🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3662 వార్తలు

మళ్లీ కుష్టు కలకలం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాయదారి రోగం.. రాష్ట్రంలో ఏటా 2,500కు పైగా కొత్త కేసులు
పాత
ముగ్గురు పోలీసులు సస్పెన్షన్
పాత
వెలుగు కార్టూన్:  గిసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ
పాత
ధాన్యం తరలింపులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు :  మంత్రి పొన్నం ప్రభాకర్
పాత
మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది..
పాత
తెలంగాణ

మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది..

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని గురువారం విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ధనుష్‌కి మంచి మార్కెట్ ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా బలమైన కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోంది. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. విఘ్

తల్లిదండ్రులకు, యూత్‌కు నచ్చే అంశాలతో..
పాత
తెలంగాణ

తల్లిదండ్రులకు, యూత్‌కు నచ్చే అంశాలతో..

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి”అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ “అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమిని సురేష్, గీతికాదాస్, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళపై మాజీ సీఐ లైంగికదాడి..!
పాత
అందరినీ అలరించే సినిమా
పాత
తెలంగాణ

అందరినీ అలరించే సినిమా

డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వీసా స్టాంపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ “జేడీ, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీ విష్ణు ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరినీ అలరించే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, జేడీ చక్రవర్తి, ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి, పవన్ సాది

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు
పాత
ఐపీఎల్ చరిత్రలో SRH రికార్డ్ బ్రేక్
పాత
IPL -2026: నేడు రాయల్ ఛాలెంజర్స్ vs గుజరాత్ జెయింట్స్ పోరు
పాత
బెంగళూరులో భారీ వర్షం..ఏడుగురి మృతి
పాత
నేడు ఆర్‌సిబితో గుజరాత్ పోరు
పాత
ఇదా జాతిని ఉద్దేశించే ప్రసంగం!
పాత
తెలంగాణ

ఇదా జాతిని ఉద్దేశించే ప్రసంగం!

నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అత్యంత వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా అత్యున్నత పాలనా స్థాయినుంచి ఏదైనా మాట్లాడితే తక్షణం అది జనంలో వెంటనే ప్రచారమవుతుంది. అదే ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడితే అది కేవలం కమ్యూనికేషన్‌కు పరిమితం కాదు. అది రాజకీయ నీతిజ్ఞతగా పరిగణించబడుతుంది. ప్రధాని కార్యాలయం ఒక పార్టీకి చెందినదిగా ఉండదు. అది రాజ్యాంగ విలువలకు, కొన్ని కోట్ల ప్రజల సమన్వయ సంకల్పం, ఆకాంక్షల ప్రతిరూపం. అందువల్ల నేరుగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడాలనుకున్న అంశం, కథనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకునేలా ఉండాలి. కొన్ని కోట్లమంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసే ప్రసంగం జాతీయ ప్రాధాన్యమైనదిగా ఉండాలే తప్ప కేవలం ఒక పార్టీ ఫక్తు రాజకీయ ప్రసంగంలా ఉండరాదు. వాస్తవానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన సందర్భాల్లోనే ప్రధాని ఎవరైనా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య సంప్రదాయం. యుద్ధాల

మమత, స్టాలిన్‌లకే మళ్లీ అవకాశం
పాత
తెలంగాణ

మమత, స్టాలిన్‌లకే మళ్లీ అవకాశం

ప్రతిష్టాత్మకంగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, మొత్తం అయిదు అసెంబ్లీల ఎన్నికల పోలింగ్ ఘట్టం బుధవారంతో ముగిసింది. రెండు చోట్ల ఎన్‌డిఎ, మూడు చోట్ల ప్రత్యర్థి పార్టీ/ కూటములు గెలుపొందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దేశప్రజల దృష్టినాకర్శించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాల్ని నిలబెట్టుకునే సూచనలున్నాయి. ఈ రెండు చోట్ల, కేంద్రంలో పాలకపక్షమైన బిజెపికి గట్టి ప్రత్యర్థులు మమతా బెనర్జీ (టిఎంసి), ఎం.కె. స్టాలిన్ (డిఎంకె) లు ముఖ్యమంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే! ఇక బిజెపి నేతృత్వం వహిస్తున్న ఎన్‌డిఎ ప్రస్తుత పాలనలోని అసోం (హిమంత బిశ్వశర్మ), పుదుచ్చెరి (ఎన్.ఆర్. రంగస్వామి) ల్లోనూ పాలకపక్షాలే గెలుపొందనున్నాయి. దేశంలో ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం కేరళ (పినరయ్ విజయ్) లో మాత్రమే పాలక వామపక్ష ఎల్‌డిఎఫ్ ఓడి కాంగ్రెస్ నేతృత్వపు యుడిఎఫ్ గెలుపొందే సంకేతాలున్నాయి. ఇక్కడ బిజెపి ఉనికి నామమాత్రమే! ఇదీ అసెంబ్లీల ఎన్నికల తాజా ముఖచిత్రం! కమ్యూనిస్టు పాలనలోని ఒక్క కేరళలో తప్ప మిగతా నాలుగుచోట్ల పాలకపక్షాలే ఎన్నికల్లో గెలిచే సూచనలున్న

టెన్త్‌లో బాలికలే టాప్
పాత
తెలంగాణ

టెన్త్‌లో బాలికలే టాప్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 95.15 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 96.26 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 2.19 శాతం అధికంగా నమోదైంది. ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పివి శ్రీహరి,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత నమోదైందని అన్నారు. విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ మోడల్ స్కూల్స్,ప్రైవేట్, కెజిబివి మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. గురుకుల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గ

గూడులేని ఆ గోడు పట్టేదెవరికి?
పాత
తెలంగాణ

గూడులేని ఆ గోడు పట్టేదెవరికి?

పేదోనిదైనా, పెద్దోనిదైనా... పైసలున్నోనిదైనా, పైసక్కరువున్నోనిదైనా... పూర్ గుడిసోనిదైనా, ఫుల్లు రిచ్చోనిదైనా... గూడున్నోడిదైనా, గూడు లేనోడిదైనా... ఎవరిదైనా పానమే. అది ఎప్పటికైనా పోయేదే గనీ, ఎల్లకాలం ఉండేది కాదు గదా..? మరి, అసొంటప్పుడు పానం బోయిన మనిషిని జూస్తే ఎందుకంత భయం? కాదు కాదు, అది భయమనుకుంటే మనం భ్రమ పడ్డట్ట్టే! ఆ పానంబోయిన మనిషి పెద్దోడు కాదు కావట్టే ఛీ పొమ్మంటున్నదీ పాడు లోకం. ఆ పానం బోయిన మనిషి దగ్గర పైసల్లెవ్వు కావట్టే అట్లా దూరం పెడుతున్నదీ సమాజం. ఆ పానం బోయిన మనిషికి నిల్వ నీడ లేదు కావట్టే ఛీ పొమ్మని ఛీత్కరించుకుంటున్నదీ లోకం. ఎందుకింత నైరాశ్యమని ఆలోచిస్తున్నరా? ఇదిగో ఈ వ్యాసం సదువుతే మీకే అర్థమైతది. 2017 అనుకుంటా... ఓ జర్నలిస్టు మిత్రుడి వాళ్ల నాయిన జగదీశ్‌కు రోడ్డు యాక్సిడెంటైతే గాంధీ దావఖానకేస్కొచ్చిన్రు. పరిస్థితేం బాగలేదు, మనిషి కొరి జీవునం మీదున్నడని తెలిస్తే.. నేను, ఇంకో ఇద్దరు జర్నలిస్టు మిత్రులు ముగ్గురం గల్సి గాంధీ దావఖానకు వోయినం. పోయేసరికే పాపం ఆ పెద్దమనిషి జీవిడిసిండనే వార్త మా కండ్లనెరుపెక్కించింది. మేమే గాదు, ఆ పెద్దమనిషి కోసం అక్కడికొచ్చిన ప్రతీ ఒక్క మనిష

పాలనకు రెవెన్యూ పట్టుగొమ్మ
పాత
తెలంగాణ

పాలనకు రెవెన్యూ పట్టుగొమ్మ

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి ఎన్నో శాఖలు ఉన్నా, ప్రజలతో అత్యంత ప్రత్యక్ష సంబంధం కలిగి, ప్రభుత్వ ఉనికిని నేలమీద ప్రతిఫలింపజేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే. ఈ శాఖను కేవలం భూముల పరిపాలనకు పరిమితమైన యంత్రాంగంగా చూడటం దాని అసలైన పరిధిని, ప్రాముఖ్యతను అణగదొక్కినట్లే అవుతుంది. వాస్తవానికి రెవెన్యూ శాఖ అనేది రాష్ట్ర పరిపాలనా నిర్మాణానికి వెన్నెముక మాత్రమే కాదు, అది ప్రభుత్వ కార్యాచరణకు క్షేత్రస్థాయి జీవనాడి. గ్రామ సరిహద్దునుంచి రాష్ట్ర రాజధానివరకు విస్తరించిన పరిపాలనా శ్రేణిలో ప్రభుత్వానికి కళ్ళూ, చెవులూ, చేతులూ అన్నీ ఈ శాఖే. ప్రజలు ప్రభుత్వాన్ని మొదటగా స్పృశించే స్థలం తహసీల్దార్ కార్యాలయం; జిల్లా పరిపాలనను క్షేత్రస్థాయిలో నడిపించే ప్రధానశక్తి కలెక్టరేట్; ఈ రెండింటి వెనుక నిలిచేది రెవెన్యూ యంత్రాంగమే. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల గడప దాటే మార్గం ఇదే. పౌరుడి జీవితం ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానమయ్యే ప్రతి దశలో రెవెన్యూ శాఖ ఉంటుంది. పుట్టుక నమోదులోనూ, మరణ ధ్రువీకరణలోనూ, కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల జారీలోనూ, వారసత్వ హక్కుల నిర్ధారణలోనూ ఈ శాఖ పాత్ర అనివార్యం. విద్య, ఉద్యోగం, సంక్

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ‘మహా’భారం
పాత
తెలంగాణ

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ‘మహా’భారం

మన తెలంగాణ/హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజ్యసభ ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ఎంత ఎత్తులో నిర్మించాలి, ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు సిఎంకు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టిఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, త

బెంగాల్ బిజెపిదే
పాత
తెలంగాణ

బెంగాల్ బిజెపిదే

న్యూ ఢిల్లీ: హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. అధికార తృణమూల్ 177187, భాజపా 95110 స్థానా ల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. టీఎంసీ 125140, భాజపా 146161 చోట్ల విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ సర్వే వెల్లడించింది. పీమార్క్ సర్వే మాత్రం తృణమూల్ 118138 స్థానాలు, భాజపా 150175 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా భాజపా వైపే మొగ్గు చూపాయి. భాజపాకు 150160 సీట్లు, తృణమూ ల్ కాంగ్రెస్‌కు 130140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో మరోసారి డీఎంకే.. ఏప్రిల్ 23న తమిళనాడులో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ మరోసారి సత్తా చాటబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనాలు వెలువడుతున్నాయి. ముక్కోణపు పోరులో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగించనుందని అంచనా వేశాయి. భాజపాతో కలిసి బరిలో దిగిన అన్నాడీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌పార్టీ టీవీకే మూ

ఉద్యోగులకు భట్టి భరోసా
పాత
తెలంగాణ

ఉద్యోగులకు భట్టి భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేశారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుణుగుణంగా ఈ ఏడాది మార్చి వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని వెయ్యి కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. గతేడాది అక్టోబర్ వరకు ఉన్న జిపిఎఫ్ క్లియర్ అక్టోబర్ 2025 వర

మెట్రో రైలు స్వాధీనం
పాత
తెలంగాణ

మెట్రో రైలు స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటి వరకు ఎల్ అండ్ టి ఆధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టి కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ బుధవారం స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఇరువురు మెట్రో బదిలీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఎల్ అండ్ టి ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఆపరేషన్స్, భవిష్యత్‌లో రెండోదశ మెట్రో పనుల్లో ఆ కంపెనీ భాగ స్వామ్యంపై వారిద్దరూ ప్రాథమికంగా చర్చించారు. వంద శాతం షేర్లు రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువ స్వాధీనం హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-Iను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టితో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి, ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధులు బుధవారం రాష్ట

గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత
పాత
తెలంగాణ

గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాలు 2025-26లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. విద్యాపరమైన నైపుణ్యం, విద్యార్థుల విజయానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 98.86 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఇది గతేడాది కంటే 0.78 శాతం ఎక్కువ. 84 విద్యాలయాల్లో 66 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. సిర్పూర్‌-1, కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన బి.అక్షయ 587 మార్కులు సాధించారు. 90 శాతం కంటే […] The post గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత appeared first on Navatelangana.

Advertisement