
3490 వార్తలు
ఏప్రిల్లో 35 శాతం వృద్ధి నమోదురూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది ఏప్రిల్లో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర ఆర్థిక ఉత్సాహానికి సంకేతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న వేగం, పన్ను చెల్లింపుల మెరుగైన అనుసరణ కారణంగా ఈ […] The post జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు appeared first on Navatelangana.
గుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా శంషాబాద్ ఓఆర్ఆర్పైఘోర రోడ్డు ప్రమాదం మృతులంతా సిరిసిల్ల వాసులునవతెలంగాణ-శంషాబాద్యాదగిరిగుట్టకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సాఫీగా ఇంటికి చేరుకోవాల్సిన వారి కుటుంబంలో చిన్న నిర్లక్ష్యం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అతివేగం’ ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబమంతా రెప్పపాటు కాలంలో విగత జీవులుగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యా రు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం […] The post ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు ఆరుగురు మృతి appeared first on Navatelangana.
మేడే. ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాట సంస్మరణగా ప్రపంచ కార్మిక వర్గ అంతర్జాతీయ దినోత్సవం మే 1వ తేదీన జరుగుతుంది. చికాగోలోని హే మార్కెట్ చౌక్లో జరిగిన సంఘర్షణలతో అది అజరామరమైంది. 1889లో అంతర్జాతీయ ఫెడరేషన్ దాన్ని నిర్ణయిస్తే ఇప్పుడు ప్రపంచమంతటా కార్మిక హక్కుల సంఘీభావ దినోత్సవంగా వారి హక్కులను చాటే రోజుగా గుర్తించబడింది. ఆ మే 1వ తేదీన చికాగో నగర కార్మికవర్గం భారీ వెల్లువగా కదిలివచ్చారు. నగరంలోని సంఘటిత కార్మికవs ఉద్యమ […] The post స్మార్ట్ఫోన్ కాలంలో కార్మికోద్యమ పాత్ర appeared first on Navatelangana.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక రూపంలో రాజ్యాంగంపైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై దాడి చేస్తూనే ఉంది. తన భావజాలానికి అనుకూలంగా మార్చుకునే కుట్రలు చేస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం, ప్రణాళిక సంఘం రద్దు, నూతన విద్యా విధాన చట్టం, విద్యుత్ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, 370 ఆర్టికల్, పెద్దనోట్ల రద్దు ఇలా అనేక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలు తీసుకుంది. తాజాగా డిలిమిటేషన్ కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును […] The post డీలిమిటేషన్ బిల్లు – రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
అమెరికా,ఇజ్రాయిల్ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, దానికి ఇరాన్ ప్రతిఘటనకు రెండు నెలలు గడచిపోయాయి. ఏప్రిల్ ఏడు నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.తొలుత హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఒక్కటే దిగ్బంధిస్తే తరువాత అమెరికా మరోవైపునుంచి నౌకలను మలేస్తున్నది.ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అరవై రోజులకు మించి అధ్యక్షుడి ఉత్తరువులతో ఏదేశం మీద కూడా సైనిక చర్య జరిపేందుకు వీల్లేదు. దీంతో చట్టంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని మరో నెల […] The post ఉక్రోషదాడుల ఉత్తరువు! appeared first on Navatelangana.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు రణన్నిన్నాదంతో కదిలిన కార్మికదండు ‘మేడే’ సామ్రాజ్యవాదుల వెన్నులో వణుకుపుట్టించే కష్టజీవుల ప్రపంచవ్యాప్త పండుగ. ప్రపంచ కార్మికుల ఐక్యతే ఆ వేడుక లక్ష్యం. శ్రమే వారి ఆయుధం. కార్మికరాజ్య స్థాపనే గమ్యం. రాష్ట్రంలో శ్రామికులే కేంద్రంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు జరిగాయి. ఊరు, వాడల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. పట్టణాల్లో అరుణపతాకాలు చేతపట్టిన కార్మికవర్గం పెట్టుబడిదారులారా…మా శ్రమను తక్కువచేయకండి…ఖబడ్దార్ అని నినదిస్తూ భారీ కవాతులు నిర్వహించింది. కమ్యూనిస్టుపార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించి కష్టజీవులకు […] The post కామ్రేడ్స్..లాల్సలాం appeared first on Navatelangana.
గుర్తింపు ఎన్నికలు, విలీనంపై చర్చించుకోండి పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తాంగాజులరామారంలో 100, బహదూర్గూడలో 150 ఎకరాల్లో బస్ టెర్మినళ్లుఒక్క డ్రైవర్నూ ఉద్యోగం నుంచి తొలగించం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి : ఆర్టీసీ కార్మిక సంఘాలతోసీఎం రేవంత్రెడ్డి సమ్మె కాలంలో వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ఆదేశం నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందిచి ప్రయాణికులకు మెరుగైన సేవలందిం చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […] The post సమగ్ర కార్యాచరణతో రండి appeared first on Navatelangana.
మరింత దిగజారిన భారత్ 157కు పడిపోయిన ర్యాంకుపొరుగుదేశాల ప్రదర్శన బెటర్మెరుగైన స్థితిలో నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లా, పాక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2026 ర్యాంకింగ్స్మోడీ పాలనలో మీడియాపై అణచివేత ధోరణి న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ మరింతగా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026’ ర్యాంకింగ్స్లో […] The post ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ appeared first on Navatelangana.
గిగ్వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం నెలరోజుల్లో విధివిధానాలు ఖరారుఈఎస్ఐ ఆస్పత్రులకు రూ.43వేల కోట్ల బకాయిలుపీజేఆర్ పేరుతో లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డ్‘శ్రమశక్తి’ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామిజూన్ 2 నుంచి ‘ప్రభాతభేరి’ : మంత్రి జూపల్లిరవీంద్రభారతిలో ‘మేడే’ వేడుకలు నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్ర శాసనసభ ఆమోదించిన గిగ్వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపారనీ, నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు చేసి అమల్లోకి తెస్తామని కార్మిక, ఉపాధికల్పనా శాఖల మంత్రి జీ వివేక్ వెంకటస్వామి తెలిపా రు. దీనివల్ల 4 లక్షల మంది […] The post హమాలీల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు appeared first on Navatelangana.
రెండు నెలల్లోనే రూ.1303 పెంచడం దారుణం : సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను అమాంతం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజ లపై యుద్ధం ప్రకటించడమేననీ, కేవలం రెండు నెలల్లోనే సిలిం డర్ ధరను రూ. 1,303 పెంచి ప్రజల నడ్డి విరచడం దారుణమ ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించింది. పెంచిన ధరను తక్షణమే ఉపసంహరించు […] The post గ్యాస్ ధరను తగ్గించాలి appeared first on Navatelangana.
ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు..యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహంపూర్తిస్థాయి నివేదిక అందే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశంనోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్లో పేలిన రియాక్టర్ నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/చిట్యాలనల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో నోష్ ఫార్మా కంపెనీలో శుక్రవారం మరోసారి రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. 8మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్లో 9మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో […] The post నోష్ ఫార్మా ల్యాబ్ మూడో బ్లాక్లో పేలిన రియాక్టర్ appeared first on Navatelangana.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఫలితంహోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లకు దెబ్బరాష్ట్రంపై రోజుకు రూ.2.28 కోట్ల భారంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు నిర్ణయం ఇటు వినియోగదారులను, అటు హోటళ్ల యాజమాన్యాలను బెంబేలెత్తిస్తోంది. ఓ కప్పు కాఫీ తాగటానికి సామాన్యుడు వెనుకాముందూ ఆడుతుంటే.. రూ.20 ఉన్న అదే కప్పు కాఫీని రూ.30కి అమ్మలేక టీ విక్రయిం చేవాడు… హోటల్ యాజమాన్యాలు దిగాలు పడుతున్నాయి. వెరసి.. ఏం తినలేని పరిస్థితి.. ఏదీ అమ్మలేని […] The post ధరలకు రెక్కలు appeared first on Navatelangana.
రైతుల నుంచి భిన్న స్వరాలుసాంకేతిక సమస్యలొస్తే…?పారదర్శకత కోసమేనంటున్న అధికారులు నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానంపై రైతుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనితో లాభనష్టాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కొందరు అంటుండగా, కొత్త విధానమే పారదర్శకంగా ఉంటుందని మరికొందరంటున్నారు. కొనుగోలు […] The post ధాన్యం కొనుగోళ్లకు ఆన్లైన్ ట్రక్ షీట్ appeared first on Navatelangana.
శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు పని చేస్తాం సైబర్క్రైమ్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదంశాఖలో అవినీతి పెరగడం తెలుసు.. దానిని కట్టడి చేస్తాంఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందిఒకరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించే మాటలపై నా స్టైల్లో చర్యలు తీసుకుంటా…అనుభవంతో పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరుస్తాఏఐతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తాంరోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బ్యూరోరాష్ట్ర ప్రజలకు కొత్త పోలీస్ బాస్ ఆనంద్ భరోసా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ […] The post పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం appeared first on Navatelangana.
నేడు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ప్రజలు ఆందోళనపడొద్దు : ఎన్డీఎమ్ఏ హెచ్చరికనవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎమ్ఏ) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ను చేపడుతున్నది. శనివారం దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను ఒకేసారి కవర్ చేస్తారు. సరిహద్దు ప్రాంతాలు మరియు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మినహాయింపు ఇచ్చినట్టు తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ పబ్లిక్ రిలేషన్స్ […] The post అలర్ట్! appeared first on Navatelangana.
3-0తో చైనీస్ తైపీపై గెలుపుసెమీఫైనల్లో టీమ్ ఇండియాథామస్ కప్ 2026భారత షట్లర్లు అదరగొట్టారు. అగ్రజట్టు చైనీస్ తైపీని చిత్తు చేసి థామస్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి సహా సాత్విక్, చిరాగ్ జోడీ వరుస మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశారు. ఐదు మ్యాచ్ల సమరంలో 3-0తో భారత్ అదిరే విజయం ఖాతాలో వేసుకుంది. మరో రెండు మ్యాచ్ల అవసరం లేకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2022లో థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో అడుగుపెట్టి […] The post అదరగొట్టారు appeared first on Navatelangana.

జడ్చర్ల పట్టణంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడవేయడంతో ఆ శిశువు పాదాలను కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం హౌసింగ్బోర్డ్ కాలనీ గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడవేసి వెళ్లారు. దీంతో కాలనీవాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అప్పటికే మృతిచెందిన శిశువు రెండు కాళ్లు కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆడ శిశువు మృతదేహం అమానవీయ ఘటన ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశమైంది.

మేషంఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. వృషభం వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. మిధునం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటకం కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరం

ఐపిఎల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్ధేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ను కెప్టెన్ రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) విఫలమయ్యారు. అయితే వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్తో కలిసి కెప్టెన్ పరాగ్ ఇన్నింగ్స్ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జురెల్ 42 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పరాగ్ 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. జడేజా కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 6 వికెట్లకు 225 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు నిసాంకా, రాహుల్లు ఢిల్లీకి శుభారంభం అందించారు. నిసాంకా 33 బంతుల్లో 62, రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరగకుండా కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బిఆర్ఎస్ ఉని కి కాపాడుకునే పనిలో నిమగ్నమైందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. కె సిఆర్కు కుమార్తె కవిత పెట్టిన కుంపటితో డాటర్ స్ట్రోక్ తగిలి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చార ని అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం కెసిఆర్, కెటిఆర్కు లేదన్నారు. ప్రజ ల సంక్షేమమే పరమావధిగా ఒక లక్షంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. పదేళ్లలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వాటాల పంపకాల్లో తేడా వల్లే కవిత టిఆర్ఎస్ పార్టీని స్థాపించిందని ఆయన వివరించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి. హరీష్ రావు తన పాత్ర ఏమ

నవతెలంగాణ – కాటారంగౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా కాటారం కేంద్రం లో గల గారేపల్లిలోని జై భీమ్ అంబేద్కర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజ్య సుఖాలను త్యజించి ప్రపంచ మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ వంటి విలువలను అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటికీ సమాజానికి […] The post బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శం: పీక కిరణ్ appeared first on Navatelangana.
ఎస్సెస్సీలో జిల్లా టాపర్గా నిలిచిన మనోజ్ఞకు ఘన సత్కారంనవతెలంగాణ – కాటారంప్రతిభకు పట్టం కట్టిన మరో ఉదాహరణగా, మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని మనోజ్ఞ ఎస్సెస్సీ ఫలితాల్లో 590 మార్కులు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ధన్వాడలో ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి […] The post ఆదర్శ విద్యార్థిని సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.