
3334 వార్తలు



అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓటమి ఎరగకుండా ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధిస్తూ వచ్చిన పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకు రాజస్థాన్ బ్రేక్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి మళ్లీ తిరిగి పుంజుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచులు గెలిచిన గుజరాత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్తో నిశాంత్ సింధు ఆరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టులోకి బార్ట్లెట్, వైశ్యక్ వచ్చారు.


హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని కెకెఆర్ 18.2 ఓవర్లలో ఛేదించింది. కోల్కతా బ్యాటింగ్లో రఘువంశీ 59 పరుగులతో అద్భుతంగా రాణించగా.. కెప్టెన్ రహానే 43, అలెన్ 29, రింకు 22 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. దీంతో కెకెఆర్ పది బంతులు మిగిలి ఉండగానే 169 పరుగులు చేసి ఈ మ్యాచ్లో విజయం సాధించింది.


నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్న జొన్న, మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. పంట పొలాలలో ఉన్న మోటార్లకు ఉన్న కేసింగ్ పైపులు, వైర్లు, పదుల సంఖ్యలో పైపులు కాలిపోవడంతో లక్షల్లో ఆస్థి నష్టం సంభవించిందని బాధిత రైతులు […] The post వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకూ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న జాబితాలో అతడు చోటు దక్కిచుకున్నాడు. ఇప్పటివరకూ అన్ని ఎడిషన్లలోనూ కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్లు ఇద్దరే. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ జాబితాలోకి మనీశ్ పాండే కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీశ్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆందోళనలో కుబీర్ రైతులు..పట్టించుకోని అధికార యంత్రాంగం నవతెలంగాణ-కుభీర్మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఎంతో కష్ట పడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో నే అగ్ని ప్రమాదాలు సంబవించి వందల ఎకరాల్లో మొక్క జొన్న పంటలు కాలిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి మండలంలో వరుసగా మొక్కజొన్న పంటకు వివిధ కారణాలవల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట రైతుల కళ్ళ ముందే బూడిద కావడంతో రైతులు చేసేది ఏమీ లేక కంటితల్లి పెట్టుకునే […] The post వరుసగా మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదాలు appeared first on Navatelangana.

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం మన తెలంగాణ వెబ్ సైట్, డెయిలీ హంట్లో 24-04-2026న పెళ్లి వివాదం వార్తకు దివీస్ సంస్థకు సంబంధం లేదు. ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగికి సంబంధించిన వివాదం విషయంలో వచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆ వార్తను ప్రచురించాము. తెలిసిన వెంటనే ఆ వార్తను వెబ్ సైట్, డెయిలీ హంట్ నుంచి తొలగించాము. ఈ తప్పుకు క్షమాపణలు కోరుతున్నాము.-ఎడిటర్,వెబ్సైట్.

ఎమ్మెల్యే స్పందించాలని నినాదాలునవతెలంగాణ-వర్ధన్నపేటగత ఐదు నెలలుగా వర్ధన్నపేట ఆకేరు పరివాహక ప్రాంతాల ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లను నిషేధించడంతో డ్రైవర్లు కార్మికులు ఆదివారం రోజున ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం వరంగల్ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ఇసుక ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు కార్మికులు ఆందోళన నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే […] The post జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి 9 వరకు రైతు వారోత్సవాలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక […] The post రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

వంటింట్లో ఉపయోగించే అనేక ఆహార పదార్థాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి కేవలం ఒక మసాలా దినుసులు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక నిధి కూడా అని చెప్పవచ్చు! నల్ల మిరియాల ఘాటైన సువాసన, రుచి ఆహారానికి మరింత రుచిని చేకూర్చడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మరి, ఇప్పుడు ఈ చిన్న మసాలా దినుసును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య లాభాలేమిటో తెలుసుకుందాం. నల్ల మిరియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా, సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.2. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. వాతావరణ మార్పుల సమయంలో జలుబు, ఫ్లూ రాకుండా నివారించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.3. బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. దీనిలోని పదార్థాలు మీ శరీరం జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.4. నల్ల మిరియాలు రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తన తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. “ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను” అని […] The post నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ appeared first on Navatelangana.
– జుక్కల్ ఏవో మహేశ్వరి వెల్లడినవతెలంగాణ – జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రైతులకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని పెద్దగుల్లా, పెద్ద ఏడ్గి , హంగర్గా , నాగల్ గావ్, ఖండేబల్లూర్, డోన్ గౌడ , కౌలాస్ ఏడు క్లస్టర్ల పరిధిలోని గ్రామంలోని రైతులతో వ్యవసాయ అనుబంధ సంస్థలైన హార్టికల్చర్, […] The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండలంలోని ఎక్లార పెద్ద రాచోటె పర్భన పటేల్ కుమారుడు అశోక్ పటేల్ గత కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం వారి స్వగృహనికి వెళ్లి పరామర్శించారు. కుమారుడి మృతి గురించి తండ్రిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే తో పాటు మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ , సీనియర్ నాయకులు పండిత్ […] The post మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నవతెలంగాణ-మద్నూర్మండలంలోని శేఖపూర్, కోడ్చిర్, అంతాపూర్, ఎక్లారా చిన్న శివారులో ఏప్రిల్ చివరి వారంలో సంభవించిన అగ్ని ప్రమాదాల కారణంగా మక్క (మొక్కజొన్న) రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రైతుల దగ్గర కి వెళ్లి వారిని మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వాన్ని రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు […] The post కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండలంలోనీ శేఖపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యూనిస్ తండ్రి హజ్ యాత్రకి వెళ్తున్న సందర్భంగా వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హజ్ యాత్రకు వెళ్ళే వారికి దైవదర్శనం కలగాలని, ఆయన ఆశీస్సులు అందాలని కోరారు. అదేవిధంగా వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. The post హజ్ యాత్ర వెళ్తున్న నాయకులకు శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఆదివార మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ కట్టుదిట్టమైన […] The post ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని స్వల్పస్కోర్కే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్లో టస్ గెలిచిన సన్రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ట్రావిస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. దీంతో ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెకెఆర్ వరుణ్ 3, నరైన్, కార్తీక్ చెరి 2, వైభవ్, గ్రీన్, అనుకుల్లు తలో వికెట్ తీశారు.

శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణం చోటు చేసుకుంది. శివతేజ్ అనే బాలుడు బ్యాటరీతో ఆడుకుంటూ ఉండగా.. అది అతడి చేతిలో పేలింది. పేలుడు ధాటికి బాలుడి వేళ్లు తెగిపడ్డాయి. వెంటనే కుటుంబసభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తీసుకువచ్చారు. శివతేజ్ నాలుగో తరగతి చదువుతున్నాడు.

హైదరాబాద్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 14 లక్షల మంది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 అని బిసి,ఎస్టి, ఎస్సి, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా? అని మాజీ సిఎం కెసిఆర్ స్కీములకే కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పథకాలకు పాతరేస్తావా? అని గురుకులాలను దెబ్బతీసి..మరో వైపు ఉన్నత విద్యకు ఉరివేస్తావా? అని కెటిఆర్ ప్రశ్నించారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సూచించారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.