23115 వార్తలు

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారంనాడు వరుస కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఆ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి సూచన మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక అధికారిక ఉత్తర్వులో పేర్కొంది.దీనికిముందు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ భావోద్వేగ లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం, యువత కలలు, ఆకాంక్షల పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన మొదటి రోజే సీబీఐ విచారణకు ఆదేశించడం, విజయవంతంగా మళ్లీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. భారత యువశక్తే దేశానికి బ

ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగింది. రెండు మాసాలుగా ఈ దేశ విద్యార్థి యువజనులు చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఆ మేరకు శనివారంనాడు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో పరీక్షా పత్రాల లీకేజీకి, విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, ఏర్పడి ఉన్న గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు. ఇది భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పుణ్యమా అని ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన తొలి విజయం. ఈ పార్టీ దేశంలో రాజకీయాల్ని సరి చేయడానికో, అధికారంలోకి వచ్చి దేశ పరిస్థితులను చక్కదిద్దడానికో ఏర్పడింది కాదు. ఈ దేశంలోని విద్యార్థులు, యువకులు సరైన విద్య అందక, ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న స్థితిలో వారిని అవమానించే విధంగా దేశ ప్రధాన న్యాయమూర్తి వారిని ఉద్దేశించి బొద్దింకలు, పరాన్నజీవులు అని చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా ఒక వ్యంగ్య వ్యక్తీకరణగా ఏర్పడింది కాక్రోచ్ జనతా పార్టీ. అది ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఏర్పడిన కొద్ది మాసాల్లోనే ఈ దేశంలో ఇక మాకు తిరుగులేదు అంటూ మూడవసారి అధికారంలోకి వచ్చిన కారణంగా అతి విశ్వాసంలో పడిన

న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంపై 37 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎట్టకేలకు శనివారంనాడు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్ నె రవేరింది. తక్కిన రెండు డిమాండ్లు కూడా నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించడంతో తమ నిరసనలను విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రలు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం చర్చలు ఫలప్రదమైనట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థుల అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించినందున ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు. నిరసనకారు లు జంతర్ మంతర్ను వీడి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థ, పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని ఇప్పటికే చెప్పామని, నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ కేసులతో వేధించమని, ఎఫ్ఐఆర్ కాపీలు అందజేస్తామని, ఆత్మహత్య చేసుకున్న విద్య

శాసనం, న్యాయం, పాలన... ఈ మూడింటికీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పీఠాలు ఉన్నాయి. వాటిని నడిపించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశానికి వెన్నెముక వంటివారు. కానీ, ఇటీవలి పరిణామాలు, వరుస వివాదాలు, అవినీతి కుంభకోణాలు ఈ వ్యవస్థల ప్రతిష్ఠపై మచ్చ తెస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం సహా అనేక ఘటనలు దేశవ్యాప్తంగా అధికారుల నైతిక దిగజారుడుపై తీవ్ర చర్చకు దారితీశాయి. యూపీఎస్సీ వంటి అత్యున్నత పరీక్షల్లో ఉత్తీర్ణులై, కోట్ల మందికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు అధికారులు దారితప్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాసేవ, నిజాయితీ, నిష్పాక్షికతలను పక్కనబెట్టి అవినీతి, అక్రమ సంపాదన, వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు, బ్లాక్మెయిలింగ్లు మరియు అక్రమ మైనింగ్ వంటి క్రిమినల్ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. దేశాన్ని కుదిపేసిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ వివాదాలను గమనిస్తే..గత రెండు దశాబ్దాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలువిచారించిన కొన్ని కీలక కేసులు ఈ విలువల సంక్షోభాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో నాటి డైరెక్టర్ అలోక్ వర్మ , స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్

మన తెలంగాణ/హైదరాబాద్: “జెన్ జీ సునామీ ఇంతటి తో ఆగవద్దు.. పోలీసుల లాఠీఛార్జిలకు, తూటాలకు అదరకుండా, బెదరకుండా ఎదురొడ్డి నిలిచినందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల వంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు మద్దతుగా పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపు ల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా విద్యార్థులూ పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేత పట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొ న్న వారినుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ జెన్ జీ చట్ట సభలకు రావాల్సిన అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు.పార్లమెంట్, అసెంబ్లీలకు పోటీచేసే కనీస వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తా మని తెలియజేశార

1998లో మన దేశంతో పాటు పాకిస్థాన్ కూడా అణ్యస్త్రాలను ప్రయోగించి తమ సత్తా చాటుకొని అణ్యస్త్ర దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశ సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ఫిబ్రవరి 1999లో లాహోర్ డిక్లరేషన్లో సంతకాలు చేశాయి. ముందు బుద్దిమంతుల వలె, వెనుక మోసగాళ్ల వలె నడపకున్న చరిత్ర కలిగిన పాకిస్థాన్ తన నీచ బుద్ధిని తరుచుగా చూపిస్తూనే ఉన్నది. ఇలాంటి దుర్బుద్ధి కలిగిన పాపాల పాకిస్థానీ కుట్రల్లో భాగంగా కశ్మీర్లో అలజడి సృష్టించడం, సైన్యం చొరబాట్లు జరపడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్లో హింసాత్మక చర్యలను ప్రేరేపించడం, వాస్తవాదీన రేఖను దాటి వ్యూహాత్మక కీలక భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం తరుచుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1999 అక్టోబర్, మే మాసాల్లో లడక్ ప్రాంత కార్గిల్ జిల్లా సరిహద్దుల్లో పాకిస్థానీ సైనికులు వాస్తవాదీన రేఖను 130 - 200 చ కి మీ మేర దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి, పర్వత శిఖరాలను, వ్యూహాత్మక మిలిటరీ స్థావరాలను ఆక్రమించారు. ఈ ఆక్రమణలతో కశ్మీర్, లడక్ల మధ్య సంబంధాలను అడ్డుకోవాలనే కుట్రలను పన్నింది పాపాల పాకిస్థాన్. 03 మే 1999 రోజున గొర్ల కా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ప్ర గతిని పరుగులు పెట్టించేలా, బడ్జెట్ అవసరాల కు అనుగుణంగా అదనపు ఆదాయ వనరుల ను సమకూర్చుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలకు తగ్గట్లుగా ఆదాయం రాబట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఆ దాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సం ఘం (రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు హాజరయ్యారు. రాష్ట్రంలో భూముల మానిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. నగర పరిధిలో ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలను అవలంబిస్తూ, మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉన్న అవకాశాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూసంపదను గు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముమ్మరంగా సాగాల్సిన సమయంలో ఎల్ నినో రూపంలో తీవ్రమైన కరువు పరిస్థితులు విరుచుకుపడుతున్నాయి. జూన్ మొదటి వారం నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 27 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఎల్నినో ఎంత ఆం దోళనకరంగా ఉందో స్పష్టమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఐఎండి, ఇక్రిశాట్, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. వానాకాలంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 306.1 మి.మీ కాగా, ఈ నెల 24 వరకు కేవలం 222.3 మి.మీ మాత్రమే నమోదైంది. ఇది రాష్ట్ర సగటులో ఏ కంగా 27 శాతం లోటు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవగా, హైదరాబాద్తో కలిపి 27 జిల్లాలు వర్షాభావ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 57.1 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, తరువాత వరుసగా హనుమకొండ -56.0, వరంగల్ -51.3, యాదాద్రి భువనగిరి 48.4, జనగామ- 48.2, కరీంనగర్ 41.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుక

ఒక చంటిపాప ఎదురుచూపువొస్తూ వొస్తూ నాన్నఒక ఆట బొమ్మ తెస్తాడు అనిఒక ఇల్లాలుగుమ్మానికి చెక్కిన శిల్పంపూట గడిచే మూట పట్టుకొస్తాడు అనిబిడ్డలు క్షేమంగా ఉండాలనిప్రతి తల్లీ కోరుకున్నట్టేఎటునుండి ఏ దుర్వార్త గుండెల్లో పేలుతుందోననిభయం గుప్పిట్లో బంధీలయినఆ తల్లులుపూజ గదిలో దేవుని పాదాలువొదలని వీర భక్తులు వాళ్ళుపోయేటప్పుడు పున్నమి చంద్రులువచ్చేటప్పుడు గ్రహణ సూర్యులుకాలికో వేలికో గాయమవ్వకుండాడ్యూటీ దిగరుఅక్కడ నెత్తురు శాక పోయకుండావాళ్ళకు రోజు గడువదువాళ్ళు, తెలిసి తెలిసిపద్మవ్యూహంలోకి పరుగెడుతున్న అభిమన్యులుచీకటిని చీలుస్తూ వెలిగే అగ్గి రవ్వలుఅంధకారపు గోడలు పగులగొడుతూవేల […] The post నెత్తుటి దీపాలు appeared first on Navatelangana.

1అనగనగా ఓ రోజు కథలుముసలితనమే లేదునేటి యువకుడికి2సాయంత్రంఅలసిపోయి సేద తీరిందికొండవతల3ఆకరి చూపుఅసలు అర్థంఆర్ద్రతే4ఆరిపోయిన దీపం మీదవెలుగుతున్న దీపమేమరణం5నిటారుగా పెరిగిందిఅంతస్తులను చూస్తూసిటీలో చెట్టు6గాలివానగుడిసె నెత్తుకపోయాయిబిగ్గరగా నవ్వారు ఇంటిల్లపాది7అవ్వ మీదవాన వలపోతగుడిసెంత నిండిపోయింది8కాలంకలలన్నింటినీ వేరుచేసిఉరితీసింది9పళ్లెంలో రూపాయిపిల్లోడిలా అల్లరి చేస్తూవెక్కిరిస్తుంది10భయంనగరంలోకొచ్చిన పులిలాఅందరినీ వెంటాడుతుంది11ఆకాశానికేసి చూశాడుహదయం నిండాశూన్యం12వానలుఋతువులో కంటేమనసులోనే ఎక్కువ కురిసాయి13రాత్రి విషాదానికిఓదార్పునిచ్చిందికుక్క అరుపు14అల్లారం లేకుండా తెల్లారే లేచాననిగర్వంగా చెప్పుకుంటుందిగుడిసె పై ఎక్కి కోడి15రాయిబావిలోకి దూకిందిలోతెంతో లెక్కపెట్టడానికి16చీకటిబూచోడికి భయపడిపాప కళ్ళకింద నిద్రపోయింది పి. సుష్మ మక్తల్9959705519 The post హైకులు appeared first on Navatelangana.

ఆమె సమయాలంటూ ఆమె పనులంటూహోదా లంటూ ఫలితాలంటూ ఏమీలేవుఅంత గా చెప్పుకోవడానికి.ఆమె పుట్టక ముందేవంట గది, ఆ గది మూల మూలనఆ గదిలోని వస్తువులపై ఆమె కోసమేకేటాయించ బడతాయిగది శుభ్రత తాలింపుల ఘుమ ఘుమలురుతువుల బహుమతులు ప్రశంసలుఅన్నీ ఆమె శ్రమకు చిరు గుర్తింపులేఆమె పుట్టక ముందే పడక గదిఆ గదిలో ఆమె ఎటువైపు అతనెటువైపుఆమె మాటలు, తల్లి తనాలుఅత్యవసర విశేషణా కిరీటాలుకడుపులో ఉన్నపుడే కేటాయించ బడ్డాయిఉదయం లేవగానే ఇంటికి ప్రభాతాన్ని అద్దడంవాకిలికి చిలుకల ముగ్గులు పేర్చడంపిల్లలలతో పాటు […] The post కేటాయింపు appeared first on Navatelangana.

లాఠీ ఛార్జ్ అంటున్నారు… వాళ్లు లాఠీలతో ఛార్జ్ చేయాలనుకుంటున్నారు,రెండు దెబ్బలు పడితే పర్వాలేదు,ఎన్ని దెబ్బలైనా పడ్డా పర్వాలేదు. కానీ…ఒక్కసారి నీ అవమానాలన్నీ,అరికాళ్ల నుండి తలపై దాకా గుర్తు తెచ్చుకో. నిన్ను చిన్నచూపు చూసిన చూపులను గుర్తు చేసుకో,నీ కష్టాన్ని కించపరిచిన మాటలను గుర్తు చేసుకో,నీ చెమటకు విలువ ఇవ్వని సమాజాన్ని గుర్తు చేసుకో. ఆ తర్వాత…లాఠీ కాదు, నీ ఓటుతో ఛార్జ్ చేయ్! ఒక్క ఓటు…ఒక్క బటన్ నొక్కడం కాదు,అది నీ ఆత్మగౌరవానికి ఇచ్చే సమాధానం. నీ […] The post లాఠీ ఛార్జ్ appeared first on Navatelangana.

చనిపోయిన వ్యక్తికి ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నామంటూ నాలుగు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మేడిపల్లిలోని కాకతీయ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల తీరుపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమా సీన్ను తలపించేలా వ్యవహారం సాగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలానికి చెందిన శోభ (42) గుండెకు సంబంధించిన ఇబ్బందులతో ఈ నెల 20న మేడిపల్లిలోని కాకతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు గుండె సమస్య తీవ్రంగా ఉందని వెంటనే స్టెంట్లు వేయాలని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు అడ్వాన్స్ గా 4 లక్షలు ఆస్పత్రికి చెల్లించామని చెల్లించారు. అయితే శనివారం మధ్యాహ్నం శోభ చనిపోయిందని వైద్యులు తెలపారు. దీంలో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.చనిపోయిన శవానికి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు చనిపోయిందని తెలిపారని ఆందోళనకు దిగారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రో

ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ నాగన్న స్ఫూర్తితోకమ్యూనిస్టులు ఐక్యం కావాలి : సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిఎస్వీకేలో నాగన్న సంతాప సభ నవతెలంగాణ – ముషీరాబాద్నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి అని ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ అన్నారు. అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగన్న గొప్ప […] The post నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి appeared first on Navatelangana.

అనధికారిక క్రాప్ హాలిడేప్రస్తుత నీటిమట్టం 3.423 టీఎంసీలుమెదక్, సంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఎద్దడిహైదరాబాద్కు నిలిచిన తాగునీటి సరఫరా నత్తనడకన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతుల పేరిట జలాశయంలో ఉన్న నీటిని ఖాళీ చేశారు. మరో పక్క వర్షాభావం వల్ల ఎగువ నుంచి వరద నీరురావట్లేదు. దీంతో సింగూరు జలాశయం నీటి నిల్వల్లేక కలతప్పింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.423 టీఎంసీల నీటి […] The post సింగూరు ఖాళీ appeared first on Navatelangana.

వాషింగ్టన్ :అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులకు , వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది. ఈ తీర్పును నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో పిటిషన్ దాఖలు చేసింది. దీన

జుట్టుపోలుగాడు : జాం జటక్… ఎహె. నేను పోలీసు దెయ్యాన్ని.కేతిగాడు : బూం భటక్.. నేను మీడియా దెయ్యాన్ని.బంగారక్క : ఓయ్ దెయ్యాలు… మీరిద్దరూ ఇటు రండి. దెయ్యాలంటే తెలుసు కదా మనసూ, మనస్సాక్షి లేనోళ్లని అర్థం. ఎందుకంటే మీరు ప్రభువును మించిన ప్రభు భక్తులు కదా…జుట్టుపోలుగాడు : అవునవును. ముందుగా నే చెప్తా నోచ్. టట్టడోరు.. అది 2026 జులై 20వ తేది. మన దేశ చరిత్రలోనే ఓ గొప్ప చారిత్రక దినం. రాజధాని ఢిల్లీ […] The post పీక్కు తినే దెయ్యాలు appeared first on Navatelangana.

బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులుయాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : సంఘీభావ సభలో వక్తలుపాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ప్రదర్శన నవతెలంగాణ-పటాన్ చెరుబిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని […] The post కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు appeared first on Navatelangana.

క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలోభారీగా ఎగిసిపడిన మంటలుపడవల్లో స్థానికుల తరలింపు పారిస్ : ఫ్రాన్స్, స్పెయిన్ లలో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డియాక్స్ కు పశ్చిమంగా ఉన్న టూరిస్ట్ స్పాట్ నుంచి ఇప్పటికే వేలాది మందిని తరలించారు. గిరోండే ప్రాంతంలో అటవీ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. స్పెయిన్ లో జాతీయ ఎమర్జెన్సీ …!సౌమోస్ ప్రాంతంలో […] The post ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు appeared first on Navatelangana.

పరిశోధనతెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో ఎన్నో విడిశిల్పాలు శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో అరుదైనది, శిల్పపరంగా ప్రత్యేక ప్రతిమాలక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు పృథ్విరాజ్ రొడ్డావార్, సహచరులు సాయిరాజ్ కాంబ్లే, కత్తురి సుభాష్ లతో కలిసి గుర్తించాడు.ఈ శిల్పానికి తల విరిగిపోయింది. అర్థపద్మాసనంలో ఆసీనుడైవున్న మూర్తి వెనక పాము చుట్టుకుని కన్పిస్తున్నది. మూర్తికి రెండువైపుల కాయోత్సర్గభంగిమలో ఇద్దరు తీర్థంకరులున్నారు. అధిష్టానపీఠం మీద రెండు సింహాల నడుమ ధర్మచక్రం […] The post చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు appeared first on Navatelangana.

రెండో టీ20లో భారత్ భారీ విజయంరాణించిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మభారత్ 219/5, జింబాబ్వే 129/10 బ్రిటన్ పర్యటనలో వరుస ఓటములను నుంచి పుంజుకున్న టీమ్ ఇండియా.. జింబాబ్వేపై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణించటంతో రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ (81), తిలక్ వర్మ (60), ప్రిన్స్ యాదవ్ (2/10), యశ్ […] The post సిరీస్ సొంతమాయె appeared first on Navatelangana.

ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశా, సచిన్లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాది లోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.

మీకు తెలుసా?ఎదుటివారితో మాట్లాడాలంటే గొంతు కావాలి. వారు చెప్పేది వినాలంటే చెవులుండాలి. కానీ ఏనుగులకు ఆ అవసరమే లేదని మీకు తెలుసా? అవి గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరంలోని మిత్రులతో ముచ్చటిస్తాయి. మనుషులు వినలేని శబ్దాలనూ వింటాయి. భూమి పొరల్లో సంభవించే మార్పులను పాదాలతోనే పసిగడతాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏనుగులు చెవులతోనే కాదు, పాదాలతోనూ వింటాయి. వీటి పాదాల్లో ‘పాసినియన్ కార్పస్కిల్స్’ అనే అత్యంత సున్నితమైన నరాల వ్యవస్థ ఉంటుంది. ఇవి భూమిలో వచ్చే […] The post పాదాలతోనూ వింటాయి appeared first on Navatelangana.