడ్డిఆరేపల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ , మాచారెడ్డి ఎస్ఐ అనిల్, మాచారెడ్డి పోలీస్ సిబ్బంది కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, “ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. గ్రామాల్లో భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. మాచారెడ్డి పాల్వంచ […] The post ఆరేపల్లిలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం appeared first on Navatelangana.
• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య నవతెలంగాణ – పెద్దవంగరఈ నెల 6న వరంగల్ లో నిర్వహించే రైతు సదస్సు కు పార్టీ శ్రేణులు, రైతన్నలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, నేటికీ హామీలు గానే మిగిలిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని […] The post వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి appeared first on Navatelangana.


న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఓట్ల కౌంటింగ్ సిబ్బందిగా కేంద్ర ఉద్యోగుల తరలింపు విషయంలో ఆదేశాలకు సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇటీవలి సర్కులర్ను సమర్ధించింది. కౌంటింగ్కు కేంద్ర ఉద్యోగాల తరలింపును సవాలు చేస్తూ బెంగాల్లోని అధికార పక్షం టిఎంసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 4వ తేదీనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కేంద్ర ఉద్యోగులను విధులలో ఉంచడం వల్ల అధికార బిజెపికి మేలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిని అక్కడి నుంచి తప్పించాలని టిఎంసి కోరింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జాయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయం పూర్తిగా ఎన్నికల సంఘం విధులు , బాద్యతల పరిధిలోకి వస్తుందని , ఇది చట్టం నిబంధనలకు విరుద్ధం ఏమీ కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల విధులతో పాటు కౌంటింగ్ ప్రక్రియ దశలో కూడాకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలతో కూడిన బృందాలు ఉంటాయని ఎన్నికల సంఘం ఈ నెల 13న సర్కులర్ వెలువరించింది. ఇది పూర్తిగా చట్టబద్ధం అని సుప్రీంకోర్టు సమర్థించింది.
మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడం ని అభినందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నవతెలంగాణ-మిరుదొడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డిపిఎం ప్రకాష్ అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన హోమ్ ఫుడ్స్ ద్వారా మిరుదొడ్డి మండలం లోని కాసులాబాద్ తో పటు పలు గ్రామాల్లో నీ మహిళా సంఘాలు కుండా ప్రేగు, బాదుషా,తో పాటు అనేక రకాల పదార్థాలు మహిళలు తయారు […] The post మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ చేనేత మరమగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వాలు ఇప్పించాలని యాదాద్రిభువనగిరి జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎ.శ్రీనివాసరావుకు చౌటుప్పల్ చేనేత కార్మికులు శనివారం వినతిపత్రం సమర్పించారు. గతంలో జియో ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన కార్మికుల జాబితాను పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే సభ్యత్వ నమోదు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్నాటి జనార్ధన్, ఉపాధ్యక్షుడు కందగట్ల కిషన్, కార్యదర్శి సుంకి […] The post చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – బల్మూరు మండల కేంద్రం బల్మూరులోని చెంచు కాలనీకి చెందిన మంగమ్మ (35 ) నివాసానికి సమీపాన ఉన్న మొల్ల చెరువులో నీట మునిగి చనిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి భార్యాభర్తలు తగవులాడుకొని చెరువులో భార్య వెళ్లి నీటిలో పడి నీటముడిగిందని కొందరు చెబుతున్నారు. సారా, కళ్ళు తాగి మత్తులో గొడవపడి వెళ్లి నీటిలో పడినట్టు మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బంధువులు కొందరు భర్త చేత ఫిర్యాదు ఇవ్వకుండా […] The post చెరువులో పడి మహిళ అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – పరకాల ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలోనూ పకడ్బందీగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి ఆదేశాల మేరకు, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వికేంద్రీకరణలో భాగంగా డివిజన్ స్థాయిలోనే ఆర్డీవో ఆధ్వర్యంలో వినతులను స్వీకరిస్తారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, 30 రోజుల్లోపు పరిష్కరించాలని, బాధితులకు తమ […] The post సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’ appeared first on Navatelangana.

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 200లకు పైగా సీట్లు గెలిచి, రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా.. తమ పార్టీనే గెలుస్తుందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ను తారుమారు చేయడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారని ఆరోపించారు. 2021, 2024లోనూ బిజెపి ఇదే విధంగా చేసిందని.. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని అన్నారు. వర్చువల్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాలు, పోలింగ్ సమయంలో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో బెంగాల్లో మోహరించిన కేంద్ర బలగాలు టిఎంసి కార్యకర్తలతో క్రూరంగా ప్రవర్తించారని.. ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఆ రోజున అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కింపు కేంద్రాల్లో 24 గంటలు నిఘా పెట్టాలన్నారు.
– మాజీ ఉపసర్పంచ్ యాదయ్యనవతెలంగాణ – ఊరుకొండ అనారోగ్యంతో బాధపడుతూ అర్ధాంతరంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన కంఠం నర్సమ్మ(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి […] The post ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి appeared first on Navatelangana.
కన్నీటి సంద్రమైన సిరిసిల్లసిరిసిల్లకు ఓఆర్ఆర్ యాక్సిడెంట్ మృత దేహాలువరుసగా ఆరు మృతదేహాల అంతిమయాత్రఒకే చితిలో ముగ్గురి దహనసంస్కారాలునవతెలంగాణ-రాజన్న సిరిసిల్లభగవంతుడా ?.. ఆ కుటుంబానికి ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా ??… ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురిని ఆ కుటుంబానికి దూరం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందయ్యా ???… ఐదు వైకుంఠరథాలపై ఆరుగురి మృతదేహాలు సిరిసిల్ల విద్యానగర్ వైకుంఠధామం వైపు అంతమయాత్రగా ఉద్విగ్న భరిత వాతావరణంలో సాగుతుంటే పట్టణ ప్రజల గుండె లోతుల్లోంచి… మౌనంగా […] The post కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు” appeared first on Navatelangana.
నవతెలంగాణ – బల్మూరు మండలంలోని నల్లచెరువు సమీపాన వ్యవసాయ పొలంలో శనివారం మక్కపంటకు నిప్పు అంటుకొని దగ్ధమైన సంఘటన చోటు చేసుకున్నది. సంబంధిత రైతుల వివరాల ప్రకారం బల్మూరుకు చెందిన బక్కయ్య, అనంతవరం గ్రామానికి చెందిన వెంకటస్వామి ఇద్దరూ కలిసి రెండెకరాల్లో సాగు చేసుకుంటున్నారు. మక్క పంట పూర్తి అయ్యి ఏరుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎకరన్నర భూమిలో మక్కపంట తీశామని, మిగతా అర్ధ ఎకరంలో 10 గుంటల వరకు పూర్తిగా మక్కపంట అగ్ని ప్రమాదంలో […] The post ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం appeared first on Navatelangana.
మునీగల వీడు గ్రామ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు నవతెలంగాణ-నెల్లికుదురుకేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు మునిగిలవీడు గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు వినతిపత్రం అందించి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని మా మునిగేలా […] The post కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి appeared first on Navatelangana.
ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్నవతెలంగాణ – పెద్దవూరబిజెపి ప్రభుత్వం 19 కేజీ ల వాణిజ్య సిలిండర్ ధరలను ఒకేసారి రూ.993 పెంచి సామాన్యులను మోసం చేసిందని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు.శనివారం హాలియా లో తమ నివాసం లో మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో ఆరు సార్లు వాణిజ్య సిలిండర్ ధరలను దాదాపు 83 శాతం అంటే డిసెంబర్ 2025 లో 1800 రూపాయలు ఉన్న ధర నిన్నటి […] The post సామాన్యుల నడ్డి విరచడమే బిజెపి సర్కార్ మ్యానిపిస్టో appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వైద్య […] The post ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం appeared first on Navatelangana.