22117 వార్తలు




హైదరాబాద్: సినీనటి పావలా శ్యామల (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గుండెపోటుతో మృతి చెందాన ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆమెకు ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సాయి దుర్గాతేజ్, దిల్ రాజు వంటి సినీ ప్రముఖలు ఆర్థిక సాయం చేశారు. 1951లో ఎపిలోని గుంటూరు జిల్లాలోని జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత నేతి శ్యామల పేరు పావలా శ్యామలాగా మారిపోయింది. నాటక రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆంధ్రావాలా, స్వర్ణకమలం, బాబాయ్ అబ్బాయ్, ఖడ్గం వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.











సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ తప్పనిసరివిచారణ నిష్పాక్షికంగా జరిగేలా చర్యలు తీసుకోండి అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ : అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది.ఈ కేసు విచారణ కోసం ఐజి కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేద

విపక్షాల ఆందోళనల నడుమ ప్రవేశపెట్టిన మంత్రి జితేంద్రసింగ్దోషులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విద్యార్థులపై దాడులను నిరసిస్తూ బిల్లుపై చర్చను అడ్డుకున్న విపక్షాలు నేడు చర్చ... ఓటింగ్? ఉభయ సభల్లో వెనక్కి తగ్గని విపక్షం పార్లమెంట్ నేటికి వాయిదా విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి : కిరెన్ రిజజు న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనల నడుమ సోమవారంనాడు పేపర్ లీకుల వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షల చట్ట సవరణ బిల్లు2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. తాజా సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీక్లకు పాల్పడే అక్రమార్కులకు జైలుశిక్ష గరిష్టంగా పదేళ్లు, జరిమానా రూ.10 కోట్లు విధిస్తారు. ఇకపై పేపర్ లీక్ అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దర్యాప్తు చేపడుతుంది. ఈ కేసుల్లో విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేసు నమోదైన రెండు నెలల్లో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజులు గడువు ఉంటుంది. అప్పీల్పై కూడా 90 రోజుల్లో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఫాస

వైద్యులకు చేతులు జోడించి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వినతిఐసియులో ఉన్న సుదర్శన్రెడ్డికి చూసి భావోద్వేగానికి గురైన కెసిఆర్యశోద ఆస్పత్రికి వెళ్లి సుదర్శన్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కెసిఆర్మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. తీవ్ర గుండెపోటుతో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసియు వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ఐసియులో ఉన్న సుదర్శన్రెడ్డిని చూసి కెసిఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు అరగంట సేపు అక్కడే ఉండి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని, అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని వైద్యులు కెసిఆర్కు వివరించారు. ఆయన అవయవ

కాక్రోచ్ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలున్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసనలు తెలపడం ప్రజలకు రాజ్యంగం కల్పించిన హక్కు అని, ఆందోళన సాకుగా వారిపై బలప్రయోగం చేయడాన్ని సమర్ధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలను నియంత్రించేందుకు చట్టబద్ధమైన విధానాలనే అనుసరించాలని సూచించింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై ఏకరూప మార్గదర్శకాలను రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నీట్-యూజీ సహా పలు పోటీ పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థుల నిరసలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జిలు జరపడంపై దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం సోమవారంనాడు విచారణ చేపట్టింది. పోలీసులపై సైతం నిరసకారులు దాడులు చేసినట్టు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసుల జీవితమూ విలువైనదేనని, పోలీసుల భద్రతలను సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరమని, పోలీసుల చర్యతో పాటు

సిఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్కు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచననేడు, రేపు ఢిల్లీలోనే సిఎం రేవంత్ మకాం రేపు మరోసారి ‘సర్’ జాగ్రత్తలపై ఏఐసిసిలో మంతనాలు హైడ్రాపై నేడు స్పందిస్తా: పిసిసి చీఫ్మన తెలంగాణ/హైదరాబాద్: ఓట్ల సవరణ ప్రక్రియ (సర్)పై ఏ మాత్రం ఏమరపాటు, నిర్లక్షం ఉండకూడదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్ పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు. రాష్ట్రంలో ‘సర్’పై స్తబ్ధత ఉందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ, ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో కెసి వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశమై సుమారు రెండు గంటల పాటు పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇదిలాఉండగా కీలకమైన ‘సర్’పై బుధవారం మరోసారి ఢిల్లీలో సమీక్ష చేద్దామని కెసి వేణుగోపాల్ వారితో అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులూ హాజరవుతారు. దీంతో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్

కబ్జాదారులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారు నాపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టింది వారే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: “నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతున్నారనీ, రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్ల, ప్రభుత్వ భూము లు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వా టిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతం లో, ఇప్పుడు, మున్ముందు ఏ బా ధ్యతలు అప్పగించినా నేను నా వై పు నుండి 100 శాతం ఫలితాలు ఇవ్వటానికి పని చేస్తున్నాను, చేస్తాను.” అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్

ప్రభుత్వ సేవలకు ఇక ఒకే సర్టిఫికెట్రేషన్ కార్డు డేటా ఆధారంగా రిజిస్టర్ను నిర్వహించనున్న ప్రభుత్వంమీసేవ కేంద్రాలు, ఆన్లైన్లో దరఖాస్తులు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ సేవలకు అవసరమైన కుటుంబ సభ్యుల వివరాల కోసం వేర్వేరు ధృవపత్రాలను సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) డాటాబేస్తో అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్ను నిర్వహిస్తారు. రేషన్ కార్డు సంఖ్యనే కుటుంబ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. ఇందులో కుటుంబ పెద్ద పేరు, సభ్యుల వివరాలు, వయసు, చిరునామా వంటి అంశాలు నమోదై ఉంటాయి. పౌరులు మీ-సేవా కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలోని వయోజన సభ్యులలో ఎవరైనా ఈ దరఖాస్తును సమర్పించవచ్చు. దరఖాస్తుదారుడ

సీమైన్స్ తగలడంతో ఘటనతప్పుడు మార్గంలో వెల్లడం వల్లే పేలింది : ఇరాన్ అమెరికాతో చర్చలకు షరతులు ఉక్రెయిన్కు హెచ్చరికలు హెజ్బొల్లాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మద్దతు దుబాయి/టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఘర్షణలు సద్దుమణుగుతున్నాయని అనుకునేలోపే ఏదో ఒక ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా హర్మూజ్లో ఇరాన్ ఏర్పాటు చేసిన సీమైన్ తగిలి ఓ చమురు ట్యాంకర్ పేలిపోయింది. తాము నిర్దేశించిన మార్గం గుండా కాకుండా మరో మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం వివరాలు బయటికి రాలేదు. అమెరికా, ఇరాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇది ఊరటనిచ్చే పరిణామమేనని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో ట్యాంకర్ పేలుడు ఘటన జరగడంతో మళ్లీ ఆందోళన నెలకొంటోంది. మరోవైపు సౌదీ అరేబియాలో హౌతీల దాడుల నేపథ్యంలో చమురు రవాణా కూడా మందగిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. బాబ్ ఎల్మండెబ్ జలసంధి గుండా ఇటీవల 11 నౌకలు మాత్రమే వచ్చినట్లు కెప్లర్ సంస్థ ప్రకటించింది. ఇక చర్చలకు ఇరాన్ కొత్త షరతులు విధించింది. హర్మూజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ధ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలుగ్రీకు పురాణాల్లోని బహు శిరస్సుల జలరాక్షసిగా హైడ్రా వ్యవహరిస్తోంది 63 ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం రూల్ ఆప్ లాకు ముప్పు అని వ్యాఖ్యానించిన ధర్మాసనం అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్: లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్ను ఆ కమిషనర్ స్థానం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిను ఆదేశించింది. లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన పిటిషన్ను సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల అమలులో వరుస ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఒకే అంశంపై భారీ సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లు దాఖలవడాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, రంగనాథ్ కొనసాగితే న్యాయపాలనకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని భూములకు సంబంధించిన వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, హైడ్రా అధికారుల వ్యవహారశైలిపై