🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3334 వార్తలు

CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో స్కోడా ఆటో ఇండియా భాగస్వామ్యం
పాత వార్త
తెలంగాణ

CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో స్కోడా ఆటో ఇండియా భాగస్వామ్యం

భారతదేశంలోని నాన్-మెట్రోపాలిటన్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి, స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు కామన్ సర్వీసెస్ సెంటర్ గ్రామీణ్ ఇ-స్టోర్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, దేశంలోని అనేక కొత్త ప్రాంతాలలోని వినియోగదారులకు కైలాక్, కుషాక్ మరియు స్లావియా మోడళ్లను అందించడానికి, CSC యొక్క విస్తృతమైన డిజిటల్ , ఫిజికల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్న కొన్ని ప్రీమియం ఆటోమోటివ్ బ్రాండ్‌లలో స్కోడా ఆటో ఇండియా ఒకటిగా నిలిచింది.ఈ భాగస్వామ్యం గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, “స్కోడా ఆటో ఇండియా వద్ద , మా వృద్ధి ప్రయాణం, కొత్త మార్కెట్లలో అందుబాటును మెరుగుపరచడం మరియు ఔచిత్యాన్ని పెంపొందించడంపై ఆధారపడి ఉంది. CSC గ్రామీణ్ ఇ-స్టోర్‌తో మా భాగస్వామ్యం, విశ్వసనీయమైన స్థానిక నెట్‌వర్క్ యొక్క బలాన్ని, భారతీయ వినియోగదారులకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే మా విభిన్న ఉత్పత్తి శ్రేణితో కలపడం ద్వారా లభ్యత అంతరాలను పూడ్చడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమం స్కోడా ఆటోను వినియోగదారులకు మరింత చేరువ చేస్తుంది, వారు ఎ

Admin2 రోజుల క్రితం👁 1
జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన
పాత
సమ్మర్ లో ఏది బెస్ట్? కొబ్బరి నీళ్లా? లేక చెరకు రసమా? వాస్తవాలు ఇవే!
పాత
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
పాత
తెలంగాణ

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓటమి ఎరగకుండా ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తూ వచ్చిన పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకు రాజస్థాన్ బ్రేక్‌లు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ తిరిగి పుంజుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచులు గెలిచిన గుజరాత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. ఈ మ్యాచ్‌తో నిశాంత్ సింధు ఆరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టులోకి బార్ట్‌లెట్, వైశ్యక్ వచ్చారు.

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. పంజాబ్‎దే ఫస్ట్ బ్యాటింగ్
పాత
సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం
పాత
తెలంగాణ

సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఘన విజయం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని కెకెఆర్ 18.2 ఓవర్లలో ఛేదించింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో రఘువంశీ 59 పరుగులతో అద్భుతంగా రాణించగా.. కెప్టెన్ రహానే 43, అలెన్ 29, రింకు 22 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. దీంతో కెకెఆర్ పది బంతులు మిగిలి ఉండగానే 169 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

IPL 2026: కాటేరమ్మ కొడుకుల జైత్రయాత్రకు బ్రేక్.. SRHపై కేకేఆర్ ఘన విజయం
పాత
Health tips: వేసవిలో కుండనీళ్లు బెస్టా.. ఫ్రిజ్ వాటరా..! ఆరోగ్యానికి ఏది మంచిది?
పాత
వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట
పాత
తెలంగాణ

వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్న జొన్న, మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. పంట పొలాలలో ఉన్న మోటార్లకు ఉన్న కేసింగ్ పైపులు, వైర్లు, పదుల సంఖ్యలో పైపులు కాలిపోవడంతో లక్షల్లో ఆస్థి నష్టం సంభ‌వించిందని బాధిత రైతులు […] The post వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట appeared first on Navatelangana.

మనీశ్ పాండే అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన
పాత
తెలంగాణ

మనీశ్ పాండే అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకూ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న జాబితాలో అతడు చోటు దక్కిచుకున్నాడు. ఇప్పటివరకూ అన్ని ఎడిషన్లలోనూ కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్లు ఇద్దరే. వాళ్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ జాబితాలోకి మనీశ్ పాండే కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీశ్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

వరుసగా మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదాలు
పాత
వివరణ : ఆ కేసుకు దివీస్ కు సంబంధం లేదు
పాత
జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..
పాత
తెలంగాణ

జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..

ఎమ్మెల్యే స్పందించాలని నినాదాలునవతెలంగాణ-వర్ధన్నపేటగత ఐదు నెలలుగా వర్ధన్నపేట ఆకేరు పరివాహక ప్రాంతాల ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లను నిషేధించడంతో డ్రైవర్లు కార్మికులు ఆదివారం రోజున ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం వరంగల్ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ఇసుక ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు కార్మికులు ఆందోళన నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే […] The post జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా.. appeared first on Navatelangana.

రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల
పాత
తెలంగాణ

రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి 9 వరకు రైతు వారోత్సవాలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక […] The post రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

నల్ల మిరియాలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
పాత
తెలంగాణ

నల్ల మిరియాలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

వంటింట్లో ఉపయోగించే అనేక ఆహార పదార్థాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి కేవలం ఒక మసాలా దినుసులు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక నిధి కూడా అని చెప్పవచ్చు! నల్ల మిరియాల ఘాటైన సువాసన, రుచి ఆహారానికి మరింత రుచిని చేకూర్చడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మరి, ఇప్పుడు ఈ చిన్న మసాలా దినుసును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య లాభాలేమిటో తెలుసుకుందాం. నల్ల మిరియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా, సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.2. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. వాతావరణ మార్పుల సమయంలో జలుబు, ఫ్లూ రాకుండా నివారించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.3. బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. దీనిలోని పదార్థాలు మీ శరీరం జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.4. నల్ల మిరియాలు రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని

నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్
పాత
తెలంగాణ

నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తన తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. “ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను” అని […] The post నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ appeared first on Navatelangana.

రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి
పాత
తెలంగాణ

రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి

– జుక్కల్ ఏవో మహేశ్వరి వెల్లడినవతెలంగాణ – జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రైతులకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని పెద్దగుల్లా, పెద్ద ఏడ్గి , హంగర్గా , నాగల్ గావ్, ఖండేబల్లూర్,  డోన్ గౌడ , కౌలాస్ ఏడు క్లస్టర్ల పరిధిలోని గ్రామంలోని రైతులతో వ్యవసాయ అనుబంధ సంస్థలైన హార్టికల్చర్, […] The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే
పాత
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండలంలోని ఎక్లార పెద్ద రాచోటె పర్భన పటేల్ కుమారుడు అశోక్ పటేల్ గత కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం వారి స్వగృహనికి వెళ్లి పరామర్శించారు. కుమారుడి మృతి గురించి తండ్రిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే తో పాటు మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ , సీనియర్ నాయకులు పండిత్ […] The post మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.

కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి
పాత
తెలంగాణ

కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  నవతెలంగాణ-మద్నూర్మండలంలోని శేఖపూర్, కోడ్చిర్, అంతాపూర్, ఎక్లారా చిన్న శివారులో ఏప్రిల్ చివరి వారంలో సంభవించిన అగ్ని ప్రమాదాల కారణంగా మక్క (మొక్కజొన్న) రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రైతుల దగ్గర కి వెళ్లి వారిని మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వాన్ని రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు […] The post కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి appeared first on Navatelangana.

హజ్ యాత్ర వెళ్తున్న నాయకులకు శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే
పాత
ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష
పాత
చెలరేగిన కెకెఆర్ బౌలర్లు.. స్వల్పస్కోర్‌కే ఎస్ఆర్‌హెచ్ ఆలౌట్
పాత
తెలంగాణ

చెలరేగిన కెకెఆర్ బౌలర్లు.. స్వల్పస్కోర్‌కే ఎస్ఆర్‌హెచ్ ఆలౌట్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని స్వల్పస్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ట్రావిస్‌ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెకెఆర్ వరుణ్ 3, నరైన్, కార్తీక్ చెరి 2, వైభవ్, గ్రీన్, అనుకుల్‌లు తలో వికెట్ తీశారు.

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. వేళ్లు తెగిపోయాయి..
పాత
విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా?: కెటిఆర్
పాత
తెలంగాణ

విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా?: కెటిఆర్

హైదరాబాద్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 14 లక్షల మంది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 అని బిసి,ఎస్టి, ఎస్సి, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా? అని మాజీ సిఎం కెసిఆర్ స్కీములకే కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పథకాలకు పాతరేస్తావా? అని గురుకులాలను దెబ్బతీసి..మరో వైపు ఉన్నత విద్యకు ఉరివేస్తావా? అని కెటిఆర్ ప్రశ్నించారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సూచించారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

Advertisement