
3480 వార్తలు
సోషలిజానికి పెరుగుతున్న ఆదరణదేశంలో మతరాజ్య స్థాపనకు మోడీ కుట్రరాష్ట్రంలో రేవంత్ సర్కార్పై ప్రజల్లో అసంతృప్తి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం‘నవతెలంగాణ’ కార్యాలయంలో ఘనంగా ‘మేడే‘నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సామ్రాజ్యవాదం పతనావస్థకు చేరుకుందనీ, అదే సందర్భంలో సోషలిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్లోని నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెండాను ఆవిష్కరించారు. అనంతరం పత్రిక ఎడిటర్ రాంపల్లి […] The post పతనావస్థలో సామ్రాజ్యవాదం appeared first on Navatelangana.
‘రైతు డిస్కం’పై ఉన్న అపోహలను తొలగించాలి : సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్విద్యుత్ శాఖలో సరఫరా లోపాలను అధిగమించి, మెరుగైన విద్యుత్ను సప్లయి చేసేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. విద్యుత్ శాఖపై శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్సీఆర్ హెచ్ఆర్డీలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష […] The post విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికత appeared first on Navatelangana.
సంతాపం తెలిపిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్లైన్రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్నవతెలంగాణ -ఆత్మకూర్సీపీఐ(ఎం-ఎల్) మాస్లైన్ డివిజన్ నాయకులు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ)జిల్లా అధ్యక్షుడు సామెల్ గత నెల ఏప్రిల్ 30న అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింతలో సామేల్ అంతిమయాత్ర జరిగింది. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పుడే […] The post కార్మిక నేత సామేల్కు నివాళి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల వేళ తాను ప్రస్తావించిన హ్యామ్ రోడ్ల స్కామ్ ఇప్పుడు నిజమైందని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో 22 నుంచి 25 శాతం వరకు ఎక్సెస్ టెండర్లు వచ్చాయని ఆరోపించారు. ఆర్ అండ్ బి శాఖలో రూ.11 వేల కోట్ల టెండర్లకు దాదాపు రూ.15 వేల కోట్ల వరకు వ్యయం పెరిగిందని, పంచాయతీ రాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల టెండర్లు రూ.8 వేల కోట్లకు చేరుతున్నాయని విమర్శించారు. ఎక్సెస్ టెండర్ వల్ల ప్రభుత్వంపై 5 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పా రు. ఈ రెండు శాఖలలో కలిపి వేల కోట్ల రూ పాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రి హరీష్రావు మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన పలు టెండర్లపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ రహదారుల టెండ ర్లు తగ్గింపుతో (లెస్) జరిగితే.. రాష్ట్ర రహదారు ల టెండర్లు మాత్రం ఎక్సెస్కు వెళ్తున్నాయని మండిపడ్డారు. టెండర్లలో 40 శాతం రాష్ట్ర ఖ జానా నుంచి వెళ్తే మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్లు బ్యాంకు రుణా
సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలిఇండ్లస్థలాలు ఇవ్వాల్సిందే : టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యహెచ్యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలునవతెలంగాణ -హైదరాబాద్రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలను నేటి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్ట్ల హక్కులను కాపాడడానికి టీడబ్ల్యూజేఎఫ్ అగ్రభాగాన ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ […] The post జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమం appeared first on Navatelangana.
దేశవ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలుసీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ప్రకాశ్కరత్హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో ఆర్. అరుణ్ కుమార్ జెండా ఆవిష్కరణనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఅంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాడవాడలా నిర్వహించిన కార్యక్రమాలు కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, మోటర్ సైకిల్ ర్యాలీలు, బహిరంగ సభలతో కార్మిక దినోత్సవం వేడుకగా సాగింది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు […] The post ఎర్రజెండా రెపరెపలు appeared first on Navatelangana.
ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విన్నపాలను సావధానంగా విన్న ఆయన, వారి సమస్యలపై సానుకూల హామీ ఇచ్చారు. ఉద్యోగుల సేవలను కొనియాడారు. […] The post సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమల్లో ఘోర వైపల్యం చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రబీ సీజన్లో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని, తాలు, తరుగు, తేమ పేరు చెప్పి దోచుకుంటున్న దళారుల నుండి రైతును ఆదుకుని ప్రతి గింజను ఎమ్మెస్పీ ధరకు కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సైతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంవల్ల ఆ పథకం ద్వారా తెలంగాణ రైతులు ప్రయోజనం అందుకోలేకపోతుండటం బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా వడ్లు, మొక్కజొన్న, శనగ కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. వడ్లు, మక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడుసహా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారని, ఆరుగాలం పండించిన పంటలను వెంటనే అమ్ముకునే దిక్కులేక మండుటెండలో రోజుల తరబడి -ఎదురు చూస్తూ అస్వస్థతకు గురవుతూ ఆసుపత్రుల పాలై చనిప
దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులుతరుగు పేరిట దోపిడీని అరికట్టాలని డిమాండ్నవతెలంగాణ-సిరికొండదొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. దొడ్డు రకం వడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేసే విధంగా చూడాలని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో పార్టీలకతీతంగా రైతులు రోడ్డుపై బైటయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు […] The post కర్షకులను కరుణించండి appeared first on Navatelangana.
ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్గాంధీ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో ఉండే వివిధ విభాగాలు, వాటి పనితీరును ఈ సందర్భంగా డాక్టర్లు మంత్రికి వివరించారు.ఉస్మానియాలో 18 నెలల చిన్నోడిని సక్సెస్ఫుల్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్వోడీ, డాక్టర్ మధుసూదన్ను మంత్రి సన్మానించారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకుని అక్కడే కవల పిల్లలకు […] The post గాంధీ హాస్పిటల్లో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ appeared first on Navatelangana.
మేడే సందర్భంగా కార్మికులతో డిప్యూటీ సీఎం భట్టి సహపంక్తి భోజనంనవతెలంగాణ-మిర్యాలగూడటౌన్కార్మికుల హక్కులు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, […] The post కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది appeared first on Navatelangana.
ఎస్ఎల్బీసీలో కూలీలు చనిపోతే శవాలను తీయలేని దుస్థితిసిగాచి పరిశ్రమ కార్మిక కుటుంబాలను పట్టించుకోలేదుఆటో అన్నలకు మొండిచేయి చూపిన ప్రభుత్వం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తెలంగాణ భవన్లో ఘనంగా మేడే వేడుకలుకార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మాజీమంత్రినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఎస్ఎల్బీసీలో కూలీలు చనిపోతే వారి శవాలను […] The post కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ appeared first on Navatelangana.
న్యాయపరమైన చిక్కుల్లేకుండా చూస్తాం:మంత్రి పొంగులేటినవతెలంగాణ-హైదరాబాద్అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే పలు సందర్బాలలో ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చేనెల జూన్ రెండో తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామని చెప్పారు. శుక్రవారం సచివాల యంలోని జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్ , తెలంగాణ […] The post జూన్ 2 నాటికి జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల సమస్య కొలిక్కి appeared first on Navatelangana.
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన ధరలకు ఆజ్యం పోయడంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు ఇటీవల కొన్ని వారాల్లోనే ఏకంగా 80 శాతం మేర పెరగడం విమానయాన సంస్థలకు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రస్తుతం విమాన నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం కేవలం ఇంధనం కోసమే వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన ధరల భారంతో సర్వీసులను కొనసాగించడం ఆర్థికంగా లాభదాయకం కాదని భావిస్తున్న సంస్థలు […] The post ఎయిరిండియాకు ఏటీఎఫ్ సెగ appeared first on Navatelangana.
ఏప్రిల్లో 35 శాతం వృద్ధి నమోదురూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది ఏప్రిల్లో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర ఆర్థిక ఉత్సాహానికి సంకేతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న వేగం, పన్ను చెల్లింపుల మెరుగైన అనుసరణ కారణంగా ఈ […] The post జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు appeared first on Navatelangana.
గుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా శంషాబాద్ ఓఆర్ఆర్పైఘోర రోడ్డు ప్రమాదం మృతులంతా సిరిసిల్ల వాసులునవతెలంగాణ-శంషాబాద్యాదగిరిగుట్టకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సాఫీగా ఇంటికి చేరుకోవాల్సిన వారి కుటుంబంలో చిన్న నిర్లక్ష్యం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అతివేగం’ ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబమంతా రెప్పపాటు కాలంలో విగత జీవులుగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యా రు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం […] The post ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు ఆరుగురు మృతి appeared first on Navatelangana.
మేడే. ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాట సంస్మరణగా ప్రపంచ కార్మిక వర్గ అంతర్జాతీయ దినోత్సవం మే 1వ తేదీన జరుగుతుంది. చికాగోలోని హే మార్కెట్ చౌక్లో జరిగిన సంఘర్షణలతో అది అజరామరమైంది. 1889లో అంతర్జాతీయ ఫెడరేషన్ దాన్ని నిర్ణయిస్తే ఇప్పుడు ప్రపంచమంతటా కార్మిక హక్కుల సంఘీభావ దినోత్సవంగా వారి హక్కులను చాటే రోజుగా గుర్తించబడింది. ఆ మే 1వ తేదీన చికాగో నగర కార్మికవర్గం భారీ వెల్లువగా కదిలివచ్చారు. నగరంలోని సంఘటిత కార్మికవs ఉద్యమ […] The post స్మార్ట్ఫోన్ కాలంలో కార్మికోద్యమ పాత్ర appeared first on Navatelangana.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక రూపంలో రాజ్యాంగంపైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై దాడి చేస్తూనే ఉంది. తన భావజాలానికి అనుకూలంగా మార్చుకునే కుట్రలు చేస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం, ప్రణాళిక సంఘం రద్దు, నూతన విద్యా విధాన చట్టం, విద్యుత్ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, 370 ఆర్టికల్, పెద్దనోట్ల రద్దు ఇలా అనేక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలు తీసుకుంది. తాజాగా డిలిమిటేషన్ కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును […] The post డీలిమిటేషన్ బిల్లు – రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
అమెరికా,ఇజ్రాయిల్ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, దానికి ఇరాన్ ప్రతిఘటనకు రెండు నెలలు గడచిపోయాయి. ఏప్రిల్ ఏడు నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.తొలుత హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఒక్కటే దిగ్బంధిస్తే తరువాత అమెరికా మరోవైపునుంచి నౌకలను మలేస్తున్నది.ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అరవై రోజులకు మించి అధ్యక్షుడి ఉత్తరువులతో ఏదేశం మీద కూడా సైనిక చర్య జరిపేందుకు వీల్లేదు. దీంతో చట్టంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని మరో నెల […] The post ఉక్రోషదాడుల ఉత్తరువు! appeared first on Navatelangana.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు రణన్నిన్నాదంతో కదిలిన కార్మికదండు ‘మేడే’ సామ్రాజ్యవాదుల వెన్నులో వణుకుపుట్టించే కష్టజీవుల ప్రపంచవ్యాప్త పండుగ. ప్రపంచ కార్మికుల ఐక్యతే ఆ వేడుక లక్ష్యం. శ్రమే వారి ఆయుధం. కార్మికరాజ్య స్థాపనే గమ్యం. రాష్ట్రంలో శ్రామికులే కేంద్రంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు జరిగాయి. ఊరు, వాడల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. పట్టణాల్లో అరుణపతాకాలు చేతపట్టిన కార్మికవర్గం పెట్టుబడిదారులారా…మా శ్రమను తక్కువచేయకండి…ఖబడ్దార్ అని నినదిస్తూ భారీ కవాతులు నిర్వహించింది. కమ్యూనిస్టుపార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించి కష్టజీవులకు […] The post కామ్రేడ్స్..లాల్సలాం appeared first on Navatelangana.
గుర్తింపు ఎన్నికలు, విలీనంపై చర్చించుకోండి పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తాంగాజులరామారంలో 100, బహదూర్గూడలో 150 ఎకరాల్లో బస్ టెర్మినళ్లుఒక్క డ్రైవర్నూ ఉద్యోగం నుంచి తొలగించం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి : ఆర్టీసీ కార్మిక సంఘాలతోసీఎం రేవంత్రెడ్డి సమ్మె కాలంలో వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ఆదేశం నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఆర్టీసీ మనుగడ, గౌరవాన్ని పెంపొందిచి ప్రయాణికులకు మెరుగైన సేవలందిం చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […] The post సమగ్ర కార్యాచరణతో రండి appeared first on Navatelangana.
మరింత దిగజారిన భారత్ 157కు పడిపోయిన ర్యాంకుపొరుగుదేశాల ప్రదర్శన బెటర్మెరుగైన స్థితిలో నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లా, పాక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2026 ర్యాంకింగ్స్మోడీ పాలనలో మీడియాపై అణచివేత ధోరణి న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ మరింతగా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026’ ర్యాంకింగ్స్లో […] The post ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ appeared first on Navatelangana.
గిగ్వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం నెలరోజుల్లో విధివిధానాలు ఖరారుఈఎస్ఐ ఆస్పత్రులకు రూ.43వేల కోట్ల బకాయిలుపీజేఆర్ పేరుతో లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డ్‘శ్రమశక్తి’ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామిజూన్ 2 నుంచి ‘ప్రభాతభేరి’ : మంత్రి జూపల్లిరవీంద్రభారతిలో ‘మేడే’ వేడుకలు నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్ర శాసనసభ ఆమోదించిన గిగ్వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపారనీ, నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు చేసి అమల్లోకి తెస్తామని కార్మిక, ఉపాధికల్పనా శాఖల మంత్రి జీ వివేక్ వెంకటస్వామి తెలిపా రు. దీనివల్ల 4 లక్షల మంది […] The post హమాలీల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు appeared first on Navatelangana.