22778 వార్తలు

వర్ధంతి సభలో పాలడుగు భాస్కర్నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి విమలా రణదీవె ప్రతిరూపమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నివాళులర్పించారు. మహిళా కార్మికులను సంఘటితం చేయడంలో ఆమె చేసిన నిరంతర కృషి భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి బలమైన పునాదులను వేసిందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విమలా రణదీవె 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెతోపాటు కార్మికోద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక […] The post పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె appeared first on Navatelangana.

మేషంమానసిక ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం మెరుగ ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృషభం అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శారీరక అలసట చికాకు కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పనులలో కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మిధునం ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మిత్రుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కర్కాటకం వృత్తి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహం అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. పితృస్వామ్య ఆస్తుల వివాదాలు సర్దుమణిగుతాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూల సమయం. కన్య పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, ఆంద

గ్లాస్గో: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం లో ఆరంభోత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి. పోటీలను బ్రిటన్ రాజు కింగ్ చార్లె స్ 111 అధికారికంగా ప్రారంభించారు. గ్లాస్గోలోని ఓవో హైడ్రోలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్షో, సాంస్కృతిక, సాహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ స్లైక్టిస్ట్ క్రిస్ హోయ్తో పాటు డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్తో పాటు రాణి కామిలా ప్రవేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటి టన్స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.ఆమెతో పాటు కాల్లమ్ బిటి, నీనా నెస్బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేశారు. ఈ పోటీల్లో భారత్తో సహా 74 దేశాలు పోటీ పడుతున్నాయి. దాదాపు 3వేల మంది అథ్లెట్లు ఇండోర్ పరేడ్లో ఆఫ్ నేషన్స్లో పాల్గొన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్ర మం పూర్తిగా ఓ భవనం లోపల జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆరంభోత్స వేడుకల్లో పాల్గొన్న భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గ

విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను ’క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అంటూ ఘా టు పదజాలంతో విమర్శించారు. భారతదేశ విద్యా వ్య వస్థ కుప్పకూలడానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నారు. జూలై 20వ తేదీ నిరసనలపై భద్రతా దళాలు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన సాహిల్ అనే విద్యార్థిని మీడి యా సమావేశంలో రాహుల్ హాజరుపరిచారు. అనంత రం మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన సాహిల్కు పెల్లెట్ గాయాలైనట్టు చెప్పారు. సాహిల్ తొడుక్కున్న టీషర్ట్ పైకి జరిపి అతనికి తగిలిన గాయాలను మీడియాకు చూపించారు. సాహిల్ కంటికి గాయమైందని, ఆ కంటి నుంచి అతను చూడలేకపోతున్నాడని చెప్పారు.ఇదీ మన దేశ భవిష్యత్తు. వేలాది మంది యువత పరిస్థితి ఇది. పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి లాఠీచార్జి చేశారు. వాళ్లు ఏం చేశారు? శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారని రాహుల్ తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ కోసం సాహిల్ పరీక్ష

కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి మంత్రులకు అనూహ్యంగా ఓ ప్రశ్న ఎదురైంది. మీరంతా సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. యువతకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్స్టా వంటి వేదికల్లో క్రియాశీలంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇన్స్టాగ్రామ్లో ఎంత మంది యాక్టివ్గా ఉంటున్నారని మోడీ ఈ సందర్భంగా మంత్రులను ప్రశ్నించారు. యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారని, అందులో ఇన్స్టాను అధిక సంఖ్యలో ఉపయోగిస్తున్నందున అందులో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్లో ఉం డాలని ప్రధాని సూచించారు. యువతకు మరిం త దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్ను పోస్టు చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు తెలిసింది. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

ఐక్యూ సంస్థ భారత్లో జెడ్11 లైట్ 5జి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.17,999 కాగా, ఈ నెల 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్లో 6.74 అంగుళాల 120 హెట్జ్ డిస్ప్లే, 1200 నిట్స్ బ్రైట్నెస్, 6500 ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్లు ఫ్లాష్ఛార్జ్ సదుపాయం ఉన్నాయి. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్తో పనిచేస్తుంది. దీనిలో 50ఎంపి సోనీ కెమెరా, ఐపి65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, అనేక ఎఐ ఫీచర్లు ఉన్నాయి.

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథోత్సవం కొనసాగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారంనాడు జగన్నాథ ‘బహుడా’ యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథాలను లాగుతూ లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలు మిన్నంటాయి. ఉదయం గుండిచా మందిరంలో స్వామికి సేవలు చేసిన అనంతరం బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామికి పోహండి వేడుకను నిర్వహించారు. అనంతరం బహుడా యాత్ర ప్రారంభమైంది. గుండిచాం మందరంలో వారం రోజుల పాటు బస చేసిన అనంతరం మూడు రథాల్లో తిరుగు ప్రయాణం సాగించడాన్ని బహుడా యాత్రగా పేర్కొంటారు. తొలుత బలభద్ర రథం ‘తాళధ్వజ్’ ముందుకు కదలగా, ఆ వెనుకే సుభద్ర రథం ‘దర్పదళన్’, జగన్నాథ స్వామి రథం ’నందిఘోష్’ ముందుకు కదిలాయి. కళాకారుల సాంస్కృతిక నృత్యాలతో సంబరాలు అంబరమంటాయి.

కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి బిట్టూ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో విదేశాల్లో ఉన్నారు.2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న బిట్టూ..వచ్చే ఏడాది పంజాబ్లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన బిట్టూ 2024లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాజీనామాతో ఖాళీ అయిన రాజస్థాన్ రాజ్యసభ స్థానంలో మిగిలిన పదవీకాలానికి బిట్టూను నామినేట్ చేశారు.



ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు బిఆర్ఎస్కు లేదని, పైగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అక్కడికి వెళ్ళడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పేరుతో బిఆర్ఎస్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ’ధర్నా చౌక్’నే ఎత్తివేసిన దౌర్భాగ్యపు చరిత్ర బిఆర్ఎస్దని ఆయన తూర్పారపట్టారు. అలాంటి పార్టీకి ఈరోజు ధర్నా చౌక్ వద్ద మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు. పేపర్ లీకేజీలపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పరీక్షల లీకేజీలతో పాటు నియామకాలే జరగని పరిస్థితి నెలకొందన్నారు. గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో పడి 27 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం ఏమిటని

న్యాయస్థానాల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా షేర్ చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు, లేదా సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికల్లో షేర్ చేయడం, మానిటైజేషన్కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది. కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారంనాడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనన్ల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్న కోర్టు వీడియోల కారణంగా న్యాయస్థానాల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానంలో ఒక న్యాయవాది తన చేతిలోని కాగితాలను గాల్లోకి విసరిన వీడియోలు వైరల్గా మారాయని పిటిషనర్ కోర్

మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్లో ’సామజవరగమన’ ఫేమ్ హాసిత్ గోలి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్లో రాబోతున్న ఈ పక్కా మాస్ కామెడీ ఎంటర్టైనర్లో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక రవితేజతో పూజా నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పూజా హెగ్డేకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఒక వైపు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, మరోవైపు హాసిత్ గోలి మార్క్ కామెడీ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక శ్రీ విష్ణు సరసన హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో సూసైడ్ నోట్ రాసి దంపతులు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో జరిగింది. ఎస్ఐ వెంకట్రెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దంపతులు వడియాల శ్రీనివాస్ (59) భార్య వడియాల జ్యోతి (52) మున్సిపాలిటీ కేంద్రంలో కిరాణా షాపు నడిపిస్తూ జీవనం పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అప్పుల భాధతో మనస్థాపం చెంది తన సొంత ఇంట్లో రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఒకేసారి దంపతులు మృతి చెందారు. ఈ విషయం శుక్రవారం ఉదయం ఆరు గంటలకు తన కుమారుడు వడియాల శ్రావన్ ఇంటికి వెళ్లి చూడగా రెండు ఫ్యాన్లకు తల్లిదండ్రులు చనిపోయి వేలాడుతూ కనిపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ వెంకట్రెడ్డి, పోలీస్ సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించగా సూసైడ్ నోట్ బయటపడింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. శుక్రవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సాగిన మంత్రివర్గం సమావేశంలో ప్రధాన్కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాల సమాచారం పేరిట జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ‘రాజీనామా చేయించడం అన్నింటికంటే సులభమైన నిర్ణయం. కానీ ప్రభుత్వం మంత్రికి అండగా ఉంది. ప్రజలు మాకు అధికారం అప్పగించారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి వ్యక్తి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కీలక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రక్షాళన జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడుతున్న అనేక ముఠాల గుట్టు రట్టు చేశామని, మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపాయి.శుక్రవారంనాడు ఈ విషయాలు వెల్లడైన కాసేపటికే కేంద్ర


బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండేళ్లు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగారు. మాజీ ప్రధానమంత్రి, భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు షాబుద్దీన్ సన్నిహితుడు. ‘తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. గుండె, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. ఇటీవలి వైద్య పరీక్షల్లో న్యూరో సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా విధుల్లో కొనసాగలేను’ అని స్పీకర్కు రాసిన లేఖలో షాబుద్దీన్ పేర్కొన్నారు. హసీనాపై బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత షాబుద్దీన్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ ఆహ్మద్ కొనసాగనున్నారు.

కొండపై నుంచి భారీ బండరాళ్లు విరిగి, దొర్లుతూ కదులుతున్న వాహనంపై పడటంతో ఆరు నెలల చిన్నారి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఉదయ్పూర్-పాంగి రహదారిపై శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కులూ నుంచి కిల్లార్కు వెళుతున్న ఎస్యూవీలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. కాడు నాలా సమీపానికి చేరుకోగానే పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాళ్లు వాహనంపై పడ్డాయి. వాటి ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనంతరం వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో వాహనం దాదాపు పూర్తిగా నలిగిపోయి, మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలను ఘటనాస్థలికి పంపించారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పోలీసులు తెలిప

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి (ఈనెల 25వ తేదీ)ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇది రైతుల పండుగ అని అభివర్ణిస్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నీ ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



