23466 వార్తలు







గ్లోబరీనా సంస్థ విషయంలో నిజాయితీని నిరూపించుకోవాల్సింది కెటిఆరేబిఆర్ఎస్ హయాంలో జరిగిన ఇంటర్ మూల్యాంకనం తప్పిదాలకు 27 మంది విద్యార్థులు బలిఇందుకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలిచిట్చాట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను నిలదీసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికెటిఆర్కు ధర్నాచౌకే దిక్కయిందని వ్యాఖ్యమన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కెటిఆర్కు లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని బిఆర్ఎస్ ఖండించలేదని, బిజెపిని ప్రశ్నించే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో కెటిఆర్ మహాధర్నా చేపట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోమెట్ సంస్థ తెలంగాణలోనే పుట్టిందని, ఆ సంస్థతో కెటిఆర్కు సంబంధాలున్నా యని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్మించ

యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిని వదిలిపెట్టం లీక్లకు పాల్పడినవారికి వేగంగా కఠిన శిక్షలు పడేలా విచారణ జరిపిస్తాంయువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది మరొకటి లేదు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటనన్యూఢిల్లీ: దేశ యువత సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నీట్ పరీక్షలో అవకతవకలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నిర్వహించిన సంసద్ చలో మార్చ్ అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ నిరసనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఆందోళనను అడ్డుకునే క్రమంలో 100 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద

కాంగ్రెస్, వామపక్షాల పన్నాగాలు ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికల వెనుక దేశ వ్యతిరేక శక్తుల హస్తం ‘నీట్’పై తక్షణమే స్పందించి 31 మందిని అరెస్ట్ చేశాం యుపిఏ పాలనలోనే రికార్డు స్థాయి లీకేజీలు n బిజెపి చీఫ్ రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అశాంతిని సృష్టించి, యువతను రెచ్చగొట్టడం ద్వా రా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బిజె పి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదే శ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పుణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల వెనుక ఈ దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక

విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపుసెలవు ప్రకటించిన యాజమాన్యాలు ఒయు, జెఎన్టియు పరీక్షలు వాయిదామనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) పాఠశాలలు, కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్ఎన్యుఐ, ఎస్ఎఫ్ఐ,ఎఐఎస్ఎఫ్,పిడిఎస్యు, ఎఐఎఫ్డిఎస్, ఎఐఎస్బి, ఎఐపిఎస్యు సంఘాల నాయకులు కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు యాడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రజాస్వామ్యవాదులు బంద్కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ప్రజాస్వామ్య నిరసనలకు లాఠీలు కాదు, సంభాషణే సమాధానమని పేర

రాబోవు నెలల్లోను ఎల్నినో ప్రభావం ప్రస్తుత వర్షాలను చూసి నాట్లు వేయకండి వరి సాగుపై రైతులు పునరాలోచించుకోవాలి 23 జిల్లాల్లో లోటు వర్షపాతం ఎల్నినోపై జిల్లాల సూచనలతో సిఎంకు సమగ్ర ప్రణాళిక సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మలమన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే నెలల్లోనూ ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని, దీంతో రైతులు వరి సాగుపై పునరాలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. గురువారం సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా వచ్చిన సూచనలతో సమగ్ర ప్రణాళిక సిద్దం చేసి సిఎంకు అందచేస్తామన్నారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్తో పాటు రబీ సీజన్పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్ర

ఆగని విపక్షాల నిరసనలు.. కదలని ఉభయసభలుముందస్తు షరతులు లేకుండా చర్చకు సిద్ధమేనన్న కిరణ్ రిజిజుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చకు సిద్ధమన్న ఖర్గేలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అమిత్షాన్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ల మధ్య పార్లమెంటు ఉభయసభలు నాలుగోరోజైన గురువారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలకు నోచుకోలేదు. తొలుత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వరుసగా సభ రెండు సార్లు వాయిదా పడి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. సభ్యులు నిబంధనలను పాటించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలను తప్పుపడుతూ, ముందస్తు షరతులతో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మాన్ ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ఆయన సమాధానమిచ్చారు. వ

సిఐడి విచారణకైనా సై..ఆరోపణలు రుజువు చేయాలి.. లేదా క్షమాపణ చెప్పాలి సిఎం రేవంత్ కు కెటిఆర్ సవాల్మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవు అని స్పష్టం చేశారు. గ్లోబరీనా తన బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధికోసమే తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

అంతర్రాష్ట్ర నదీజలాలపై చర్చ రాష్ట్ర బిజెపి ఎంపీలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ హామీకాళేశ్వరం నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సాంకేతిక పరిశీలన జరపాలని మంత్రిని కోరిన ప్రజాప్రతినిధులుమన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నట్లు సమాచారం. గురువారం ఢిల్లీలో తనను కలుసుకున్న బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈమేరకు హామీ ఇచ్చినట్లు సమాచా రం. గోదావరి -కావేరి అనుసంధానం, బనకచర్ల, పాలమూరు ప్రా జెక్టులపై చర్చించేందుకు త్వరలో భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశమై ఈ అంశాలను కొలిక్కి తేవాలాని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వివరించినట్లు తెలిసింది. త్వరలో మరోసారి రేవంత్రెడ్డి, చంద్రబాబు, డికె శివకుమార్లతో భేటీ అయిన తర్వాత చాలా అంశాలు పరిష్కారమవుతాయని చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రస్తుత నిర్వహణ సాధ్యసాధ్యాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన జరపాలని వారు పాటిల్ను కోరారు. అలాగే దీని భవిష్యత్తు నిర్వహణకు సంబంధించి స్పష్టమైన సిఫా

సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి తాగు నీటి సరఫరాపై ఎల్ నినో ప్రభావం పడకుండా చూడాలి నీటి వనరులను అనుసంధానం చేయాలి నిర్దేశిత సమయంలో ఎస్టిపిల నిర్మాణం పూర్తి చేయాలి వాటర్ బోర్డు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసిలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సిఎం సూచించారు. హైదరాబాద్ మహా నగర తాగు నీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసిహెచ్ఆర్డిలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలని సిఎం సూచించారు.ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వ

నా భార్య పిల్లల్ని ఏమి అనొద్దు..దెయ్యమైన వాళ్లను మంచిగా చూసుకుంటా...! సూసైడ్ నోట్లో కానిస్టేబుల్ భావోద్వేగం నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని డిజిపి కార్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. డిజిపి కార్యాలయంలోనే ఒక కానిస్టేబుల్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో కార్యా లయంలోని వాష్రూమ్కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న సహచ ర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా ఆయన అప్పటికే మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో పోలీసులు నిర్వహిం చిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, వారు చాలా మంచి వారని స్వామి పేర్కొ న్నారు. అంతేకా కుండా, తాను చనిపోయి దయ్యం అయినా కూడా తన భార్య, పిల్లలను చూసుకుంటాను అంటూ భావోద్వేగ పూర

ఆహ్వాన పత్రికను అందజేసిన సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పది వసంతాలను దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుని పదకొండో వసంతంలోకి అడుగు పెడుతున్న నవతెలంగాణ ప్రజల దినపత్రిక.. మున్ముందు ప్రజల ఆదరణను మరింతగా చూరగొనాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, విలేకరులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు ఒకటిన నిర్వహించబోయే వార్షికోత్సవానికి తప్పకుండా వస్తానని […] The post ప్రజల పత్రిక నవతెలంగాణ appeared first on Navatelangana.

పారిస్ : లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ను కలిసేందుకు పలువురు మోడల్స్ను ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ ప్రొఫెషనల్ మోడల్ రిక్రూటర్ డేనియల్ సియాద్ పారిస్లోని తన నివాసంలో విగతజీవిగా కన్పించాడు. ఫ్రాన్స్ రాజధాని శివారు ప్రాంతమైన కొలంబెస్లోని నివాస గృహంలో సియాద్ మృతదేహం లభించిందని నాంటెర్ జ్యుడీషియల్ కోర్టు డిప్యూటీ ప్రాసిక్యూటర్ మేరీ- సెలిన్ లారిజ్ చెప్పారు. మరణానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు సియాద్ మృతదేహాన్ని పోస్ట్మార్టంకు పంపారు. ఇటీవల సీఎన్ఎన్కు సియాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను […] The post ఆ మోడల్ రిక్రూటర్ చనిపోయాడు appeared first on Navatelangana.

వాషింగ్టన్ : అమెరికా, సౌదీ అరేబియా దేశాలు అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఒప్పందం గల్ఫ్ దేశమైన సౌదీకి వీలు కల్పిస్తుంది. దీనిని ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’గా అమెరికా ఇంధన శాఖ అభివర్ణించింది. సౌదీ అణు ఇంధన కార్యక్రమాలలో అమెరికా కంపెనీలకు ఈ ఒప్పందం గొప్ప ప్రవేశం కల్పిస్తుందని తెలిపింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా బయటపెట్టలేదు. అయితే భవిష్యత్లో యురేనియంను శుద్ధి చేసుకునేందుకు ఈ […] The post మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..సౌదీతో అమెరికా అణు ఒప్పందం appeared first on Navatelangana.

విలువ కోల్పోతున్న ప్రయాణ పత్రాలుతాజా ర్యాంకింగ్స్లో పదో స్థానానికి పరిమితం వాషింగ్టన్ : 2006లో అమెరికా పాస్పోర్ట్ ప్రపంచానికి ఓ అత్యున్నత టిక్కెట్గా ఉండేది. కానీ ఆ తర్వాత గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పుడు అమెరికా ప్రయాణ పత్రాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. ప్రయాణ స్వేచ్ఛకు సంబంధించిన ర్యాంకింగ్స్లో అమెరికా బాగా వెనుకబడిపోయింది. వీసా లేకుండా లేదా వీసా ‘ఆన్’ డిమాండ్ పైన సందర్శించగలిగిన ప్రదేశాల సంఖ్య ఆధారంగా హెన్లీ […] The post అమెరికా పాస్పోర్ట్…వెరీ పూర్ ! appeared first on Navatelangana.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయదుఆ పార్టీ అవయవదానంతోనే బీజేపీకి అధికారంకాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా సర్మిగిలిన 30 శాతం చాలా కీలకం అవగాహన లేకున్నా.. ఓటు పోయే ప్రమాదంబీజేపీ నేతల మధ్య అంతర్గత ఘర్షణలుబీఆర్ఎస్ తప్పులపై విచారణ సాగుతోందిమీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్నీట్ పేపర్ తో సహా పలు ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు […] The post మతలబేంటీ? appeared first on Navatelangana.

పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి స్పీకర్ ప్రసాద్కుమార్ సమక్షంలో సమీక్షనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ భవనంలో పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పరిశీలించారు. గురువారం హైదరాబాద్లోని శాసనసభ, శాసన మండలి సంయుక్త భవనాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా ఆగాఖాన్ ట్రస్ట్ , రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా చేపట్టిన పునురు ద్ధణ పనుల గురించి సీఎం ఈ సందర్భం గా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇంకా […] The post అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి appeared first on Navatelangana.

ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాలి : సరఫరాపై సమీక్షలో ముఖ్యమంత్రియూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు..పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుత్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలిఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ అందజేయాలియూనిఫాం సరఫరాపై సమీక్షలోముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి […] The post ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ appeared first on Navatelangana.