🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3732 వార్తలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీ చైతన్య కాలేజీలో చోరీ.. దొంగ అరెస్ట్‌‌‌‌‌‌‌‌
పాత
సుర్రుమంటున్న సూరీడు... వడదెబ్బతో నలుగురు మృతి
పాత
తెలంగాణ

సుర్రుమంటున్న సూరీడు... వడదెబ్బతో నలుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు విశ్వరూపం చూపిస్త్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. మండిపోతున్న ఎండల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో మనకు పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఎలా ఉంటుందో తెలిస్తేనే భయం వేస్తోంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజు వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇతర జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వడదెబ్బతో మంచిర్యాల జిల్లాలో భోగారపు మార

ప్రధాని రాకతో రాష్ట్ర రాజకీయంలో పెనుమార్పు: బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు
పాత
ఫ్యూచర్ సిటీ కేంద్రంగా  హైస్పీడ్  రైల్ కారిడార్ హబ్ : మంత్రి కోమటి రెడ్డి
పాత
ఫ్యూచర్ సిటీలో  భారీ మెడికల్ హబ్ : సీఎం రేవంత్ రెడ్డి
పాత
కాంగ్రెస్‌‌ ఎంపీలపై కేసీఆర్‌‌ వ్యాఖ్యలు సరికాదు : వరంగల్‌‌ ఎంపీ కడియం కావ్య
పాత
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి : సీఎం రేవంత్‌‌ రెడ్డి
పాత
మక్క కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎంపీ డీకే అరుణ
పాత
అనాథ పిల్లలకు అండగా ఉంటాం : మంత్రి సీతక్క
పాత
గన్నీ బ్యాగుల కోసం రైతుల పడిగాపులు
పాత
ఫోన్ తెచ్చిన తంటా... బాలుడిని చంపి
పాత
తెలంగాణ

ఫోన్ తెచ్చిన తంటా... బాలుడిని చంపి

అమరావతి: ఇద్దరు బాలుర్లు ఫోన్లలో ఆడుకుంటుండగా ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఓ బాలుడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని పూడ్చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విందూరు ప్రాంతంలోని మర్రిపల్లిమడుగు గ్రామ శివారులోని ఓ తోటలో రెండు కుటుంబాలు పని చేస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన 17 ఏళ్ల బాలుడు, ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. ఇద్దరు ఫోన్‌లో ఆడుకుంటుండగా గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో 17 ఏళ్ల బాలుడు మరో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. భయంతో అక్కడే గుంటలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. తన కుమారుడు కనిపించడంతో గూడూరు పిఎస్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ : డీజీపీ శివధర్ రెడ్డి
పాత
కరెంట్ లైన్పై పిడుగుపడి.. ఊరంతా విద్యుత్ షాక్
పాత
ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణం తీసిన బిర్యానీ, పుచ్చకాయ
పాత
తెలంగాణ

ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణం తీసిన బిర్యానీ, పుచ్చకాయ

ముంబయి: బంధువులతో కలిసి బిర్యానీ తిన్నం తరువాత ఓ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడంతో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రాలోని ముంబయిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పైధోనీలో అబ్దుల్లా కాదర్(40), నస్రీన్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఆయేషా(16), జైనాబ్(12)లు ఉన్నారు. కాదర్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో అబ్దుల్లా కుటుంబం వెళ్లింది. వింధులో బిర్యానీ తరువాత ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఆదివారం ఉదయం ఐదు గంటల వాంతులు, విరేచనాలు కావడంతో వారు స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుడ్ పాయిజన్‌తోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
పాత
తెలంగాణ

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘బిఆర్‌ఎస్ అధినే త, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మర మనిషా.. మనసున్న మనిషా? అనే కవిత ప్రశ్నలకు తొలుత కెసిఆర్ జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కౌ న్సిల్ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. భ విష్యత్తులో బిజెపితో కలిసి పోటీ చేయబోమని కె సిఆర్ ఒట్టేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించా రు. కెసిఆర్‌కు చెడు జరగాలని ఆ కుటుంబ సభ్యు లే తప్ప ఎవరూ కోరుకోవడం లేదన్నారు. కెసిఆర్ తనకు శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి మాత్రమేనని అన్నారు. బిఆర్‌ఎస్ చచ్చిన శవంతో సమానమని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా, బిఆర్‌ఎస్‌కే మనుగడ లేనప్పుడు కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడాలని ఆయన దాట వేశారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌కు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. రా

బిఆర్‌ఎస్ కమిటీలన్నీ రద్దు
పాత
తెలంగాణ

బిఆర్‌ఎస్ కమిటీలన్నీ రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మిన హా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ పార్టీ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్ని స్థా యిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్‌కు అప్పగించారు. వెంటనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ ర జతోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భం గా కెటిఆర్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. లో క్‌సభలో బిఆర్‌ఎస్ సభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇటీవల లోక్‌సభలో బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని, బిఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని పేర్కొన్నారు. హెచ్చరించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడితే బిఆర్‌ఎస్ పక్షనేత సురేశ్ రెడ్డి

సాదాబైనామాలపై ఆర్‌డిఓలకే నిర్ణయాధికారం
పాత
తెలంగాణ

సాదాబైనామాలపై ఆర్‌డిఓలకే నిర్ణయాధికారం

మన తెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కరే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరిం త వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీఓలకే అధికారాలను ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యం త ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్

ఇది ఆయిల్ కంపెనీల మాయ?
పాత
తెలంగాణ

ఇది ఆయిల్ కంపెనీల మాయ?

మన తెలంగాణ/హైదరాబాద్: ఆయిల్ కంపెనీల మాయాజాలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి బంక్‌లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను తగ్గించాయి. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా డబ్బులు చెల్లించి న బంక్‌లకు సైతం పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయకపోవడంతో బంక్ ల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంక్‌ల్లో వా హనాల రద్దీ పెరుగుతోంది. ఈనెల 29వ తేదీన పశ్చిమబెంగాల్‌లో రెం డో విడత ఎన్నికలు అయిపోగానే ఆయిల్ ధరలను విడతల వారీగా పెం చే ఉద్ధేశ్యంలో భాగంగా బంక్‌లకు ఆయిల్ సరఫరాను కంపెనీలు తగ్గించాయని తెలిసింది. దీనిపై బంక్‌ల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఆయిల్ కంపెనీలు సివిల్ సప్లయ్ అధికారులు చర్చలు చేపట్టినట్టుగా సమాచారం.దీనికితోడు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గాయని అందుకే బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో వాహనదారులు భయంతో బంక్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఆయిల్ కంపెనీ

బిడ్డను కన్న తర్వాత ఇప్పుడు అత్యాచారమంటారా?
పాత
తెలంగాణ

బిడ్డను కన్న తర్వాత ఇప్పుడు అత్యాచారమంటారా?

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సోమవారం ఒక మహిళను ఉద్దేశించి, సమ్మతితో ఉన్న సంబంధంలో నేరం అనే ప్ర శ్న ఎక్కడుంది? అని ప్ర శ్నించింది. తప్పుడు వివాహ హామీతో లైంగిక దాడి చేశాడం టూ తన మాజీ సహజీవన భాగస్వామిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును ఆమె స వాల్ చేసింది. న్యాయమూర్తులు బి.వి. నాగర త్న, ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాలా కాలం పాటు కలిసి నివసించారని, వారికి ఒక సంతానం కూడా ఉందని ధర్మాసనం గమనించింది. వీరిరువురూ కలిసి జీవించారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. వివాహం జరగలేదని ఇప్పుడు లైంగిక దాడి అంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి జీవించారు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. మహిళ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆమె భర్త మరణించిన తర్వాత తన బావ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పరిచ యం ఏర్పడిందని తెలిపారు. వివా హం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించాడని కోర్టుకు వివరించారు. దీనిపై జస్టి స్ నాగరత్న స్పందిస్తూ, అయితే వివాహానికి ముందే ఎందుకు అతని తో కలిసి జీవించింది? అని ప్రశ్నించా రు. ఆమె అతనితో కలిసి సహజీవనం చేసిం

కుప్పకూలిన భారీ క్రేన్.. ఐదుగురి దుర్మరణం
పాత
తెలంగాణ

కుప్పకూలిన భారీ క్రేన్.. ఐదుగురి దుర్మరణం

మన తెలంగాణ/శంకర్‌పల్లి: గాలివాన నుంచి ప్రాణాలు కాపాడుకుందామని షెడ్డు కిందకు వె ళ్లిన కార్మికులకు, అదే షెడ్డు మృత్యుపాశమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని ఎన్‌సిసి (నాగార్జున కన్స్ట్రక్షన్స్) కంపెనీలో భారీ క్రేన్ షెడ్డుపై విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం శంకర్ పల్లి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలివాన మొదలైంది. ఆ సమయంలో ఎన్‌సిసి కంపెనీ బ్రిక్స్, భారీ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులు వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఒక రేకుల షెడ్డు కిందకు చేరారు. అయితే గాలి తీవ్రతకు షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి కార్మికులు ఉన్న షెడ్డుపై కుప్పకూలింది. భారీ క్రేన్ ఒక్కసారిగా పడటంతో షెడ్డు కింద ఉన్న వారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. క్రేన్ ఇనుప విడిభాగాల కింద నలిగి ఐదు మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా సమయంలో షెడ్డు కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో క్షతగాత్రుల సంఖ

కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి
పాత
తెలంగాణ

కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మధిరలో ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభనవతెలంగాణ-మధిరకార్మికులు, కర్షకుల హక్కుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని కడదాకా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయి) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరస్తు ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం పార్టీ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి అధ్యక్షతన ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. […] The post కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి appeared first on Navatelangana.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
పాత
తెలంగాణ

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతులు సద్వినియోగం చేసుకోవాలిశాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం లాభసాటి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణనవతెలంగాణ- అశ్వారావుపేటరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.నాగాంజలి, డాక్టర్‌ ఐ.కృష్ణతేజ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామంలో ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు […] The post రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.

పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి
పాత
తెలంగాణ

పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ‘నో స్టాక్‌ బోర్డులు’ కనపడుతున్నాయనీ, దీంతో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాభాపేక్షతోనే ఆయిల్‌ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. కేంద్ర […] The post పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA