
3347 వార్తలు

ఎమ్మెల్యే స్పందించాలని నినాదాలునవతెలంగాణ-వర్ధన్నపేటగత ఐదు నెలలుగా వర్ధన్నపేట ఆకేరు పరివాహక ప్రాంతాల ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లను నిషేధించడంతో డ్రైవర్లు కార్మికులు ఆదివారం రోజున ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం వరంగల్ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ఇసుక ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు కార్మికులు ఆందోళన నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే […] The post జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి 9 వరకు రైతు వారోత్సవాలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక […] The post రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

వంటింట్లో ఉపయోగించే అనేక ఆహార పదార్థాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి కేవలం ఒక మసాలా దినుసులు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక నిధి కూడా అని చెప్పవచ్చు! నల్ల మిరియాల ఘాటైన సువాసన, రుచి ఆహారానికి మరింత రుచిని చేకూర్చడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మరి, ఇప్పుడు ఈ చిన్న మసాలా దినుసును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య లాభాలేమిటో తెలుసుకుందాం. నల్ల మిరియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా, సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.2. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. వాతావరణ మార్పుల సమయంలో జలుబు, ఫ్లూ రాకుండా నివారించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.3. బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. దీనిలోని పదార్థాలు మీ శరీరం జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.4. నల్ల మిరియాలు రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తన తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. “ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను” అని […] The post నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ appeared first on Navatelangana.
– జుక్కల్ ఏవో మహేశ్వరి వెల్లడినవతెలంగాణ – జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రైతులకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని పెద్దగుల్లా, పెద్ద ఏడ్గి , హంగర్గా , నాగల్ గావ్, ఖండేబల్లూర్, డోన్ గౌడ , కౌలాస్ ఏడు క్లస్టర్ల పరిధిలోని గ్రామంలోని రైతులతో వ్యవసాయ అనుబంధ సంస్థలైన హార్టికల్చర్, […] The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండలంలోని ఎక్లార పెద్ద రాచోటె పర్భన పటేల్ కుమారుడు అశోక్ పటేల్ గత కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం వారి స్వగృహనికి వెళ్లి పరామర్శించారు. కుమారుడి మృతి గురించి తండ్రిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే తో పాటు మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ , సీనియర్ నాయకులు పండిత్ […] The post మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నవతెలంగాణ-మద్నూర్మండలంలోని శేఖపూర్, కోడ్చిర్, అంతాపూర్, ఎక్లారా చిన్న శివారులో ఏప్రిల్ చివరి వారంలో సంభవించిన అగ్ని ప్రమాదాల కారణంగా మక్క (మొక్కజొన్న) రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రైతుల దగ్గర కి వెళ్లి వారిని మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వాన్ని రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు […] The post కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండలంలోనీ శేఖపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యూనిస్ తండ్రి హజ్ యాత్రకి వెళ్తున్న సందర్భంగా వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హజ్ యాత్రకు వెళ్ళే వారికి దైవదర్శనం కలగాలని, ఆయన ఆశీస్సులు అందాలని కోరారు. అదేవిధంగా వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. The post హజ్ యాత్ర వెళ్తున్న నాయకులకు శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఆదివార మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ కట్టుదిట్టమైన […] The post ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని స్వల్పస్కోర్కే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్లో టస్ గెలిచిన సన్రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ట్రావిస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. దీంతో ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెకెఆర్ వరుణ్ 3, నరైన్, కార్తీక్ చెరి 2, వైభవ్, గ్రీన్, అనుకుల్లు తలో వికెట్ తీశారు.

శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణం చోటు చేసుకుంది. శివతేజ్ అనే బాలుడు బ్యాటరీతో ఆడుకుంటూ ఉండగా.. అది అతడి చేతిలో పేలింది. పేలుడు ధాటికి బాలుడి వేళ్లు తెగిపడ్డాయి. వెంటనే కుటుంబసభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తీసుకువచ్చారు. శివతేజ్ నాలుగో తరగతి చదువుతున్నాడు.

హైదరాబాద్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 14 లక్షల మంది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 అని బిసి,ఎస్టి, ఎస్సి, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా? అని మాజీ సిఎం కెసిఆర్ స్కీములకే కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పథకాలకు పాతరేస్తావా? అని గురుకులాలను దెబ్బతీసి..మరో వైపు ఉన్నత విద్యకు ఉరివేస్తావా? అని కెటిఆర్ ప్రశ్నించారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సూచించారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇది చల్లటి వార్త. మండే ఎండల నుంచి రెండు రోజుల పాటు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగితా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. రాసున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదేస్థాయిలో కొనసాగి తదుపరి మూడు రోజుల్లో క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
నవతెలంగాణ-ఆలేర్ రూరల్ ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో పి ఏ సి ఎస్ నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిదే సంతోష్ ప్రారంభించగా.. గ్రామ సర్పంచ్ పరిదే మమత ఆధ్వర్యంలో జరిగింది. ఎండ తీవ్రతలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిన్నం శివకుమార్, ఇంచార్జి […] The post హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగ కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమిపాలైనప్పటికీ.. గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి కెకెఆర్ తిరిగి పుంజుకుంది. ఇక సన్రైజర్స్ కూడా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో కెకెఆర్ రెండు మార్పులు చేసింది. సీఫర్ట్ స్థానంలో ఫిన్ ఆలెన్, రమన్దీప్ సింగ్ స్థానంలో మనీశ్ పాండేని జట్టులోకి తీసుకుంది. సన్రైజర్స్ కూడా రెండు మార్పులు చేసింది. నితీశ్ స్థానంలో స్మరణ్, హర్ష్ దూబే స్థానంలో హర్షల్ పటేల్లు జట్టులోకి వచ్చారు. తుది జట్లు: కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిస్ రఘువంశీ(కీపర్), కామరూన్ గ్రీన్, రొవ్మెన్ పోవెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైేభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్), హెన్రిచ్ క్లాసెస్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్,

హైదరాబాద్: విభిన్నమైన, విలక్షణమైన సినిమాలు తీయడంలో నటుడు అడివి శేష్ ముందుంటాడు. అందుకే ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఇక శేష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. శేష్ గత సినిమాకు భిన్నంగా ఈ సినిమాని రొమాంటిక్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కించారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్. షానియోల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దర్శకుడితో పాటు శేష్, స్క్రీన్ ప్లే రాయడం విశేషం. ఇక ఈ సినిమా ఒటిటిలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మరి మీరు ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను థియేటర్లో మిస్ అయి ఉంటే మే 8వ తేదీన బుల్లితెరపై చూసేయండి.
పాలకులకు పనిచేస్తున్న విలేకరులు..కొందరి ప్రవర్తనతో మీడియా పరువు పోతోంది..నవతెలంగాణ-అచ్చంపేటఒక్క సిరా చుక్క లక్ష మెదడులను కదిలింప చేస్తుంది. ఆలోచింప చేస్తుందని ఓ కవి వర్ణించాడు. ఎక్కడో చదివిన జ్ఞాపకం జర్నలిజం అంటే.? ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉంటూ ప్రజా సమస్యల గుర్తించి వార్త కథనాల రూపంలో ప్రచురించి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారుల తప్పిదాలను అక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయడమే నిజమైన జర్నలిజం. ప్రజాస్వామానికి నాలుగో పిల్లర్ మీడియా. మీడియా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దీని […] The post దారి తప్పుతున్న జర్నలిజం appeared first on Navatelangana.

భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో రూ.15 లక్షల కంటే తక్కువ ధరకే అనేక ఎస్యూవీలు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీలు ఈ బడ్జెట్లో అనేక ఎంపికలను అందిస్తున్నాయి. ఈ ఎస్యూవీలలో ఇప్పుడు పనోరమిక్ సన్రూఫ్లు, వెంటిలేటెడ్ సీట్లు (కూల్డ్ సీట్లు) ADAS వంటి సెఫ్టి ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 లక్షల లోపు కొత్త ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో అనేక ఎంపికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కియా సోనెట్భారతదేశంలో రూ.15 లక్షల లోపు ఎస్యూవీ విభాగంలో అత్యంత సరసమైన ఎంపికలలో కియా సోనెట్ ఒకటి. ఇది 82bhp,115 Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో లేదా 118 bhp, 172 Nm ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇది 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ (iMT) లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో కూడా వస్తుంది. కియా సోనెట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ను కూడా అందిస్తోంది. ఇందులో 1.5-లీటర్ (114.4 bhp/250 Nm) ఇంజన్ను 6-స్పీడ్ మాన్యువల్, iMT, లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (AT) ట్రాన్స్మిషన్తో జత
నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నాగమణి రాజు అప్ప కుమార్తె శ్రద్ధ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాసు సాయిలు , స్థానిక సర్పంచ్ ఉష సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు […] The post వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే జండావిష్కరణనవతెలంగాణ-ఆలేరు రూరల్బీ జే పీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ ల మూలంగా యాజమాన్యాల ముందు కార్మికవర్గాన్ని బానిసలుగా చేసి శ్రమను దోచుకోవడమే నని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ లు […] The post కార్మిక చట్టాలను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు appeared first on Navatelangana.
“పట్టుదలకి ప్రతిఫలం – విద్యార్థులకు ఘన సన్మానం” గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-మక్తల్ మక్తల్ మండలంలోని మాధ్వార్ గ్రామంలో విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయాన్ని సాధించిన సుమారు 50 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకంగా రామకృష్ణ మఠం వారు ప్రచురించిన “మేలుకో నేస్తమా” అనే పుస్తకాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా […] The post విజేతలకు గ్రామాభిమాన సత్కారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – మిరుదొడ్డి వ్యవసాయ పంట పొలాల్లో చేతికి తాకేంత ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. ఈ తీగల కింద వ్యవసాయం చేయాల్సి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళనతో పనులు చేయాల్సి వస్తోంది. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బోయిని బొందయ్య తన వ్యవసాయ పొలంలో వేలాడుతున్న కరెంటు తీగలను తొలగించాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నాడు. దీంతో పంటపనులు […] The post పొంచిఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు appeared first on Navatelangana.

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఈనెలలో తన వివో X300 సిరీస్లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. అవి వివో X300 FE, వివో X300 FE. ఈ రెండు పరికరాలు మే 6న భారత టెక్ మార్కెట్లో లాంచ్ అవుతాయని కంపెనీ ఇటీవల ధృవీకరించింది. కాగా, ఈ రెండు పరికరాల సేల్స్ మే 14న ప్రారంభమవుతాయి. టీజర్లు, ఇటీవలి నివేదికలు ఈ రెండు పరికరాల దాదాపు అన్ని ఫీచర్లను వెల్లడించాయి. మరి రాబోయే వివో X300 FE, వివో X300 అల్ట్రాలలో ఉన్న ఫీచర్లు ఏమిటి/ వాటి అంచనా ధరలు ఏమిటో తెలుసుకుందాం. వివో X300 FE ఫీచర్లుమొదటి సిరీస్లోని కాంపాక్ట్ మోడల్ అయిన వివో X300 FE కొత్త ఆకుపచ్చ రంగు వేరియంట్లో వస్తుంది. ఇది ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ఉంటుందని టీజర్ కూడా ధృవీకరిస్తుంది. ఈ ఫోన్లో 6.31-అంగుళాల 1.5K LTPO ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా, ఈ పరికరంలో 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ