20671 వార్తలు


అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భోగాపురం ఎయిర్ పోర్టుని వేదికగా వాడుకున్నారని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శనివారం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం లో దేశ ప్రధాని ముందు కూడా అబద్ధాలు ఆడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చింది జగన్ హయాంలోనేనని, 2026లో ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తామని ఆనాడే జగన్ చెప్పారని అమర్నాథ్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందని విమర్శించారు. చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు తమకు లేవని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేసింది కొబ్బరికాయ కొట్టడం.. గుమ్మడికాయ కట్టడం మాత్రమేనని, దారినే పోయే వాళ్లు ఎవరైనా కొబ్బరికాయ కొడతారని, గుమ్మడికాయ కడతారని ఎద్దేవా చేశారు. మిగతా పనంతా చేసింది జగనేనని అమర్నాథ్ పేర్కొన్నారు.


హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నారు. ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలు నింపాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.

తిరుపతి: టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడంతో స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.



గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తున్న గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్ ఘోర తప్పిదానికి పాల్పడింది. నాప్కిన్పై అసంపూర్తిగా భారత మ్యాప్ను ముద్రించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత బాక్సర్ లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదరు రెస్టారెంట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లవ్లీనాతో పాటు పలువురు భారత అథ్లెట్లు రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్లారు. ఆ సమయంలో ‘మిస్టర్ సింగ్స్ ఇండియా’ అని అసంపూర్తిగా ఉన్న భారత మ్యాచ్ను లవ్లీనా గమనించారు. భారత మ్యాప్లో కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేకుండా ముద్రించారని పేర్కొన్నారు. ‘‘మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆ మ్యాప్లో ముద్రించలేదు. భారత్లోని ప్రతి భాగం ముఖ్యమైందే’’ అని లవ్లీనా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమెకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్రాలే కాదు.. ఆ మ్యాప్లో కశ్మీర్ కూడా అసంపూర్తిగా ఉందని తెలిపారు. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని రెస్టారెంట్ ప్రతినిధులను డిమాండ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ రెస్టారెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

లక్నో: సోషల్ మీడియాలో ఓ యువతిని ఎస్ఐ పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. అతడిపై ఫిర్యాదు చేయడంతో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో పాటు విడాకులు తీసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సత్యేంద్ర గౌతమ్ అనే ఎస్ఐ కాన్పూర్లోని సేన్ పాశ్చిమ్ పారా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. బిటెక్ చదివిన ఓ యువతి 2024లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని రూమ్కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో సదరు ఎస్ఐపై పిఎస్లో ఫిర్యాదు చేయడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమె శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు విడాకులు ఇస్తానని బెదిరించడంతోపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్ఐ తనని మళ్లీ చేసుకున్నాడని, ఇప్పుడు తనపై దాడి చేయడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేస











దేశవ్యాప్తంగా ఏకరీతి కోసం కేంద్ర ప్రభుత్వం 1987 మోడల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2002 నేషనల్ పబ్లిక్ హెల్త్ బిల్, 2009 నేషనల్ హెల్త్ బిల్ వంటి నమూనా చట్టాలను ప్రతిపాదించింది. ఈ చట్టాలు పారిశుధ్యం, నీటి సరఫరా, మార్కెట్లు, ఆహార భద్రత, సంక్రమణ వ్యాధుల నియంత్రణ వంటి అంశాలను ప్రస్తావించినప్పటికీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, కొత్త అంటువ్యాధులు, వాతావరణ మార్పుల ప్రభావం, పర్యావరణ కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేంత సమగ్రత వాటిలో లేదు. సాంప్రదాయ ప్రజారోగ్య చట్టాలు ప్రధానంగా బలవంతపు నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం వ్యక్తులపై కొన్ని పరిమితులు విధించవచ్చనే భావన దీనికి ఆధారం. ప్రజారోగ్యం అనేది కేవలం వ్యాధులకు చికిత్స అందించే వ్యవస్థ కాదు. సమాజం సమష్టి కృషి ద్వారా వ్యాధులను నివారించడం, ఆయుష్షును పెంచడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం అనే శాస్త్రం, కళ. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజారోగ్య చట్టం రాష్ట్రం, స్థానిక సంస్థలు, సమాజం కలిసి పనిచేసే విధానాన్ని, అధికారాలను, బాధ్యతలను నిర్దేశిస్తుంది. అదే సమయం లో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత

మన తెలంగాణ/మోత్కూర్ : మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మోత్కూర్, అడ్డగూడూర్, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలకు సంబంధించిన 31 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 551 దరఖాస్తులు అందినట్లు సీడీపీఓ నాజీ విలేకరులకు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 7 వరకు మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని, వాటి ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా వెంట తీసుకురావాలని తెలిపారు. నిర్ణీత గడువులో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని లేనిపక్షంలో కలిగే ఇబ్బందులకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీడీపీఓ నాజీ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విమర్శలు రావడం సహజం. కానీ విమర్శను దేశద్రోహంగా, నిరసనను శాంతిభద్రతల సమస్యగా, ప్రశ్నించే వారిని శత్రువులుగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్యాన్ని బల పరచదు, పైగా బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గడం కూడా ఇలాంటి వైఖరి వల్లే ప్రారంభమవుతుంది. యువత ఎందుకు ఆందోళన చెందుతోంది అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందా? ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉందా? పరీక్షల పారదర్శకతపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందా? పాలనా వ్యవస్థలో ప్రతిభకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం భావోద్వేగ రాజకీయాలతో సమస్యలు పరిష్కారం కావు. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలు ఎంత ముఖ్యమో, ప్రజల అసంతృప్తి అంతకంటే ముఖ్యమైన రాజకీయ సంకేతం. ముఖ్యంగా యువత వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తే దానిని కేవలం ఒక నిరసన కార్యక్రమంగా చూడలేం. అది సమాజంలో పేరుకుపోతున్న అసంతృప్తి, నిరాశ, భవిష్యత్తుపై ఆందోళనకు ప్రతిబింబం. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల నిజమైన బలం పోలీసు బలగాల్లో కాదు, ప్రజల

ముంబై: దులీప్ ట్రోఫీ 2026కు సన్నహాలు చేస్తోంది బిసిసిఐ. ఈ దేశవాళిలో తలపడనున్న సెంట్రల్ జోన్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు సారథి రజత్ పాటిధార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు యాజమాన్యం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఉప సారధిగా ఎంపికయ్యాడు. సారాంశ్ జైన్, అమన్ మోఖడె, జీషన్ అన్సారీ, కునాల్ ఛండేలా, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆర్యన్ జుయల్, ఆయూష్ పాండే, హర్ష్ దూడె, యాష్ ఠాకూర్ వంటి వారు జట్టులో స్థానం కలిపించారు. సౌరవ్ రావత్, మయాంక్ మిశ్రా, అమన్దీప్ ఖరె, భార్గవ్ మోరాయ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈనెల 23న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో ఐదు టెస్టు మ్యాచ్లు జరుగనున్నాయి. కాగా, ట్రోఫీలో నార్త్ ఈస్ట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్తోపాటు వెస్ట్ జోన్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సెంట్రల్ జోన్ జట్టు గతేడాది జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ జట్టును ఓడించి టైటిల్ గెలుకుంది. తొలిసారి ఛాంపియన్ నిలిచిన సెంట్రల్ జోన్ రజత్ పాటిధార్ సారథ్యం వహించి, 382 పరుగులతో రాణించి జట్టు గెలుపులో కీలక భూమికపోషించాడు