
3542 వార్తలు
నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు. The post కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో బర్గి డ్యామ్లో 31 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. పరిమితికి మించిన ప్రయాణికులు, బలమైన గాలులే ప్రమాదానికి కారణమని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. The post మధ్యప్రదేశ్లో పడవ బోల్తా.. తొమ్మిదిమంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్లో గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం అమాంతం పెంచేసింది. ఒక్కో వాణిజ్య సిలిండర్పై రూ.993 పెంచింది. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.3,071కి చేరింది. గృహవినియోగ సిలిండర్ (ఎల్పీజీ) ధరలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం పేర్కొంది. The post భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్-2026 బిల్లు’కు గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. మేడే సందర్భంగా ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ బిల్లు ద్వారా డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయడానికి మార్గం సుగమం కానుంది. రాబోయే 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన […] The post గిగ్ వర్కర్లకు శుభవార్త.. appeared first on Navatelangana.

ముడిచమురు ఉత్పత్తి చేసే 12 దేశాల కూటమి (ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్)లో సభ్యదేశంగా ఉత్పత్తి, సరఫరా తదితర వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఆ కూటమినుంచి బయటపడడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం మే 1 నుంచి అమలులోకి వస్తుంది. దీనివల్ల ముడిచమురు ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. 1960లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ఈ ‘ఒపెక్’ను నెలకొల్పాయి. అల్జీరియా, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా తదితర దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాలతోపాటు రష్యా వంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కలిస్తే దానిని ‘ఒపెక్ +’ అని పిలుస్తారు. ప్రపంచ మార్కెట్లో చమురు వాణిజ్యం 50 శాతం ఈ ఒపెక్ నియంత్రణలోనే ఉంటోంది. చమురు మార్కెట్లో ధరల స్థిరీకరణను కాపాడడం, సభ్యదేశాలకు స్థిరమైన ఆదాయం అందించడం ఈ ఒపెక్ లక్షం. ఒపెక్ కూటమిలో ఉంటున్నందున యుఎఇ చమురు ఉత్పత్తిపైన, సరఫరాపైన పరిమితులు భరించవలసి వస్తోంద

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందే లా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ దేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతారని సిఎం అన్నారు. విద్యా శాఖతో పాటు బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ ల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువా రం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గతం లో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్మెంట్, సరఫ రా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవని వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తీసుకువచ్చామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. గతంలో దుస్తులు, నో టు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ఇతర సామ గ్రి సరఫరాకు సంబంధించి ఏ శాఖకు ఆ శాఖ చేపట్టడంతో అవకతవకలకు ఆస్కా రం ఉండేదన్నారు. అ టువంటి అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సి ఎం స్పష్టం ఉండాలని అధికారులను సి ఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యతతో పా టు సకాలంలో అందడంపైనా ప్రత్యేక

ఉచితాలు సమాజానికి శాపమా... అనే ప్రశ్న ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చర్చగా మారింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సంక్షేమం కోసం పాలన చేయడం. కానీ ఆ సంక్షేమం అంటే ఏమిటి? అది తక్షణ ఉపశమనా లేక దీర్ఘకాల అభివృద్ధా? ఈ రెండు మధ్య ఉన్న సున్నితమైన తేడాను గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం స్వయం గా దారితప్పే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి కూడా అదే. దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉచితాలు అనే పదం రాజకీయాల్లో ప్రధాన ఆయుధంగా మారింది. ప్రతి పార్టీ కూడా ప్రజలను ఆకర్షించడానికి కొత్త కొత్త పథకాల పేరుతో ఉచితాలు ప్రకటిస్తోంది. ఉచిత విద్యుత్, ఉచిత డబ్బు పంపిణీ, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం వంటి అనేక పథకాలు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఉచితాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? నిజంగా ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయా? లేక ఓట్లు సాధించడానికి ఒక రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతున్నాయి. ఉచితాలు ఇవ్వడం అంటే తప్పు అని ఒకే పదంతో చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రభుత్వ జోక్యం అవసరం అవుతుంది. పేదరికం, ఆకలి, ఆరోగ్య సమస్యలు, వ

ప్రపంచంలోనే కీలక ఆర్థికశక్తిగా భారత్ ఎదుగుతోందని, అతిపెద్ద ఆర్థికవ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ నరేంద్ర మోడీ ప్రభు త్వం చేస్తున్న ప్రచారాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తేల్చిచెప్పింది. ఐఎంఎఫ్ తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్) ప్రకారం, ప్రపంచ జిడిపి ర్యాంకింగ్స్లో భారత్ ఆరవ స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు నాల్గవ స్థానంలో ఉండగా, మరో రెండు మూడేళ్లలో మూడవ స్థానానికి చేరబోతున్నామని, 2047 నాటికీ మొదటి స్థానానికి చేరుకోగలమని అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంచనాలు తలకిందులై భారత్ ఆరవ స్థానంకు దిగజారింది. అదే సమయంలో తాజా కాగ్ నివేదిక భారత ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇటువంటి కీలక ఆర్థిక పరిణామాలపై ప్రభుత్వం మౌనం వహిస్తుండటం గమనిస్తే ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నాలే స్పష్టం అవుతున్నాయి. ప్రస్తుత యుఎస్ డాలర్లలో నామమాత్రపు జిడిపిపరంగా జపాన్, యుకె భారత్ను అధిగమించాయి. అయితే, 2026 నాటికి, భారత ఆర్థిక వ్యవస్థ విలువ అంతకుముందు సంవత్సరం ఉన్న $

కార్మికులారా ఏకంకండి! పోరాడండి! పోరాడితే పోయేదేమీ లేదు! బానిస సంకెళ్లు తప్పా!! ఈ నినాదం 180 సంవత్సరాల క్రితం కార్మికులు వివిధ పరిశ్రమలలో వారు చేస్తున్న పని పరిస్థితులపైన, జీవన పని విధానంపైన, వారు రోజువారీగా చేస్తున్న పని గంటలు.. పొందుతున్న వేతనాలు.. అందుతున్న సౌకర్యాలపై లోతు గా పరిశీలించి కార్మికులను సంఘటితపరచాల్సిన అవసరం ఉందని.. అందుకు రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్ మార్క్, ఫెడరిక్ ఎంగిల్స్ ఉద్బోధించారు. అటు తర్వాత 1886లో చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిదిగంటల పని దినంకోసం ఉద్యమించారు. ఈ ఉద్యమమే అన్ని పట్టణాలకు మహాప్రళయంగా విస్తరించింది.. 8 గంటల పని దినం కోసం జరిగిన పోరాటంలో కార్మికులు తుపాకీ గుళ్లకు బలైనారు. రక్తతర్పణం చేసినారు.. వారికి సంఘీభావంగా ప్రపంచంలోని వివిధ పారిశ్రామిక నగరాలలో ప్రదర్శనలు జరిగినవి. వారికి సంఘీభావంగా ఎనిమిదిగంటల పని దినం కోసం మే 1న కార్మిక పోరాటాల సంఘీభావ దినం జరుపుకోవాలని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య పిలుపునిచ్చింది. నాటి నుండి మే డేను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు. మే డే అంటేనే కార్మికుల చెమట, త్యాగం, పోరాటం, ఐక్యతకు ప్రతీక. 1886లో 8 గంట

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన నేపథ్యం లో, ఇరాన్ కొత్త ఆయుధం గురించి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆయుధం ప్రయోగిస్తే శ త్రు దేశాల బలగాలకు హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చు అంటూ ఇరాన్ సంచలన వ్యా ఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, ఇ రాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ ష హ్రామ్ ఇరానీ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రతిగా అమెరి కా ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్ అణు కా ర్యక్రమంపై చర్చలు వాయిదా వేయాలని టెహ్రా న్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ట్రంప్ తి రస్కరించిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా నౌకాదళ నిర్బంధాన్ని కొనసాగించాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. రాష్ట్ర నియంత్రిత ప్రెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, అతిగా భయపెట్టే కొత్త ఆయుధాన్ని శత్రు బలగాలు త్వరలోనే ఎదుర్కొంటాయి అని హెచ్చరించారు. ఆ ఆయుధం ఇప్పటికే వారి పక్కన ఉంది. అది చూసి వారికి హార్ట్ ఎటాక్ రాకూడదని

న్యూఢిల్లీ ః నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టుడేస్ చాణక్య సంస్థ తన ఎగ్జిట్ పోల్ను గురువారం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఇందులో అత్యున్నత స్థాయి రాజకీయ వేడి రగులుకున్న పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతాపార్టీకే విజయావకాశాలు ఉన్నాయని టుడేస్ చాణక్య తెలిపింది. ఈ రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఇక్కడ 294 స్థానాలలో బిజెపికి 192కు పైగా స్థానాలు రావచ్చునని ఈ సంస్థ అంచనా వేసింది. కాగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూటమికి ఈసారి 100కు పైగా స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇతరులకు కేవలం సున్నా నుంచి రెండు సీట్లు దక్కే వీలుంది. ఈ విధంగా చూస్తే ఈ రా ష్ట్రంలో వామపక్షాల ప్రాబల్యం మరింత దిగజారిన సంకేతా లు వెలువడ్డాయి. ఇంతకు ముందటితో పోలిస్తే బిజెపికి 3 శాతం అధికంగా అంటే 48 శాతం ఓట్లు పోలవుతాయని తెలిపారు. టిఎంసికి 38 శాతం, ఇతరులకు 14 శాతం ఓటింగ్ ఉందని తెలిపారు. టుడేస్ చాణక్య పబ్లిక్ ఒపినియన్ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల నిర్వహణలో ఉంది. తమిళనాడులో అదికార డిఎంకెదే తిరిగి గెలుపు ఇతర పోల్ సంస్థల

మన తెలంగాణ/హైదరాబాద్: పసిపిల్లల అక్రమ రవాణా ముఠాను గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా నాయకుడు మురుగన్ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశా రు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ ముఠా పసిపిల్లల విక్రయాలకు సంబంధించి సమాచారంతో గుజరాత్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇలా ఉండగా ఆదిలాబాద్లో గత సంవత్సరం ఇటుకల పరిశ్రమలో కార్మికుడిగా పని చేసిన మురుగన్, ఏడాదిలోనే పిల్లల అక్రమ రవాణా ముఠాను ఏర్పాటు చేసి కీలకంగా మారాడు. పిల్లల విక్రయానికి సంబంధించి గత సంవత్స రం హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ప రిధిలోని నమోదైన ఒక కేసులో మురుగన్ పేరు బయటపడింది. ఇదే కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తరువాత జులైలో విడుదలైన మురుగన్ దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో మురుగన్తో పాటు ఆ ముఠాలో సభ్యులుగా ఉన్న కా సారపు తిరుపతి, కాసారపు మల్లయ్యలను గుజరాత్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని విచారించగా ముఠాలో మరి కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరో వైపు మురుగన్ భార్య కృ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గర్భవిచ్ఛిత్తి చట్టాల ను సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. ఈ చట్టాలను సవరించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి సూ ర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఒక 15 సంవత్సరాల బాలిక అ త్యాచారానికి గురై, ఆమె 30 వారాల గర్భం విచ్ఛిత్తికి అంతకు ముందు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు. ఇ న్నినెలల గర్భ విచ్ఛిత్తి వైద్యపరంగా సరికాదని దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్కు దిగింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కకు పెట్టాలని కోరింది. దీనిపై అత్యున్నత ధర్మాసనం స్పం దించింది. ఎయిమ్స్ పిటిషన్ అనుచితం అని పేర్కొంది బాలిక ఓ వైపు అవాంఛనీయ గర్భం మోయడం, విచారణపరమైన జాప్యంతో తలెత్తే సమస్యలను కూడా ఎదుర్కోవల్సి రావడం బాధాకరం అవుతుందని తెలిపారు. అత్యాచారాలు ఇతరత్రా చర్యలతో గర్భధారణ సంబంధిత కేసులలో చట్టాలను ప్రభుత్వం సమూలంగా మార్చాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గర్భవిచ్ఛిత్తి విషయంలో ఎన్ని వారాలు అనేది చూడటానికి వీల్లేదని తెలిపారు. అత్యాచారం కేసులలో విచారణలు వారం రోజులలో ముగిసి, న్
నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు : మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం […] The post నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి appeared first on Navatelangana.
రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యంప్రగతి రిసార్ట్స్లో ఘనంగా వార్షిక సర్వసభ్య సమావేశం : వీణ వెంకటరమణ రాయుడునవతెలంగాణ-హైదరాబాద్స్మార్ట్ఫార్మింగ్ దిశగా రైతు విజయమే వైకే లాబొరేటరీస్ లక్ష్యమని సంస్థ అధినేత, ఎండీ వీణ వెంకటరమణ రాయుడు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్లో ఏప్రిల్ 26న వైకే లాబొరేటరీస్ వార్షిక సర్వసభ్య సమావేశం రంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి టీమ్ లీడర్స్, మార్కెటింగ్ […] The post స్మార్ట్ ఫార్మింగ్ దిశగా appeared first on Navatelangana.
హైదరాబాద్: పిల్లలు లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు విషయంలో కఠిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ దష్టితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. భర్త మరణం అనంతరం భారతదేశంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్న రష్యన్ మహిళకు వీసా పొడిగించాలని ఆదేశించింది.భారతీయుడిని వివాహం చేసుకున్న ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో, కర్మకాండలు నిర్వహించడం, వద్ధురాలైన అత్తకు తోడుగా ఉండడం వంటి కారణాలతో వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పిల్లలు లేని […] The post రష్యన్ మహిళకు వీసా పొడిగించండి హైకోర్టు appeared first on Navatelangana.
ఇరాన్పై యుద్ధ భయంతోనే..న్యూఢిల్లీ : చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2022 తర్వాత తొలిసారిగా బ్రెంట్ క్రూడ్ ఓ దశలో ఏడు శాతం పెరిగి బ్యారల్కు 126 డాలర్లకు పైగా పలికింది. ఇరాన్పై యుద్ధానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అమెరికా సైన్యం దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు నూతన ప్రణాళికలను ఉంచింది. దీంతో యుద్ధం తప్పదన్న అనుమానాలతో చమురు ధరలు అటకెక్కి కూర్చున్నాయి. ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దాడులు చేసినప్పటి నుంచి చమురు ధరలు ఈ […] The post మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు appeared first on Navatelangana.
రికార్డు స్థాయిలో 300 రోజుల మోహరింపుప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక తిరిగి అమెరికాకువాషింగ్టన్ :యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యప్రాచ్యం నుంచి వెనక్కి రానున్నది. 300 రోజులకుపైగా సాగిన రికార్డు స్థాయి మోహరింపు తర్వాత ఇది స్వదేశానికి బయలుదేరనుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటానికి అమెరికా సైన్యం దీన్ని వినియోగించింది. అనంతరం ఇరాన్పై సంబం ధించిన యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించింది. అయితే ఆ యుద్ధనౌకపై క్షిపణులతో విరుచుకుపడటంతో దెబ్బతిన్న విషయం విదితమే. అమెరికా సైన్యం ఆత్మస్థైర్యాన్ని ఇరాన్ […] The post యూఎస్ఎస్ గెరాల్డ్ఆర్ ఫోర్డ్ వెనక్కి appeared first on Navatelangana.
పైపులు ధ్వంసం, బావులు బ్లాక్వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిలీ సెట్లర్ల అమానవీయ తీరుపాలస్తీనీయులకు నీటి కటకటగాజా : పాలస్తీనియుల పట్ల ఇజ్రాయిలీ సెట్లర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి తాగడానికి నీరు కూడా లేకుండా చేస్తున్నారు. వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిలీ సెట్లర్లు నీటి వనరులు, పైపులు, బావులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు పెంచారు. దీంతో పాలస్తీనియన్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వారి జీవనోపాధి, వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో ఇజ్రాయిలీ సెట్లర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువులు, […] The post నీటి వనరులే టార్గెట్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల (మే నెల) చి వరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇ న్చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రె వెన్యూ, ఫారెస్టు అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చివరి దశలో ఉన్న ఇళ్లను వీలైనం త త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అంసపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసి న మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇ ళ్ల పథకం ద్వారా అందజేస్తామని మంత్రి పొం గులేటి వెల్లడించారు. వాటిని పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ చానల్లో నిధులు విడుదల చేస్తామన్నారు. చాలా ఇ
గ్రీన్ చానెల్లో నిధులుఈనెలాఖరు నాటికి 2 బీహెచ్కే ఇండ్ల కేటాయింపుఅసంపూర్తిగా ఉన్న వాటికి రూ.ఐదు లక్షలు అందజేస్తాంప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేదుసరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలిరెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే చేపట్టాలి : ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్షనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈనెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని అధికారులను రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార […] The post డబుల్ బెడ్రూం ఇండ్లకు appeared first on Navatelangana.
ఎస్సీ గురుకులాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత : స్టేట్ టాపర్స్ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీ పరిధిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. శాలువను కప్పి, మెమెంటోను అందజేశారు. […] The post పదో తరగతిలో కార్పొరేట్కు దీటుగా ఫలితాలు appeared first on Navatelangana.
విభజన హామీలను నెరవేర్చాలిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రేపు రాస్తారోకోలుపెట్రో ఉత్పత్తుల కొరతపై 4న నిరసనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణకు ఈ నెల పదో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రావడం శుభపరిణామమనీ, అయితే, పర్యటనకే పరిమితం కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్,అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. దేశంలో చమురు కొరత లేనట్టయితే కృత్రిమ కొరత […] The post ప్రధాని పర్యటనలకే పరిమితం కావొద్దు appeared first on Navatelangana.