22419 వార్తలు

అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయో పరిమితిని 21కి తగ్గించాలియువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం ‘నీట్’ ఆందోళనలు, నమోదైన కేసులపై కేంద్రం సమీక్షించాలి నష్టపోయిన కుటుంబాలకు సాయం చేయాలి జాతీయ మీడియాతో సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలుమన తెలంగాణ/హైదరాబాద్: ‘జై జవాన్ జై కిసాన్ - జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరా రు. హైదరాబాద్లో జాతీయ మీడియా ప్రతినిధులతో ఆదివారం జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. యువశక్తే దేశ భవిష్యత్కు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రం గాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యు వతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని

హన్మకొండలోని నివాసంలో ఉదయం మాజీ ఎంఎల్ఎ సుదర్శన్రెడ్డికి గుండెపోటు హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పలుమార్లు సిపిఆర్ తొమ్మిదోసారికి ఫలించిన వైద్యురాలు మమత ప్రయత్నం కెసిఆర్ ఆదేశాలతో హన్మకొండకు కెటిఆర్, హరీశ్రావు మెరుగైన వైద్యం కోసం గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలింపుసికింద్రాబాద్ యశోదలో కొనసాగుతున్న చికిత్సమనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్రావు, పార్టీ నేతలు హుటాహుటిన వరంగల్కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదర్శన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స మొదలు పెట్టామని

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశారు. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. వయసు పైబడటం, రాజకీయాలు అవినీతిమయం కావడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సంక్షేమం కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోసారి ఎన్నికల్లో పోటీచేయాలని మైసూరులోని వరుణ నియోజకవర్గం ప్రజలు తనను కోరారని, అయితే ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని సిద్ధరామయ్య తెలిపారు.గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు సమకూర్చేవారని, విజయాన్ని చేకూర్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 79 ఏళ్లని, తమ (కాంగ్రెస్) ప్రభుత్వం పదవీకాలం మరో ఏడాదిన్నర మిగిలి ఉందని చెప్పారు. అప్పటికి తన వయస్సు 81-82 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. ఆరోగ్యం బాగోలేకపోవడ

‘సర్’కు మరో వారం రోజులే గడువు 74.38 శాతం డిజిటలైజేషన్ పూర్తిజిల్లాల్లో 80 శాతం పైనే ఫారాల సమర్పణహైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 60 శాతం లోపే డిజిటలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల నుంచి సుమారు కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశం ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితామన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..సర్) గడువు మరో వారం రోజులే మిగిలింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. సర్ ప్రక్రి య జిల్లాల్లో మెరుగ్గా కనిపిస్తుండగా, హై దరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయం త్రం వరకు 2,51,61,783 (74.38 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన ట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. చాలా జిల్లాలో 80 శాతానికి పైగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్లో 51.85 శాతం, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా

జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల అమానవీయ దాడులపై నిలదీసేందుకు సిద్ధమవుతున్న విపక్షం ప్రధాని మోడీ క్షమాపణకు పట్టుపట్టే అవకాశం హోంమంత్రి అమిత్ షాకు విపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటైన లేఖ నిరసనకారులపై పెల్లెట్ గన్స్కు మీరే అనుమతించారా? అని నిలదీత బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పో లీసులు దారుణంగా వ్యవహరించారన్న ఆ రోపణలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర తిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టనున్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపా యి. అయితే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రెండేళ్ల కిందటి ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై వైఖరిని సోమవారం ఖరారు చేయనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటు కార్యాలయంలో సోమవారం ఉదయం జరి గే ఇండియా కూటమి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్న ట్లు సమాచారం. విద్యార్థులపై ‘అమానవీయ దాడి’కి బాధ్యులెవరో తే

తాత్కాలిక టెంట్లు కనుమరుగు, ఇళ్లకు మళ్లిన విద్యార్థులు 53 మెట్రిక్ టన్నుల వ్యర్ధ పదార్ధాలను తొలగించిన ఎన్డీఎంసీ నినాదాలున్న గోడలకు పెయింటింగ్, ఫుట్పాత్ల రిపేర్ టైఫాయిడ్ నుంచి కోలుకుంటున్న దీప్కే ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేసిన సిజెపి నేత ఈ పోరాటం ముగింపు కాదు, ఆరంభం మాత్రమేనని స్పష్టీకరణన్యూఢిల్లీ: నినాదాలు, ప్రసంగాలు, ఆందోళనలతో అట్టుడికిన జంతర్ మంతర్ వద్ద తిరిగి ప్రశాం త పరిస్థితి నెలకొంటోంది. మంత్రి పదవికి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆందోళనలకు సారథ్యం వహించిన సిజెపితో కేంద్రం జరిపిన చ ర్చలు విజయవంతం కావడంతో 36 రోజుల జెన్ జీ, సిజెపి నిరసలకు శనివారంనాడు తెరపడింది. సిజెపి విజ్ఞప్తి మేరకు విద్యార్థులు ఇళ్లముఖం ప ట్టారు. దీంతో ఆదివారంనాడు జంతర్మంతర్ వ ద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే టైఫాయిడ్ నుంచి కోలుకోగా, పర్వావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. విద్యార్థుల నిరసనలకు ముగియడంతో జంతర్ మంతర్ వద్ద మునిసిపల్ కార్మికులు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసే పనుల ను వేగవంతం చేశారు. సుమారు 100 మందికి పైగా పారిశుధ్

మేషంప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగి ఇబ్బంది పెడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృషభం ఆర్థికంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కీలక పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిధునం ఉద్యోగస్తులకు అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం అదృష్టం కలిసివస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పితృస్వామ్య ఆస్తుల లేదా పాత వివాదాల విషయంలో అనుకూల నిర్ణయాలు వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహం ఆరోగ్య విషయంలో మిక్కిలి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. బంధువులతో

కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం 48 కిలోల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చానుపురుషుల విభాగంలో రిషికాంత సింగ్కు రజతం రాష్ట్రపతి, ప్రధాని, సిఎం సహా పలువురు ప్రముఖుల అభినందనలు గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం వచ్చిచేరింది. మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా, కామన్వెల్త్ గేమ్స్లో చానుకు ఇది వరుసగా మూడో గోల్డ్ మెడల్. అంతకుముందు 2018లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన చాను.. 2022లో జరిగిన విశ్వక్రీడల్లో మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో వరుసగా మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్గా చాను నయా రికార్డును నెలకొల్పింది. అదివారం జరిగిన ఈ పోటీల్లో స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కిలోల బరువు ఎత్తిన చాను.. రెండో ప్రయత్నంలో 82 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ంది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త స్నాచ్ రికార్డును నమోదు చేసింది. అనంరతం జరిగిన క్లీన్ అండ్ జెర్క్


సహాయక చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఐరోపా దేశాలుమాడ్రిడ్ : స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, సైనిక బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇందుకు ఐరోపాలోని ఆయా దేశాలు కూడా సాయపడుతునాయి. ఫ్రాన్స్లోని బోర్డో నగర పరిసరాల్లో మంటలు అత్యంత తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. గిరోండ్, లాండెస్ ప్రాంతాల నుంచి సుమారు 1.97 లక్షల మందిని ఖాళీ చేయించారు. మంటల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో రవాణా సేవలను నిలిపివేశారు. ప్రజల కోసం తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంటలను అదుపు చేసేందుకు సైనిక విమానాలు, అగ్నిమాపక హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. స్పెయిన్లో మాడ్రిడ్కు పశ్చిమాన అడవిలో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. సుమారు 70 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగతో మాడ్రిడ్లో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు అత్యవసరమైతే


మన తెలంగాణ/హైదరాబాద్ః ఆరోగ్య రంగానికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద పీట వేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, రోగికి చేసే వైద్యం ఒక వ్యక్తికే కాకుండా సమాజానికి, దేశానికి చేసే సేవగా భావించాలని ఆయన తెలిపారు. బిజెపి డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ భావంతోనే దేశాభివృద్ధి సాధ్యం అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తోందని ఆయన చెప్పారు. జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది జీతాల వరకు మెజారిటీ నిధులను కేంద్రమే అందిస్తోందని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రధాని మోడీ అందించిన ప్రోత్సాహమే కారణమని కొనియాడారు. స్వచ్ఛ భారత్ పరిసరాల పరిశుభ్రతకే కాక ’స్వస్థ్ భారత్’ సాధనకు పునాదిగా నిలిచిందని తెలిపారు. ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్స



మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడ్రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిలాో్ల్ల్ల కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది. హైదరా బాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ చినుకులు లేదా మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ బోగాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన (శనివారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. శనివారం ఉదయం10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కుంటారు. ఉదయం 10:45-10:50 గంటలకు ప్రధాని మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎపి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎపి సిఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:5010:55 గంటలకు కారులో ప్రయాణి కుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. 10:5510:58: 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు. 11, 11.15 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. 11.17 - 11.25 గంటలకు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 11:3012:55 గంటలకు విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 8 నెలల కాలం పూర్తి చేసుకున్న అమెరికా-రష్యా వ్యోమగాములు ఆదివారంనాడు సురక్షితంగా కజకిస్థాన్ భూభాగానికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు సెర్గీ కుద్-స్వెర్చ్కోవ్, సెర్గీ మిఖాయేవ్లు సోయుజ్ ఎంఎస్-28 నౌక ద్వారా దిగారు. అంతరిక్షంలో 241 రోజలు పాటు వీరు గడిపారు. ఇది విలియమ్స్, విఖాయేవ్లకు తొలి అంతరిక్ష మిషన్ కాగా, కుద్-స్వెర్చ్కోవ్కు రెండవది.

లండన్: ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు వద్ద భారతీయ నావికులున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి జాడ గల్లంతైనట్టు కీవ్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారంనాడు తెలిపింది. నల్ల సముద్రంలోని ఒడెసా ఓడరేవు వద్ద ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ వాణిజ్య నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్టు వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో నలుగురు భారతీయులు ఆ నౌకలో ఉన్నారని, ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, గల్లంతైన ఇద్దరు భారతీయుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఉక్రెయిన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వివరించింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్లోని కీలక బ్లాక్ సీ పోర్ట్ తరచు దాడులకు గురవుతోంది.


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.దీనికి ముందు విద్యాశాఖ మంత్రి పదవిని తనకు అప్పగించడంపై ప్లహ్లాద్ జోషి స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నిర్దేశకత్వంలో నిబద్ధతతో తన బాధ్యతలు నిర్వహిస్తాననిఅన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారని, జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన రాజీనామా లేఖలో, తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. మంత్రిగా తాను బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకేలేదని, మాఫియా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదనే సంకల్పంతోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.


మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఎఐజి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణను ఎపి సిఎం చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. గత వారం సినిమా షూటింగ్లో గాయపడిన బాలకృష్ణకు ఇటీవల మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత వేగంగా కోలుకుంటున్నదీ వాకబు చేశారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, తదుపరి పునరావాస ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల బృందం పర్య వేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్య బృందం స్పష్టం చేసింది. వైద్యుల సూచనల మేరకు త్వరలోనే బాలకృష్ణ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో బాల కృష్ణ తిరిగి ఇంటికి చేరుకోవాలని, మళ్లీ ఎప్పటి లాగే షూటిం గ్లలోనూ, ప్రజా సేవలోనూ వేగంగా పాల్గొనాలని అభిమానులు సామాజిక మాధ్య మాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
