19753 వార్తలు

హైదరాబాద్: ఒక ప్రమాదకరమైన అపోహ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఇసిజి చేయించుకుంటారు. ఇసిజి నార్మల్గా వచ్చిందంటే “గుండెపోటు లేదు” అని భావించి ఇంటికి వెళ్లిపోతారు. అయితే ఈ అభిప్రాయం చాలాసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. నార్మల్ ఇసిజి వచ్చినంత మాత్రాన గుండెపోటు లేదని ఖచ్చితంగా చెప్పలేము.ఇసిజి అనేది గుండె విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే అత్యంత ముఖ్యమైన పరీక్ష. గుండెపోటును గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రతి గుండెపోటును మొదటి ఇసిజిలోనే గుర్తించలేము. ముఖ్యంగా స్టెమీ గుండెపోటు ప్రారంభ దశలో ఇసిజిలో ఎలాంటి మార్పులు కనిపించకపోవచ్చు. కొంతమంది రోగుల్లో కనిపించే నాన్ ఎస్ టి ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారక్షన్ అనే గుండెపోటు రకంలో మొదటి ఇసిజి పూర్తిగా సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గుండె వెనుక భాగం లేదా సర్ కమ్ ప్లెక్స్ కరోనరీ ఆర్టరీ ప్రభావితమైన కొన్ని గుండెపోటులలో కూడా సాధారణ ఇసిజితో నిర్ధారణ కష్టమవుతుంది.ఎప్పుడు మరింత జాగ్రత్త అవసరం? ఈ లక్షణాలు ఉంటే ఇసిజి నార్మల్ వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు.ఛాతిలో బిగుతుగా లేదా నొక్కినట్ల





శ్రీలంకతో త్వరలో భారత్ టెస్ట్ సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కి ముందు భారత్కి షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాడని భావించిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు ఈ సిరీస్కి దూరమ్యాడు. దీంతో భారత జట్టు బౌలింగ్ విభాగంలో లోటు ఏర్పడింది. అయితే బుమ్రా స్థానంలో జమ్మెుకశ్మీర్కి చెందిన అకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బిసిసిఐ సోషల్మీడియాలో పోస్టు చేసింది. 29 ఏళ్ల నబీ చాన్నాళ్ల నుంచి భారత జట్టులో ఆరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. అసలు గత రంజీ ట్రోఫీని జమ్ముకశ్మీర్ నెగ్గడంలో అకిబ్ నబీదే కీలక పాత్ర. ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో అతడికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టులోనే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ, అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్కి ఎంపికైన నబీని తుది జట్టులో ఆడించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండ


హైదరాబాద్: టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోవ వైరల్గా మారాయి. తనతో కలిసిన ఆడిన టాప్-5 బౌలర్లను ప్రకటించాడు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్కు ఐదో స్థానం కేటాయించడంతో అతడి సారీ చెప్పడంతో పర్సనల్గా మెసేజ్ చేస్తానని వివరణ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్కు అశ్విన్ కెప్టెన్సీలో అర్ష్దీప్ సింగ్ బౌలర్గా ఉన్నాడు. అశ్విన్ కెప్టెన్సీలో మూడు ఐపిఎల్ మ్యాచ్లు ఆడాడు. 2019లో మినీ వేలంలో అర్ష్దీప్ సింగ్ ను పంజాబ్ జట్టు రూ.20 లక్షల ప్రైజ్మనీకి కొనుగోలు చేసిన విషయం విధితమే.భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అని, అతడి పట్ల తనకు కొంత వ్యక్తిగత అభిమానం ఉందన్నారు. భువీకి తొలి స్థానం ఇచ్చానని అర్ష్దీప్ వివరణ ఇచ్చాడు. రెండోస్థానంలో షమీ, మూడో స్థానం కులదీప్ సింగ్, నాలుగో స్థానం యుజేంద్ర చాహల్, ఐదో స్థానం రవి చంద్రన్ అశ్విన్కు ఇచ్చాడు. అశ్విన్ చివరి స్థానంలో పెట్టడం ఇష్టం లేదు కానీ నాలుగు స్థానాలు నిండిపోవడంతో ఐదో స్థానం ఇవ్వాల్సి వచ్చిందన్నారు.



మగాడి జీవితమూ నిశ్శబ్ద ఆరాట పోరాటం పిల్లాడిగా ఆటపాటలు తండ్రి వేలు పట్టి నడకలు అమ్మ ఒడి కన్నీటిని తుడిచే గుడి అమ్మ ఒడిలోంచి బడిలోకి బతుకు అర్థంతో పాటు అర్థాన్ని ఆర్జించే జ్ఞాన సముపార్జన ఉద్యోగ ఉపాధుల వేటలు జీవనోపాధికి ఏదో ఒక వృత్తిలో మునకలు పెళ్లితో తలపై కుటుంబ భారం ఎదిగే కొద్దీ తన ఇష్టాల్నిచంపుకొని కుటుంబ నవ్వుల కోసం అలుపెరుగని అవిశ్రాంత పరుగులు గెలుపోటముల నడుమ నలిగి పోతాడు భర్త, తండ్రి అయ్యాక అతనో డైరీ మాత్రమే అయి, పేజీల్లో ఖర్చులు, బాధలే చెమట వరదల పెట్టుబడితో కుటుంబ నవ్వుల పంటను సాగు చేస్తూ అప్పులు, నొప్పులతో ఒంటరై పోతాడు తన రెక్కల కింది పెరిగిన పిల్లలు ఎదిగి ఎగిరి పోయాక ఒంటరై పోయి ఆలి ఒడిలో పిల్లాడిలా ఒరిగి పోతాడు జీవితాంతం అందరి కోసం బతికి చివరగా జ్ఞాపకాలతో మిగిలిపోతాడు తను ఎన్నిసార్లు ఓడినా. కుటుంబం గెలుపును కోరుకుంటూ. కన్నీటిని కలల సాగుకు వాడుకుంటూ చెమట చుక్కలతో సాఫల్య స్నానం చేస్తూ ఒంటరిగా వచ్చి ఒంటరిగానే నిష్క్రమిస్తాడు - మధుపాళీ


పెద్దపల్లి: గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యౌటింక్లయిన్ కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పోతన కాలనీలోని 83వ బ్లాక్లో యాదవనేని వసంత్ విజ్ఞత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వకీల్పల్లి గనిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మరో రూమ్లో ఉన్న సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు వెంటనే దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఎస్ఐ ప్రసాద్రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఈ రోజు ఒప్పు్పకోక తప్పదు ఊరి చివర తుప్పల్లోను వీధి మూల సందుల్లోనూ గుత్తులుగా పూసిన అనాథ పూలు అందాన్ని ఊరేగిస్తూ ఆకాశాన్ని ముద్దాడుతుంటే గెలుపు ఒప్పు్పకోక తప్పదు ఎక్కడో వీధి చివర వెలివేసిన బొక్కెడు మల్లె ఈసడింపులను ఎదురీదుకొని ఎండా వానను భరించుకొని ఒక్క వసంతానికై వేచే ఆశకు మరే ఋతువైనా చిన్నబోదా? వేర్లు తెంపి, తుంచేసినామొదల్లు పీకి పారేసినా ఎక్కడో కొన ఊపిరితోమళ్ళీ వేళ్ళూనుకునాలనే ఓ ప్రయత్నం ఉంటే చాలదా? ఏ వసంతమో వచ్చి ఆదుకోదా? - వినోద్ కుత్తుం


(ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రముఖ కవి,సాహితీ విమర్శకులు సచ్చిదానందన్తో రఘు శేష భట్టార్ చేసిన ఇంటర్వ్యూ ) మీరు భారతీయ కవుల్లో శిఖర సమానులు. పాఠకులే కాదు ఉద్దం డులైన ఎంతోమంది కవులు మీ కవిత్వానికి ఫిదా ఔతారు. ఇంత మందిని mesmarize చేసేలా రాయటం ఎలా సాధ్యమైంది? చిలీకి చెందిన సుప్రసిద్ధ కవి నికనర్ పర్రా అంటాడు. - కవి ఐన వాడు ఖాళీ పేజీలపై తనదైన ముద్ర వేయాలని. ఆ పేజీలను నేను కొత్తగా సున్నితంగా మలచాలనుకుంటాను. నిజానికి కవి ఐన ప్రతి మనిషి ఈ సూత్రాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే పాఠకుల కు దగ్గరౌతాం. బహుశా నేను నికనర్ పర్రా మాటల్ని గట్టిగా పట్టించుకొని ఉంటాను. ఒక అత్యుత్తమ కవికి ఉండే లక్షణం ఏమిటంటే అతడు ఎంతో మంది అజ్ఞాత పాఠకులకు స్ఫూర్తినిస్తాడు. తన రాతలతో వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఎంతోమందిని తట్టిలేపిన మీరు అలా స్ఫూర్తి పొందిన సందర్భాలున్నాయా? నేనిప్పటికీ కవిత్వం చదువుతాను. గంగలో మునిగి అర్ఘ్యం ఇచ్చే వాడిలా లేదా మక్కా వైపు తిరిగి ప్రార్థించే వాడిలా శ్రద్ధగా చదువుతా ను, రాసేప్పుడు కూడా అలాగే ఉంటాను. అట్లా ఉండటమే సాహిత్య సాంప్రదాయం అనుకుంటాను. ప్రతీకలు, రూపకాలు నాకు వర్ణమాలలాంటివి. చదవటం నా



మనిషి చరిత్రను గమనిస్తే ఒక విరోధాభాసం స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ కోసం పుట్టిన మనిషే, తన చేతుల తో తానే బంధనాలను నిర్మించుకున్నాడు. ప్రకృతిలోని ఇతర జీవుల మాదిరిగా ప్రేమతో, సహజత్వంతో జీవించాల్సిన మ నిషి, నాగరికత పెరిగిన కొద్దీ అధికారం, ఆధిపత్యం, మతం, జాతి, సంపద, విజ్ఞానం పేర్లతో తన చుట్టూ కనిపించని సంకెళ్లను వేసుకున్నాడు. ప్రపంచంలోని యుద్ధాలు, రాజ్యాలు, వలస పాలనలు, మత ఘర్షణలు అన్నీ చివరికి ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే తపన నుంచే పుట్టాయి. ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి సహజ మానవ విలువలు క్రమంగా భయం, ద్వేషం, అసూయ, అహంకారాల కింద నలిగిపోయాయి. నాగరికత మనిషికి సౌకర్యాలు ఇచ్చినా, అంతరంగ శాంతిని మాత్రం దూరం చేసింది. ఈ సంక్షోభాన్ని ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టా య్, దాదాపు 116 సంవత్సరాల క్రితమే తన హిందువులకో ఉత్తరంలో విశ్లేషించాడు. 1908లో అమెరికాలోని భారత స్వాతంత్య్ర సమరయోధుడు తారకనాథ్ దాస్ కు రాసిన ఈ లేఖలో టాల్స్టాయ్ కేవలం బ్రిటిష్ వలస పాలనను మాత్రమే విమర్శించలేదు. బానిసత్వం అనే భావన మనిషి అంతర్మనస్సులో ఎలా పుడుతుందో వివరిస్తాడు. ఈ లేఖను మళ్ళీ ఇ న్నాళ్ళకు చింతకుంట్ల సంపత్

