24605 వార్తలు



‘పెద్ది’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా సుకుమార్తో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్, సుకుమార్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ‘పుష్ప’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్గా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అంతేకాక.. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్ఫర్మెన్స్కు స్కోప్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారట. 2027 చివర్లో కానీ.. 2028 మార్చిలో కానీ.. ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం.


హైదరాబాద్: యువతను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కరీంనగర్ లో కెటిఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు? అని బిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. చేస్తాం అని తెలియజేశారు. బిఆర్ఎస్ లాగా నిరుద్యోగ యువతతో తాము ఆటలు ఆడలేదని, నిరుద్యోగులకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు సూచించారు.

లండన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. దీంతో భారత పేసర్లు వికెట్లు తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జాకబ్ బేతల్ అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజ్లో బేతల్ (53), డకెట్ (34) ఉన్నారు.




హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారిపోయారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుబంధు బంద్ అయ్యింది, సాగుకు కరెంట్ ఇవ్వట్లేదని అన్నారు. సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూరియా లేదు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని విమర్శించారు. మున్ముందు మరింత కరువు వస్తుందని హరీష్ రావు సూచించారు. గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని, స్కామ్ ల కాంగ్రెస్ పోయి..స్కీముల మాజీ సిఎం కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారని, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే.. భద్రాచలం మునుగుతుందని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు బోల్తా పడింది. తిరుపతి నుంచి కారులో హైదరాబాద్కు చెందిన ఐదుగురు భక్తులు తిరుమలకు బయలుదేరారు. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయ, ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.






శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజౌరీ, ఫూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఢిల్లీ: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. హార్టికల్చర్ పై దేశవ్యాప్తంగా ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై చర్చ జరగాలని, చట్టం తేవాలని, మ్యూల్ ఖాతాలు, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై జరగాలని కోరారు. షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీలద్వారా దేశానికి తీవ్ర నష్టం జరిగిందని ఎంపి లావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరిగతిన జరుగుతున్నాయని, గోదావరి- పెన్నా నదులను అనుసంధానించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాలని, మహిళా బిల్లుకు విపక్షాలు సహకరించాలని ఎంపి లావు కృష్ణదేవరాయులు కోరారు.

సిద్దిపేట: కాళేశ్వరం జలాల కోసం రైతన్నలు కదం తొక్కారు. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు రైతుల మహా పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. రక్త పీపాసి సిఎం రేవంత్ రెడ్డి ఈగ కాసుకోవాలని, నీళ్ల కోసం మా రక్తం దారపోస్తామని, కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని రైతన్నలు నినాదాలు చేశారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని, ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర కు వేలాది మందిగా తరలివచ్చి రిజర్వాయర్లను నీళ్లతో నింపాలని కోరారు. -

బెంగళూరు: బైక్పై వెళ్తుండగా అడవి పందిని తప్పించే క్రమంలో నవ వధువు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంజనగూడు ప్రాంతానికి చెందిన పునీత్, మోగనహుండి గ్రామానికి చెందిన మేఘనకు 15 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఆషాడ మాసం కావడంతో మేఘన తన పుట్టింటికి వెళ్లింది. భార్యను కలిసేందుకు పునీత్ కూడా అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం భార్యతో కలిసి తన ఇంటికి బైక్పై వస్తున్నాడు. ఆర్టి నగర్ సమీపంలో అడవి పంది ఎదురు రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. మేఘనా తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన చనిపోయింది. పునీత్ స్వల్ప గాయాలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పునీత్ హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మేఘన కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలలో ఉండేదని పోలీసులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

‘దేవతల పాత్రలు పోషించే అవకాశాలు నటీనటులకు అంత సులభంగా లభించవు. ఎందుకంటే అవి చరిత్రలో నిలిచిపోయతాయి. సీతమ్మ పాత్ర నాకు దక్కడం నా అదృష్టం’’ అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు. ఆమె సీతగా, రణ్బీర్ కపూర్ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్లో విడుదల కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా శననివాం ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘సీతమ్మ నేవ్వే నా ద్వారా ఈ పాత్రలో నటించూ అని ధ్యానం చేస్తుండేదాన్ని’ అని తెలిపారు.

హైదరాబాద్: నేతలందరూ వారి నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. సర్ ప్రక్రియ చాలా కీలకమైనదని..నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. జూమ్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టాలని, సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు సర్ ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని, దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలు గుర్తించి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవద్దు అని మహేష్ గౌడ్ సూచించారు.