22242 వార్తలు

కబ్జాదారులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారు నాపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టింది వారే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: “నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతున్నారనీ, రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్ల, ప్రభుత్వ భూము లు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వా టిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతం లో, ఇప్పుడు, మున్ముందు ఏ బా ధ్యతలు అప్పగించినా నేను నా వై పు నుండి 100 శాతం ఫలితాలు ఇవ్వటానికి పని చేస్తున్నాను, చేస్తాను.” అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్

ప్రభుత్వ సేవలకు ఇక ఒకే సర్టిఫికెట్రేషన్ కార్డు డేటా ఆధారంగా రిజిస్టర్ను నిర్వహించనున్న ప్రభుత్వంమీసేవ కేంద్రాలు, ఆన్లైన్లో దరఖాస్తులు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ సేవలకు అవసరమైన కుటుంబ సభ్యుల వివరాల కోసం వేర్వేరు ధృవపత్రాలను సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) డాటాబేస్తో అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్ను నిర్వహిస్తారు. రేషన్ కార్డు సంఖ్యనే కుటుంబ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. ఇందులో కుటుంబ పెద్ద పేరు, సభ్యుల వివరాలు, వయసు, చిరునామా వంటి అంశాలు నమోదై ఉంటాయి. పౌరులు మీ-సేవా కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలోని వయోజన సభ్యులలో ఎవరైనా ఈ దరఖాస్తును సమర్పించవచ్చు. దరఖాస్తుదారుడ

సీమైన్స్ తగలడంతో ఘటనతప్పుడు మార్గంలో వెల్లడం వల్లే పేలింది : ఇరాన్ అమెరికాతో చర్చలకు షరతులు ఉక్రెయిన్కు హెచ్చరికలు హెజ్బొల్లాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మద్దతు దుబాయి/టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఘర్షణలు సద్దుమణుగుతున్నాయని అనుకునేలోపే ఏదో ఒక ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా హర్మూజ్లో ఇరాన్ ఏర్పాటు చేసిన సీమైన్ తగిలి ఓ చమురు ట్యాంకర్ పేలిపోయింది. తాము నిర్దేశించిన మార్గం గుండా కాకుండా మరో మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం వివరాలు బయటికి రాలేదు. అమెరికా, ఇరాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇది ఊరటనిచ్చే పరిణామమేనని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో ట్యాంకర్ పేలుడు ఘటన జరగడంతో మళ్లీ ఆందోళన నెలకొంటోంది. మరోవైపు సౌదీ అరేబియాలో హౌతీల దాడుల నేపథ్యంలో చమురు రవాణా కూడా మందగిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. బాబ్ ఎల్మండెబ్ జలసంధి గుండా ఇటీవల 11 నౌకలు మాత్రమే వచ్చినట్లు కెప్లర్ సంస్థ ప్రకటించింది. ఇక చర్చలకు ఇరాన్ కొత్త షరతులు విధించింది. హర్మూజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ధ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలుగ్రీకు పురాణాల్లోని బహు శిరస్సుల జలరాక్షసిగా హైడ్రా వ్యవహరిస్తోంది 63 ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం రూల్ ఆప్ లాకు ముప్పు అని వ్యాఖ్యానించిన ధర్మాసనం అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్: లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్ను ఆ కమిషనర్ స్థానం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిను ఆదేశించింది. లోతుకుంట భూముల వివాదానికి సంబంధించిన పిటిషన్ను సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల అమలులో వరుస ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఒకే అంశంపై భారీ సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లు దాఖలవడాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, రంగనాథ్ కొనసాగితే న్యాయపాలనకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని భూములకు సంబంధించిన వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, హైడ్రా అధికారుల వ్యవహారశైలిపై

ప్రభుత్వ ఉద్యోగాలను ఉచితంగా ఇవ్వడం తగదు కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చినఉద్యోగాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెన్నై: కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు)కు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి ని యామకాలకు అనుమతిస్తే, భవిష్యత్తులో మరెం తో మంది ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి విజయ్ కరూర్లో పర్యటించారు. పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కు టుంబాలకు కారుణ్య నియామకాల కింద ప్ర భుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.గత ఏడాది సెప్టెంబర్లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో విజయ్ ప్రసంగించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారులతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ ఆలస్యంగ

బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 2.19 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 13.39 శాతం వృద్ధితో రూ.10,215 కోట్లకు, మొత్తం ఆదాయం 4.26 శాతం పెరిగి రూ.39,684 కోట్లకు చేరింది. గ్లోబల్ అడ్వాన్సులు 17.97 శాతం పెరగగా, స్థూల ఎన్పిఎ 1.57 శాతం, నికర ఎన్పిఎ 0.36 శాతానికి తగ్గాయి. The post కెనరా బ్యాంక్కు రూ.4,856 కోట్ల లాభాలు appeared first on Navatelangana.

హైదరాబాద్ : అమెజాన్ మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ ఐదేళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. 2021 నుంచి ఇప్పటివరకు భారత్లో 12 వేల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎఐ, మెషిన్ లెర్నింగ్లో ఉచిత శిక్షణ ఇచ్చినట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 4 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని.. 2026లో దరఖాస్తులు 1.3 లక్షలు దాటగా, మహిళా విద్యార్థుల వాటా 40 శాతానికి చేరింది. ఎంపికైన 3 వేల మందికి […] The post 12 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు అమెజాన్ ఎఐ శిక్షణ appeared first on Navatelangana.

బాట్ల ఆధిపత్యంతో నష్టమేఎలాన్ మస్క్ హెచ్చరికశాన్ఫ్రాన్సిస్కో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రాబోయే పదేళ్లలో మానవ మేధస్సును మించిపోతుందని దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. మనుషులు చింపాంజీల కంటే తెలివైనవారైనందున వాటిని నియంత్రించినట్లే భవిష్యత్తులో ఎఐ మానవాళి కంటే అత్యంత తెలివైనదిగా మారి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని.. మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని […] The post ఎఐతో ముప్పు తప్పదు appeared first on Navatelangana.

మిర్యాలగూడ ఆర్డీఓకు వృద్ధ దంపతుల వినతిఆస్తి కోసం కొడుకు వేధిస్తున్నాడని ఆవేదనరక్షణ కల్పించండి.. లేదంటే మరణానికి అనుమతి ఇవ్వండని వేడుకోలునవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్ఆస్తి కోసం కన్న కొడుకే తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, వేధింపులు తాళలేకపోతున్నామని, తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ వృద్ధ దంపతులను ఆర్డీఓను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆర్డీఓ రమణారెడ్డికి విన్నవించుకున్నారు. వారు తెలిపిన […] The post కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి appeared first on Navatelangana.

అన్నారం గ్రామంలో రైతులతో జూలకంటి రంగారెడ్డిమహాసభ విజయవంతానికి విరాళాల సేకరణనవతెలంగాణ-మిర్యాలగూడటౌన్ నవంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం జాతీయ మహాసభ జరగనుందని, దానికి రైతాంగం ఆర్థిక, హార్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని సంఘం జాతీయ నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో పొలాల్లో నాట్లు వేస్తున్న రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రైతులను […] The post రైతు సమస్యలపై పోరాటాలకు శ్రీకారం appeared first on Navatelangana.

కాంగ్రెస్ నాయకుల సంబరాలునవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న సీఎం రేవంత్రెడ్డి హామీ మేరకు ఎయిర్పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశారని మాజీ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. ఎయిర్పోర్టు భూ సేకరణ, ఇతర పనులకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల 278 కోట్ల 14 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో ఆదిలాబాద్లో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి డీసీసీ కార్యాలయం ఎదుట సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డికి […] The post ‘ఎయిర్పోర్టు’కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరుపై హర్షం appeared first on Navatelangana.

దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్జనగామలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 35వ వర్ధంతి సభనవతెలంగాణ-జనగామఏసి రెడ్డి నరసింహారెడ్డి త్యాగాల బాటలో యువతరం నడవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. సోమవారం జనగామ జిల్లాలోని ఏసి రెడ్డి నగర్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, జనగామ మాజీ ఎమ్మెల్యే అమరజీవి ఏసి రెడ్డి నరసింహారెడ్డి 35వ […] The post ‘ఏసి రెడ్డి’ త్యాగాల బాటలో యువతరం నడవాలి appeared first on Navatelangana.

సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంతొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా 10 స్టేషన్ల ఎంపిక : హెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డిమెరిడియన్ నిర్వహణపై అసంతృప్తినవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించేందుకు స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు మెట్రో స్టేషన్లు, ప్రయాణికుల సౌకర్యాలను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బేగంపేట్ స్టేషన్ నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ […] The post మెట్రో స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు appeared first on Navatelangana.

ఆర్టీసీ డిపోల దగ్గర ధర్నాలో ఎస్డబ్ల్యూఎఫ్విజయవంతం చేసిన కార్మికులకు నేతల అభినందనలునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిది-హైదరాబాద్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్- సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక డిపో మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులకు కార్యకర్తలకు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, […] The post ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలి appeared first on Navatelangana.

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్హైడ్రా కమిషనర్ను వెంటనే తొలగిచాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తు న్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పారు. హైడ్రా చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా […] The post హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం appeared first on Navatelangana.

మేషంఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభం దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి. మిధునం దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటకం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సింహం

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం... విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కోల్ కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జి మీద ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తన పాత సినిమాలకు పూర్తి భిన్నంగా చాలా ట్రిమ్గా మారిపోయి ఒక కొత్త మేకోవర్లో కనిపిస్తున్నాడు. ఇక సాయి పల్లవి తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మైమరపించనుంది. హౌరా బ్రిడ్జిపై జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను ప్లాన్ చేశారట.






హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతన్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లో భారత్ స్వర్ణం సాధించి సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్కు చెందిన యువ సంచలనం ఇషా సింగ్ పసిడి పతకం సాధించింది. భారత్కే చెందిన మరో స్టార్ షూటర్ మనుబాకర్ ఇదే విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇషా అసాధారణ ఆటతో అలరించింది. క్వాలిఫికేషన్స్లో అంతంత మాత్రంగానే రాణించిన ఇషా కీలకమైన ఫైనల్లో మాత్రం చెలరేగి పోయింది. అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో రికార్డు స్థాయిలో 40 హిట్స్తో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 21 ఏళ్ల ఇషా అంతర్జాతీయ షూటింగ్లో అద్భుత ఆటతో అదరగొడుతోంది. పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ దేశ,రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తోంది. ఇదిలావుంటే భారత స్టార్ షూటర్ మనుబాకర్ 28 హిట్స్తో కాంస్యం దక్కించుకుంది. కాగా, చైనాకు చెందిన ఝాంగ్ 37 హిట్స్తో రజతం సాధించింది.