
3911 వార్తలు

నేటి వేగవంతమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లేదా నీరసంగా అనిపించడం వంటి చిన్న సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల చాలామంది డాక్టర్లను ఆశ్రయించి మందులను వాడుతుంటారు. అయితే వంటింట్లోనే లభించే రెండు మసాలా దినుసులను ఉపయోగించి ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా? అవును, నిజమే!వంటగదిలో కనిపించే జీలకర్ర- సెలెరీ నీరు దాదాపు అని ఆరోగ్య సమస్యలను దూరం చేసి, శరీరాన్ని ఎంతో ఆరోగ్యాంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మరి ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కలిగే లాభాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర-సెలరీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు 1. జీలకర్ర, సెలెరీ రెండింటిలోనూ జీర్ణక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. 2. ఈ నీరు జీవక్రియను వేగవంతం చేసి, శరీరం కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. 3. జీలకర్ర, సెలెరీ నీరు శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడ

అతి చిన్న వయస్సులోనే ఐపిఎల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 15 ఏళ్లకే ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్లో భారీగా పరుగులు చేస్తున్న వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కాగా, ఎంత సీరియస్ క్రికెట్ ఆడుతున్న.. వైభవ్లోని ఆ చిన్న పిల్లాడి లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇప్పటికీ తాను కార్టూన్లు చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తన ఫోటో కోసం వచ్చిన పిల్లలను సరదాగా ఆటపట్టించాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ ఇప్పటికే ఛత్తీస్గఢ్ చేరుకుంది. అయితే ఎయిర్పోర్ట్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. వాళ్లతో వైభవ్ ‘‘బ్రదర్.. నేను ఫోటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును నేను సీరియస్గా చెబుతున్నా’’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులు ఆలోచనలో పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వైభవ్ వాళ్లను అడ్డుకొని ఒక్కో ఫోటోకి రూ.100 తీసుకుంటానని.. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అని అడిగా. అందులో ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని ఆఫర్ చేశ

శారాజీపేట పిహెచ్సీ డాక్టర్ హైమావతి నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామంతో పాటు బైరంనగరం, రాజానగరం,రాఘవపూరం గ్రామాల ప్రజలు రేపు (మంగళవారం) నిర్వహించే మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలని శారాజీపేట పిహెచ్సీ డాక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 9 గంటలకు కొలనుపాక ఘడిలోని రైతు వేదిక వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్-రే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి […] The post మెగా ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలి appeared first on Navatelangana.

నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత దినచర్యల కారణంగా మలబద్ధకం సర్వసాధారణం అవుతోంది. చాలా మంది ఈ సమస్యను లైట్ తీసుకుంటున్నారు. అయితే, దీర్ఘకాలిక మలబద్ధకం శరీరానికి ఒక తీవ్రమైన సంకేతం కావచ్చు. ఇది కడుపులో భారంగా ఉండటం, గ్యాస్, ఎసిడిటీ, నీరసం వంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడానికి మందులపై ఆధారపడకుండా కొన్ని సులభమైన అలవాట్లను ప్రయత్నించవచ్చు. ఇవి కడుపును శుభ్రపరచడమే కాకుండా, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే 5 అలవాట్ల గురించి తెలుసుకుందాం. 1. ఉదయం గోరువెచ్చని నీరు తాగడం రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం మలబద్ధకానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మలవిసర్జనను సులభతరం చేస్తుంది. కావాలనుకుంటే, దానికి కొద్దిగా నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. 2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం. ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, సలాడ్లను చేర్చుకోవాలి. పీచుపదార్థం మలాన్ని మృదువుగా చేసి, ప్రేగులను శుభ్రంగా ఉంచడ


మున్సిపాలిటీ ఆదాయానికి గండపట్టించుకోని అధికారులునవతెలంగాణ – అచ్చంపేటమునిసిపాలిటీలలో గానీ గ్రామపంచాయతీలలో గానీ వ్యవసాయ భూములు ఇండ్ల స్థలాలుగా మార్చి విక్రయించాలంటే మునిసిపాలిటీ ఆఫీస్ నుంచి లే అవుట్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని నిబంధనలకు ప్రకారంగా ఇంటి స్థలాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కానీ అచ్చంపేట పట్టణంలో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ చేసి విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన మునిసిపాలిటీ అధికారులు వ్యక్తిగతంగా మాముళ్ళు ( లంచాలు) తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా […] The post లే అవుట్ లేకుండానే ప్లాట్లు అమ్మకాలు appeared first on Navatelangana.


భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా అనేక తయారీదారులు అద్భుతమైన ఎంపికలను అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ త్వరలో ఒక కొత్త మోటార్సైకిల్ను విడుదల చేయనుంది. ఈ విడుదలకు ముందు, తయారీదారు సోషల్ మీడియాలో ఒక టీజర్ను విడుదల చేసింది. ఆ వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. టీజర్ విడుదలకొత్త మోటార్సైకిల్ విడుదలకు ముందు, తయారీదారు ఒక టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్ మోటార్సైకిల్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. టీజర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విడుదల తేదీ వివరాలను కూడా తెలియజేస్తుంది. ఏ సమాచారం వెల్లడైంది? సోషల్ మీడియాలో విడుదల చేసిన టీజర్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో పెద్ద LED DRLలు, సర్కిల్ షేప్ లో ఉన్న LED హెడ్లైట్ ఉన్నాయి. ఈ మోటార్సైకిల్ను ఏప్రిల్ 30న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కూడా తయారీదారు ప్రకటించింది. ఇంకా "మీ ధైర్యాన్ని చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వేచి చూడండి! 30.4.2026 భారతదేశపు అత్యంత ధైర్యమైన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రాబోతోంది!" అని ఆ పోస్ట్లో ఉంది. LFP బ్యాటరీ తయారీదారు ఇ

నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్ appeared first on Navatelangana.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 15న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ‘తస్సాదియ్యా’ అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 20 వేలకు పైగా రీల్స్తో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూ ట్యూబ్, షార్ట్ వీడియోస్లోనూ సాంగ్ అందరినీ అలరిస్తూ సాంగ్ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్లో దూసుకెళ్తోంది. ఈ సెలబ్రేషన్ సాంగ్ను పర్ఫెక్ట్గా సంతో ష్ నారాయణన్ కంపోజ్ చేశారు. సమంత ఈ సినిమాలో కేవలం లీడ్ రోల్లో నటించటమే కా దు.. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు.



నవతెలంగాణ-హైదరాబాద్: డీజిల్ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ …. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఆటోలు , గూడ్స్ వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఆటో, హమాలీ ఇతర కార్మికులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు […] The post డీజిల్, పెట్రోల్ కొరత నివారించాలంటూ … విజయవాడలో సీపీఐ(ఎం) ఆందోళన appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ (హాస కొత్తూర్) చౌరస్తా వద్ద ఉన్న పార్టీ జెండా గద్దె వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్ బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను […] The post బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ చంద్ర బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో తమ గ్రామ పోలీస్ గా వ్యవహరించిన కానిస్టేబుల్ నవీన్ చంద్ర బదిలీ పై వెళ్తుండడంతో ఈ మేరకు సోమవారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన్ చంద్రను ఎస్ఐ అనిల్ రెడ్డి సమక్షంలో శాలువాతో ఘనంగా […] The post బదిలీపై వెళ్తున్న గ్రామ కానిస్టేబుల్ కు సన్మానం appeared first on Navatelangana.

మాజీ చండూరు ఎంపీపీ తోకల వెంకన్న నవతెలంగాణ – చండూరు రాష్ట్ర ప్రజల సమస్యల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను సోమవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీగా […] The post ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ appeared first on Navatelangana.

అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో లారీ బీభత్సం చేసింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న కూలీల్ని లారీ ఢీకొంది. లారీ ఢీకొట్టడంతో కూలీలు ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.