24144 వార్తలు

రాష్ట్రంలో బుధవారం ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కోసం పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగుతామని రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వీరికి మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో కూడా సమ్మె బాట పట్టే అవకాశం ఉందని సమాచారం.

న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన అత్యాచార వైఖరి, పరీక్షల వ్యవహారంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు విపక్ష ఎంపీలు మంగళవారం కోరారు. సభ ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ తదితరులు స్పీకర్ను ఆయన కార్యాలయంలో కలిసి తమ విజ్ఞప్తిని వినిపించారు. అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల దాడి, పరీక్షల సంక్షోభంలో ప్రభుత్వ పూర్తి బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్లో విసృ్తతంగా చర్చ జరగాలని కోరాం అని తెలిపారు.తమ భవిష్యత్తుకు సంబంధించిన సముచిత ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థులపై దాడులు జరిగాయని రాహుల్ ఆరోపించారు. దేశ యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంట్లో చర్చ జరగకపోతే, ఆ సభ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. విద్యార్థుల గొంతును అణచివేయడానికి ప్రతిపక్షం అవకాశం ఇవ్వదని, వారి సమస్యలు వీధుల్లోనే కాకుండా పార్లమెంట్లోనూ మారుమోగేలా చేస్తామని ఆయన స


బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్హామ్ క్యాబినెట్లో భారత మూలాలున్న ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. బ్రిటిష్ ఇండియన్ కనిష్క నారాయణ్ యూకే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బిహార్లో జన్మించిన 36 ఏళ్ల కనిష్క నారాయణ్ 2024 జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేల్స్ నుంచి ఎంపీగా గెలిచారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఆన్లైన్ భద్రత, కృత్రిమ మేథ విభాగాన్ని ఆయన పర్యవేక్షించేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏఐ మంత్రిగా నియమితులయ్యారు. కాగా, భారత మూలాలున్న లీసా నాండీకి సైతం బర్న్ హామ్ క్యాబినెట్లో చోటు దక్కింది. కీర్ స్మార్టర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీకి మరోసారి ఆ పదవి దక్కింది.


కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుపై జరిగిన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్న యువతకు కాంగ్రెస్ కుటుంబం, దేశం మొత్తం అండగా నిలుసా ్తయన్నారు. ‘మీరు మమ్మ ల్ని జైలులో పెట్టవచ్చు, మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు; కానీ న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న లక్షలాది మంది భారతీయ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు అణచివేయలేర’ని అన్నారు.


న్యూఢిల్లీ : కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే రానున్న ఎన్నికల్లో భీమ్ ఆర్మీ పార్టీ టికెట్పై పోటీ చేస్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే జోస్యం చెప్పారు. ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా ప్రధాని నరేంద్రమోడీయే తమ నాయకుడుగా భావిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం మోడీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. “ప్రతి ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. జెపీ ఉద్యమం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులను తయారు చేసింది. అన్నా హజారే ఉద్యమం నుంచి కేజ్రీవాల్ నాయకుడయ్యారు” అని ఆయన ఉదహరించారు. నేపాల్లో కూడా ఎవరైతే జెన్ జెడ్ ఉద్యమంతో పాలుపంచుకున్నారో వారు రాజకీయ పార్టీలో చేరడం తప్పనిసరి అయ్యిందన్నారు. ఎన్డిఎ పార్లమెంటరీ సమావేశంలో మంగళవారం ప్రధాని మోడీ యువతకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారని ప్రస్తావించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల పాశవిక చర్యలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడాన్ని అడగ్గా , దానికి బదులు కాంగ్రెస్ 1975లో ఎమర్జెన్సీ విధించినందుకు ప్రజలకు క

న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ప్రాణాధార సూచికలు (వైటల్ పారామీటర్లు) స్థిరంగా ఉన్నాయని, అయితే ఇంట్రావీనస్ ద్రవాలు, గ్లూకోజ్ తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి. ఈ మేరకు ఒక హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన రక్తంలో చక్కెర స్థాయి ఇంకా తక్కువగానే ఉందని, సీరమ్ పొటాషియం స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా 3.2 ఎంఈక్యూ/ఎల్గా నమోదైందని తెలిపింది. నోటి ద్వారా పొటాషియం మందులు ఇస్తున్నామని తెలిపింది. అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించింది. అయితే దీర్ఘకాల ఉపవాసం, డీహైడ్రేషన్, రక్త పరీక్షల్లో కనిపిస్తున్న ఫలితాల కారణంగా ఆయనను నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచి వరుస పరీక్షలు నిర్వహించడం అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

ఇన్-సర్వీస్ టీచర్స్- కోసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, సంక్షేమ శాఖ విద్యాసంస్థలు, మోడల్ స్కూళ్లు, తదితర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. టీచర్ల అర్హతలను నిర్ధారించడం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచిన నిబంధనలు, షెడ్యూల్ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బుధవారం నుంచి జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి.. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం..ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి, తదుపరి పదోన్నతులు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్లతో పాటు ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్లు నిర్వహించే


గ్యాంగ్టక్: సిక్కిం నామ్చి జిల్లా లోని జోలుంగే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. అక్కడ శిథిలాల తొలగింపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు. ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ సొరంగంలో కొండచరియలు విరిగి పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రాజెక్టు అధికారులు, కార్మికులతోపాటు మొత్తం 25 మంది సొరంగంలో చిక్కుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అకస్మాత్తుగ సోమవారం కొండచరియలు విరిగి పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్షా, సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 కి పది మృతదేహాలను వెలికి తీసినట్టు , వీరిలో ఏడుగురిని గుర్తించినట్టు ఇంకా గుర్తింపు కాని మూడు మృతదేహాలను జిల్లా ఆస్పత్రి సింగ్టమ్, ఎస్టిఎన్ఎం ఆస్పత్రికి పంపినట్టు జిల్లా అధికారులు వివరించారు. గుర్తించిన ఏడు మృతదేహాల్లో న

న్యూఢిల్లీ: నీట్ లీక్, విద్యార్థుల ఛలో పార్లమెంటు నిరసనలపై పోలీసుల లాఠీఛార్జి వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. విపక్షాల ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారంనాడు కూడా ఎలాంటి సభా కార్యక్రమాలు జరక్కుండా ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్సభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు లోబడి విపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ ఓం బిర్లా నచ్చచెప్పినప్పటికీ విపక్షాలు పట్టువీడకపోవడంతో సభను మొదటిసారి ఆయన వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్షాలను తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ బుధవారంనాటికి వాయిదా పడింది. ఇటు రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పోలీసు చర్యను సభలో లేవనెత్తారు. అధికార పార్టీ సభ్య



న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యమని, ప్రజల మధ్యకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ విజయాలను విసృ్తతంగా వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఎంపీలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి క్షణాన్ని అంకితం చేయాలని సూచించారు. మంగళవారం జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, దేశమే మొదట అన్న భావనతో పనిచేయాలని ప్రధాని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ప్రతి ఎంపీ తన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశ సంక్షేమానికి అంకితం చేయాలి. దేశ అభివృద్ధి, సుసంపన్నత కోసం నిరంతరం కృషి చేయాలని ప్రధాని సూచించారు అని తరుణ్ చుగ్ వెల్లడించారు.భారత్ అంతర్జాతీయ వేదికపై మరింత ప్రభావాన్ని చూపుతోందని, భారత యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతోందని ప్రధాని సమావేశంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ విధానం, సంక్షేమ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రధాని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రధాని నాయకత్వంల


న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల సమస్యపై చర్చ జరిపేందుకు తాను ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఉదయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అనుమతి కోరగా, ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారని రాహుల్ వెల్లడించారు. పార్లమెంట్లో చర్చ జరపాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరం అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం భారతీయ విలువలకు విరుద్ధమని రాహుల్ విమర్శించారు. నిన్న జరిగిన ఘటనపై ప్రధాని ఇప్పటివరకు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు. విద్యార్థులను ఈ విధంగా కొట్టించడం పూర్తిగా తప్పు అని అన్నారు.దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల నిర్వహణ పూర




బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో మంతనాలుమన తెలంగాణ/హైదరాబాద్ః కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నప్పటికీ, బిజెపి రాష్ట్ర నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఏమిటీ ?, పార్టీ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ? వంటి ప్రశ్నలను కేంద్ర మంత్రి అమిత్ షా కురిపిస్తే, వాటికి సరైన సమాధానం చెబుతూనే లిఖితపూర్వకంగా ఓ నివేదిక ఇచ్చేందుకు ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 26న అమిత్ షా మధ్యాహ్నం 12.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి 1.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బిఎస్ఎఫ్కు చెందిన హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకుని, అక్కడ ప్రతిమా విద్యా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి 3.45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్లో బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో కొంత సేపు మంతనాలు జరుపుతారు. అక్

రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన మంగళవారం విచారించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న చర్యలను, కేసులో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో సీసీ నెం.308/2024లో సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ముగింపు పలికింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే 2021 ఏప్రిల్ 26న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ పథకంలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తో పాటు విపత్తు నిర్వహణ చ