24118 వార్తలు

పోరాట స్ఫూర్తితో ఆందోళన ప్రదేశం తిరిగి స్వాధీనంకేంద్ర మంత్రి రాజీనామాపై సీజేపీ స్పష్టం నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోకేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు పోరాటానికి వెనుకడుగు వేసేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వ అణచివేత చర్యలను పోరాట స్ఫూర్తితో అధిగమించి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ప్రదేశాన్ని నేతలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం పోలీసులు, కేంద్ర బలగాలు కూల్చివేసి, సీల్ చేసిన ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్తో సహా నిరసన టెంట్లను […] The post వెనక్కి తగ్గం appeared first on Navatelangana.

దేవాదుల పది మోటార్లను నడపాలిప్రభుత్వం వినకుంటే ప్రజాపోరుకుసిద్ధమవుతాం : మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రాజెక్టుల్లో నీరున్నప్పటికీ రైతులకు ఎందుకివ్వడం లేదని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదులకు మంత్రులు వెళ్లి మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతామనీ, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి రైతులు […] The post నీళ్లున్నా రైతులకు ఎందుకివ్వడం లేదు? appeared first on Navatelangana.

అసెంబ్లీ, మండలి సమావేశాలకు సమాయత్తం కావాలి :అధికారులకు సీఎస్ సంజయ్జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఇదే అంశంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. […] The post కేంద్ర నిధుల సమీకరణకు కార్యాచరణ appeared first on Navatelangana.

ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంమేడిగడ్డను కుంగకొట్టి కరువంటున్న హరీశ్రావుపదేండ్ల అరాచకం, రెండున్నరేండ్ల ప్రజాపాలనపై చర్చకు సిద్ధంవిద్యార్థులపై లాఠీచార్జి మోడీ నియంతపాలనకు నిదర్శనం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేండ్ల పాటు అరాచక పాలన సాగించారు. కాళేశ్వరం పేరిట ప్రజలకు ఎన్నో కలలు చూపించి లక్ష కోట్ల నిధులు గోదావరి పాలు చేశారు. తాపీ, ఇంజినీర్, మేస్త్రీ.. నేనే అని కేసీఆర్ […] The post కలలు చూపించి కొల్లగొట్టారు appeared first on Navatelangana.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మాజీ మంత్రి హరీశ్రావు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుపై దుష్ర్పచారం మాని, కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్ను మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్ను ఎందుకు చేర్చారో చెప్పాలంటూ నిలదీశారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు […] The post రైతులను తప్పుదోవ పట్టించొద్దు appeared first on Navatelangana.

చలో ఢిల్లీ యాత్రనుఅడ్డుకున్న పోలీసులుప్రభుత్వ హామీతో యాత్ర విరమణ న్యూఢిల్లీ : అటు కాక్రోచ్ పార్టీ ధర్నా గురించి కేంద్రం తంటాలు పడుతుంటే..మరో వైపు అన్నదాతలు చలో ఢిల్లీ అంటూ కదిలారు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా జరగనున్న కిసాన్ మహాపంచాయత్లో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వైపు పాదయాత్ర ప్రారంభించారు. పంజాబ్కు చెందిన వందలాది మంది రైతులను, హర్యానా ప్రవేశ ద్వారమైన శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. 2024 ఫిబ్రవరిలో […] The post యూఎస్ తో డీల్ వద్దు appeared first on Navatelangana.

మేషంఆర్థిక వ్యవహారాలలో ఒక ఖచ్చితమైన ప్రణాళికకు వస్తారు. అయితే మీ మాట తీరు కాస్త పదునుగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. పాత పెట్టుబడుల నుండి అనుకూల ఫలితాలు అందుతాయి. వృషభం మీలో ఉత్సాహం, ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతాయి. ప్రభుత్వ లేదా ఉన్నతాధికారుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు, కానీ తొందరపాటు శారీరక అలసటకు దారితీయకుండా చూసుకోండి. మిధునం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా విలాసాలు లేదా ప్రయాణాల కొరకు ధనవ్యయం కావచ్చు. పనులలో కొంత ఆలస్యం జరిగినా, పట్టుదలతో పూర్తి చేస్తారు. నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధ్యానానికి సమయం కేటాయించండి. కర్కాటకం మీకు అన్ని విధాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు లేదా పాత మిత్రుల సహాయంతో నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. సింహం వృత్తి, వ్యాపార రంగాలలో సానుకూల మార్పులు వస్తాయి. మీ పని తీరుకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కొత్త బా

వైభవ్ సూర్యవంశీ, రింకు సింగ్పై ఫోకస్శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి అగ్ని పరీక్షరేపటి నుంచి భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస సిరీస్ ఓటములు చవిచూసిన శ్రేయస్ అయ్యర్కు జింబాబ్వే పర్యటన ఓ మంచి అవకాశం. కెప్టెన్గా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్కు జింబాబ్వేలో తొలి ప్రాధాన్య జట్టు అందుబాటులో ఉంది. ఇక్కడైనా భారత్ గెలుపు బాట పట్టకుంటే కెప్టెన్కు కష్టాలు తప్పవేమో!. భారత్, జింబాబ్వే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ […] The post ఇక్కడేం చేస్తారో? appeared first on Navatelangana.

వర్తమాన కాలంలో ఇంధనమే అన్నిటికీ మూలం. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధజ్వాలల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు తెలిసివచ్చింది. ఈ విషయంలో భారత్ కొన్నేళ్ల క్రితమే కళ్లు తెరిచింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణకూ, ఉత్పత్తికీ నడుం బిగించింది. ఆ దిశగా సాధించిన మరో విజయమే హైడ్రోజన్ రైలుకు రూపకల్పన. హర్యానాలోని జింద్ సోనిపట్ రైల్వేస్టేషన్ల మధ్య నాలుగు రోజుల క్రితం పరుగు ప్రారంభించిన హైడ్రోజన్ రైలు ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై ఆశలు మోసులెత్తిస్తోంది. డీజిల్ తో పనిలేని, విద్యుత్ అవసరం అసలే లేని ఈ కాలుష్యరహిత, పర్యావరణహిత రైలు భారత్ లాంటి జనాభాతో కిటకిటలాడే దేశాలకు ఎంతో అవసరం. హైడ్రోజన్ రైలును పట్టాలకు ఎక్కించడంతో ఇప్పటికే ఇలాంటి రైళ్లు వినియోగంలో ఉన్న జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణకొరియా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం ఒక విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లన్నింటిలోకీ శక్తిమంతమైనదీ, సుదూరం ప్రయాణించగలిగేదీ కావడం గమనార్హం. మరొక విశేషమ

“వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమ్యూ నిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మూసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. మీకు బలమైన మతం ఉంటే వారి సిద్ధాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు. 250 ఏండ్ల […] The post అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా! ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి? appeared first on Navatelangana.

హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పులు వెలువడి నెలలు గడుస్తున్నా, ఆర్డర్ కాపీల విడుదలలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై పిటిషనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టు హాల్లో కొందరు జడ్జీలు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారంటూ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే.. కోర్టు హాల్లో ప్రస్తుత న్యాయవాదులు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యుల ప్రవర్తనకు నిరసనగా ‘క్యాట్’ న్యాయమూర్తులు […] The post తీర్పులు సరే… మరి ఆర్డర్లేవీ? appeared first on Navatelangana.

దేశంలో విద్యావ్యవస్థ అక్రమాలకూ, నీట్ 2026 పేపర్ లీక్కూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ – ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇటీవల భారీ ధర్నా చేపట్టింది. దానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం 17 జులై […] The post వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి! appeared first on Navatelangana.

ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసనఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులురాహుల్, ప్రియాంక బలవంతంగా తరలింపున్యూఢిల్లీ: ప్రధాని నివాసం ముందు మూడు గంటలకుపైగా రాహుల్ సాగుతున్న ఆందోళనను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. కాసేపటికి రాహుల్, ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, అఖిలేష్ యాదవ్, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు సహా పలువురు ఎంపిలు, నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులు తరలిస్తున్న క్రమంగా రాహుల్ తీవ్రంగా ప్రతిఘటించారు. నేలపై పడుకున్న ఆయనను పైకి లేపేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. తోపులాట క్రమంలో రాహుల్ కంటి కింద స్వల్పగాయం కావడంతో పాటు ముక్కు రక్తం బయటికి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన కాళ్లు, చేతులకు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుత పరిస్థితి ఇదీ’ అని రాహుల్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక ప్రియాంక గాంధీని వాళ్లను తరలించే బస్సు కదులుతుండగానే బలవంతంగా ఎక్కించారు. ఆమె మెట్ల వద్ద వేలాడుతూనే పయనించారు. అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం స్టేషన్కు, ప్రియాంకను మందిర్మార్గ్ పోలీస్ స్టేషన్కు, ఎంపిలను క

న్యూఢిల్లీ: నీట్ లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనను బహిరంగంగా సమర్ధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు చేపట్టిన ధర్నాను విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంతో జుగల్ బందీగా దీనిని అభివర్ణించింది. సీజేపీ ఆందోళనను రాహుల్ గాంధీ బలహీనపరుస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, నెలరోజులుగా సీజేపీ, సోనమ్ వాంగ్చుక్ నిరసనలు తెలుపుతున్నా మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ రాహుల్ను మాత్రం తన నివాసం వద్ద ధర్మాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జరిగిన గంటలోనే మోదీ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడటం తమకు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సీజేపీ నిరసనను బలహీనపరచేందుకే తన ఇంటి ముందు ధర్నాకు రాహుల్ను మోదీ అనుమతించారని ఆప్ మరో నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ సైతం కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. నీట్ లీక్పై జరుగుతున్న ఉద్యమంపై కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు సీజేప

కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడేందుకు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సొంత పార్టీలో తిరుగుబాటు సృష్టించిన ద్రోహులను మాత్రం మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతుగా ఉండాలంటే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని, ఎంత మంది వెళ్లిపోయినా తనకు సంతోషమేనని అన్నారు. యువనాయకులతో ఆ స్థానాలను భర్తీ చేసుకుంటామని చెప్పారు. టీఎంసీని బలహీనపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీలో గత దశాబ్దకాలంగా ఆయన చేసిన పనులను బహిర్గతం చేస్తానని, ఆయన ముసుగు తొలగిస్తానని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ఓటమి చవిచూస్తే బిహార్లోనూ పునాదులు కదులుతాయని అన్నారు. టీఎంసీకి తానే వ్యవస్థాపక అధ్యక్షురాలిని అయినందున దానిని చేజిక్కుంచుకోవడం తిరుగుబాటు నేతలకు కుదరదని స్పష

పెళ్ళికి ముందే మరోకరితో ఉన్న ప్రేమ వ్యవహారం నేపధ్యంలో ఒ భార్య కట్టుకున్న భర్త ఆత్మహత్యకు పాల్పడే విధంగా వ్యవహరించి చివరికి ఆ నవవరుడి ప్రాణాలనే తీసింది. వివాహంజరిగిన మూడు నెలలకే భార్య వేధింపులు తాళ లేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రఘునాథపాలెం మండలంలోని రాంక్య తండాలో వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంక్య తండాకు చెందిన సదర్ లాల్ కు ఈ ఏడాది మే నెలలో ఇదే మండలంలోని ఒక యువతితో వివాహమైంది. నూరేళ్ల పంటగా సాగాల్సిన వారి వైవాహిక జీవితంలో పెళ్లయిన మూడో రోజు నుంచే విషాదం అలుముకుంది. నీకు మగతనం లేదు అంటూ భార్య కట్టుకున్న భర్తను తీవ్రంగా అవమానించడం, ప్రారంభించింది.మగ తనం లేదని ప్రతి రోజు నిందిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్, తనపై వచ్చిన నిందను తుడిచేసుకోవడానికి, తన సమర్థతను నిరూపించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్టులు కూడా చేయించుకున్నాడు. వైద్య పరీక్షల్లో సదర్ లాల్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కట్టుకున్న భార్య ప్రతి రోజు నిత్యం సెల్ ఫోనో లో ఛాటింగ్ చేయడం,ఫోన్ మాట్లాడటం,విడియో కాల్స్

కాబూల్: అఫ్గానిస్థాన్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తూర్పు అఫ్గానిస్థాన్ ప్రావిన్స్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. 20 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. మరో 100 మంది జాడ గల్లంతైనట్టు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. నూరిస్థాన్ ప్రావిన్స్లోని పరున్ సిటీ, ఇతర ప్రాంతాల్లో వరదల తాకిడికి భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ప్రతినిధి యూసఫ్ హమ్మద్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అఫ్గనిస్థాన్లోని 2024లో సంభవించిన భారీ వరదల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది మొదట్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి సుమారు 110 మంది మరణించారు.

దుబాయ్ : ఇరాన్అమెరికా మధ్య హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం వరుసగా దాడులు సాగుతున్నాయి. మంగళవారం ఉదయం జలసంధి లోని ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఆ ట్యాంకర్ను సిబ్బంది విడిచిపెట్టేలా ఒత్తిడి తెచ్చింది. అయితే జలసంధిపై గట్టి పట్టున్న ఇస్లామిక్ రిపబ్లిక్ను టార్గెట్ చేసుకుని అమెరికా పదోసారి దాడులు చేసింది. అయినా జలసంధిపై ఇరాన్ పట్టును సడలించలేకపోయింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలపైన, సాగర సామర్థాలపైన, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగ క్షేత్రాలపైన, వైమానిక రక్షణ వ్యవస్థలపైన వరుసగా దాడులు చేసినట్టు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ మంగళవారం వెల్లడించింది. దాడులకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేసింది. నావికా సిబ్బందిపై అనవసరంగా దాడులు చేయడాన్ని ఉద్దేశిస్తూ , హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా రవాణాజరిగేలా వీలు కల్పించేందుకు ఇరాన్ను జవాబుదారీ చేయాలన్నదే తమ లక్షంగా అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.కువాయిట్పై మళ్లీ ఇరాన్ దాడులు కువాయిట్ లోని విద్యుత్ ,డిశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ మళ్లీ దాడులు చేసిందని కువాయిట్ మంగళవారం వెల్లడించింది. ఈమేరకు కువాయిట్ ఎలక్ట్రిసిటీ, వాటర్, రెన్యుబల్ ఎనర్జీ మంత్రి

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష, దానికి సంబంధించిన ఆందోళనలపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం మంగళవారం ప్రకటించింది. అయితే ఈ అంశంపై చర్చను కోరిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అనంతరం తన డిమాండ్లను మార్చారని కేంద్రం ఆరోపించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా సందర్భంగా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. అనంతరం జితేంద్ర సింగ్ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను వెంటనే ధర్నాను విరమిస్తానని రాహుల్ గాంధీ తొలుత చెప్పారని జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ అత్యున్నత నాయకత్వంతో మాట్లాడిన అనంతరం ఆ డిమాండ్ను అంగీకరించి, నీట్ పరీక్షతో పాటు దానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్కు తెలియజేశామని చెప్పారు. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకుని,




రాష్ట్రంలో బుధవారం ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కోసం పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగుతామని రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వీరికి మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో కూడా సమ్మె బాట పట్టే అవకాశం ఉందని సమాచారం.