19637 వార్తలు

దేవాలయాలకు వెళితే క్షుద్ర పూజలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారునిర్ణీత గడువులోగా క్షమాపణలు చెప్పాలిలేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాంలీగల్ నోటీసులో హరీష్ రావు హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళితే క్షుద్ర పూజలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్న హరీశ్ రావుపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని హరీష్రావు న్యాయవాది లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కావాలనే ఈ దుష్ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తద్వారా కరువు రావాలనే ఉద్దేశంతోనే హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని నోటీసులో న్యాయవాది త

న్యూఢిల్లీ: భారతీయ శిక్షాసృ్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 498ఏ పరిధిని విస్తరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు భర్త లేదా అతని బంధువుల క్రూరత్వానికి సంబంధించిన ఈ నిబంధన, ఇకపై వివాహ స్వభావం కలిగిన సహజీవన (లైవ్-ఇన్) సంబంధాల్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్. కోటిశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహ స్వభావం కలిగిన సహజీవన సంబంధంలో ఉన్న మహిళపై పురుషుడు క్రూరత్వానికి పాల్పడితే, అతనిపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టవచ్చని పేర్కొంది. సెక్షన్ 498ఏలో పేర్కొన్న రక్షణలు, వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడిన, వివాహాన్ని పోలిన సహజీవన సంబంధాలకు మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న సంబంధాలకే ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ విసృ్తత వ్యాఖ్యానం కేవలం సెక్షన్ 498ఏకే పరిమితమని, ఐపీసీలోని ఇతర నిబంధనలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అయితే, ఇలాంటి కేసుల్లో అరెస్టులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా మార్గదర్శకాలను కచ్

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో సన్నాహాలుపోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణలో అధికారులు మారనున్న మేయర్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు మన తెలంగాణ/సిటీబ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)లకు వచ్చే నవంబర్ చివరలో ఎన్నికలు జరుగనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సన్నాహాల్లో అధికారులు నిమగ్నమయ్యారనేది తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా మున్సిపిల్ కార్పొరేషన్ల పోలింగ్స్టేషన్ల పునర్వవస్థీకరణను జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నట్టు తెలిసింది. కొత్తగా రెండు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఆవిర్భవించిన నేపథ్యంలో వాటిలోని పోలింగ్స్టేషన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారనేది సమాచారం. ముఖ్యంగా ఈవీఎంలు, వాటిని భద్రపరిచిన గోదాంలను జీహెచ్ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారు. వాటి పరిస్థితులను కమిషనర్లు అంచనా వేయడం, అవసరమైన మరిన్ని ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఓటరు జాబితాను రూపొందించడం, వార్డుల డీ లిమిటెషన్పై మున్సిపల్ అధి




మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు యువతను మోసం చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో గడ్డం వేణు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని తట్టుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే తన జీవితంలో ఈ దుస్థితి వచ్చిందని వేణు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు చేసిన వాగ్దానాలు, వాటి అమలులో జరిగిన మోసాన్ని కూడా వేణు తన లేఖలో ప్రస్తావించారని అన్నారు. ఖమ్మం జిల్లా యువకుడు గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దాఖలైన ఒక ఛార్జ్షీట్ అని పేర్కొన్నారు. ఒకవేళ ఆ లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందకపోతే బిఆర్ఎస్ తరఫున తామే పంపిస్తామని చెప్పారు. అందులోని అంశాలు చదివిన తర్వాత అయినా యువతపై కనీసం జాలి, బాధ్యతతో వ్యవహరించాలన

ప్రవాసులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలిమీ కోసమే సత్వర అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నాం ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి చట్టబద్దమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు యోచిస్తున్నాం ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోండిఆటా 19వ జాతీయ మహాసభలో ప్రవాసులతో ఉప ముఖ్యమంత్రి భట్టి పిలుపుమన తెలంగాణ/హైదరాబాద్: అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రవాస భారతీయులు, తాము సాధించిన విజ్ఞానాన్ని, మేధస్సును సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన 19వ ఆట (ఏటిఏ) జాతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో దీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని పోటీపడే స్థాయికి తీసుకెళ్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముందుకు రావాలని ఆయన కోరారు. మీకోసం సింగిల్ విండో విధానాన్న

వెయ్యి మంది రోగులకు రొబోటిక్ సర్జరీలువైద్య బృందానికి సిఎం రేవంత్రెడ్డి అభినందనలు మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్లో వెయ్యి రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసి నిమ్స్ సాధించిన ఈ ఘనతను వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్తో పాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే నిమ్స్లో 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి వ్య

4 సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్షం సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి పాలమూరురంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టుకు అత్యున్నత ప్రాధాన్యం పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం వేగవంతం రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అంతర్రాష్ట్ర విభాగాన్ని బలోపేతం చేయాలిఅధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాలుమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి భవిష్యత్కు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యున్నత ప్రాధాన్య జాబితాలో ఉంచి, సాధ్యమైనంత వరకు ఆరు నెలల్లో ప్రాజెక్టుల వారీగా పర్యావరణ అనుమతులు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియకు సంబంధించి

మరింత బలపడే అవకాశాలు అప్రమత్తతో గట్టెక్కవచ్చు అల్పపీడన ద్రోణి దిశ మార్చుకోవడం వల్లే ఇటీవల రాష్ట్రంలో వర్షాలు కురిశాయిఆశలన్నీ ఇండో ఓషన్ డైపోల్ మీదనే ‘మన తెలంగాణ’తో హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నడింపల్లి రాఘవేంద్రరాజు మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులు త్వరగా త గ్గేవి కావని, ఎల్ నినో ఎప్పుడూ సుదీర్ఘంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైంటిస్ట్-డి నడింపల్లి రాఘవేంద్ర రాజు అన్నారు. సోమవారం ఆయన మన తెలంగాణతో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులపై మాట్లాడారు. ఇటీవల ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షాలతో ఎల్నినో ముప్పు తొలగిపోలేదని, ఇది ఇంకా కొనసాగుతుందని, ఎల్నినో ప్రస్తుతం మధ్యస్థ స్థాయిలో ఉందని, మరింత బలపడే అవకాశాలే కనిస్తున్నాయని తెలిపారు. గత నెలో 22 రోజులు అల్పపీడన పరిస్థితులు ఉన్నా వార్షాలు తక్కువ రోజులే కురవడం ఈ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గాలులు ప్రభావంతో రాష్ట్రంలో గత ఐదు రోజులు విస్తారంగా కురిశాయని, విదర్భ, ఉత్తర చత్తీస్గడ్లో ఏర్పడిన ద్రోణి దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో కురిసన వర్షాలతో లోటు నుంచి ప్రస్తుత

వేలం ప్రక్రియలో మణుగూరు సమీపంలోని ఓపెన్ కాస్ట్ డిప్సైడ్ బ్లాక్ను దక్కించుకున్న సింగరేణి పికెఒసిలో 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.10,000కోట్ల ఆదాయం 6,500 మందికి జీవనోపాధి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటనమన తెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పికెఓసి (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తాలు ఉన్నాయని, తద్వారా ప్రతి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ మైన్ పొందవచ్చని ఆయన చెప్పారు. దీంతో దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు వేసిందని అన్నారు. ఇటీవలే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో పికెఓసి డిప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయని తెలిపారు. పికెఓ

ఆధారాలు లేవన్న ఢిల్లీ కోర్టు హైకోర్టును ఆశ్రయిస్తాం: మహిళా రెజ్లర్లు న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. కేసులో తగిన ఆధారాలు లేవని, సాక్షుల వాంగ్మూలాల్లో పరస్పర విరుద్ధతలు ఉన్నాయని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసులో బ్రిజ్ భూషణ్తో పాటు డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ను కూడా అదనపు ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ నిర్దోషిగా విడుదల చేశారు. ఈ కేసు 2023లో ఆరుగురు మహిళా రెజ్లర్లు, వారిలో ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేత వినేశ్ ఫొగాట్ కూడా ఉండగా, చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్కెమెరా ప్రొసీడింగ్స్లో తీర్పు వెలువరించిన న్యాయస్థానం, కేసులో సమర్పించిన ఆధారాలు సరిపోవని, సాక్షుల వాంగ్మూలాల్లో స్థిరత్వం లేదని పేర్కొంది. నిందితుల తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ మాట్లాడుతూ, సాక్ష్యాల్లోని వైరుధ్యాలు, సంఘటనల సాధ్యాసాధ్యాలు, నిందితులు సంఘటన జరిగిన సమయంలో అక్కడ

కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ పాగాబంకీపూర్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిపై ఘన విజయంఎన్నికల రాజకీయాల్లో బోణీ కొట్టిన జన్ సురాజ్ అధినేత బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అడ్డాలో 30 ఏళ్ల తర్వాత కమలం పార్టీకి ఓటమి 19,324 ఓట్ల ఆధిక్యంతో పికె గెలుపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇది సంకేతం విజయం తర్వాత ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్య గుజరాత్, మధ్యప్రదేశ్లో బిజెపి, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలుపున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠతో రేపిన బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. బంకీపూర్ నుంచి పోటీ చేసిన జన్సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు. దీంతో బీజేపీ కంచుకోటలో ఆయన పాగా వేసినట్టయింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పీకే పాల్గొని గెలవడం, పార్టీకి సైతం ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల ఆధిక్యంతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. సిన్హాకు 44,827 ఓట్లు రాగా, ప్రశాంత్ కిషోర్కు 64,151 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్య

లేబర్ కోడ్ల పేరుతో కార్పొరేట్లకు ఊడిగంఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వీబీగ్రామ్ జీ చట్టం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్యనవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక […] The post 10న జైల్భరోను జయప్రదం చేయండి appeared first on Navatelangana.

ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహయాదాద్రిలో గాయని జానకి,నాగన్నల సంస్మరణ సభనవతెలంగాణ-భువనగిరిప్రజా కళల్ని ప్రోత్సహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రముఖ గాయని జానకి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట నరసింహ మాట్లాడుతూ.. గాయని జానకి వేలాది పాటలు పాడి గొప్ప గాయనిగా గుర్తింపు పొందారని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలతో ఉన్న జానకికి అనేక అవార్డులు […] The post ప్రజాకళల్ని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘటనమెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునవతెలంగాణ-రాయపర్తివరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని ఆశ్రమ పాఠశాల సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని […] The post ఆహారం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.

చివరివారంలో పరిశ్రమకు చేరుతున్న వైనంనూనె దిగుబడిపై ప్రభావం ధరల విధానమే కారణమా..? నవతెలంగాణ-అశ్వారావుపేటఆయిల్ ఫెడ్ పరిశ్రమకు నెల చివరివారంలో పామాయిల్ గెలలు అధికంగా వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ధరల విధానమే కారణమని తెలుస్తోంది. జూన్, జులై రెండు నెలల్లోనూ చివరి వారంలోనే రైతులు అత్యధిక గెలలు పరిశ్రమకు తరలించారు. జూన్లో మొత్తం 11,224.165 టన్నుల గెలలు సేకరణ జరగగా, అందులో ఒక్క చివరి వారంలోనే 5,119.525 టన్నులు (45.61 శాతం) వచ్చాయి. జులైలో మొత్తం 14,471.980 […] The post అధికంగా పామాయిల్ గెలల సేకరణ appeared first on Navatelangana.

ఆదివాసుల భారీ ర్యాలీ, ధర్నా1/70 పీసా చట్టాల పటిష్ట అమలుకు డిమాండ్నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్ఆదిలాబాద్ జిల్లా సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఏజీఎస్(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం), రాయిసెంటర్ సార్మేడీలు, పటేల్స్, సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అధికారికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించి 5వ షెడ్యూల్లో భాగంగా అన్ని […] The post సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి appeared first on Navatelangana.

గీతన్నల చైతన్యయాత్రలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లునవతెలంగాణ-మరిపెడగీత కార్మిక సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్ల బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘గీత వృత్తిలో అమరుల యాది’ చైతన్యయాత్ర సోమవారం రెండవరోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం మండలాల్లో […] The post గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ను విడుదల చేయాలి appeared first on Navatelangana.

శనివారం అర్ధరాత్రి పరారైన విద్యార్థులునవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. నల్లగొండ జిల్లా సంస్థాన్నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో గోడ దూకి మరో ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు పరారయ్యారు. తిరుపతి చూసేందుకు వెళ్లామంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం.సంస్థాన్నారాయణపురం మండలం కొతులాపురం గ్రామానికి చెందిన ఇరుగంటి నవదీప్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన […] The post తిరుపతిలో సర్వేల్ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం appeared first on Navatelangana.

తద్వారా అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలిటి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి : అధికారులకు సీఎస్ సంజయ్జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్చందానీ […] The post మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలి appeared first on Navatelangana.

తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ పిలుపునవతెలంగాణ – బంజారాహిల్స్ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) స్కాలర్ల సమస్యల పరిష్కారం, స్టైఫండ్ పెంపు కోసం మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి. శ్రవణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. […] The post నేటి నుంచి ఆయుష్ వైద్యుల నిరవధిక సమ్మె appeared first on Navatelangana.