
4147 వార్తలు

ఒక వైపున నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఓటమి, మరో వైపున అయిదు రాష్ట్రాల ఎన్నికల పోరాటం,దాంట్లో మళ్లీ సర్ తతంగాలు,అంతర్జాతీయంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ యుద్ధం ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది మాత్రం మత రాజ కీయాలు చేయడంలో మునిగి తేలుతున్నారు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే ఏదో జరిగిపోయిందనీ, మత విశ్వాసాలు దెబ్బతీశారనీ మనోభావాలు దెబ్బతి న్నాయని నిరంతర ఫిర్యాదులు తీసుకొచ్చి భావావరణాన్ని ఉద్రిక్త పర్చడం మతతత్వ శక్తుల ఎత్తుగడగా తయారైంది. పోస్ట్ట్రూత్ అనబడే […] The post విశ్వాసాలపై వివాదాలు,మతాలతో రాజకీయాలు appeared first on Navatelangana.
ముఖం మీద ఉమ్మేసినా, తుడుచుకుని పోయే సిగ్గుశరం లేని రకం ఇది. బండ బూతులు తిట్టినా నిండు కుండలా కదలని మెదలని జీ హుజూర్ బాపతు. ఇంకా ఏం అనాలి? అంత బానిసగా, చవటగా మారారా! సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని సైతం సవాల్ చేసి గడగడలాడించిన వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్ మొదలైన వీరులు పుట్టిన నేలను ఏలుతున్న నాయకుడివేనా నువ్వు! నీ పిరికిపంద చర్యలకు, నూట నలభై ఆరు కోట్ల మంది అవమాన […] The post దేశానికి అవమానం appeared first on Navatelangana.







రాష్ట్రంలో కొన్ని రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు ఉదయం ఎండ, సాయంకాలం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. ఎండ తీవ్రత పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వివరించింది.ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యపేట, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 27న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్లో 40.4 డిగ్రీల ఉష్ఱోగ్రతలు నమోదు కాగా ఖమ్మంలో 39.4, రామగుండం, హనుమకొండలో 39, ఆదిలాబాద్లో 37.8, హైదరాబాద్ 37.4, మెదక్లో 37 డిగ్రీలుగా ఉంది.

శుక్రవారం అర్థరాత్రి ‘మహా రాజకీయం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నట్లుండి శివసేన (యుబిటి) నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు. ఇది అత్యంత కీలక రహస్య భేటీ అయింది. దీనిపై రాజకీయ వర్గాలలో సంచలనాత్మక కథనాలు వెలువడ్డాయి. ముంబైలోని మాత్రోశ్రీ నివాసానికి వెళ్లి సిఎం ఈ నాయకుడితో సమావేశం అయ్యారు. అయితే బిజెపి నేత అయిన ఫడ్నవిస్ ఈ వార్తలను ఖండించారు. ఇటువంటి ఎటువంటి ఆంతరంగిక సమావేశం జరగలేదని శనివారం వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికలు కొన్ని జరుగనున్న నేపథ్యంలో ఇరువురు కీలక విషయాలపై చర్చించుకున్నారని సామాజిక మాధ్యమాలు విశ్లేషించాయి. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, శివసేనల మధ్య ఇటీవలికాలంలో దూరం పెరిగింది. పైగా ఉద్ధవ్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల ఇండియా కూటమికి చేరువ అయ్యారు. అయితే తాను ఉద్ధవ్ను కలుసుకున్నాననే వార్త సరికాదని, అయినా ఆయనను రహస్యంగా కలుసుకోవల్సిన అవసరం లేదని ఫడ్నవిస్ తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు వార్తలతో రాజకీయ సమస్యలకు యత్నిస్తున్నారని, అటువంటి వారిపై తగు రీతిలో చర్యలు ఉంటాయని ఫడ్నవిస్ హెచ్చరించార


ఆప్ నుంచి బిజెపిలోనికి పార్టీ ఫిరాయించిన ఎంపి రాఘవ ఛద్దాకు సోషల్ మీడియా పరంగా షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ఇతర ఎంపీలను కూడా తీసుకుని బిజెపిలోకి వెళ్లిన మరుసటి రోజే ఈ యువ ఎంపి ఇన్స్టా ఫాలోయర్స్ 24 గంటల్లోనే పదిలక్షల మేర తగ్గారు. దీనికి కారణం ఎప్పటికప్పుడు అందరి సోషల్ మీడియా పోస్టింగ్లను విశేషంగా చూసే నవయువ జనం ఈ ఎంపి రాజకీయ చేష్టను ఇష్టపడలేదని నిర్థారణ అయింది. సభలలో తరచూ రాజకీయ విలువల గురించి చెపుతూ వచ్చే రాఘవకు ఈ యువతరం అయిన జన్ జడ్ నుంచి ఇంతకాలం విశేష స్పందన ఉంది. పార్టీ మారకముందు ఆయనకు ఉన్న ఇన్స్టా అభిమానుల సంఖ్య 14.6 మిలియన్లు, ఇది శుక్రవారం మధ్యాహ్నం లెక్క. అయితే ఇప్పుడు శనివారం ఈ ఫాలోవర్స్ సంఖ్యాబలం 13.5 మిలియన్లకు పడిపోయింది. రాఘవ చర్యను యువతరం ఇష్టపడలేదని ఇప్పటి పరిణామంతో వెల్లడైంది. ఆప్ నుంచి బిజెపిలోనికి దూకిన ఈ ఎంపికి తగ్గిన పాలోవర్స్ విషయంపై తరచూ సామాజిక మాధ్యమంలో ఉండే ఎన్సిపి ఎస్పి అధికార ప్రతినిధి అనిష్ గావాన్డే స్పందించారు. ఇంటర్నెట్ రెండంచుల పదునైన కత్తి, రాత్రికి రాత్రి ఎవరిని అయినా హీరోను చేస్తుంది. అవసరం అయితే అదే వ్యక్తిని మరుసటి రోజుకు జీరోగా కిందపడేస్తుంద


ఐపిఎల్ 2026లో భాగంగా మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. తీసుకున్న హైదరాబాద్. దీంతో మొదట రాజస్తాన్ బ్యాటింగ్కు దిగనుంది. గత మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఇక, స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తిరిగి రావడంతో.. హైదరాబాద్ బౌలింగ్ మరింత బలంగా మారనుంది. వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్.. మరోసారి రాజస్థాన్ ను ఓడించి తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.జట్ల వివరాలు:సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, నాంద్రే బర్


తూర్పు పసిఫిక్ సముద్రంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న బోటుపై దాడి చేసి ఇద్దరిని హతమార్చినట్టు అమెరికా మిలిటరీ వెల్లడించింది. లాటిన్ అమెరికా సాగర జలాల్లో డ్రగ్ రవాణా నౌకలను పేల్చివేయడం గత సెప్టెంబర్ నుంచి ట్రంప్ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే రవాణా చేస్తున్న నౌకలేమిటో మిలిటరీ ఎలాంటి ఆధారాలు చెప్పడం లేదు. అమెరికాకు డ్రగ్ వెల్లువను అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 9న రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి రాష్ట్ర నాయకులు సన్నాహలు చేపట్టనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా మూడో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. కాగా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను ప్రధాని (పిఎంవో) కార్యాలయం అధికారికంగా ప్రకటించలేదు. అయితే బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం ప్రధాని రాక గురించి చెబుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయనున్నారని, ఎంఎంటిఎస్ మలి దశను ప్రారంభిస్తారని, ఇంకా బీబీ నగర్లోని ఏయిమ్స్ను ప్రారంభిస్తారని, రవాణా కనెక్టివిటీ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల దృష్టా తాము భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ప్రజలను, ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం లేని నూట్రల్స్ను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అన్ని జి

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ అర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయి ఎంగిడి కిందపడిపోయాడు. బాడీవెయిట్ మొత్తం మెడ మీద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఫిజియో వెళ్లి పరిశీలించాడు. ఎంగిడి ఫిజియోకు స్పందిస్తున్నట్లు కనిపించినా.. అస్సలు కదల లేదు. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ తమ సహచరుడిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈక్రమంలో మైదానం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. వెంటనే అంబులెన్స్ ను మైదానంలోకి తీసుకొచ్చి ఎంగిడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.


పెద్ద అంబర్పేట్లో పనిచేసే ఓ జూనియర్ అసిస్టెంట్ను అబ్ధుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు డిప్యూటేషన్పై పంపిస్తే ఆయన అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్ధుల్లాపూర్మెట్లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్ కు సహయంగా ఉంటారని ఉన్నతాధికారులు అక్కడకు డిప్యూటేషన్ పంపిస్తే నిషేధిత జాబితాలో ఉన్న భూములను, ప్రభుత్వ భూములకు బై నెంబర్లు వేసి ఈ జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నల్లగొండలోని ఆర్ఓఓబి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే హవా ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ల సమయంలో వారు చెప్పినంత ఇవ్వాల్సిందేనని ప్రైవేటు వ్యక్తులు డిమాండ్ చేస్తుండడంతో ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ జిల్లా డిఆర్ ఖమ్మం జిల్లాకు కూడా ఇన్చార్జీగా ఉండడం, ఆయనకు ప్రైవేటు వ్యవహారాలు ఎక్కువ కావడంతో సబ్ రిజిస్ట్రార్లు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ ఏడాది నాలుగు నెలల్లో 260 మంది మావోయిస్టులు 238 ఆయుధాలతో లొంగిపోయారని డిజిపి వెల్లడించారు. ఈ క్రమంలో 2024 నుంచి ఇప్పటి వరకు వివిధ క్యాడర్లకు చెందిన 818 మంది మావోయిస్టులు, 334 ఆయుధాలతో లొంగిపోయారని రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద లొంగుబాటు శకంగా డిజిపి చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన డికెఎస్జడ్సి సభ్యుడు హేమ్లా ఐతు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కీలక నేతగా ఉన్నారని, పొడియం లచ్చు అలియస్ మనోజ్ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో 9వ ప్లాటూన్ కమాండర్గా పనిచేస్తున్నాడని, సుమారు 17 సంవత్సరాలుగా అజ్ఞీత జీవితం గడుపుతున్నట్లు డిజిపి వివరించారు.