
3507 వార్తలు
హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి.విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం […] The post సబ్బండ వర్గాలకు ఘనమైన నివాళిగా.. appeared first on Navatelangana.


దేశంలో తొలిసారిగా అడ్డంకులు లేని టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు గుజరాత్లోని ఎన్హెచ్ 48పై సూరత్ బహరూచ్ సెక్షన్లో ఇటువంటి వ్యవస్థ ఛోరాయాసి టోల్ ప్లాజా వద్ద అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే మంత్రి సామాజిక మాధ్యమంలో స్పందించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేనినైనా సాధించుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలకు వీల్లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఈ కొత్త విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు తీసుకువచ్చిన ఎంఎల్ఎఫ్ఎఫ్తో ప్రయాణ కాలం తగ్గుతుంది. హైవేలపై రద్దీ తగ్గుతుంది,. ఇంధన సామర్థం పెరుగుతుంది. టోల్ నిర్వహణ దాదాపుగా మానవ రహిత ఆపరేషన్ల ద్వారానే సాగుతుందని వివరించారు. వాహన ఉద్గారాల వ్యాప్తి కూడా తగ్గుతుంది. పౌరులకు సరైన వాహన వెసులుబాటు కల్పించడం కీలకం.
పీనట్ బటర్.. పల్లీ వెన్న తెలియని వారుండరు. చాలా మంది రోజూవారీ అవసరాలకు ఇంట్లో వినియోగిస్తుంటారు. దీని రుచి గురించి వేరే చెప్పక్కర్లేదు.. ఆరోగ్యానికీ పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే పీనట్ బటర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీని ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. గుండె ఆరోగ్యానికి కొండంత అండపల్లీ […] The post నిద్రకు ముందుఓ స్పూను…. appeared first on Navatelangana.
చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లకి పెండ్లి చేస్తే తమ భారం తీరిపోతుందనుకుంటారు. ఇలాంటి ఆలోచనలతో అభం శుభం తెలియని మైనార్టీ తీరని అమ్మాయిలకు పెండ్లి చేసి మూడు ముళ్ల బంధంలో బంధిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వారికి చదువుకునే స్వేచ్ఛను ఇచ్చి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ల కాళ్లపై వారు నిలబడతారు. ఆ తర్వాత పెండ్లి చేస్తే ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే ధైర్యం వాళ్లకు ఉంటుంది. అలా కాకుండా చిన్న వయసులోనే […] The post పెండ్లికెందుకు తొందరా appeared first on Navatelangana.


సౌందర్యానికి, ఫిట్నెస్కు కేవలం ఖరీదైన డైట్ ప్లాన్లు మాత్రమే అవసరం లేదని.. మన ఇంటి పాతకాలపు వంటకాలు కూడా అద్భుతాలు చేస్తాయని నిధి అగర్వాల్ నిరూపిస్తోంది. ఈ అందాల భామ తన గ్లామర్ రహస్యం పెరుగన్నం అని చెప్పి ఆశ్చర్యపరిచారు. ముందు రోజు రాత్రి అన్నంలో పెరుగు కలిపి తర్వాత రోజు ఉదయం ఆ చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని, ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె తన అనుభవాన్ని షేర్ చేశారు. పెరుగన్నంలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.'

ఓఆర్ఆర్ తోండుపల్లి ఎగ్జిట్- 16 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బొల్లి శివకుమార్ (37), భార్య బొల్లి లాస్య (30), కూతురు రిషిత (8), కోడెం శ్రీనివాస్ (40), భార్య శ్వేత (35) కుమారులు కృష్ణచంద్ర (9), కోడెం మాధవ్ (11)లు కలిసి యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు. తోండుపల్లి ఎగ్జిట్ 16కు దగ్గరలో ఓఆర్ఆర్పై ఆగి ఉన్న AP 39 UV0909 నెంబర్ గల లారీని వ్యాగనార్ TS 23 F 2298 గల కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆమెను స్థానికులు హాస్పటల్కు తరలించారు. సంఘటనకు సంబంధించి చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాలు లా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులోనుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.సిరిసిల్ల ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, శ్వేత, శివ, లాస్య, చిన్నారి కృష్ణచం

చిట్యాల మండంలంలోని బొంగోని చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో గల నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కార్మికుల దినోత్సవమైన మేడే రోజున ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం కార్మికవర్గాన్ని కలచి వేస్తుంది. కార్మికులు తెలిపి వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడి తేరుకునేలోపే కంపెనీ నుంచి దట్టమైన పొగలు, మంటలు వచ్చాయి. దీంతో కంపెనీలో ప్రమాదం సంభవించిందని ప్రజలకు అర్థమైంది. కాగా, మూడో బ్లాక్లో ఈ ప్రమాదం సంభవించింది. చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలక్రిష్ణ 32 చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు గత ఐదేళ్ల్లుగా కంపెనీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆ బ్లాక్లో మొత్తం 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్లోని డీఆర్డీఓ హాస్పిటల్కు తరలించారు.


అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. భారత జట్టు 104 పాయింట్లతో టాప్3లో చోటు సంపాదించింది. ఆస్ట్రేలియా 131 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో మాత్రం టీమిండియా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి డబ్లూటిసిలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో మెరుగైన స్థానంలో నిలిచాయి.

పశ్చిమ బెంగాల్లో శనివారం మే 2న అసెంబ్లీ స్థానాలకు చెందిన 15 పోలింగ్ బూత్లలో రీపోల్ జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల అక్రమాల ఆరోపణలు రావడంతో వివాదానికి తెరదించేందుకు ఇక్కడ రీ పోల్కు దిగుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ నిర్వహిస్తారుఇప్పుడు రీ పోలింగ్ జరిగే కేంద్రాలు సౌత్ 24 పరగణా జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రహాట్ పశ్చిమ అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నాయి. ఇక ఫల్తా పోలింగ్ స్టేషన్లో కూడా అక్రమాల ఫిర్యాదులు అందాయి. అయితే ఇక్కడ రీ పోలింగ్పై ఇసి నిర్ణయం వెల్లడికావల్సి ఉంది.

పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఏకగ్రీవంగా నెగ్గింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారధ్య ప్రభుత్వం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆప్ ఎంపీల ఫిరాయింపుల దశలో ఈ బలపరీక్షకు దిగింది. బలపరీక్ష కోసం పంజాబ్ విధాన సభ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. పార్టీలో తామంతా విశ్వసనీయ సైనికుల మాదిరిగా ఉంటామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. తమ ప్రభుత్వ బలపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాన్ స్వయంగా సభలో ప్రవేశపెట్టారు. ఆప్ కథ ముగిసినట్లే అని , ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లుతారని ప్రచారం జరిగిందని , దీనితో ప్రజలలో ఏదో జరుగనుందనే భ్రమలు ఏర్పాడ్డాయని మాన్ తీర్మానం ప్రవేశపెట్టే దశలో తెలిపారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టే దశలో సభలో విపక్షాలు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీంగా ఆమోదించింది. తామంతా కూడా కేజ్రీవాల్ వెంబడి నిలబడుతామని, తనకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఉంటారని ఈ సందర్భంగా మాన్ తెలిపారు.

దేశవ్యాప్తంగా శనివారం నాడు సెల్ఫోన్ వినియోగదారుల ఫోన్లు గట్టి శబ్దం లేదా వైబ్రేషన్తో కాసేపు మోతమోగనున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్యర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్షలు జరపనున్నారు. పరీక్ష సమయంలో ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ సమయంలో ఫోన్ గట్టి శబ్దంతో మోగుతుంది. సంబంధిత విపత్తు నిర్వహణ సందేశం కూడా బయటికి వినపడుతుంది. దేశంలో అలర్ట్ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తున్నది దీని ద్వారా తెలుస్తుంది. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రజలకు సందేశాన్ని వెంటనే చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని, అందుకే అలర్ట్ సందేశాన్ని సెల్ఫోన్ వినియోగదారులందరికీ పంపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


మధ్యప్రదేశ్లో గురువారం జరిగిన నాటు పడవ ప్రమాదంఓ హృదయ విదారక దృశ్యాన్ని కళ్లముందుంచింది. బర్గి రిజర్వాయర్లో బోటు షికారుకు వెళ్లిన దశలో పెనుగాలులు పడవ బోల్తాకు దారితీశాయి. ఈ దశలో ఓ తల్లి పడవ ఊగిసలాట దశలో , ఇక మునక తప్పదని తెలిసినా చివరి వరకూ తన నాలుగేండ్ల కొడుకు ప్రాణాలను రక్షించాలని తాపత్రయపడింది. బాబును గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ ఒకే లైఫ్ జాకెట్లో శవాలుగా మరుసటి రోజు గాలింపు చర్యల దశలో దొరికారు. బిడ్డ కోసం తల్లి పడ్డ ఆరాటం, కబళించిన నీటి కెరటాల నడుమ ఆమె బిడ్డ కోసం జరిపిన తుది పోరాటం గుర్తుకొచ్చేలా వీరి చివరి దశ ఉంది. ఈ జంట శవాలను చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీటి పర్యంతం అయింది. అక్కడ సహాయక చర్యల పర్యవేక్షణలో ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు ఈ తల్లి కొడుకుల దీన స్థితి చూపి చలించిపోయాడు. కన్నీరు దిగమింగుకునేందుకు తల్లడిల్లాల్సి వచ్చింది.

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)లో చేరనున్నారు. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టిఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎంఎల్ఎగా గెలిచారు. ఎన్టి రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.పార్టీ, కార్మిక జెండాలు ఎగురవేసిన కవిత ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలను శుక్రవారం బంజారాహిల్స్లోని తెలంగాణ రాష్ట్ర సేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మే డే జెండాతో పాటు కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్మికులు, కర్షకులకు మే డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించారు. మే డే వేడుకల్లో ఆటో యూనియన్ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు


అమెరికాలో ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది లో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే కర్నూలుకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు అమెరికా, షికాగోలోని డీపాల్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయ త్నాలు చేస్తున్నాడు. అయితే, అమెరికాలో మారిన పరిస్థితుల కారణంగా ఉద్యోగం రావటం కష్టతరంగా మారింది. అవసరాల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవటం.. ఖర్చుల కోసం కుటుంబసభ్యుల మీద ఆధారపడాల్సి రావటం తో చందు తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28వ తేదీన అపార్ట్మెంట్ గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణా లు తీసుకున్నాడు. చందు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకుపైనే ఆశలన్నీ చందు తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు చందుని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుత




సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా శివమ్ మావి లీగ్ నుంచి దూరమైన విషయం తెలిసిందే. గత మినీ వేలంలో మావిని రూ.75 లక్షలకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అయితే అతడు గజ్జల్లో గాయం కారణంగా లీగ్కి దూరమయ్యాడు. ఇప్పుడు అతడి స్థానాన్ని యువ ప్లేయర్ ఆర్ఎస్ అంబరీష్తో భర్తీ చేసింది. అంబరీష్ మీడియం పేస్ ఆల్ రౌండర్. అండర్-19 వరల్డ్ కప్-2026 విన్నింగ్ జట్టులో అతడు సభ్యుడు. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకింగ్ బౌలర్. ఈ 18 ఏళ్ల కుర్రాడు కుడిచేతితో బౌలింగ్ చేస్తాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన అంబరీష్కు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రఫుల్ హింగే, సకిబ్ వంటి కుర్రాళ్లకు సన్రైజర్స్ ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇంకా ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 3వ తేదీన ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 𝐀𝐍𝐍𝐎𝐔𝐍�