🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3769 వార్తలు

అమెరికా దిగ్బంధంతో ఇరాన్ చమురు వాణిజ్యానికి గట్టిదెబ్బ
పాత వార్త
తెలంగాణ

అమెరికా దిగ్బంధంతో ఇరాన్ చమురు వాణిజ్యానికి గట్టిదెబ్బ

అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో చాబహార్ పోర్టు సమీపంలో నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు, సముద్ర నిఘా సంస్థల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్‌కు వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో ఉన్న చాబహార్ పోర్టు అమెరికా దిగ్బంధ రేఖకు సమీపంలో ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత వారం చివర్లో అక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు భారీ సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన అణు వ్యతిరేక సంస్థ, యునైటెడ్‌అగైనెస్ట్‌అణు ఇరాన్, సముద్ర గూఢచారి సంస్థ విండ్‌వార్డ్‌తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గత వారం అమెరికా నౌకాదళం అడ్డుకున్న రెండు భారీ చమురు నౌకలను మళ్లించినట్లు కూడా అమెరికా నేవీ వెల్లడించింది.చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ వోర్‌టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రవాణాలో లేదా సముద్రంలో నిల్వగా ఉన్న ఇరాన్ ముడి చమురు పరిమాణం సుమారు 15.5 కోట్ల బ్యారెల్స్‌గా ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇర

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 1
నయా ఫాసిజం-జాతీయత
పాత
తెలంగాణ

నయా ఫాసిజం-జాతీయత

ఇండియాలో నయా ఫాసిజం పైచేయి సాధిస్తున్న క్రమంలోనే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు బయటకు వ్యక్తమవుతూ వచ్చాయి. నిస్సహాయంగా ఉన్న ఒక మైనారిటీ తరగతి ప్రజలను ‘పరాయివాళ్లు’గా వేరు చేయడం, వారి పట్ల మెజారిటీ ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ అంగాల ద్వారా, నయా ఫాసిస్టు గూండాల ద్వారా ఆ మైనార్టీలను అణచివేయ డానికి పూనుకోవడం, తమను విమ ర్శించేవారిని, రాజకీయ ప్రత్యర్ధులను, మేధావులను, కళాకారులను, తక్కినవారిని అణగదొక్కడం అటువంటి లక్షణాలే. మరోవైపు బాహాటంగానే […] The post నయా ఫాసిజం-జాతీయత appeared first on Navatelangana.

ముందు నుయ్యి, వెనక గొయ్యి – దిక్కుతోచని ట్రంప్‌
పాత
తెలంగాణ

ముందు నుయ్యి, వెనక గొయ్యి – దిక్కుతోచని ట్రంప్‌

అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం మొదలై నేటికి రెండునెలలు దాటిపోతోంది. కాల్పుల విరమణ, పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంలో శాంతి చర్చల ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అవి కొలిక్కి రావటం అంత తేలిగ్గా జరిగేట్లు లేదు. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు, మూడు దేశాలకు లేక గల్ఫ్‌ దేశాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలు ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలలో కూరుకుపోయి, ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ఫిభ్రవరి 28న […] The post ముందు నుయ్యి, వెనక గొయ్యి – దిక్కుతోచని ట్రంప్‌ appeared first on Navatelangana.

రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ విక్టరీ: పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్
పాత
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటిన సెలబ్రెటీలు.. చిత్తుగా ఓడిన సీనియర్ నేతలు
పాత
పంజాబ్‌కు రాజస్థాన్ బ్రేక్
పాత
తెలంగాణ

పంజాబ్‌కు రాజస్థాన్ బ్రేక్

వరుస విజయాలతో ఐపిఎల్ సీజన్ 2026లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు జట్టుకు శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ 16 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఇక యశస్వి 27 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా, శుభమ్ దూబెలు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెరీరా 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేశాడు. శుభం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను స్టోయినిస్ 22 బంతుల్లో 62 (నాటౌట్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59) అండగా నిలిచారు.

ప్రధాని మోదీ, అమిత్ షా స్ఫూర్తితోనే బీజేపీలో చేరా: స్వాతి మాలీవాల్
పాత
తెలంగాణ

ప్రధాని మోదీ, అమిత్ షా స్ఫూర్తితోనే బీజేపీలో చేరా: స్వాతి మాలీవాల్

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడం పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశం కోసం చేస్తున్న పనుల నుంచే తనకు ప్రేరణ లభించిందని తెలిపారు. 2024లో ఆప్ నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఏర్పడిన మాలీవాల్, ఇటీవల బీజేపీలో విలీనమైన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యుల బృందంలో భాగమయ్యారు. మంగళవారం ఆమె ఢిల్లీలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్‌హోత్రా, ఎంపీ యోగేందర్‌చందోలియా, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ సమక్షంలో ఆమెను అధికారికంగా పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా దేశం కోసం చేస్తున్న చారిత్రాత్మక పనులు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వారినుంచి స్ఫూర్తి పొందే నేను బీజేపీలో చేరాను అని స్వాతి మాలీవాల్ మీడియాతో చెప్పారు.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో కూడా బీజేపీనుంచి తనకు మంచి సహకారం లభించిందని మాలీవాల్ తెలిపారు. ఎవరి బలవంతం వల్ల నేను ఈ పార్టీలో చేరలేదు. జరుగుతున్న ప్రతి ప

పోలీసుల అదుపులో రూ. 25 కోట్లతో పరారైన జ్యోతి రెడ్డి
పాత
తెలంగాణ

పోలీసుల అదుపులో రూ. 25 కోట్లతో పరారైన జ్యోతి రెడ్డి

వనస్థలిపురంలో అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైన రియల్ చీటర్ బద్దం జ్యోతిరెడ్డి (40) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలానగర్‌లో నివసించే ఆమె ప్రజలను నమ్మించి తన ఇంటిని సైతం ఇద్ద రికి అమ్మినట్లు (డబుల్ రిజిస్ట్రేషన్) ఆరోపణలు రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బద్దం జ్యోతిరెడ్డిని అరెస్ట్‌ను గోప్యంగా ఉంచు తున్నారు. నగర శివారు ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వన స్థలిపురం డివిజన్ కమలానగర్‌లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో పలువురు రియల్టర్లు, రాజకీయనాయకులతో పరిచయాలు పెంచుకుంది. పలువురి వద్ద 10 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి అప్పులు చేసింది. ముందుగా వడ్డీ క్రమం తప్పకుండా ఇవ్వడంతో చాలా మంది అప్పులు ఇచ్చారు. దాదాపు రూ.25 కోట్లకు పైగానే వసూలు చేసి పరారైంది. అదే క్రమంలో రూ.3 కోట్లు అప్పుగా తీసుకున్న సుజిత్‌‌ అనే వ్యక్తికి కమలానగర్‌లోని తన సొంత ఇంటిని సేల్‌‌ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికి కూడా సేల్‌డీ

పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలు: ఎన్ఐఏను రంగంలోకి దించిన ఈసీ
పాత
లుక్‌ టెస్ట్‌ ఓకే
పాత
తెలంగాణ

లుక్‌ టెస్ట్‌ ఓకే

చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవు తున్నారు. డైరెక్టర్‌ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ టెస్ట్‌ విజయవంతంగా పూర్తయింది. లుక్‌ టెస్ట్‌ చూస్తుంటే మెగాస్టార్‌ పవర్‌ఫుల్‌, స్ట్రైకింగ్‌ లుక్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవు తోంది. ఇప్పటికే విడుదలైన హార్డ్‌ హిట్టింగ్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు పోస్టర్‌ […] The post లుక్‌ టెస్ట్‌ ఓకే appeared first on Navatelangana.

నాగార్జున 100వ సినిమాలో టబు
పాత
తెలంగాణ

నాగార్జున 100వ సినిమాలో టబు

అక్కినేని నాగార్జున దిగ్విజయంగా 99 సినిమాలను పూర్తి చేసుకుని, 100వ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు.ఆయన నటించబోయే ఈ మైల్‌ స్టోన్‌ ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపు దిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్‌ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీ కరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. […] The post నాగార్జున 100వ సినిమాలో టబు appeared first on Navatelangana.

ట్రైలర్‌తో ‘కర’పై అంచనాలు రెట్టింపు
పాత
తెలంగాణ

ట్రైలర్‌తో ‘కర’పై అంచనాలు రెట్టింపు

ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ బ్యానర్‌ మీద సిహెచ్‌ సతీష్‌ కుమార్‌, రాజేష్‌ కుమార్‌ బొబ్బర రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు […] The post ట్రైలర్‌తో ‘కర’పై అంచనాలు రెట్టింపు appeared first on Navatelangana.

తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు
పాత
తెలంగాణ

తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు

హీరో సుమంత్‌ ప్రభాస్‌ నటించిన కొత్త చిత్రం ‘గోదారి గట్టుపైన’. నూతన దర్శకుడు సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్‌ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ,’ఈ ట్రైలర్‌లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్‌ అయ్యే […] The post తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు appeared first on Navatelangana.

గుజరాత్ మున్సిపోల్స్‌లో బిజెపి క్లీన్‌స్వీప్
పాత
తెలంగాణ

గుజరాత్ మున్సిపోల్స్‌లో బిజెపి క్లీన్‌స్వీప్

గాంధీనగర్ : గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బిజెపి సత్తా చాటింది. 15 మున్సిపల్ కార్పొరేషన్లను క్వీన్ స్వీప్ చేసింది. మంగళవారంనాడు వెలువడిన ఫలితాలు మరోసారి రాష్ట్రంలో కాషాయ పార్టీ పట్టును నిరూపించింది. మోర్బీ, పోరుబందర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్క స్థానం కూడా విపక్షాలకు దక్కకుండా వాటిల్లోని 52 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇటీవల 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండింటి టర్మ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. తాజా ఫలితాల్లో అధికార బిజెపి ఆహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, గాంధీదామ్, సురేంద్రనగర్, మెహ్‌సానా, ఆనంద్, నదియాద్, నవ్‌సారి, వాపి కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. ఆహ్మదాబాద్‌లో 192 స్థానాలకు గాను బిజెపి 160 దక్కించుకోగా, కాంగ్రెస్ మిగతా 32 స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఈ సారి మాత్రం సున్నాకు పరిమితమైంది. సూరత్ 120కి బిజెపి 115 గెలుచుకోగా, కాంగ్రెస్ ఒకటి, ఆప్ నాలుగింట విజయం సాధించాయి. రాజ్‌కోట్‌లో 72 స్థానాలకు గాను బిజెపి 65

మండే ఎండ‌ల్లో
పాత
కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..స్క్రాప్ గోడౌన్ లో మంటలు
పాత
పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది అఫ్రిదీ హతం
పాత
తెలంగాణ

పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది అఫ్రిదీ హతం

ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అఫ్రిదీని ఖైబర్ ఫఖ్తున్ఖా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇస్లామాబాద్‌కు 250 కిమీ దూరంలో ఖైబర్ రీజియన్ లోని లండికోటల్ పద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అఫ్రిదీ ప్రాణాలు కోల్పోయాడని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు. ఖైబర్ పంక్తున్‌ఖ్వా లో ఉగ్రవాద గ్రూపుల చర్యలకు, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌లో అఫ్రిదీ కీలక పాత్ర వహించేవాడు.ఖైబర్ లోని జఖాఖెల్ గిరిజన తెగలకు చెందిన అఫ్రిదీ ప్రఖ్యాత మత విద్యావేత్తగా పేరు పొందాడు. అహ్లేహదిత్ (సలాఫీ) స్కూల్ ఆఫ్ థాట్‌కు చెందిన విద్యావేత్త.

మే మొదటివారంలో భారత్ కు  చేరుకోనున్న.. ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్
పాత
బీపీ కంట్రోల్‌ ఎలా?
పాత
పటియాలా రైల్వేట్రాక్ పై పేలుడు.. ఒకరు మృతి
పాత
తెలంగాణ

పటియాలా రైల్వేట్రాక్ పై పేలుడు.. ఒకరు మృతి

పంజాబ్ లోని పటియాలలో శంభు ప్రాంతంలో సోమవారం రాత్రి శంభుఅంబాల రైల్వే ట్రాక్ సమీపంలో సంభవించిన పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు ప్రయత్నించిన వ్యక్తి ఆ సంఘటనలోనే ప్రాణాలు కోల్పోగా, పేలుడు ధాటికి ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. బొతోనియా గ్రామానికి సమీపాన గల ఈ శంభుఅంబాల రైల్ ట్రాక్‌ను సరకు రవాణాకు వినియోగిస్తుంటారు. ఈ పేలుడు సంఘటనలో ప్రమేయం ఉందన్న అనుమానంతో నలుగురిని అరెస్టు చేశారు. మృతుడు జాగృప్ సింగ్ తరన్‌తరన్ జిల్లా పంజ్‌వార్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్టు పటియాలా ఎస్‌ఎస్‌పి వరుణ్ శర్మ వెల్లడించారు. పేలుడు ప్రదేశాన్ని సందర్శించిన స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వే) శశిప్రభా ద్వివేది సిసిటివీ ఫుటేజీ ఆధారంగా వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు జాగృప్ తన మోటార్ సైకిల్‌ను అమృత్‌సర్‌లో పార్కింగ్ చేసినట్టు గుర్తించామన్నారు. అరెస్టయిన వారిలో మన్సా నివాసితులైన ప్రదీప్ సింగ్ ఖల్సా, కుల్విందర్ సింగ్,తరన్ తరన్‌కు చెందిన సత్నాం సింగ్, గురుప్రీత్ సింగ్ ఉన్నారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుల వర్గం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా బిల్లుపై వెనక్కి తగ్గం: ప్రధాని మోడీ
పాత
తెలంగాణ

ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా బిల్లుపై వెనక్కి తగ్గం: ప్రధాని మోడీ

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వెనక్కి తగ్గమని, పోరాడుతూనే ఉంటామని అన్నారు. మంగళవారంనాడిక్కడ నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఎంతో కృషి చేశామని, అయితే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ లాంటి విపక్షాలు నీచ రాజకీయాలు చేసి ఆమోదం పొందకుండా కుట్రలు చేశాయన్నారు. మహిళలు చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీల్లోకి రావడం వారికి ఇష్టం లేదని, కొన్ని దశాబ్దాలుగా వాళ్లు చేస్తున్నది కూడా ఇదేనని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ అనే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టామని, అది విజయవంతం అయ్యేందుకు మహిళా మూర్తుల ఆశీర్వాదాలు తీసుకునేందుకే తాను వారణాసి వచ్చినట్లు మోడీ పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం తెచ్చింది కాదని, తాము ఇందులో ఎలాంటి రాజకీయ లబ్ధిని ఆశించలేదన్నారు. పేదలు, సాధారణ కుటుంబాలకు చెందిన మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు.

బాబి సినిమా కోసం చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి..
పాత
తెలంగాణ

బాబి సినిమా కోసం చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి..

మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ‘చిరుబాబీ2’ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ భారీ అంచనాలను సృష్టించింది. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు పోస్టర్ హింట్ ఇచ్చింది. ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ కొల్లి, ఈసారి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

ఏపీలో మూడు పెట్రోల్‌ బంకులు సీజ్‌...
పాత
హై కోర్టును ఆశ్రయించిన సినీనటి అషురెడ్డి
పాత
తెలంగాణ

హై కోర్టును ఆశ్రయించిన సినీనటి అషురెడ్డి

ఎన్‌ఆర్‌ఐ ధర్మేంద్ర, సినీనటి అషురెడ్డిల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ధర్మేంద్రతో రాజీకుదుర్చుకునేందుకు అషురెడ్డి ప్రయత్నించడం చర్చనీయాంశం అయింది. బిగ్‌బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి వివాహం చేసుకుంటానని, తనను నమ్మించి రూ.9.83కోట్లు తీసుకుని మోసం చేసిందని షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనను, తన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ కేసును కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అషురెడ్డి పంపిన

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA