22480 వార్తలు

1అనగనగా ఓ రోజు కథలుముసలితనమే లేదునేటి యువకుడికి2సాయంత్రంఅలసిపోయి సేద తీరిందికొండవతల3ఆకరి చూపుఅసలు అర్థంఆర్ద్రతే4ఆరిపోయిన దీపం మీదవెలుగుతున్న దీపమేమరణం5నిటారుగా పెరిగిందిఅంతస్తులను చూస్తూసిటీలో చెట్టు6గాలివానగుడిసె నెత్తుకపోయాయిబిగ్గరగా నవ్వారు ఇంటిల్లపాది7అవ్వ మీదవాన వలపోతగుడిసెంత నిండిపోయింది8కాలంకలలన్నింటినీ వేరుచేసిఉరితీసింది9పళ్లెంలో రూపాయిపిల్లోడిలా అల్లరి చేస్తూవెక్కిరిస్తుంది10భయంనగరంలోకొచ్చిన పులిలాఅందరినీ వెంటాడుతుంది11ఆకాశానికేసి చూశాడుహదయం నిండాశూన్యం12వానలుఋతువులో కంటేమనసులోనే ఎక్కువ కురిసాయి13రాత్రి విషాదానికిఓదార్పునిచ్చిందికుక్క అరుపు14అల్లారం లేకుండా తెల్లారే లేచాననిగర్వంగా చెప్పుకుంటుందిగుడిసె పై ఎక్కి కోడి15రాయిబావిలోకి దూకిందిలోతెంతో లెక్కపెట్టడానికి16చీకటిబూచోడికి భయపడిపాప కళ్ళకింద నిద్రపోయింది పి. సుష్మ మక్తల్9959705519 The post హైకులు appeared first on Navatelangana.

ఆమె సమయాలంటూ ఆమె పనులంటూహోదా లంటూ ఫలితాలంటూ ఏమీలేవుఅంత గా చెప్పుకోవడానికి.ఆమె పుట్టక ముందేవంట గది, ఆ గది మూల మూలనఆ గదిలోని వస్తువులపై ఆమె కోసమేకేటాయించ బడతాయిగది శుభ్రత తాలింపుల ఘుమ ఘుమలురుతువుల బహుమతులు ప్రశంసలుఅన్నీ ఆమె శ్రమకు చిరు గుర్తింపులేఆమె పుట్టక ముందే పడక గదిఆ గదిలో ఆమె ఎటువైపు అతనెటువైపుఆమె మాటలు, తల్లి తనాలుఅత్యవసర విశేషణా కిరీటాలుకడుపులో ఉన్నపుడే కేటాయించ బడ్డాయిఉదయం లేవగానే ఇంటికి ప్రభాతాన్ని అద్దడంవాకిలికి చిలుకల ముగ్గులు పేర్చడంపిల్లలలతో పాటు […] The post కేటాయింపు appeared first on Navatelangana.

లాఠీ ఛార్జ్ అంటున్నారు… వాళ్లు లాఠీలతో ఛార్జ్ చేయాలనుకుంటున్నారు,రెండు దెబ్బలు పడితే పర్వాలేదు,ఎన్ని దెబ్బలైనా పడ్డా పర్వాలేదు. కానీ…ఒక్కసారి నీ అవమానాలన్నీ,అరికాళ్ల నుండి తలపై దాకా గుర్తు తెచ్చుకో. నిన్ను చిన్నచూపు చూసిన చూపులను గుర్తు చేసుకో,నీ కష్టాన్ని కించపరిచిన మాటలను గుర్తు చేసుకో,నీ చెమటకు విలువ ఇవ్వని సమాజాన్ని గుర్తు చేసుకో. ఆ తర్వాత…లాఠీ కాదు, నీ ఓటుతో ఛార్జ్ చేయ్! ఒక్క ఓటు…ఒక్క బటన్ నొక్కడం కాదు,అది నీ ఆత్మగౌరవానికి ఇచ్చే సమాధానం. నీ […] The post లాఠీ ఛార్జ్ appeared first on Navatelangana.

చనిపోయిన వ్యక్తికి ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నామంటూ నాలుగు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మేడిపల్లిలోని కాకతీయ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల తీరుపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమా సీన్ను తలపించేలా వ్యవహారం సాగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలానికి చెందిన శోభ (42) గుండెకు సంబంధించిన ఇబ్బందులతో ఈ నెల 20న మేడిపల్లిలోని కాకతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు గుండె సమస్య తీవ్రంగా ఉందని వెంటనే స్టెంట్లు వేయాలని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు అడ్వాన్స్ గా 4 లక్షలు ఆస్పత్రికి చెల్లించామని చెల్లించారు. అయితే శనివారం మధ్యాహ్నం శోభ చనిపోయిందని వైద్యులు తెలపారు. దీంలో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.చనిపోయిన శవానికి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు చనిపోయిందని తెలిపారని ఆందోళనకు దిగారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రో

ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ నాగన్న స్ఫూర్తితోకమ్యూనిస్టులు ఐక్యం కావాలి : సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిఎస్వీకేలో నాగన్న సంతాప సభ నవతెలంగాణ – ముషీరాబాద్నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి అని ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ అన్నారు. అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగన్న గొప్ప […] The post నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి appeared first on Navatelangana.

అనధికారిక క్రాప్ హాలిడేప్రస్తుత నీటిమట్టం 3.423 టీఎంసీలుమెదక్, సంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఎద్దడిహైదరాబాద్కు నిలిచిన తాగునీటి సరఫరా నత్తనడకన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతుల పేరిట జలాశయంలో ఉన్న నీటిని ఖాళీ చేశారు. మరో పక్క వర్షాభావం వల్ల ఎగువ నుంచి వరద నీరురావట్లేదు. దీంతో సింగూరు జలాశయం నీటి నిల్వల్లేక కలతప్పింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.423 టీఎంసీల నీటి […] The post సింగూరు ఖాళీ appeared first on Navatelangana.

వాషింగ్టన్ :అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు , వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది. ఈ తీర్పును నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో పిటిషన్ దాఖలు చేసింది. దీన

జుట్టుపోలుగాడు : జాం జటక్… ఎహె. నేను పోలీసు దెయ్యాన్ని.కేతిగాడు : బూం భటక్.. నేను మీడియా దెయ్యాన్ని.బంగారక్క : ఓయ్ దెయ్యాలు… మీరిద్దరూ ఇటు రండి. దెయ్యాలంటే తెలుసు కదా మనసూ, మనస్సాక్షి లేనోళ్లని అర్థం. ఎందుకంటే మీరు ప్రభువును మించిన ప్రభు భక్తులు కదా…జుట్టుపోలుగాడు : అవునవును. ముందుగా నే చెప్తా నోచ్. టట్టడోరు.. అది 2026 జులై 20వ తేది. మన దేశ చరిత్రలోనే ఓ గొప్ప చారిత్రక దినం. రాజధాని ఢిల్లీ […] The post పీక్కు తినే దెయ్యాలు appeared first on Navatelangana.

బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులుయాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : సంఘీభావ సభలో వక్తలుపాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ప్రదర్శన నవతెలంగాణ-పటాన్ చెరుబిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని […] The post కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు appeared first on Navatelangana.

క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలోభారీగా ఎగిసిపడిన మంటలుపడవల్లో స్థానికుల తరలింపు పారిస్ : ఫ్రాన్స్, స్పెయిన్ లలో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డియాక్స్ కు పశ్చిమంగా ఉన్న టూరిస్ట్ స్పాట్ నుంచి ఇప్పటికే వేలాది మందిని తరలించారు. గిరోండే ప్రాంతంలో అటవీ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. స్పెయిన్ లో జాతీయ ఎమర్జెన్సీ …!సౌమోస్ ప్రాంతంలో […] The post ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు appeared first on Navatelangana.

పరిశోధనతెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో ఎన్నో విడిశిల్పాలు శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో అరుదైనది, శిల్పపరంగా ప్రత్యేక ప్రతిమాలక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు పృథ్విరాజ్ రొడ్డావార్, సహచరులు సాయిరాజ్ కాంబ్లే, కత్తురి సుభాష్ లతో కలిసి గుర్తించాడు.ఈ శిల్పానికి తల విరిగిపోయింది. అర్థపద్మాసనంలో ఆసీనుడైవున్న మూర్తి వెనక పాము చుట్టుకుని కన్పిస్తున్నది. మూర్తికి రెండువైపుల కాయోత్సర్గభంగిమలో ఇద్దరు తీర్థంకరులున్నారు. అధిష్టానపీఠం మీద రెండు సింహాల నడుమ ధర్మచక్రం […] The post చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు appeared first on Navatelangana.

రెండో టీ20లో భారత్ భారీ విజయంరాణించిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మభారత్ 219/5, జింబాబ్వే 129/10 బ్రిటన్ పర్యటనలో వరుస ఓటములను నుంచి పుంజుకున్న టీమ్ ఇండియా.. జింబాబ్వేపై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణించటంతో రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ (81), తిలక్ వర్మ (60), ప్రిన్స్ యాదవ్ (2/10), యశ్ […] The post సిరీస్ సొంతమాయె appeared first on Navatelangana.

ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశా, సచిన్లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాది లోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

మీకు తెలుసా?ఎదుటివారితో మాట్లాడాలంటే గొంతు కావాలి. వారు చెప్పేది వినాలంటే చెవులుండాలి. కానీ ఏనుగులకు ఆ అవసరమే లేదని మీకు తెలుసా? అవి గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరంలోని మిత్రులతో ముచ్చటిస్తాయి. మనుషులు వినలేని శబ్దాలనూ వింటాయి. భూమి పొరల్లో సంభవించే మార్పులను పాదాలతోనే పసిగడతాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏనుగులు చెవులతోనే కాదు, పాదాలతోనూ వింటాయి. వీటి పాదాల్లో ‘పాసినియన్ కార్పస్కిల్స్’ అనే అత్యంత సున్నితమైన నరాల వ్యవస్థ ఉంటుంది. ఇవి భూమిలో వచ్చే […] The post పాదాలతోనూ వింటాయి appeared first on Navatelangana.

చెవినొప్పిపేషెంట్ : చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే…చుక్కల మందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా…! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది డాక్టర్ :అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు…?పేషెంట్ : రెండే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా అంతే డాక్టర్. సినిమా యాడ్స్టీచర్: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?గోపీ : అవునండీ. సినిమా […] The post నవ్వుల్ పువ్వుల్ appeared first on Navatelangana.

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య వివాదం మరింత తీవ్రత రం అవుతోంది. దీంతో తుంగతుర్తి నియోజకవర్గం పంచాయితీపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించాల్సిన నివేదికను పెండింగ్లో పెట్టారు. శనివారం నివేదిక ఇవ్వాల్సి ఉండగా, రెండు రోజులుగా మళ్లీ ఎమ్మెల్యే మందుల సామేల్కు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నివేదికను పెండింగ్లో పెట్టారని తెలుస్తోం ది. తుంగతుర్తిలో మందుల సామేల్కు తానే టిక్కెట్ ఇప్పించానంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని సామేల్ తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం తనకు టిక్కెట్ ఇచ్చిం దే తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ భగ్గుమన్నా రు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి ని యోజకవర్గంలో మంత్రి వెంకట్ రెడ్డి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని ఆక్షేపించారు. ఎస్సి నియోజకవర్గంపై మీ అధిప త్యం ఏమిటని ఆయన కోమటిరెడ్డ


వెలుగుతున్న ఆశ ఒకవైపు, కొనసాగుతున్న అల్పత్వము మరోవైపు. నేడు దేశ కదలికను గమనిస్తుంటే భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేయలేమనే నిరాశ నుంచి ఏదైనా చేయగలమనే ధైర్యం నిండుతోంది. మాకిక తిరుగులేదనుకున్నవారికి తలలు తిరిగేట్టు జరగటం చూస్తుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఎంత వాస్తవికమైనవో అర్థమవుతున్నది. నిరసనల నిప్పురవ్వ అంటుకుంటే ఎంత దావానలమై ముంచెత్తుతుందో స్పష్టపరిచింది నేటి యువత తిరుగుబాటు. గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నిరవధికంగా జరుగుతున్న నిరసన […] The post యువరక్తమూ- అల్పత్వము appeared first on Navatelangana.



కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై హింస, పెల్లెట్ గన్లు ప్రయోగించిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్షానే బాధ్యులని ఆరోపించారు. విద్యార్థులపై అణిచివేతను పార్లమెంటులో ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ కీలకమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించిన అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే గొప్పదైన మన విద్యా వ్యవస్థలో కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందని. ఆర్ఎస్ఎస్ దొడ్డిదారిన మన విద్యావ్యవస్థలో చొరబడి నాశనం చేసిందని తప్పుపట్టారు. ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ఇకనైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యమం సాగించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి హక్కులు, భవిష్యత్తును పరిరక్షించేందుకు ఎప్పుడు ఏ అవసరమున్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చార

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిపిఎస్సి)మాజీ ఛైర్మన్ తమన్సింగ్ సోన్వానీని ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై శనివారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిజిపిఎస్సి) 2020 2021 మధ్యకాలంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడమే కాకుండా తమ బంధువులు, మేనల్లుళ్లు, రాజకీయ నాయకులు, అధికారుల కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా పరీక్ష ఫలితాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపు లోకి తీసుకున్నారు. సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రాయ్పూర్ లోని స్పెషల్ పిఎంఎల్ఎ కోర్టులో హాజరు పర్చిన తరువాత కస్టోడియల్ రిమాండ్కు కోర్టును అభ్యర్ధిస్తారు. 2024లోసిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది. కాలేజీ పేరు చెప్పి సిఎస్ఆర్ విరాళాల కింద దాదాపు రూ 45 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది.
