
3638 వార్తలు
నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం బుధవారంతో ముగిసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో 23న, బెంగాల్లో తొలి విడత 23న, 29న రెండో దఫా పోలింగ్ ముగిసింది. దీంతో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ హంగామ మొదలైంది. ఆయా సర్వే సంస్థలు పలు అంచనాలతో తమ జోస్యాన్ని వెల్లడించాయి. తమిళనాడలో డీఎంకే జోరు కొనసాగునుందని యాక్సిస్ ఇండియా, పి-మార్క్, మాట్రిజ్, పిపుల్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్ తదితర ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. […] The post ఎగ్జిట్ పోల్స్ హంగామ..ఏ రాష్ట్రంలో ఎవరు ఆధిక్యం appeared first on Navatelangana.

ఐపిఎల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత తడబడిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు.. ఆ తర్వాత కీలక సమయంలో అద్భుతంగా రాణించారు. అనంతరం ఛేజింగ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ 76, క్లాసెన్ 65, అభిషేక్ 45, సలీల్ 30 పరుగులతో రాణించారు. దీంతో 8 బంతులు మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ 249 పరుగులు చేసి వరుసగా ఐదో సారి విజయఢంకా మోగించింది. అయితే ఈ మ్యాచ్లో తమ జట్టు బ్యాటర్లపై కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభారంభం అత్యంత ముఖ్యం. మా బ్యాటింగ్ లైనప్ గురించి తెలిసిందే కదా.. ఇక పిచ్ కూడా చాలా బాగుంది. మా చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోదని అనుకున్నాం. మా బ్యాటర్లు దాన్ని చేసి చూపించారు. మా ఓపెనర్లకు భయం అంటే తెలియదు. వారి దగ్గర చాలా భిన్నమైన షాట్లు ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే.. వారిని నేను బౌలింగ్ చేయడం లేదు. వారిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సలీల్ అరోరా ఫినిషింగ్ టచ్ బాగుంది. అత

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం క్రమం తప్పకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇటీవల ఈ సంస్థ మరో ఆకట్టుకునే ప్లాన్ను ప్రకటించింది. ఇది తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.997. ఇది వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే ఇబ్బందిని నివారించాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎన్ఎల్ రూ.997 రీఛార్జ్ ప్లాన్బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ అతిపెద్ద ప్రత్యేకత దాని 150 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీ. అంటే, ఒకసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 5 నెలల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంటర్నెట్ను ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లకు కూడా ఇది ఒక అద్భుతమైన ప్లాన్ కావచ్చు. అదనంగా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఇది ఒక ఆల్-ఇన్-వన్ ప్యాకేజీగా నిలుస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయాల











ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్ప్లస్ చైనాలో సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని 'వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా' పేరిట తీసుకొచ్చింది. సంస్థ ఈ పరికరాన్ని ఏస్ 6 సిరీస్లో మూడో మోడల్గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8,600mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా ధర 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,499 (సుమారుగా రూ.48,400)12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,799 (సుమారుగా రూ.52,500) 16GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,099 (సుమారుగా రూ.56,700) 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారుగా రూ.60,800). 16GB + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,099 (సుమారు రూ.70,500) వన్ ప్లస్ ఏస్ 6 అల్ట్రా ఫీచర్లుఈ కొత్త వన్ ప్లస్ ఫోన్లో 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ పరికరం 165Hz వరకు రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ ఫోన్ గరిష్ట బ్రైట్నెస్ 1,800 నిట్స్ వరకు ఉం
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, తాము మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పేర్కొంది. ఆటోమేషన్, ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గతేడాది తమ కంపెనీ ఉద్యోగాలు తొలగించలేదని, భవిష్యత్తులోనూ లేఆఫ్స్ ఉండవని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అనేది కీలక మార్పు అని, అయితే అది వెంటనే ఉద్యోగాలను తీసేయదన్నారు. The post ఇన్ఫోసిస్లో లేఆఫ్లు ఉండవు: సలీల్ పరేఖ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పదో తరగతిలో ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కానీ నిన్న విడుదలైన ఫలితాల్లో ఆమెకు 480 మార్కులు వచ్చాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన సాయిప్రియ (17) పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో ఈ నెల 24న ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. నిన్న ఫలితాలు రాగా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావడంతో […] The post ‘టెన్త్’ ఫెయిల్ భయంతో ఆత్మహత్య.. కానీ 480 మార్కులొచ్చాయి appeared first on Navatelangana.

హైదరాబాద్: డిజిపి శివధర్ రెడ్డి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని సివి ఆనంద్ తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పోలీస్ అకాడమీలో డిజిపి శివధర్ రెడ్డికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్ లో శివధర్ రెడ్డికి గౌరవవందనం, పదవీ విరమణ పొందిన శివధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి ఆనంద్, ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్లొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఈ సందర్భంగా సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని, ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సివి ఆనంద్ సూచించారు.





నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది దుర్మరణం చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, పనులు ముగించుకుని సుమారు 40 మందికి పైగా కూలీలు ఒక పికప్ వ్యాన్లో […] The post మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి appeared first on Navatelangana.