24539 వార్తలు


నాగాలాండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. నాగాలాండ్ పోలీసులు సహా అస్సాం రైఫిల్స్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, మౌలికసదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

చెన్నై: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరికొన్ని చిత్రాలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. తమిళ చిత్రాలకు కూడా అవార్డులు లభించాయి. విజయ్ సేతుపతి నటించి ‘మహరాజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హఇట్గా నిలిచిన విషయం తెలిందే. ఈ చిత్రంలో నటించిన బాల నటి సచనా నమీదాస్కు జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్లో చూసిన సచనా.. తన పేరు వినగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయి.. కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026






‘పెద్ది’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా సుకుమార్తో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్, సుకుమార్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ‘పుష్ప’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్గా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అంతేకాక.. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్ఫర్మెన్స్కు స్కోప్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారట. 2027 చివర్లో కానీ.. 2028 మార్చిలో కానీ.. ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం.


హైదరాబాద్: యువతను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కరీంనగర్ లో కెటిఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు? అని బిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. చేస్తాం అని తెలియజేశారు. బిఆర్ఎస్ లాగా నిరుద్యోగ యువతతో తాము ఆటలు ఆడలేదని, నిరుద్యోగులకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు సూచించారు.

లండన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. దీంతో భారత పేసర్లు వికెట్లు తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జాకబ్ బేతల్ అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజ్లో బేతల్ (53), డకెట్ (34) ఉన్నారు.




హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారిపోయారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుబంధు బంద్ అయ్యింది, సాగుకు కరెంట్ ఇవ్వట్లేదని అన్నారు. సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూరియా లేదు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని విమర్శించారు. మున్ముందు మరింత కరువు వస్తుందని హరీష్ రావు సూచించారు. గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని, స్కామ్ ల కాంగ్రెస్ పోయి..స్కీముల మాజీ సిఎం కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారని, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే.. భద్రాచలం మునుగుతుందని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు బోల్తా పడింది. తిరుపతి నుంచి కారులో హైదరాబాద్కు చెందిన ఐదుగురు భక్తులు తిరుమలకు బయలుదేరారు. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయ, ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.






శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజౌరీ, ఫూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.