
3807 వార్తలు



మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రి పాలనతో రాష్ట్రాభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. పిసిసి కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన సమర్థ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటైన ఈ శిక్షణా శిబిరం వచ్చే నెల 2వ తేదీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ.. బిఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ళ బిఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం, దోచుకున్న వారంతా ఇప్పుడు కెసిఆర్ పక్కన పందికొక్కుల్లా ఉన్నారంటూ టిఆర్ఎస్ (సేన) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బిఆర్ఎస్ను ఆదరించే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పంచాయితీతో కెసిఆర్ సతమతమవుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పు
నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో 2027 జనాభా లెక్కలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశలో ఇండ్లు, సంబంధిత వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. మొదటి దశలో ఎన్యుమరేటర్స్ స్వయంగా ప్రజల ఇండ్ల వద్దకు వచ్చి సమాచారం సేకరిస్తారు. అయితే, ఈసారి ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోటా ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. ప్రభుత్వం ఈ ఏడాది జనగణన కార్యక్రమాన్ని డిజిటల్ విధానం ద్వారా కూడా చేపట్టడంతో ప్రజలు […] The post సెల్ఫ్ ఎన్యుమరేషన్..వీడియో appeared first on Navatelangana.

నవతెలంగాణ – అచ్చంపేటయువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి జీవితం నాశనం అవుతుందని అచ్చంపేట పోలీస్ సిఐ నాగరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో యువతకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మహిళల చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానంగా యువత నేటి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. సాంకేతిక రంగం తీవ్రంగా విస్తరిస్తోందని అన్నారు. నేటి యువత […] The post యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ […] The post కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కిశోర బాలికల సంరక్షణ, వారి అభివృద్ధిపై భూపాలపల్లి జిల్లా మహిళ సంక్షేమశాఖ (డిడబ్ల్యూఓ) అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన అవగాన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తహశీల్దార్ రవికుమార్, ఏపీఎం […] The post కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన appeared first on Navatelangana.

తెలంగాణ కొత్త పోలీస్ బాస్ గా సివి ఆనంద్ ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను డిజిపిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్.. రాష్ట్ర పోలీస్ శాఖలో పలు హోదాలో పనిచేశారు. ప్రస్తుతం హోం సెక్రెటరీగా ఉన్న సివి ఆనంద్.. డిజిపి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డిజిపిగా పనిచేస్తున్న శివధర్ రెడ్డి.. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.



నవతెలంగాణ-హైదరాబాద్: మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక అర్ధాకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలం కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికులను క్షేత్రస్థాయికి ఉన్నతాధికారులు పరిశీలించాలని, అప్పడే […] The post కనీస వేతనానికి నోచుకోని ఉపాధి హామీ కార్మికులు: కొండమడుగు నర్సింహ appeared first on Navatelangana.


నవతెలంగాణ-అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి రైతులు పంటలు విక్రయించడానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు రావడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. అమ్మకాలు, కొనుగోలు లలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు భోజనాలు చేసుకోవడానికి విశ్రాంతి […] The post విశ్రాంతి భవనానికి తాళం.. రైతుల అవస్థలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – కాటారంకాటారం మండలం లోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం భరోసా టీం, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చైల్డ్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాలు) వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలను తెలియజేస్తూ, అటువంటి సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. […] The post పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన appeared first on Navatelangana.
నవతెలంగాణ-కాటారం కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర మంగళవారం బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సడవలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, కిశోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని, […] The post కాటారంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పరుష లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఈ సందర్భంగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య తన చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కల్యాణ లక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. […] The post కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన ఏనుగు వీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ మంగళవారం మృతురాలి కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. సన్నబియ్యం బస్తా, క్యాన్ నూనె, నిత్యావసర వస్తువులు అందజేసీ ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, కోశాధికారి బాపు, కార్యదర్శి రమేష్ రావు, శేషిదర్ రావు పాల్గొన్నారు. The post మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం appeared first on Navatelangana.