
3501 వార్తలు
శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు పని చేస్తాం సైబర్క్రైమ్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదంశాఖలో అవినీతి పెరగడం తెలుసు.. దానిని కట్టడి చేస్తాంఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందిఒకరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించే మాటలపై నా స్టైల్లో చర్యలు తీసుకుంటా…అనుభవంతో పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరుస్తాఏఐతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తాంరోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బ్యూరోరాష్ట్ర ప్రజలకు కొత్త పోలీస్ బాస్ ఆనంద్ భరోసా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ […] The post పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం appeared first on Navatelangana.
నేడు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ప్రజలు ఆందోళనపడొద్దు : ఎన్డీఎమ్ఏ హెచ్చరికనవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎమ్ఏ) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ను చేపడుతున్నది. శనివారం దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను ఒకేసారి కవర్ చేస్తారు. సరిహద్దు ప్రాంతాలు మరియు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మినహాయింపు ఇచ్చినట్టు తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ పబ్లిక్ రిలేషన్స్ […] The post అలర్ట్! appeared first on Navatelangana.
3-0తో చైనీస్ తైపీపై గెలుపుసెమీఫైనల్లో టీమ్ ఇండియాథామస్ కప్ 2026భారత షట్లర్లు అదరగొట్టారు. అగ్రజట్టు చైనీస్ తైపీని చిత్తు చేసి థామస్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి సహా సాత్విక్, చిరాగ్ జోడీ వరుస మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశారు. ఐదు మ్యాచ్ల సమరంలో 3-0తో భారత్ అదిరే విజయం ఖాతాలో వేసుకుంది. మరో రెండు మ్యాచ్ల అవసరం లేకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2022లో థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో అడుగుపెట్టి […] The post అదరగొట్టారు appeared first on Navatelangana.

జడ్చర్ల పట్టణంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడవేయడంతో ఆ శిశువు పాదాలను కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం హౌసింగ్బోర్డ్ కాలనీ గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడవేసి వెళ్లారు. దీంతో కాలనీవాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అప్పటికే మృతిచెందిన శిశువు రెండు కాళ్లు కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆడ శిశువు మృతదేహం అమానవీయ ఘటన ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశమైంది.

మేషంఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. వృషభం వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. మిధునం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటకం కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరం

ఐపిఎల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్ధేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ను కెప్టెన్ రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) విఫలమయ్యారు. అయితే వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్తో కలిసి కెప్టెన్ పరాగ్ ఇన్నింగ్స్ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జురెల్ 42 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పరాగ్ 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. జడేజా కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 6 వికెట్లకు 225 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు నిసాంకా, రాహుల్లు ఢిల్లీకి శుభారంభం అందించారు. నిసాంకా 33 బంతుల్లో 62, రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరగకుండా కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బిఆర్ఎస్ ఉని కి కాపాడుకునే పనిలో నిమగ్నమైందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. కె సిఆర్కు కుమార్తె కవిత పెట్టిన కుంపటితో డాటర్ స్ట్రోక్ తగిలి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చార ని అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం కెసిఆర్, కెటిఆర్కు లేదన్నారు. ప్రజ ల సంక్షేమమే పరమావధిగా ఒక లక్షంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. పదేళ్లలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వాటాల పంపకాల్లో తేడా వల్లే కవిత టిఆర్ఎస్ పార్టీని స్థాపించిందని ఆయన వివరించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి. హరీష్ రావు తన పాత్ర ఏమ

నవతెలంగాణ – కాటారంగౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా కాటారం కేంద్రం లో గల గారేపల్లిలోని జై భీమ్ అంబేద్కర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజ్య సుఖాలను త్యజించి ప్రపంచ మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ వంటి విలువలను అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటికీ సమాజానికి […] The post బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శం: పీక కిరణ్ appeared first on Navatelangana.
ఎస్సెస్సీలో జిల్లా టాపర్గా నిలిచిన మనోజ్ఞకు ఘన సత్కారంనవతెలంగాణ – కాటారంప్రతిభకు పట్టం కట్టిన మరో ఉదాహరణగా, మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని మనోజ్ఞ ఎస్సెస్సీ ఫలితాల్లో 590 మార్కులు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ధన్వాడలో ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి […] The post ఆదర్శ విద్యార్థిని సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

బొప్పరం గ్రామంలో కోతుల రాజ్యం!దిన దినం భయం భయంతో బతుకుతున్న గ్రామ ప్రజలు..సర్పంచ్ హామీలు గాలి మాటలేనా…?నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పరం గ్రామం… పేరు వినగానే శాంతి, పల్లె వాతావరణం గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం “వన్యప్రాణి సఫారి”లా మారిపోయింది. గ్రామంలో కోతుల ‘స్వతంత్ర రాజ్యం’ నడుస్తుండగా, ప్రజలు మాత్రం దిన దినం భయం భయంగా రోజులు గడుపుతున్నారు.ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చిన […] The post సెలవుకి వచ్చిన జవాన్కే ‘మంకీ వార్’… appeared first on Navatelangana.


ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(90) దుమ్మురేపాడు. ధ్రువ్ జురెల్(42) తన విధ్వంసాన్ని కొనసాగించగా.. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(47 నాటౌట్,14 బంతుల్లో), జోఫ్రా ఆర్చర్ 1 నాటౌట్ గా నిలిచాడు.

జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్ శుక్రవారం బిహార్ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేసి కొత్త ఇంటికి మారారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన 1 ఆన్ మార్గ్లోని అధికార నివాసంలో ఉంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నితీశ్ కుమార్, ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరుసటిరోజు బీజేపీ నేత సమ్రాట్ చౌధరి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.నితీశ్ కుమార్ నవంబర్ 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. మేము 1 ఆన్ మార్గ్ నుంచి 7 సర్క్యులర్ రోడ్కు మారాం. ఇక అక్కడే నివసిస్తాం అని నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ మీడియాకు తెలిపారు. 2006లో 1 ఆన్ మార్గ్ను బిహార్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిశాంత్ ప్రజలకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

హైదరాబాద్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం అక్రమ విక్రయాల దందాపై నటి రేణుదేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణాలను చూస్తుంటే సమాజం ఎంతటి భయంకరమైన ’కలికాలం’లో ఉందో అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేసే కఠిన హృదయులు ఉన్న చోట, నోరులేని కుక్కలను వదులుతారని ఎలా అనుకుంటాం?‘ అని ఆమె ప్రశ్నించారు. రక్తం అమ్మేవాడి కంటే కొనేవాడిదే పెద్ద తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా సేకరిస్తున్నారు అనే కనీస అవగాహన లేకుండా కొనడం వల్ల ఇలాంటి అక్రమ దందాలకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. తప్పు చేసిన వారు ప్రకృతి సిద్ధమైన శిక్ష నుంచి తప్పించు కోలేరని ఆమె పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి తప్పుకు ఫలితం అనుభవించా ల్సిందే. మనం చేసే కర్మ మనకు కచ్చితంగా తిరిగి వస్తుంది‘ అని ఆమె హెచ్చరించారు.
హీరో రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్మీట్లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ,”ఉప్పెన’ క్లైమాక్స్ చూసినప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, […] The post ‘పెద్ది’ అద్భుతంగా వచ్చింది appeared first on Navatelangana.

ఇండిగో విమానం ఇక్కడ నుంచి రాయ్పూర్కు బయలుదేరుతుండగా రన్వేపై కోతుల సంచారంతో టేకాఫ్ ఆగిపోయింది. ఎయిర్పోర్టు వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. గురువారం ఇండిగో విమానం 6ఇ6521 మొత్తం 150 మంది ప్రయాణికులతో బయలుదేరుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో రన్వేపై అడ్డుగా కోతులు దాటుకుంటూ రావడాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే టేకాఫ్ నిలిపివేసి ట్రాఫిక్ కంట్రోల్కు విషయం తెలియజేశారు. దాంతో విమానాన్ని తిరిగి వెనక్కు తీసుకు వచ్చి తిరిగి ఇంధనం నింపాక గంట తరువాత బయలుదేరారు. టేకాఫ్ నిలిపివేయడానికి చాలా ఇంధనం అవసరమైంది. దాంతో విమానం విమానం బయలుదేరడం ఆలస్యం కావడమే కాక, మిగతా విమానాలు బయలుదేరడం ఆలస్యమైంది. ఈ సంఘటనకు పది నిమిషాల ముందు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం విమానాశ్రయంలో దిగింది.సమీపాన రన్వేపై కోతుల గుంపు ఉందని ఆ విమానం పైలట్ చెప్పి అధికారులను అప్రమత్తం చేశాడు. ఈ సంఘటన తరువాత ఎయిర్పోర్టు వన్యమృగ నిర్వహణ సిబ్బంది రన్వేను ఖాళీ చేయించిన తరువాత విమానాలు యథాప్రకారం బయలుదేరాయి.
గత కొంత కాలంగా బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ వంటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. బాలకృష్ణ నటించబోయే ఎన్బికే 111 ప్రాజెక్ట్ను దర్శకుడు కొరటాల శివతో చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. బాలకష్ణ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కు సరిపోయేలా హై వోల్టేజ్ యాక్షన్ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ […] The post అధికారానికి ఉద్దేశం తోడైతే..? appeared first on Navatelangana.
హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి.విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం […] The post సబ్బండ వర్గాలకు ఘనమైన నివాళిగా.. appeared first on Navatelangana.


దేశంలో తొలిసారిగా అడ్డంకులు లేని టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు గుజరాత్లోని ఎన్హెచ్ 48పై సూరత్ బహరూచ్ సెక్షన్లో ఇటువంటి వ్యవస్థ ఛోరాయాసి టోల్ ప్లాజా వద్ద అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే మంత్రి సామాజిక మాధ్యమంలో స్పందించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేనినైనా సాధించుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలకు వీల్లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఈ కొత్త విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు తీసుకువచ్చిన ఎంఎల్ఎఫ్ఎఫ్తో ప్రయాణ కాలం తగ్గుతుంది. హైవేలపై రద్దీ తగ్గుతుంది,. ఇంధన సామర్థం పెరుగుతుంది. టోల్ నిర్వహణ దాదాపుగా మానవ రహిత ఆపరేషన్ల ద్వారానే సాగుతుందని వివరించారు. వాహన ఉద్గారాల వ్యాప్తి కూడా తగ్గుతుంది. పౌరులకు సరైన వాహన వెసులుబాటు కల్పించడం కీలకం.
పీనట్ బటర్.. పల్లీ వెన్న తెలియని వారుండరు. చాలా మంది రోజూవారీ అవసరాలకు ఇంట్లో వినియోగిస్తుంటారు. దీని రుచి గురించి వేరే చెప్పక్కర్లేదు.. ఆరోగ్యానికీ పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే పీనట్ బటర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీని ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. గుండె ఆరోగ్యానికి కొండంత అండపల్లీ […] The post నిద్రకు ముందుఓ స్పూను…. appeared first on Navatelangana.
చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లకి పెండ్లి చేస్తే తమ భారం తీరిపోతుందనుకుంటారు. ఇలాంటి ఆలోచనలతో అభం శుభం తెలియని మైనార్టీ తీరని అమ్మాయిలకు పెండ్లి చేసి మూడు ముళ్ల బంధంలో బంధిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వారికి చదువుకునే స్వేచ్ఛను ఇచ్చి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ల కాళ్లపై వారు నిలబడతారు. ఆ తర్వాత పెండ్లి చేస్తే ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే ధైర్యం వాళ్లకు ఉంటుంది. అలా కాకుండా చిన్న వయసులోనే […] The post పెండ్లికెందుకు తొందరా appeared first on Navatelangana.