
3357 వార్తలు










– జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులకు జరిగిన ఉపయోగం శూన్యం – కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, చిత్తశుద్ధి లేదు – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయి – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలు కదులుతాయి– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావునవతెలంగాణ – బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర […] The post రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, దద్దమ్మ, చలనం లేని కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కారు బీభత్సం చేసింది. బైక్ పై తండ్రి, కుమారుడు ఎల్బీనగర్ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వారిని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో కారు డ్రైవర్ తండ్రి కుమారుడిపై దాడికి దిగాడు. కారును ఆపేందుకు యత్నించిన తండ్రిని డ్రైవర్ బానెట్ పైకి ఎక్కించి కారు ఆపకుండా దాదాపు 2 కి.మీ. ఈడ్చుకెళ్లాడు. బాలాపూర్ చౌరస్తా వరకు కారు డ్రైవర్ తిరిగి వచ్చాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలి కారు డ్రైవర్ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దాదాపు చేతులెత్తేశాడు. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయామని అంగీకరించాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఓటమితో 9 మ్యాచ్లలో 7 పరాజయాలను మూటగట్టుకున్న ముంబై జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ “ఇది కేవలం ఈ రాత్రికి సంబంధించిన ఓటమి […] The post మొత్తం సీజన్లోనే మేం విఫలమయ్యాం : హార్దిక్ పాండ్యా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని మొత్తం 824 నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు మే 4వ తేదీ సోమవారం రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల కల్లా ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపనేది పూర్తిగా తెలిసిపోతుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు […] The post రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. The post కామారెడ్డిలో అగ్నిప్రమాదం..షాపులు దగ్ధం appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్పై దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే యుద్ధం పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అక్కడ మిగిలిన క్షిపణి సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకోవాలని కోరుకుంటున్నామని, ఇరాన్ నేతలు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. కాగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు ఇరాన్ 14 అంశాలతో ప్రతిపాదన పంపింది. The post దురుసుగా ప్రవర్తిస్తే ఇరాన్పై మళ్లీ దాడులు: ట్రంప్ హెచ్చరిక appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని షాహదరా జిల్లా వివేక్ విహార్ ఫేజ్-1లో ఉన్న ఓ నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున భవనంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. వెంటనే 14 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి […] The post ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి appeared first on Navatelangana.

మహబూబ్నగర్: ప్రేమ జంటను బెదిరించి ప్రియుడే ముందే బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, బాలిక(17)ను తీసుకొని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పిల్లిగుండుతండా శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రేమ జంటను కూలీ పనులు చేస్తున్న అశోక్ కుమార్(26), లక్ష్మణ్(25) గమనించి వారిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని ప్రేమ జంటను బెదిరించడంతో తమ వద్ద లేవని చెప్పడంతో స్నేహితుడి ద్వారా రూ. 6500 ఫోన్ పే చేయించుకున్నారు. యువకుడి ముందే బాలికపై లక్ష్మణ్, అశోక్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఒకప్పుడు రాజ్యాలను పాలించి, యుద్ధరంగాల్లో వీరత్వం ప్రదర్శించి చరిత్రలో స్థానం సంపాదించిన ముదిరాజ్ జాతి, నేడు తన అస్తిత్వంకోసం సంఖ్యాబలంలోనే సింహభాగం కోల్పోతూ విలపిస్తోంది. ‘ముదిరాజ్’ అంటే రాజసం అనే గర్వం రక్తంలో ఉన్నా, వాస్తవ జీవితం పేదరికం, విద్యా విహీనత, ఉద్యోగ వంచన, శ్రమ దోపిడీల మధ్య నలిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కులాలవారీ జనాభా సర్వే (SEEEPC) నివేదిక ఈ సామాజిక విషాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. రాష్ట్రంలోని 242 కులాలలో అత్యధిక జనాభా సంఖ్యలో ఒకటైన ముదిరాజ్ సమాజం (ముదిరాజ్, ముత్రాసి, తెనుగొల్లు) దాదాపు 26.39 లక్షల మంది (7.4 శాతం) ఉన్నారు. బిసిలలో అతిపెద్ద సమూహం కావడం విశేషం.కానీ, సమ్మిళిత వెనకబాటుతన సూచీ (Composite Backwardness Index CBI)లో వారి స్కోరు 94 పాయింట్లు. రాష్ట్ర సగటు 81 పాయింట్లు అయితే, ఎస్సిలు 96, ఎస్టిలు 95 పాయింట్లతో సమానంగా లేదా దగ్గరగా ఉండటం ఆందోళనకరం. ఈ సూచీ 42 ప్రధాన అంశాల ఆధారంగా తయారైంది. ఇందులో ఎక్కువ స్కోరు ఎక్కువ వెనకబాటుతనాన్ని సూచిస్తుంది. తెలంగాణ కులగణన నివేదిక 135 కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనకబడి ఉన్నట్లు చె




