
3652 వార్తలు




ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్ప్లస్ చైనాలో సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని 'వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా' పేరిట తీసుకొచ్చింది. సంస్థ ఈ పరికరాన్ని ఏస్ 6 సిరీస్లో మూడో మోడల్గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8,600mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా ధర 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,499 (సుమారుగా రూ.48,400)12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,799 (సుమారుగా రూ.52,500) 16GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,099 (సుమారుగా రూ.56,700) 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారుగా రూ.60,800). 16GB + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 5,099 (సుమారు రూ.70,500) వన్ ప్లస్ ఏస్ 6 అల్ట్రా ఫీచర్లుఈ కొత్త వన్ ప్లస్ ఫోన్లో 6.78-అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ పరికరం 165Hz వరకు రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ ఫోన్ గరిష్ట బ్రైట్నెస్ 1,800 నిట్స్ వరకు ఉం
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, తాము మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పేర్కొంది. ఆటోమేషన్, ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గతేడాది తమ కంపెనీ ఉద్యోగాలు తొలగించలేదని, భవిష్యత్తులోనూ లేఆఫ్స్ ఉండవని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అనేది కీలక మార్పు అని, అయితే అది వెంటనే ఉద్యోగాలను తీసేయదన్నారు. The post ఇన్ఫోసిస్లో లేఆఫ్లు ఉండవు: సలీల్ పరేఖ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పదో తరగతిలో ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కానీ నిన్న విడుదలైన ఫలితాల్లో ఆమెకు 480 మార్కులు వచ్చాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన సాయిప్రియ (17) పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో ఈ నెల 24న ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. నిన్న ఫలితాలు రాగా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావడంతో […] The post ‘టెన్త్’ ఫెయిల్ భయంతో ఆత్మహత్య.. కానీ 480 మార్కులొచ్చాయి appeared first on Navatelangana.

హైదరాబాద్: డిజిపి శివధర్ రెడ్డి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని సివి ఆనంద్ తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పోలీస్ అకాడమీలో డిజిపి శివధర్ రెడ్డికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్ లో శివధర్ రెడ్డికి గౌరవవందనం, పదవీ విరమణ పొందిన శివధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి ఆనంద్, ఈ కార్యక్రమంలో నూతన డిజిపి సివి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పాల్లొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఈ సందర్భంగా సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని, ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సివి ఆనంద్ సూచించారు.





నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది దుర్మరణం చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, పనులు ముగించుకుని సుమారు 40 మందికి పైగా కూలీలు ఒక పికప్ వ్యాన్లో […] The post మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి appeared first on Navatelangana.






ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని గురువారం విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ధనుష్కి మంచి మార్కెట్ ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా బలమైన కంటెంట్, ఎమోషనల్ కంటెంట్తో ‘కర’ రాబోతోంది. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. మంచి కంటెంట్తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్ను పెట్టారు. విఘ్

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శిని’. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “అందరూ ఇది కేవలం లవ్స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి”అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ “అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమిని సురేష్, గీతికాదాస్, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా వినుకొండలో ఓ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్పై లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై లైంగికదాడి చేశారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్న మల్లయ్యకు చెందిన నాటు కోళ్ల […] The post మహిళపై మాజీ సీఐ లైంగికదాడి..! appeared first on Navatelangana.

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ వీసా స్టాంపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “డైరెక్టర్ కశ్యప్కి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ “జేడీ, తరుణ్ ఇచ్చిన సపోర్ట్ను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీ విష్ణు ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరినీ అలరించే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, జేడీ చక్రవర్తి, ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి, పవన్ సాది
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూరు వంతెనపై బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్కు చెందిన 12 మంది వలస కార్మికులు కటికేనపల్లిలో నివాసం ఉంటూ హమాలీ పని చేస్తూ […] The post ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు appeared first on Navatelangana.